breaking news
Kasinkota
-
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
కశింకోట(అనకాపల్లి): పట్టాదారు పాసు పుస్త కం ఇచ్చేందుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) ఏసీబీ అధికారులకు చిక్కారు. అవినీతి నిర్మూలనకు సీఎం ప్రవేశపెట్టిన ఏసీబీ టోల్ఫ్రీ నంబరును బాధితుడు ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా వీఆర్వోను పట్టుకుని అరెస్టు చేశారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ కె.రంగరాజు తెలిపిన వివరాలిలావున్నాయి. కారణం లేకుండా దరఖాస్తు తిరస్కారం.. మండలంలోని తాళ్లపాలెం గ్రామానికి చెందిన గల్లా సత్యనారాయణకు అదే గ్రామ రెవెన్యూలో సర్వే నెంబర్ 133/1లో 49.50 సెంట్ల భూమి ఉంది. దీని వివరాలు ఆన్లైన్లో నమోదు కాలే దు. దీంతో ఆన్లైన్లో నమోదు చేయాలని 2012లో రెండు దఫాలు తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేశాడు. అధికారులు అకారణంగా వాటిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ గత డిసెంబర్ నెలలో తనకు రైతు భరోసా పథకం సొమ్ము పొందేందుకు తన భూమి వివరాలను ఆన్లైన్ చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని దరఖాస్తు చేశాడు. అయితే ఇందుకు రూ.3 వేలు ఇవ్వాలని తాళ్లపాలెం వీఆర్వో పీవీ రాజేష్ డిమాండ్ చేశారు. ఏసీబీ టోల్ఫ్రీ నంబరుకు ఫిర్యాదుతో.. అవినీతి నిర్మూలనకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఏసీబీ టోల్ ఫ్రీ నంబరు 14400కు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. వాస్తవమేనని వెల్లడవడంతో వారు రంగంలోకి పథకం రూపొందించారు. సత్యనారాయణ బంధువైన చప్పగడ్డ ప్రసాద్ ద్వారా వీ ఆర్వో రాజేష్కు లంచం ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా వీఆర్వో రూ.2 వేలకు అతనితో ఒప్పందం కుదుర్చుకున్నారు. నగదు ఇచ్చిన వెంటనే.. నగదు ఇచ్చిన వెంటనే పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడానికి వీఆర్వో అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రసాద్తో నాలుగు రూ.500 నోట్లు పంపించారు. వీటిని స్థానిక రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వీఆర్వో రాజేష్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నగదు స్వా«దీనం చేసుకొని రాజే‹Ùపై కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రంగరాజు తెలిపారు. శనివారం కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వివరించారు. ఈ దాడిలో సీఐలు గఫNర్, రమే‹Ù, లక్ష్మణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ఏసీబీ దాడితో రెవెన్యూ సిబ్బంది కలవరం చెందారు. -
డిప్యూటీ కలెక్టర్కు గాయాలు
సుమో టైర్ పంక్చరై ప్రమాదం మరో నలుగురికి స్వల్పగాయాలు కశింకోట: కశింకోట వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సివిల్ డిఫెన్స్ విభాగంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి. జవహార్లాల్ నెహ్రూ, మరో నలుగురు గాయపడ్డారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న సుమో కశింకోట ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వచ్చేసరికి ముందు టైరు పంక్చర్ అయింది. దీంతో సుమో అదుపు తప్పి జాతీయ ర హదారి డ్రైనేజీ కాలువపై నుంచి దూసుకు వ చ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. విద్యుత్ స్తంభం విరిగిపోయి, సరఫరా నిలిచిపోయింది. సుమోలో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జవహార్లాల్ నెహ్రూ గాయపడగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేశారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న నలుగురు స్వల్పంగా గాయపడినట్టు స్థానికులు తెలిపారు. వీరు తర్వాత వేరే కారులో వెళ్లారు. ఆర్ఈసీఎస్ అధికారులు, సిబ్బంది విరిగిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభాన్ని ఏర్పాటుచేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మంగళవారం చర్యలు తీసుకున్నారు.