breaking news
juice factory
-
భారీ అగ్నిప్రమాదం.. 52 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా శివార్లలోని ఒక ఆహారోత్పత్తుల కార్మాగారంలో గురువారం జరిగిన అగ్రిప్రమాదంలో కనీసం 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. రూప్గంజ్ ప్రాంతంలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, క్షణాల్లో ఫ్యాక్టరీ అంతటా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ కార్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల్లో అత్యధికులు టీనేజర్లేనని స్థానికులు తెలిపారు. ‘52 మృతదేహాలను వెలికితీశాం. ఫ్యాక్టరీలో మరికొన్ని మృతదేహాలు ఉండే అవకాశముంది. సహాయ, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి’ అని అధికారులు తెలిపారు. ఆరు అంతస్తులున్న ఆ భవనంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా మంటలు, దట్టంగా పొగ కనిపించాయని స్థానికులు తెలిపారు. ‘మంటలు మొదట ప్రారంభమైన నాలుగో అంతస్తు వరకు గాలింపు ముగిసింది. ఇంకా ఐదు, ఆరు అంతస్తులను పరిశీలించాల్సి ఉంది’ అని అగ్నిమాపక విభాగం అధికారి శుక్రవారం వెల్లడించారు. భవనం పై నుంచి బయటకు వెళ్లే ఎగ్జిట్ పాయింట్కు తాళం వేసి ఉందని, దాంతో మంటల్లో చిక్కుకున్న కార్మికులు బయటకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. -
జ్యూస్ ఫ్యాక్టరీలకు టమాట
మదనపల్లె, న్యూస్లైన్ : మదనపల్లె టమాట జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలుతోంది. జిల్లాలోని మూడు జ్యూస్ ఫ్యాక్టరీలకు రోజూ 25లోడ్ల వరకు కాయలను తరలిస్తున్నారు. మదనపల్లె డివిజన్లోని మార్కెట్లకు 15 రోజులుగా దిగుబడి అధికంగా రావడంతో ధరలు కుప్పకూలారుు. బుధవారానికి కిలో 90పైసలకు ధర పతనమైంది. వారం రోజులకు ముందు కొంత నిలకడగా ఉన్న ధరలు, ఒక్కసారిగా పతనమయ్యూరుు. దీంతో దిక్కుతోచని రైతులు చిత్తూరు, పలమనేరు, రేణిగుంట జ్యూస్ ఫ్యాక్టరీలకు జ్యూస్ ఫ్యాక్టరీలకు టమాట కాయలను తరలిస్తున్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో కిలో టమాట మొదటి రకం రూ.3.50, రెండవ రకం రూ.2.50, మూడవ రకం రూ.1.70 పైసలు పలకగా, 8వ తేదీన మొదటి రకం రూ.4లు, రెండో రకం రూ.3లు, మూడవ రకం రూ.2లు, 9వ తేదీన మొదటి రకం రూ.3.50, రెండవ రకం రూ.2.50, మూడవ రకం రూ.1.70 పలికింది. ఈ నెల 10,11వ తేదీల్లో కిలో మొదటి రకం రూ.3లు, రెండవ రకం రూ.2లు, మూడవ రకం రూ.1.50లు పలికాయి. 12,13,14,15వ తేదీల్లో మొదటి రకం కిలో రూ.3లు, రెండవ రకం రూ.2లు, మూడవ రకం 90 పైసలకు పడిపోరుుంది. రోజూ మదనపల్లె మార్కెట్కు 250 నుంచి 290 టన్నుల వరకు కాయలు వస్తున్నారుు. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, కాకినాడతో పాటు తమిళనాడులోని కుంభకోణం, తిరుచ్చి ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ అధికారులు భావిస్తున్నారు. -
జ్యూస్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం