-
మహాలక్ష్మికి నా భర్తతో అఫైర్.. అందుకే ఆమె భర్త వదిలేశాడు : నటి
ప్రముఖ తమిళ నిర్మాత రవీందర్ బుల్లితెర నటి వీజే మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. చూడచక్కని రూపంతో అందంగా ఉన్న మహాలక్ష్మీ.. భారీకాయుడైన రవీందర్ను పెళ్లాడటంతో ఈ జంట హాట్టాపిక్గా నిలిచింది. వీరి పెళ్లి గురించి తమిళనాటే కాకుండా సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యకాలంలో వీళ్లపై వచ్చినన్ని ట్రోల్స్ ఎవరి మీద వచ్చి ఉండవు. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. తాజాగా మహాలక్ష్మి గురించి నటి జయశ్రీ సంచలన ఆరోపణలు చేసింది. మహాలక్ష్మికి తన భర్తతో అఫైర్ ఉందని, అందుకే మొదటి భర్త ఆమెను వదిలేశాడంటూ పేర్కొంది. తన ముందే ఆమెతో వీడియో కాల్స్ చేసి మాట్లాడేవాడని, అంతేకాకుండా మహాలక్ష్మి కొడుకు తన భర్తను నాన్న అని పిలుస్తున్నాడంటూ గతంలో జయశ్రీ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. అయితే ఆ వార్తలను కొట్టిపారేసిన మహాలక్ష్మి జయశ్రీ కావాలనే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుందని, ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో రవీందర్ తనకు అండగా నిలబడ్డాడని, అందుకే అతనితో కొత్త జీవితం ప్రారంభించానని తెలిపింది. -
ప్రేమను పంచుదాం
ప్రస్తుత పరిస్థితుల్లో అందరిలోనూ స్ఫూర్తిని పెంచి, ప్రేమను పంచాలనే ఉద్దేశంతో కమల్ హాసన్ కరోనా వైరస్ పోరాటంపై ‘అరివుమ్ అన్బుమ్’ (బుద్ధి, ప్రేమ) పేరుతో ఓ పాటను సిద్ధం చేశారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను పాడటంతో పాటు కమల్ హాసనే స్వయంగా రాశారు. ఈ పాటకు కమల్ తో పాటు సుమారు 12 మంది ప్రముఖులు గొంతు కలిపారట. శంకర్ మహదేవన్, అనిరుధ్, జిబ్రాన్, యువన్ శంకర్ రాజా, దేవిశ్రీ ప్రసాద్, బొంబాయి జయశ్రీ, సిద్ శ్రీరామ్, సిద్ధార్థ్, శ్రుతీ హాసన్, ఆండ్రియా, తమిళ బిగ్ బాస్ ఫేమ్ ముగెన్ ఈ పాటను ఆలపించారు. ఈ పాటను ఎవరింట్లో వాళ్లు ఉండి రికార్డ్ చేశారు. ‘‘ఈ పాటను కమల్ హాసన్ గారు కేవలం రెండు గంటల్లో రాసేశారు. పాటలో 12 మంది వాయిస్ మాత్రమే కాదు 37 మంది కోరస్ వాయిస్లు వినిపిస్తాయి. వాళ్లను ఆన్ లైన్ ఆడిషన్ చేసి సెలక్ట్ చేశాను’’ అని ఈ పాటకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు జిబ్రాన్. త్వరలోనే ఈ పాట విడుదల కానుంది. -
పుడమి తల్లికి ప్రణామం
గాత్రాలన్నీ శృతిలో ఉన్నాయి. తొమ్మిది మంది గాయనీగాయకులు! బాంబే జయశ్రీ–టు–శంకర్ మహదేవన్. ఇక స్వరాలు కావాలి. పుడమిపై పరిచేశాడు అమృత్ రామ్నాథ్. కర్ణాటక సంగీతంలో కసుగాయి. 21 ఏళ్లుంటాయంతే. పాడతాడు. పాటలకు ఉయ్యాలలు కడతాడు. అతడికొచ్చింది ఆఫర్! వరల్డ్ ఎర్త్డేకి మంచి మ్యూజిక్ వీడియో చెయ్యాలి. అదీ ఆఫర్. ఆర్నెల్ల కిందటే వరల్డ్ ‘ఎర్త్ డే నెట్వర్క్’.. ఇండియాలో వెదకులాట మొదలు పెట్టింది. బాగా పాడేవారి కోసం. బాగా ట్యూన్ కట్టేవాళ్ల కోసం. బాగా లిరిక్స్ రాసేవారి కోసం. ఎర్త్ డే నెట్వర్క్కి భారతీయ రాయబారి బాంబే జయశ్రీ. కర్ణాటక లలిత సంగీత, సినీ గాయని. జయశ్రీనే దగ్గరుండి టీమ్ని తయారు చేసుకున్నారు. ఉత్సాహవంతుడైన అమృత్ రామనాథ్కి దర్శకత్వ బాధ్యతల్ని ఇచ్చేశారు! ఆ సంగీత దృశ్యకావ్యమే.. ‘ధర్తీ మా’. పుడమి తల్లికి ప్రణమిల్లడం. ఒకే పాటను ఎనిమిది భాషల్లో.. హిందీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, తమిళ్, కన్నడ, మలయాళం, గుజరాతీలలో.. పాడించాలి. ఒకే భావాంశానికి ఈ ఎనిమిది భాషల్లో అక్షరాలను పొదగాలి. వయోలిన్, గిటార్, తబలా, మృదంగం.. ప్రధాన వాద్యాలు. అందరూ తిరుగులేని విధంగా కుదిరారు. లిరిక్స్ వచ్చేశాయి. కొంత పని అయ్యాక మార్చి 25 కి కట్టుబడి నిలిచిపోయింది. లాక్డౌన్! అప్పటికి రికార్డింగ్ అయింది ముగ్గురి గాత్రాలు