-
ఆధునిక పద్ధతిలో మూల్యాంకనం
సమస్యలకు చెక్ పెట్టేందుకే.. జేఎన్టీయూహెచ్లోనే వాల్యుయేషన్ సకాలంలోనే బీటెక్, బీఫార్మసీ ఫలితాల విడుదల సాక్షి, సిటీబ్యూరో: పరీక్షా ఫలితాల విడుదల లో జాప్యంతోపాటు ఎదురయ్యే ఇతర సమస్యలకు చెక్ పెట్టేందుకు మూల్యాంకన విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టినట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎన్వీ రమణారావు తెలిపారు. శనివారం జేఎన్టీయూహెచ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో తెలంగాణ వ్యాప్తంగా 65 కేంద్రాల్లో మూల్యాంకనం జరిగేదన్నారు. ప్రస్తుతం జేఎన్టీయూహెచ్ వేదికగా ఒకేచోట అన్ని జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తున్నందున క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కు ఆధునిక ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. ఈ తరహా టెక్నాలజీ ఒక్క జేఎన్టీయూహెచ్లో మాత్రమే ఉందన్నారు. అంతేకాకుండా జవాబు పత్రాల బండిల్స్ మిస్ కాకుండా అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. తేడాలొస్తే బ్లాక్లిస్ట్లో.. మూల్యాంకనాన్ని మెరుగైన పద్ధతిలో చేపడుతున్నామని వర్సిటీ పరీక్షల విభాగం డెరైక్టర్ ఈశ్వర్ప్రసాద్ అన్నారు. జవాబు పత్రాన్ని మూడు నిమిషాలలోపు మూల్యాంకనం చేస్తే సర్వర్ అనుమతించదన్నారు. మూల్యాంకనంలో తేడాలను గమనించేందుకు ఒక చీఫ్ ఎగ్జామినర్తోపాటు నలుగురు అదనపు కంట్రోలర్లు ఉంటారన్నారు. ప్రతి బండిల్ నుంచి ర్యాండమ్గా రెండేసి పేపర్లు తనిఖీ చేస్తారని, తేడాలున్నట్టు తేలితే రీవాల్యుయేషన్ చేయిస్తామని తెలిపారు. నిర్లక్ష్యం వహించే ఆచార్యులను బ్లాక్ లిస్ట్లో పెడతామన్నారు. ఏటా ఫలితాలు వచ్చిన తరువాత కనీసం 15 వేలమంది రీవాల్యుయేషన్, రీకౌంటింగ్లకు దరఖాస్తు చేసుకునేవారని, మూల్యాంకనంలో నాణ్యతను పెంపొందించడంతో రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సంఖ్య ఈ ఏడాది 1,500కు మించలేదన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతున్న తీరును సీసీటీవీల ద్వారా వీసీ, రిజిస్ట్రార్, రెక్టార్లు తమ చాంబర్నుంచే పర్యవేక్షిస్తారని చెప్పారు. మూల్యాంకనం తరువాత మార్కులను ఎప్పటికప్పుడు ట్యాబ్లెట్ పీసీల్లో నమోదు చేయడం ద్వారా నేరుగా సర్వర్కు అనుసంధానం చేశామన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఫలితాలను సకాలంలో అందించాలనే ఉద్దేశంతో ఉదయం 9 నుంచి రాత్రి10 గంటల వరకు ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ రెక్టార్ టి.కిషన్ కుమార్రెడ్డి, వర్సిటీ ఇన్నోవేషన్ టెక్నాలజీ సెంటర్ డెరైక్టర్ మాధవీలత తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలు పెట్టరు.. ఫలితాలు ఇవ్వరు..జేఎన్టీయూహెచ్ తీరిది!
వరుసగా వాయిదా పడుతోన్న బీటెక్ పరీక్షలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్టీయూహెచ్)లో బీటెక్ వార్షిక పరీక్షల వ్యవహారం ప్రహసనంగా మారింది. కొత్త విద్యా సంవత్సరం ముంచుకొస్తున్నా.. గత విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బీటెక్ కోర్సులో మొదటి మూడేళ్ల విద్యార్థులకు ఇంతవరకు పరీక్షలు జరగలేదు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఇకనైనా పరీక్షలు జరుగుతాయో లేదోనని విద్యార్థులు అం దోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల కమిషన్ అనుమతితో బీటెక్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించిన జేఎన్టీయూహెచ్ పరీక్షలు ముగిసి నెలయినా ఇంతవరకు ఫలితాలను ప్రకటించలేదు. అత్యంత సాంకేతిక వ్యవస్థను నెలకొల్పామని చెబుతున్న అధికారులు ఫలితాల జాప్యంపై నోరు మెదపడంలేదు. ఫలితంగా విదేశాల్లో ఉన్నత విద్యకోసం దరఖాస్తు చేసుకున్న ఫైనలియర్ అభ్యర్థులకు అవకాశాలు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంది. వాయిదాల పర్వం యూనివర్సిటీ ఆవిర్భవించాక ఇంతకు ముందెన్నడూ లేని విధంగా పరీక్షల విభాగం అధికారులు వార్షిక పరీక్షలను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. దీంతో విద్యార్థులు తమ వేసవి సెలవులను ప్రశాంతంగా గడిపేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల సంవత్సరంలో పరీక్షల షెడ్యూలును ప్రకటించడంలో యంత్రాంగం విఫలమైంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా వార్షిక పరీక్షలు ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడగా మూడోసారి ప్రకటించిన షెడ్యూలు ప్రకారమైనా పరీక్షలు జరుగతాయో లేదో అర్థంకాని పరిస్థితి నెలకొంది. తొలుత ఏప్రిల్ 22నుంచి మే 5 వరకు షెడ్యూలు ప్రకటించగా, వాటిని ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. రెండోసారి మే 20 నుంచి జూన్ 5 వరకు ప్రకటించగా వాటిని ఏ కార ణంత్లో వాయిదా వేశారో ఎవరికీ తెలియలేదు. మూడోసారి జూన్ 3 నుంచి జూన్ 17వరకు ప్రకటించారు. కొత్త రాష్ట్రాల అవతరణ నేపథ్యంలో అవి కూడా వాయిదా పడనున్నాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జూన్ 3 నుంచి సాధ్యమేనా? జూన్ 1, 2 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొని, జూన్ 3 నుంచి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఎలా హాజరు అవుతారని యాజమాన్యం భావించిందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఒకవేళ విద్యార్థులు ఈ పరీక్షలను మరోసారి నిర్వహించమంటే షెడ్యూలు మారుస్తుందా? కీలకమైన ఈ పరీక్షల నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement