breaking news
Justice for Victims
-
ప్రశ్నించరన్న దైర్యంతో పద్దతిగా పాపాలు.. దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త
-
వెన్నులో వణుకుపుట్టించిన ఘటన.. నూర్పై కిరాతకం
మరో ఘోర ఘటన అంతర్జాతీయ సమాజంలో ఆడవాళ్ల భద్రత-రక్షణల మీద చర్చకు దారి తీసింది. నూర్ ముకదమ్ అనే యువతిని అతికిరాతకంగా హత్య ఘటన పాక్ అట్టుడుకిపోయేలా చేస్తోంది. పాక్ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్ను ఆమె స్నేహితులే క్రూరంగా హింసించి చంపారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున్న దుమారం రేపుతోంది. #Justicefornoor హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నూర్ ముకదమ్.. పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త షౌకత్ ముకదమ్ కూతురు. గతంలో ఆయన సౌత్ కొరియా, కజకస్థాన్లకు రాయబారిగా పని చేశారు. ఈయన కూతురు నూర్(27).. మంగళవారం రాత్రి ఇస్లామ్బాద్ సెక్టార్ ఎఫ్-7/4లోని ఓ ఇంట్లో ఘోర హత్యకు గురైంది. ఆ ఇల్లు ఆమె స్నేహితుడు జహీర్ జకీర్ జాఫర్ది. అయితే ఈ హత్య జహీర్ చేసిందనేనని నిర్ధారించిన పోలీసులు.. శనివారం దాకా అతన్ని అరెస్ట్ చేయలేదు. అంతేకాదు అతని మానసిక స్థితి సరిగాలేదని, అతన్ని చికిత్స కోసం తరలించాలని ఇస్లామాబాద్ పోలీసులు కోర్టును ఆశ్రయించడంపై జనాల్లో ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. వేల సంఖ్యలో బ్యానర్లు చేతబడ్డి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో వస్తా! మంగళవారం ఉదయం బక్రీద్ కోసమని గొర్రెను కొనడానికి రావల్పిండికి వెళ్లాడు షౌకత్. ఆయన భార్య కొత్త బట్ల కోసం బయలకు వెళ్లింది. వచ్చి చూసేసరికి కూతురు ఇంట్లో లేదు. తన స్నేహితులతో బయటకు వెళ్తున్నానని, ఒకటి రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పిందామె. మంగళవారం మధ్యాహ్నం నూర్ ఫోన్ స్విచ్ఛాఫ్ రాగా.. ఆమె తన దగ్గర లేదని జకీర్ బదులిచ్చాడు. అదేరోజు రాత్రి ఆమె మృతదేహం దొరికినట్లు ఖోహ్సర్ పోలీసులు షౌకత్కు సమాచారం అందించారు. తగలబెట్టి.. గొంతు కోసి నూర్ ముకదమ్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బతికుండగానే ఆమెను చిత్రవధ చేశారు. ఆమె ఒంటిపై అన్ని చోట్లా కత్తి గాట్లు పెట్టారు. సూదులతో వీపులో గుచ్చారు. జుట్టు కత్తించేశారు. ఆపై ఆమె శరీరాన్ని తగలబెట్టి.. పదునైన ఆయుధంతో పీక కోశారు. తల, మొండాన్ని వేరు చేసి.. దూరంగా పడేశారు. ఈ పైశాచిక ఘటన ఒక్కసారిగా పాక్ ఉలిక్కిపడింది. అయితే అత్యాచారానికి గురైందన్న బాధితురాలి తండ్రి షౌకత్ అనుమానాలపై డాక్టర్ల నుంచి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. మరోవైపు ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో జకీర్ను శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. The barbaric murder of young woman, Noor, in Islamabad is yet another horrifying reminder that women have been & are brutalized & killed with impunity. This must end. We are committed to ensuring no one is above the law & culprits having influence & power cannot simply "get away" — Shireen Mazari (@ShireenMazari1) July 21, 2021 పలుకుబడితో.. ఇస్లామాబాద్లో ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈవో జకీర్ జాఫర్. అతని కొడుకే జహీర్ జకీర్ జాఫర్.. పైగా జహీర్ కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చాడు. జహీర్ జకీర్ జాఫర్ మానసిక స్థితి బాగానే ఉందని, పోలీసులు తప్పుదోవపట్టిస్తున్నారని, రాజకీయ పలుకుబడితో బయటపడే ప్రయత్నం చేస్తున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. అయితే నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడని, కఠినంగా శికక్షించి తీరతామని కేంద్ర మంత్రులు హామీ ఇస్తున్నారు. -
ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోంది
టీఆర్ఎస్పై రాష్ట్రపతికి అఖిల పక్షం ఫిర్యాదు ► దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు ► బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని అఖిల పక్ష, టీజేఏసీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తున్న దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలపై పోలీసులను ప్రయోగించి చిత్రహింసలకు గురిచేస్తోందని రాష్ట్ర పతి రామ్నాథ్ కోవింద్కు ఫిర్యాదు చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి, ఎమ్మెల్యే సంపత్కుమార్ తదితరులు బుధవారం ఢిల్లీలో రాష్ట్రపతిని కలిశారు. బంగారు తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు. న్యాయవిచారణ జరిపేలా ఆదేశించండి.. ఇసుక దందాలకు పాల్పడుతున్న వారికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ తన బంధువులతో కలసి నడుపుతున్న ఇసుక దందాను ప్రశ్నించిన నేరెళ్లకు చెందిన 8 మంది దళితులను పోలీసులు వేధిస్తున్నారని రాష్ట్రపతికి వివరించారు. నేరెళ్లలో ఎస్పీ దగ్గరుండి మరీ దళితులను చిత్రహింసలకు గురిచేశారన్నారు. ఈ ఘటనలో బాధితులకు న్యాయం జరిగేలా స్వతంత్ర కమిషన్తో విచారణ జరిపేలా డీజీపీని ఆదేశించాలని, బాధితులకు నష్టపరిహారమందేలా చూడాలని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నియంతృత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదన్నారు. ఉద్యోగాల కోసం యువత, వ్యవసాయంలో చేయూత కోసం రైతులు ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం వారిని అణగదొక్కుతోందన్నారు. సమావేశం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను ఎలా కాలరాస్తోందో రాష్ట్రపతికి సమర్పించినట్లు చెప్పారు. దళితులపై జరుగుతున్న దాడులపై విచారణ జరిపించాలని చేసిన విజ్ఞప్తిపై రాష్ట్రపతి సానుకూలంగా స్పందించార న్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణలో ఎంపీటీసీ ఉపట్ల శ్రీనివాస్పై జరిగిన దాడిని కోదండరాం ఖండించారు.