మాత్రమే. జయశ్రీ, అభిషేక్, శ్వేత. చెన్నైలోని అమృత్ రామ్నాథ్ హోమ్ స్టూడియోలో ఉన్నారు వాళ్లు ముగ్గరూ. మిగతావాళ్లు చెన్నై చేరుకోలేకపోయారు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, శాన్ఫ్రాన్సిస్కో.. ఎక్కడున్న వాళ్లు అక్కడి నుంచే పాడి పంపిస్తే.. మిగతా ఖాళీలను స్టూడియోలో పూరించుకున్నాడు అమృత్ రామనాథ్. ఆ మాత్రం త్వరగానైనా అయింది.. ప్లానింగ్లో అతడు జాగ్రత్తగా ఉండటం వల్లనే. జయశ్రీ మేమ్తో తను ఎన్నిమాటలైనా పడతాడు. కానీ జయశ్రీ మేమ్కు మాట రాకూడదు అనుకున్నాడు. ఒరిజినల్ ట్యూన్ ఇదీ అనుకున్నాక ఆ ట్యూన్కి తగ్గట్లు హిందీలో తనే పాట భావాన్ని రాయించి మిగతా ఏడు భాషల్లోని గేయ రచయితలకు పంపించాడు. ఎర్త్ డే నెట్వర్క్కి సహ రాయబారి కౌశికి చక్రవర్తి. ఆమె కూడా రామ్నాథ్కి కీలకమైన దర్శక సహకారం అందించారు. చిత్రా సాయిరామ్ (కన్నడ), చేతనా శ్రీకాంత్ (హిందీ, మరాఠీ) కార్తీక్ దలాల్ (గుజరాతీ), వి.పి.రామ్నాథ్ (బెంగాలీ), మథురాంతకి (తమిళ్), షిజిత్ నంబియార్ (మలయాళం), విధూ పుర్కాయస్థ (పంజాబీ).. వీళ్ల నుంచి పాట లిరిక్స్ తెప్పించి, మూలార్థానికి అనువాదాలు సరిపోయిందీ లేనిదీ చెక్ చేయించిందంతా కౌశికీనే. బెంగాలీ లిరిక్స్ రాయడంలో రామ్నాథ్కి కూడా ఆమె సహాయం చేశారు. యజ్ఞం పూర్తి అయింది. ‘‘భూమాతా నీకు వందనాలు. మా జీవనాధారం నువ్వే. తరాలుగా మా పోషణ నువ్వే. ప్రణామాలు తల్లీ.. నీకు ఆత్మ ప్రణామాలు..’’ అని ‘ధర్తీ మా’.. ఆలపించే ఈ బహుభాషా స్తుతి గీత గుచ్ఛం.. యాదృచ్ఛికంగానే అయినా సరైన సమయంలో వచ్చింది. వరల్డ్ఎర్త్డే సందర్భంగా నేడు విడుదల అవుతున్నా.. ఈ కరోనా కష్ట కాలమూ ఒక సందర్భం అయింది. -
టీవీ నటితో అక్రమ సంబంధం..
తమిళనాడు, పెరంబూరు: బుల్లితెర నటుడు ఈశ్వర్పై అతని భార్య, బుల్లితెర నటి జయశ్రీ మంగళవారం పోలీస్కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వంశం సీరియల్ ద్వారా ప్రాచుర్యం పొందిన నటి జయశ్రీ. అమె బుల్లితెర నటుడు ఈశ్వర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తిరువాన్మయూర్ కామరాజర్ నగర్లో నివశిస్తున్న వీళ్ల మధ్య విబేధాలు తలెత్తాయి. నటి జయశ్రీ ఇటీవల తన ఆస్తులకు చెందిన డాక్యుమెంట్స్ను కుదవ పెట్టుకున్నాడని, తనను కొడుతూ చిత్ర వదకు గురి చేస్తున్నాడని భర్తపై అడయారు మహిళా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో ఈశ్వర్ తన భార్యను కొట్టినట్లు అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు. కాగా మంగళవారం నటి జయశ్రీ చెన్నై పోలీస్కమిషనర్ కార్యాలయంలో తన భర్తపై మరో ఫిర్యాదు చేసింది. అందులో తన భర్త అరెస్ట్ అయిన తరువాత తనకు హత్యాబెదిరింపులు వస్తున్నాయని, వారెవరో కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అనంతరం జయశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త ఈశ్వర్ వేరే టీవీ నటితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పింది. అంతే కాకుండా పెళ్లి అయిన తరువాత తాగుడుకు అలవాటు పడ్డాడని, జూదానికి వ్యసనపరుడు అయ్యాడని చెప్పింది. గంజాకు అలవాటు పడినట్లు చెప్పింది. తన డబ్బు, బంగారం తాకట్టు పెట్టాడని తెలిపింది. అంతే కాకుండా తను అక్రమ సంబంధం పెట్టుకున్న నటితో కలిసి ఉన్న వీడియో కాల్స్ చేసేవాడని చెప్పింది. తాగి వచ్చి తన కూతురును లైంగిక వేధింపునకు గురి చేసే వాడని పేర్కొంది. ఇదంతా సహించలేకే తాను అడయారు పోలీసులకు ఫిర్యాదు చేశానంది. దీంతో పోలీసులు ఈశ్వర్ను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. హాత్యాబెదిరింపు కాల్స్ రావడంతో పోలీస్కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు నటి జయశ్రీ చెప్పింది. -
అత్త కాళ్లు నరికిన కోడలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement