breaking news
karimnagar trip
-
'వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు'
కరీంనగర్ : ప్రజల బాధను తన బాధగా మలుచుకున్న వ్యక్తి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు. అందుకే రాజన్నగా ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా పరామర్శ యాత్రలో ఉన్న ఆమె శుక్రవారం హుజురాబాద్, మానకొండూరులో ఏడు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌక్ వద్ద వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ బతికుంటే ప్రతి ఎకరాకు సాగునీరు అందేదని, పేదలకు ఇళ్లు, ఉచిత విద్య, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేదని అన్నారు. అలాగే రైతులకు 9గంటల కరెంట్ వచ్చేదని వైఎస్ షర్మిల అన్నారు. -
త్వరలో బీసీలకూ కల్యాణలక్ష్మి: కేసీఆర్
కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ములకనూరులో తెలంగాణతల్లి విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాలలో శనివారం పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కార్ త్వరలోనే బీసీలకూ కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తుందని తెలిపారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. -
అటాక్ హుస్నాబాద్ పేరుతో మరోసారి వస్తా...
కరీంనగర్ : అటాక్ హుస్నాబాద్ పేరుతో మరోసారి వస్తా... అప్పుడు ఒకే రోజు లక్ష మొక్కలు నాటుదామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రతిగ్రామంలో 40 వేల మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకోవాలని, ఒక్క మొక్క దక్కకపోయినా సర్పంచ్, ఎంపీటీసీ రాజీనామా చేయాల్సిందేనని కరీంనగర్ జిల్లా పర్యటనలో సీఎం స్పష్టం చేశారు. మొక్కల పెంపకానికి గ్రామానికి రూ. 10 లక్షలు ఆయన మంజూరు చేశారు. గ్రామ సర్పంచ్ లు వాడవాడలా తిరిగి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేయొద్దని నినాదాలు చేసిన వారిని మందలించి, మిడ్ మానేరు నుంచి గౌరవెల్లి రిజర్వాయర్ కు ఏడాదిలోగా నీరందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాళేశ్వరం పథకం ద్వారా కొమరవెల్లి మల్లన్న రిజర్వాయర్ ను నింపుతామని చెప్పారు. హుస్నాబాద్, జనగామ నియోజకవర్గాలలో ప్రతి గ్రామానికి నీరందిస్తామని ఆయన వివరించారు. -
ఎట్లా బతికేది?
పంట నష్టంతో కుంగిపోయిన రైతన్న సర్కార్ సాయం కోసం ఎదురుచూపు కరీంనగర్ జిల్లాలో పర్యటించిన పొంగులేటి అన్నదాతను ఓదార్చే యత్నం.. అండగా ఉంటామని భరోసా పార్లమెంట్లోనూ చర్చిస్తానని హామీ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అకాల వర్షం అన్నదాతను కుంగదీసింది. ఈదురుగాలులు, వడగళ్ల వానకు తెలంగాణలో సుమారు లక్షన్నర ఎకరాల్లో పంట న ష్టం వాటిల్లింది. అందులో కరీంనగర్ జిల్లాకు జరిగి న నష్టం అపారం. ఈ జిల్లాలోనే ఇప్పటి వరకు 62 వేల ఎకరాలు దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశా రు. ఆస్తి, పశు సంపదతో కలిపి సుమారు రూ. 50 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పంట నష్టా న్ని పరిశీలించేందుకు కరీంనగర్ జిల్లాకు వచ్చారు. జిల్లాలోని జగిత్యాల, వేములవాడ, చొప్పదండి ని యోజకవర్గాల్లోని పలు గ్రామాలను సందర్శించారు. ఆయా ప్రాంతాల్లోని దాదాపు 30 వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. అకాలవర్షానికి నష్టపోయిన వందలాది మంది రైతులను కలిసి వారి గోడును విన్నారు. ఈ సందర్భంగా ఏ రైతును కదిలించినా కన్నీళ్లే దర్శనమిచ్చాయి. ‘చేతికొచ్చే పంట వడగళ్ల దెబ్బకు మట్టిపాలాయే.. పెట్టిన పెట్టుబడి రాకపా యే... చేసిన అప్పులు తీరకపాయే... ఇంకా ఎట్లా బతికేది’ పొంగులేటి ఎదుట రైతులు భోరుమన్నా రు. రైతుల దుస్థితిని చూసి చలించిన పొంగులేటి వారిని ఓదార్చారు. ‘పెద్దమ్మా... పెద్ద య్యా... మీరు బాధ పడొద్దు... చావు పరిష్కారం కాదు. ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగేలా చేస్తా. 