kaikalur
-
కైకలూరు కేంద్రంగా పిల్లల విక్రయం కేసులో ట్విస్ట్
సాక్షి, కైకలూరు: ఏలూరు జిల్లా కైకలూరు కేంద్రంగా ఇటీవల నమోదైన పిల్లల విక్రయం కేసులో ట్విస్ట్ ఎదురైంది. పిల్లల విక్రయంలో కీలక సూత్రధారి జనసేన నేత తల్లిగా గుర్తించారు. మీడియాలో వచ్చిన కథనాలపై ఉన్నతాధికారుల ఆదేశాలతో ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. గర్భిణీగా రిజిస్టర్ కాకుండా పిల్లలను తెచ్చి, తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై ఆరా తీశారు. ఇద్దరు పిల్లల్ని విక్రయించినట్లు విచారణలో ఐసీడీఎస్ అధికారులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బిశెట్టి వీరమ్మ, గోపి, చిన్ని, రెడ్డెమ్మ, ఫరీనా పిల్లల విక్రయాలకు పాల్పడినట్లు గుర్తించారు. వారిపై కైకలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లల విక్రయాల్లో సూత్రధారిగా కైకలూరు జనసేన నేత ఏఎన్ బాబు తల్లి అబ్బిశెట్టి వీరమ్మ (@వీరాకుమారి, @ఈడేపల్లి ఆంటీ) ఉన్నారు. 2024లో ఇద్దరు పిల్లల్ని అబ్బిశెట్టి వీరమ్మ విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. పది రోజుల క్రితం ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన ఆకేటి మోక్షిత్ (రెండున్నరేళ్లు) అదృశ్యమయ్యాడు. ఆకేటి మోక్షిత్ అదృశ్యం వెనుక అబ్బిశెట్టి వీరమ్మ ముఠా హస్తం ఉందేమోననే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కైకలూరు కేంద్రంగా పసిపిల్లల విక్రయం!
ఏలూరు: జిల్లాలోని కైకలూరు కేంద్రంగా పసిబిడ్డలను విక్రయిస్తున్న ఘటన కలకలం రేపుతోంది. పసిబిడ్డలను అంగడి సరుకుగా మార్చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ముదినేపల్లి మండలం శ్రీహరిపురానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు అకేటి మోక్షిత అదృశ్యమయ్యాడు. గత 13 రోజుల నుంచి మోక్షిత్ ఆచూకీ కనిపించడం లేదు. ఇంటిముందు ఆడుకుంటున్న మోక్షిత్ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కైకలూరు, ముదినేపల్లి సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. దీనిపై జనసేన నేత ఏఎన్ బాబుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిపిల్లలను విక్రయిస్తున్నడని ఏఎన్ బాబుపై ఆరోపణులు వస్తున్నాయి. దాంతో ఏఎన్ బాబు పాత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఏఎన్ బాబు షాపు వద్దకు వెళ్లారు పోలీసులు. అయితే ఏఎన్ బాబు పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
రంగా విగ్రహాలకు అవమానం
కైకలూరు/కలిదిండి: ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో దివంగత ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి మోహనరంగా విగ్రహాలకు అవమానం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి మాస్్కలు ధరించిన ఇద్దరు దుండగులు కలిదిండి, సానారుద్రవరం గ్రామాల్లో రంగా విగ్రహాలకు పేడపూసి అవమానించారు. పోలీసులు సేకరించిన సీసీ టీవీ ఫుటేజీలలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. కలిదిండి మూడు కూడళ్ల సెంటర్లో రంగా విగ్రహం వద్ద శుక్రవారం సినీ నటుడు చిరంజీవి పుట్టిన రోజు వేడుక నిర్వహించారు. శనివారం ఉదయం రెండు ప్రాంతాల్లో విగ్రహాలకు పేడ ఉండటాన్ని గమనించిన రంగా అభిమానులు కోపంతో రగిలిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. నిందితుల్ని గుర్తించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి.. నిందితుల్ని గుర్తించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. పథకం ప్రకారమే.. ముదినేపల్లి మండలం ఈడేపల్లిలో రెండు, కైకలూరు మండలం ఆలపాడులో ఒకచోట స్థాపించిన రంగా విగ్రహాలను ఆయన తనయుడు వంగవీటి రాధా ఆదివారం ఆవిష్కరించనున్నారు. కలిదిండి, సానారుద్రవరం గ్రామాల మీదుగానే ఆయన వెళ్లాల్సి ఉంది. అందుకే దుండగులు ఈ మార్గాన్ని ఎన్నుకున్నట్టు తెలుస్తోంది. సీసీ టీవీ ఫుటేజీల్లో ఈ దుశ్చర్యకు పాల్పడిన ఇద్దరూ 18 ఏళ్లలోపు వారిగా కనిపిస్తున్నారు. మాస్క్ పెట్టుకుని ఒక యువకుడు విగ్రహానికి పేడ పూయగా, తర్వాత మరో యువకుడు బైక్పై రావడంతో అతనితో కలిసి పరారయ్యాడు. రాధా రానుండటంతో పక్కా పథకం ప్రకారమే విగ్రహాలకు పేడ పూసినట్టు స్థానికులు భావిస్తున్నారు. విగ్రహాలను శుద్ధి చేసిన వైఎస్సార్సీపీ నేతలు దుండగుల దుశ్చర్యను తెలుసుకుని శనివారం రంగా విగ్రహాలను శుద్ధి చేసేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేతలపై కూటమి కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) శనివారం కలిదిండిలోని రంగా విగ్రహం వద్దకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో వచ్చారు. రంగా విగ్రహానికి క్షీరాభిషేకం చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో కూటమి పార్టీకి చెందిన వ్యక్తులు డీజే వ్యాన్ను పెద్ద శబ్దంతో విగ్రహం వైపు తిప్పారు. అక్కడితో ఆగకుండా కూటమి కార్యకర్తలు బైక్లపై నినాదాలు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో డీఎన్నార్ సీఐ రవికుమార్కు ఫిర్యాదుచేశారు. కూటమి కార్యకర్తల కవ్వింపు చర్యలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ.. నాలుగు రోజుల్లోగా దోషులను గుర్తించాలని, లేదంటే 3వేల మంది కార్యకర్తలతో కలిదిండిలో నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. ఎమ్మెల్యేను చుట్టుముట్టిన జనం విగ్రహాలను అవమానించిన విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఘటనా స్థలాలను శనివారం పరిశీలించారు. దీంతో.. స్థానికులు ఆయనను చుట్టుముట్టారు. నిందితులను తక్షణమే పట్టుకోవాలని పట్టుబట్టారు. ఎమ్మెల్యే కామినేని ఐజీ జీవీజీ అశోక్కుమార్తో ఫోన్లో మాట్లాడారు. ఆంధ్రా–తెలంగాణ రాధా, రంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. సీఎం చంద్రబాబు కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. ఈ ఘటనను సీఎం చంద్రబాబు తీవ్రంగా ఖండించారని, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారని పేర్కొంది. దుండగుల సమాచారమిస్తే బహుమతి రంగా విగ్రహాలకు పేడ పూసిన దుండగుల సమాచారం చెబితే బహుమతి అందిస్తామని ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ శనివారం ప్రకటించారు. కలిదిండి పోలీస్స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజల మధ్య విభేదాలు సృష్టించడానికే దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పారు. -
CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)
-
ప్రియుడితో కలసి భర్తను హతమార్చింది
కైకలూరు: ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన సంఘటన సోమవారం కృష్ణా జిల్లాలో వెలుగు చూసింది. ఈ కేసులో కైకలూరు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. కైకలూరు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ రంజిత్ కుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. కైకలూరు మండలం వరాహపట్నంకు చెందిన లక్ష్మినరసింహస్వామికి విజయలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. విజయలక్ష్మికి ఎనిమిదేళ్ల క్రితం సూరి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దాంతో దంపతుల మధ్య గొడవలు ఏర్పడి వారు విడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి ఆమె సూరితో సహజీవనం చేస్తోంది. ఎలాగైనా భర్తను మట్టుబెట్టాలని పథకం పన్నిన విజయలక్ష్మి ప్రియుడు సూరి, మరో వ్యక్తి శ్రీనివాస్తో కలిసి లక్ష్మినరసింహస్వామిని వారం రోజుల క్రితం హతమార్చి చేపల చెరువులో పడేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు హత్యతో సంబంధం ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు.


