breaking news
K V Ramana Chary
-
ప్రతి అసెంబ్లీ కేంద్రంలో మహిళా దినోత్సవం
సాక్షి, హైదరాబాద్: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వేడుకలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నిధులను జిల్లాలకు విడుదల చేస్తామని చెప్పారు. బుధవారం సచివాలయంలో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి, సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్ తదితరులతో ఆయన సమావేశం నిర్వహించారు. మార్చి 8న రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కార్యక్రమానికి వేదికగా లలితకళాతోరణాన్ని పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 8 గంటల మధ్య జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళలకు అవార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. శుక్రవారం మరోమారు ఉత్సవ కమిటీ సమావేశం అవుతుందని తెలిపారు. ‘భేటీ బచావో, భేటీ పడావో’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసి కేంద్రం ప్రశంసలు పొందిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు. -
కె వి రమణాచారితో మనసులో మాట
-
‘బంగారు’ చీర బహూకరణ
సాక్షి, హైదరాబాద్: నగర చరిత్ర, విశిష్టతలను తెలిపే అపురూపమైన ఓ చీరను నగరానికి చెందిన ఓ కుటుంబం రాష్ట్ర ప్రభుత్వానికి బహూకరించింది. దాదాపు 350 ఏళ్ల కింద మల్మల్ వస్త్రంపై బంగారపు పూతతో రూపొందించిన ఈ చీర, తరతరాలుగా నగరానికి చెందిన గోపాల్ షా సోదరుల కుటుంబానికి వారసత్వ ఆస్తిగా సంక్రమిస్తూ వస్తోంది. రిటైర్డ్ పురాతత్వ శాఖ అధికారి నారాయణరావు ఆధ్వర్యంలో గోపాల్ షా బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారుడు కేవీ రమణాచారిని కలసి ఈ చీరను కానుకగా సమర్పించారు. 850 గ్రాముల బరువున్న ఈ చీరను 16వ శతాబ్దంలో తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. నాటి చేనేత కార్మికులు ఎంతో నైపుణ్యంతో ఈ చీరను రూపొందించారని కేవీ రమణాచారి తెలిపారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్న తరుణంలో, రాష్ట్రానికి బంగారు తాపడం చేసిన చీరను బహూకరించిన గోపాల్ షా కుటుంబాన్ని ఆయన అభినందించారు.