breaking news
Kaun Banega Crorepati -7
-
ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం.. కోటీ రూపాయలు మిస్ చేసుకున్న యువతి!
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'కౌన్ బనేగా కరోడ్పతి' షోతో బిజీగా ఉన్నాపు. ప్రస్తుతం 17వ సీజన్కు ఆయనే హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో ఓ కంటెస్టెంట్ ఏకంగా కోటి రూపాయల ప్రశ్న వరకు దూసుకొచ్చింది. అయితే ఒక్క సమాధానం చెబితే కోటి రూపాయలు యువతి సొంతమయ్యేవి. కానీ ఊహించని విధంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే రూ.50 లక్షల ప్రైజ్మనీతోనే సరిపెట్టుకుంది. ఇంతకీ ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి.తాజా ఎపిసోడ్లో ఢిల్లీకి చెందిన 21 ఏళ్ల యువతి కశీష్ సింఘాల్ రూ. 50 లక్షలతోనే సరిపెట్టుకుంది. ఈ డబ్బుతో తన తండ్రి చేసినరూ. 15 లక్షల రుణాన్ని తిరిగి చెల్లిస్తానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆ యువతి సమాధానం చెప్పలేకపోయిన ఆ కోటి రూపాయల ప్రశ్న ఏంటో చూసేద్దాం.ప్రశ్న: విసిగోత్ రాజ్యానికి చెందిన ఏ రాజు రోమ్ నగరంపై దాడి చేయకుండా ఉండేందుకు మిరియాలు డిమాండ్ చేశాడు?ఎ) లుడోవిక్, బి) ఐమెరిక్, సి) అలారిక్ డి) థియోడోరిక్ ఆప్షన్స్ ఇవ్వగా.. కశీష్ సింఘాల్ సమాధానం చెప్పలేకపోయింది. దీంతో ఆట నుంచి నిష్క్రమించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ సి..అలారిక్ అంటూ అమితాబ్ చెప్పారు. రూ.50 లక్షలు గెలిచిన ఆమె తన జర్నీని పంచుకని అందరినీ కన్నీళ్లు పెట్టించింది. ఈ రియాలిటీ షో సోనీటీవీతో పాటు సోనీలివ్ ఓటీటీలోనూ ప్రసారమవుతోంది. -
కరోడ్పతి ఫాతిమా
ఈమె పేరు ఫిరోజ్ ఫాతిమా(22). ఉత్తరప్రదేశ్లోని సహరన్పూర్కు చెందిన ఈమె కోన్బనేగా కరోడ్పతి-7 సీజన్లో తొలి మహిళా కోటీశ్వరురాలిగా నిలిచారు. తద్వారా ఈ షోలో రూ.కోటి గెలుచుకున్నారు. బీఎస్సీ చదివిన ఫాతిమా ఆర్థిక కారణాల వల్ల తన సోదరి చదువు కోసం ఉన్నత విద్యాభ్యాసం చేయాలన్న తన కలను త్యాగం చేశారు. మరణించిన తన తండ్రి చేసిన అప్పు తీర్చడం కోసమే ఈ పోటీలో పాల్గొన్నానని.. రోజూ పేపర్లు చదవడం, న్యూస్ చానళ్లు చూడటం ద్వారా ప్రపంచవ్యాప్త పరిణామాల గురించి తెలుసుకున్నానని ఫాతిమా చెప్పారు. వచ్చిన డబ్బుతో పై చదువులు చదవాలనుకుంటున్నానని.. తన తల్లికి సౌకర్యవంతమైన జీవితాన్ని అందించాలనుకుంటున్నానని తెలిపారు. ఫాతిమా రూ. కోటి గెలుచుకున్న ఎపిసోడ్ డిసెంబర్ 1న సోనీ చానల్లో ప్రసారమవుతుంది.