breaking news
Jaish-e-Muhammad chief to Pakistan
-
పాకిస్తాన్ ఇక ఏకాకే!?
ఇస్లామాబాద్/వాషింగ్టన్ : అంతర్జాతీయంగా పాకిస్తాన్పై భారత్ మరోమారు అత్యంత కీలక దౌత్య విజయాన్ని సాధించింది. భారత్పై ఉగ్రదాడులకు తెగబడుతున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలకు హక్కానీ నెట్వర్క్తో సంబంధాలున్నాయని అమెరికా తేల్చింది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి సంస్థలపై చర్యలు తీసుకునేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. హక్కానీ నెట్వర్క్తో సంబంధాలున్న లష్కరే తోయిబాపై ఉగ్రవాదంపై పోరులో భాగంగా పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. అందులో భాగంగా అమెరికన్ కాంగ్రెస్ కొత్తగా రూపొందించిన నేషనల్ ఢిఫెన్స్ ఆథరైజేషన్ చట్టం 2018లో లష్కరే తోయిబా, హక్కానీ నెట్వర్క్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. లష్కరే తోయిబాను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించినట్లు అందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేలా అమెరికా కొత్తగా చట్టాన్ని రూపొందించింది. లష్కరే తోయిబాను అమెరికా ఉగ్రవాద సంస్థగా గుర్తించడంతో.. ఉగ్రవాదంపై పోరు చేస్తున్న పాకిస్తాన్ కూడా ఈ సంస్థను ఉగ్రసంస్థగానే పరిగణించాల్సి ఉంటుంది. ఉగ్రవాదంపై పోరుగలో భాగంగా పాకిస్తాన్కు అమెరికా భారీగా ఆర్థిక సహకారం అందిస్తోంది. గతంలో 350 మిలియన్ డాలర్లు ఉన్న ఆర్థిక సహకారం.. ఈ ఏడాది 700 మిలియన్ డాలర్లకు అమెరికా పెంచింది. హక్కానీ నెట్వర్క్, లష్కరే తోయిబాలను నిర్వీర్యం చేసే క్రమంలో పాకిస్తాన్ వెనకడుగు వేస్తే.. భవిష్యత్లో అమెరికా నుంచి ఎటువంటి నిధులు అందవని రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. ఇది భారత్ విజయం ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగిన బ్రిక్స్, ఇతర అంతర్జాతీయ వేదికలపై లష్కరే తోయిబా, దాని అధిపతి హహీజ్ సయీద్పై భారత్ పోరుబాట పట్టింది. ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ను అంతర్జాతీయ ఉగ్రసంస్థలుగా ప్రకటించాలని భారత్ అంతర్జాతీయ వేదికలపై గట్టిగా డిమాండ్ చేసింది. అంతేకాక జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్య సమితిలో భారత్ పెద్ద పోరాటమే చేసింది. చైనా అడ్డుపడకపోయి ఉంటే.. మసూద్ అజర్ని ఈ పాటికే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రపంచం గుర్తించేది. -
అనుమతివ్వండి అంతు తేలుస్తాం..!
జైషే ఇ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పాకిస్థాన్ ప్రభుత్వంపై మండి పడ్డాడు. కాశ్మీర్ ను అధీనంలోకి తీసుకోవడంలో పాకిస్థాన్ విఫలమైందని, నిర్ణయాత్మక లోపాలే అందుకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక్క అవకాశం ఇస్తే భారత్ లో కల్లోలం సృష్టిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వాన్నికోరాడు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో జిహాదీలను కోల్పోయే పరిస్థితి ఇకపై ఎదురు కాకూడదని మసూద్ ప్రకటించాడు. జిహాదీ విధానాలు దేశానికి వ్యూహాత్మక ప్రయోజనాలను చేకూరుస్తాయంటూ పాకిస్థాన్ ప్రభుత్వానికి నేరుగా సూచించాడు. నిర్ణయాలను తీసుకోవడంలో ప్రభుత్వం ఎంతో వెనుకబడుతోందని, భారతదేశానికి వ్యతిరేకంగా తమ కార్యకలాపాలను అమలు చేసేందుకు అనుమతించాలని కోరాడు. జైషే వార పత్రిక 'అల్ ఖ్వాలమ్' తాజా సంచికలో మసూద్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. 'పాకిస్థాన్ ప్రభుత్వం కొద్దిపాటి ధైర్యం చూపితే'.. అంటూ అజహర్ అల్ ఖ్వాలమ్ పత్రిక ముందు పేజీలో వ్యాసం రాశారు. ముజాహిదీన్ కు ఒక్కసారి అవకాశం ఇస్తే... కాశ్మీర్ సమస్య, నీటి వివాదం వంటివన్నీ పూర్తి స్థాయిలో ఒకేసారి పరిష్కరించుకునే అవకాశం ఉందని అజహర్ అభిప్రాయ పడ్డాడు. 1971 నాటి చేదు జ్ఞాపకాలను తుడిచిపెడుతూ, 2016లో విజయవంతమైన భావోద్వేగాలను మనసునిండా నింపుకోవచ్చని సూచించాడు. భారతదేశం అఖండ భారత్ నిర్మాణానికి ప్రయత్నిస్తోందని, అందుకే అణువణువునా జిహాదీలను అణచివేయాలని చూస్తోందని చెప్పాడు. వారి ఆశలను కూకటి వేళ్ళతో తుంచేందుకు జిహాదీ విధానం ఎంతగానో సహకరిస్తుందని సలహా ఇచ్చాడు. పఠాన్ కోట్, ఉడీ దాడులతో భారత్ తన సైనిక పరాక్రమాన్ని గుర్తు చేసిందన్నాడు. పాకిస్థాన్ పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ ప్రయత్నిస్తోందని, ఈ విషయం కాశ్మీర్ పరిస్థితి చూస్తే తెలుస్తోందన్నాడు.