-
కప్పలవాగులో కొట్టుకుపోయిన కారు
సాక్షి, కోవెలకుంట్ల: కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం వల్లంపాడు సమీపంలో ప్రవహిస్తున్న కప్పలవాగులో మంగళవారం అర్ధరాత్రి ఓ కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ఐదుగురు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. చిత్తూరు జిల్లా వేంపల్లెకు చెందిన మధుసూదన్, మహేష్, మనోజ్కుమార్, మనోహర్, సోమశేఖర్ కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు సోమవారం కారులో బయలుదేరారు. అర్ధరాత్రి కావడంతో గూగుల్ మ్యాప్ ద్వారా దొర్నిపాడు మండలం గుండుపాపల నుంచి లింగాల మీదుగా ప్రయాణం సాగించారు. శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కుందూ నదికి నీటిని విడుదల చేయడంతో ఇరవై రోజుల నుంచి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కప్పలవాగు సమీపానికి చేరుకున్నాక అర్ధరాత్రి కావడంతో కారు లైటింగ్లో వాగు ఉధృతిని అంచనా వేయలేకపోయారు. కారును వేగంగా వాగులోకి దించడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ముందు కూర్చున్న వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో వెనుక కూర్చున్న ముగ్గురు అప్రమత్తమై డోర్ తెరుచుకుని వాగులోకి దూకారు. తర్వాత అందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. బుధవారం గ్రామస్తులు వాగు వద్దకు చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో కారును బయటకు లాగారు. -
ముంచెత్తిన వాన
♦ అమరావతి సమీపంలో పొంగిన కప్పల వాగు ♦ కొండవీటి వాగుకు చేరుతున్న వర్షపు నీరు ♦ తెనాలి లోతట్టు ప్రాంతాల్లో దెబ్బతిన్న వరి ♦ ఈ వర్షాలతో పంటలకు మేలే అంటున్న అధికారులు సాక్షి, అమరావతి బ్యూరో : జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా రోజంతా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షాలు ప్రస్తుతం వేసిన పంటలకు మేలు చేకూర్చుతున్నాయి. ఇంకా పదును కాని మాచర్ల ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేయనున్నారు. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో రోడ్లు చిత్తడిగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరి, రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. గుంటూరు నగరంలో మ్యాన్ హోల్లు పొంగి ప్రవహిస్తున్నాయి. తాడికొండ నియోజకవర్గంలోని తాడికొండ, కంతేరు, పొన్నెకల్లు, పాములపాడు గ్రామాల్లో వర్షపు నీరు ప్రత్తి పంట పొలాల్లోకి చేరటంలో నీట మునిగాయి. అమరావతి సమీపంలో కప్పల వాగు పొంగి ప్రవహించడంతో రెండు గంటల పాటు అమరావతి – క్రోసూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో కూరగాయల సాధారణ సాగు విస్తీర్ణం 32,500 ఎకరాలు కాగా, ఇందులో ఇప్పటికే 16 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మిగిలిన విస్తీర్ణంలో ప్రస్తుతం సాగు చేపట్టనున్నారు. జిల్లాలో దాదాపు 2.50 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తు›తం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 30 వేల ఎకరాల్లో మిర్చి పంట వేయనున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తెనాలి, కొల్లిపర, బుర్రిపాలెం, నందివెలుగు ప్రాంతాల్లో వెదజల్లే పద్ధతిలో సాగు చేసిన వరి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి మునిగిపోయింది. దాదాపు 50 ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగినట్లు సమాచారం. జిల్లాలో 32.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం... జిల్లాలో సగటు వర్షపాతం 32.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. తుళ్లూరులో అత్యధికంగా 65.4, నూజెండ్లలో అత్యల్పంగా 5 మిల్లీమీటర్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 47 మండలాల్లో 20 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. మేడికొండూరు 62 మిల్లీమీటర్లు, దాచేపల్లి 58.2, పెదకూరపాడు 55.8, బెల్లంకొండ 54.4, పెదకాకాని 52.4, అమరావతి 50.2, అచ్చంపేట 49.8, తాడికొండ 48.2, తెనాలి 46, కొల్లూరు 45.8, కొల్లిపర 44.6, రెంటచింతల 44.5, క్రోసూరు 42.6, మంగళగిరి 42.2, గుంటూరు 40.4, టి.చుండూరు 38.4, ఫిరంగిపురం 38.2, రాజుపాలెం 38.2, అమృతలూరు 37.2, చేబ్రోలు 36.6, తాడేపల్లి 36.6, సత్తెనపల్లి 33.4, గురజాల 32.4, వేమూరు 32.4, దుగ్గిరాల 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎరువులు, విత్తనాలు సిద్ధం జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు మేలు చేకూర్చేలా ఉన్నాయి. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచవరం ప్రాంతాల్లో ఇప్పటికే వేసిన ప్రత్తి, అపరాల పంటలకు మేలు చేకూరనుంది. పంటలు వేయకుండా మిగిలిన ఖాళీ పొలాల్లోనూ ప్రస్తుత వర్షాలతో సాగు చేపట్టనున్నారు. ఇప్పటివరకు వర్షాలు లేక సాగు అత్యల్పంగా ఉన్న మాచర్ల ఏడీఏ పరిధిలో ప్రస్తుత వర్షాలతో సాగు విస్తీర్ణం పెరగనుంది. రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసి ఉంచాం. పశ్చిమ డెల్టాలో వర్షం ఆగిపోయిన తరువాత వెద పద్ధతిలో వరి సాగు చేయనున్నారు. మిగిలిన పొలాలకు వరి నార్లు పోస్తున్నారు. – కృపాదాస్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, గుంటూరు 30వేల ఎకరాల్లో మిర్చి సాగు ప్రస్తుత వర్షాలతో జిల్లాలో మిర్చి విత్తనాలు వేయనున్నారు. 30 వేలకు పైగా ఎకరాల్లో సాగు చేయనున్నారు. పసుపు పంటకు కూడా వర్షం మేలు చేకూర్చనుంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అరటి, బొప్పాయి, నిమ్మకు సైతం ఈ వర్షం ఊపిరి పోయనుంది. – జయచంద్రారెడ్డి, హార్టీకల్చర్ డీడీ, గుంటూరు
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement