breaking news
kapulapalem
-
కాకినాడలో విషాదం: తీరానికి మృతదేహాలు
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని సూర్యారావుపేట బీచ్లో గత గురువారం గల్లంతైన ఐదుగురులో ఇద్దరి మృతదేహలు లభ్యమయ్యాయి. యూ.కొత్తపల్లి మండలం సుబ్బంపేట తీరానికి వారి మృతదేహలు కొట్టుకు వచ్చాయి. అదేరోజు ముగ్గురి మృతదేహాలు వెలికితీయగా, నేడు మరో ఇద్దరి మృతదేహాలు తీరంలో కనిపించాయి. తాళ్లరేవు మండలం సుంకరపాలెం (కాపులపాలెం) పితానివారిపేటకు చెందిన పితాని గోవిందు, పితాని శ్రీను కుటుంబాలు, వారి చెల్లెలు శీలం తనుకులమ్మ కుటుంబం మొత్తం 18 మంది సభ్యులు టాటా ఏసు గూడ్స్ ఆటోలో పెద్దాపురం నియోజకవర్గంలోని కాండ్రకోట నూకాలమ్మతల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గురువారం సూర్యరావు పేట బీచ్ కి వచ్చారు. పితాని గోవిందు కుటుంబానికి చెందిన పితాని అనిత (16), పితాని రమ్య (18), పితాని వీరవంశీ (14), పితాని శ్రీను కుటుంబానికి చెందిన పితాని జయకృష్ణ (20), శీలం తనుకులమ్మ (30), శీలం దేవి (16) సముద్రంలోకి దిగిన వెంటనే ఓ రాకాసి అల వీరిని లోపలికి లాగేసుకుంది. సముద్రం ఒడ్డున ఉన్న కుటుంబ సభ్యులు చూస్తుండగానే వీరంతా మునిగిపోయారు. వారిని రక్షించేందుకు పితాని శ్రీను (36) సముద్రంలోకి దిగి సముద్రంలో కొట్టుకుపోయాడు. ఏడుగురిలో ఇద్దర్ని స్ధానికులు ఎలాగోలా కష్టపడి రక్షించారు. గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహలు ఆరోజే తీరానికి కొట్టుకువచ్చాయి. మిగిలిన ఇద్దరి మృదేహలు నాలుగురోజైన ఆదివారం తీరానికి కొట్టుకొచ్చాయి. సంబంధిత కథనాలు కాకినాడ బీచ్లో విషాదం కాటేసిన కడలి -
కాపులపాలెం కలవరం
తాళ్లరేవు (ముమ్మిడివరం) : అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన గ్రామస్తుల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయన్న సమాచారం తెలియగానే మండలంలోని కాపులపాలెం పితానివారి పేటలో కలవరపడింది. మూడు కుటుంబాల్లో ఎవరు ఉన్నారో, ఎవరు మరణించారో తెలియక ఆ కుటుంబాల వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మృతుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మిన్నంటింది. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు, టిళ్లపూడి నాగేశ్వరరావు, గుత్తుల శ్రీను, గుత్తుల విఘ్నేశ్వరరావు తదితరులు కాకినాడలో సంఘటనా స్థలానికి వెళ్లి బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. ఆ పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఈ ఘటనపై సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ.. కాకినాడ ప్రమాదంలో మృతి చెందిన పితాని శ్రీను, భార్య హేమలత ఇద్దరు కుమారులు జయకృష్ణ, దుర్గాప్రసాద్ (పండు)లతో కాండ్రకోట వెళ్లారు. ఈ ప్రమాదంలో పితాని శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడు జయకృష్ణ సముద్రంలో గల్లంతయ్యాడు. దీంతో ఆ కుటుంబంలో హేమలత, చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ మిగిలారు. పితాని శ్రీను సోదరుడు గోవిందు, అతని భార్య పద్మ, కుమార్తెలు అనిత, రమ్య, కుమారుడు వీరవంశీలతో కలిసి దర్శనానికి వెళ్లారు. అనిత అక్కడికక్కడే మృతి చెందగా, వీరవంశీ ఆచూకీ లభించలేదు. అనిత పదో తరగతి పరీక్షలు ఇటీవల ఇంజరం హైసూ్కల్లో రాసింది. వీరవంశీ స్థానిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మరో కుమార్తె పితాని రమ్య తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. కుమార్తె, కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మృతి చెందిన పితాని శ్రీను చెల్లెలు శీలం తణుకులమ్మ, ఆమె కుమార్తె శీలం దేవి, కుమారుడు శీలం శ్రీనులతో కలిసి వెళ్లింది. ప్రమాదంలో శీలం దేవి అక్కడికక్కడే మృతి చెందగా, శ్రీను కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తణుకులమ్మ భర్త గతంలోనే మృతి చెందడంతో ఆమె కూలిపని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. తణుకులమ్మ పరిస్థితి విషమంగా ఉంది. తల్లి అపస్మారక స్థితికి చేరుకోవడం, అక్క దేవి చనిపోవడంతో శ్రీను ఒంటరివాడయ్యాడు. వీరితోపాటు వెళ్లిన శీలం సత్యనారాయణ, కుటుంబ సభ్యులు మాత్రం క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. సత్యనారాయణ యానాం మున్సిపాలిటీ ట్రాక్టర్ డ్రైవరుగా పనిచేస్తున్నాడు. అతని చిన్న కుమారుడు త్రిమూర్తులు, అతని భార్య దుర్గాదేవి, కుమార్తె, కుమారుడు క్షేమంగా బయటపడ్డారు. మృతుల కుటుంబాలకు స్థానిక నేతల పరామర్శ స్థానిక నేతలు అక్కడకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. స్థానిక దళిత నాయకుడు, విశ్వజన కళామండలి జిల్లా అధ్యక్షుడు వడ్డి ఏడుకొండలు, లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షుడు మోపూ రి వెంకట రెడ్డినాయుడు, మాజీ సర్పంచిలు సుంకర సూర్యనారాయణ, గుత్తుల రామకృష్ణ, కవల కోటేశ్వరరావు తదితరులు పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే దాట్ల కాకినాడ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుంటామని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు హామీ ఇచ్చారు. ఆయన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వృద్ధ దంపతులకు గుండెకోత కాకినాడ ప్రమాదంలో మృతి చెందిన పితాని శ్రీను తల్లిదండ్రులు పొట్టకూటి కోసం హైద్రాబాద్లో ఉంటున్నారు. కుమారుడు శ్రీను, కుటుంబ సభ్యులు మరణించారన్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులు ఫో¯ŒSలో వారికి తెలియజేశారు. -
కాకినాడ బీచ్లో విషాదం
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సూర్యారావుపేట బీచ్లో గురువారం విషాదం చోటుచేసుకుంది. విహార యాత్ర కాస్తా విద్యార్థుల కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. సముద్ర స్నానానికి వెళ్లి తొమ్మిదిమంది విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో అయిదు మృతదేహాలు బయటికి కొట్టుకువచ్చాయి. మరో ముగ్గుర్ని స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గల్లంతు అయిన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 19 మంది కాకినాడ బీచ్కి విహర యాత్రకు వచ్చారు. వీరంతా పక్కనే ఉన్న పాలరేవు మండలం కాపులపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందినవారు ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులు వంశీ, పండు, శీలం దుర్గ, పితాని శ్రీను, అనితగా గుర్తించారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరా తీశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలాగే గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
కాకినాడ బీచ్లో విషాదం