10 రోజుల్లో ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తా’అని భరోసా ఇచ్చారు. నేలరాలిన పంట: కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టిన పొంగులేటి వైఎస్సార్ సీపీ నేతలతో కలిసి తొలుత మల్యాల మండలం మానాలలోని వరి చేల ను పరిశీలించారు. వడగళ్ల వానకు వరి పంట ధాన్యమంతా నీటిపాలైన దృశ్యాలే కన్పించాయి. అక్కడే ఉన్న కాసునోళ్ల గంగవ్వ అనే రైతు ‘సారూ.. అప్పు తెచ్చి మూడెకరాల్లో వరి వేసిన. వడగండ్ల వానొచ్చి మా నోట్ల మట్టి కొట్టిపాయె. తెచ్చిన అప్పు తీర్చేదెట్లా... బతికేదెట్ల?’ అని భోరున విలపించింది. మానాల నుంచి జగిత్యాల మండలం నర్సింగాపూర్, చల్గల్ రాయికల్ మండలం కిష్టంపేట గ్రామాల్లోని పంట పొలాలకు వెళ్లారు. బాడిశెట్టి లచ్చయ్య, పెదాల చిన్నభూమయ్య, బక్కశెట్టి రాజిరెడ్డి, మగిశెట్టి లచ్చుసహా పలువురు రైతు నేలరాలిన నువ్వుల పంటను, వడగళ్ల దెబ్బకు నేలరాలిన మామిడి కాయలను చూపిస్తూ కంట తడిపెట్టారు. ‘సర్కారోళ్లు సాయం చేయకుంటే ఇక మా చావడమే మేలు’ అంటూ భోరుమన్నారు. కిష్టంపేట నుంచి వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి మండలానికి వచ్చిన పొంగులేటి బృందం కట్లకుంట, తొంబర్రావుపేట గ్రామాల్లోని పొలాల్లోకి వెళ్లారు. ఆ ప్రాంతాల్లో కూలిన అరటి, బొప్పాయి చెట్లు, నేలకొరిగిన నువ్వులు, నేలపాలైన మామిడి కాయలను పరిశీలించారు. విరిగిన అరటిచెట్లను పొంగులేటికి చూపిస్తూ రైతులు యార్ల రాజి రెడ్డి, మహేష్ ‘ఈ ఏడాది బాగా కాపుకొచ్చినయ్.. తీరాచూస్తే అరటి చెట్లన్నీ కళ్లముందే కూలిపాయే’అని కన్నీటి పర్యంతమయ్యారు. పార్లమెంట్లో చర్చిస్తా: పొంగులేటి రైతాంగానికి జరిగిన నష్టంపై రేపటి నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చిస్తానని పొంగులేటి చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీతోపాటు సీఎం కేసీఆర్తోనూ మాట్లాడి పంట నష్టపోయిన రైతులకు నూటికి నూరుశాతం సాయం అందేలా కృషి చేస్తానన్నారు. జిల్లాలో పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మమేకమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ దివంగ త సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పంట నష్టం వాటిల్లితే తక్షణం పరిహారం ఇచ్చేవారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు వైఎస్ తరువాత వచ్చిన పాలకులెవరూ అన్నదాతకు అండగా నిలవడం లేదన్నారు. రైతులకు న్యాయం జరిగేవరకు పోరాటం వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి కొత్తగూడెం: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించే వరకు ప్రభుత్వం తో పోరాడుతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. వరికి రూ. 15 వేలు, ఇతర పంటలకు రూ. 25 వేలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పినపాక ఎ మ్మెల్యే, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో శనివారం నిర్వహించిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వైఎస్సార్సీపీ కా ర్యకర్తల కోసం రూ.50 లక్షలతో సంక్షేమ నిధిని ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు మాయ మాటలు చెప్పి ఇతరపార్టీల నాయకుల ను ప్రలోభాలకు గురిచేస్తూ తమ పార్టీలోకి రప్పించుకుంటున్నారని ఆరోపించారు. పాయం వెంకటేశ్వర్లుకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారలేదని గుర్తుచేశారు. 2019 నాటికి శాసనసభను శాసించే స్థాయికి వైఎస్సార్సీపీ ఎదుగుతుందన్నారు. ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని నిల్చోపెట్టి గెలిపించి పార్టీ సత్తా నిరూపిస్తామని అన్నారు. -
నేడు కరీంనగర్ కు ఏపీ సీఎం చంద్రబాబు
కరీంనగర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. రామకృష్ణ కాలనీ నుంచి కరీంనగర్ వరకు చంద్రబాబు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో పార్టీ ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశముందని టీడీపీ నేత విజయరమణా రావు తెలిపారు. ఈ పర్యటన నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ ధర్నాకు పిలుపునిచ్చింది. ధర్నా నేపథ్యంలో జిల్లాలో పోలీసులను భారీగా మోహరించారు. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్ చేశారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఉన్న హోటల్ వద్ద పోలీసులను మోహరించారు. ఆయనను హౌస్ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది.