-
నటించే నాయకుడు కేసీఆర్
కొందుర్గు(షాద్నగర్): ముఖ్యమంత్రి కేసీఆర్ సమయానుకూలంగా నటించే నాయకుడని మాజీ ఎంపీ జైపాల్రెడ్డి అన్నారు. కొందుర్గు మండలం జిల్లేడ్చౌదరిగూడ మండల కేంద్రంలో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి, అమోదం పొందడానికి కృషిచేసింది తానేనని, ఇందులో ఏమైన తప్పు ఉంటే చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో బిల్లు అమోదం పొందిన అనంతరం కేసీఆర్ తన కుటుంబ సభ్యుల సమేతంగా వచ్చి సోనియాగాంధీ ఆశీస్సులు తీసుకొని తాను తెలంగాణకు కాపలా కుక్కలా ఉండానని తెలుపలేదా అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేస్తానని దళితులను మోసం చేశాడన్నారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తేనే 2019 ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించారని, కానీ, ఇప్పటివరకు ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు. కేసీఆర్ కేబినెట్లో మహిళలకు మంత్రి పదవులు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. నోట్లు మార్పిడి చేసి పేద ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనన్నారు. పెట్రోల్పై సుంకం తగ్గించి పేద ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు. 12 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రూ. 73 వేల కోట్ల బకాయి రుణాలు మాఫి చేశామన్నారు. అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ రెగ్యులర్గా రుణాలు చెల్లించే రైతులకు కూడా 5 వేల కోట్లతో మాఫీ చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామన్నారు. పెట్రోల్ ధర పెంచేది రూపాయల్లో.. తగించేది ఒక్క పైసనా..అని ప్రశ్నించారు. ఇక బీజేపీ భవిష్యత్ శూన్యమని, కేసీఆర్ది కూడా అంతేనని అన్నారు. సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పింది ఏదీ చేయడని, ఆయన మాటలు అబద్దాల మూటలని విమర్శించారు. రైతులకు ముష్టి నాలుగు వేలు ఇవ్వడం కాదని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పట్లో తెలంగాణ సొమ్ము ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారని, ఉద్యోగాలు ఆంద్రోళ్లకు పోతున్నాయని చెప్పిన కేసీఆర్.. కృష్ణ జలాలను ఇంకా ఆంధ్రకు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. కమీషన్ల కోసం కాంట్రాక్టులు ఇస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ మ్యానిఫెస్టో అబద్దాల పుట్ట అని, ఇంటికో ఉద్యోగం ఇస్తానని యువతను మోసం చేశాడన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏకకాలంలో లక్ష రూపాయల వరకు మాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయని విధానాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుధాకర్రావు, కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బంగారు స్వరూప, నాయకులు బుజ్జినాయక్, శంకర్గౌడ్, దామోదర్రెడ్డి, బాల్రాజ్, సయ్యద్ సాదిక్, శివలీల, నాగమణి, విజయలక్ష్మి, చంద్రశేఖర్, పురుషోత్తంరెడ్డి, మధు, రాములు, రమేష్, శేఖర్ పాల్గొన్నారు. -
'శుంఠ' బూతు మాట కాదు
నల్గొండ : కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి సమర్థించారు. 'సీమాంధ్రలో శుంఠలు పుట్టారు' అంటూ రెండు రోజుల క్రితం జైపాల్ రెడ్డి తెలంగాణ తహసీల్దార్ల డైరీ ఆవిష్కరణ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. శుంఠ అంటే బూతు మాట కాదని ....గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం వివరణ ఇచ్చారు. దీనిపై సీమాంధ్ర నేతలు రాద్ధాంతం చేయటం తగదని ఆయన హితవు పలికారు. భోగిమంటల్లో తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేయటాన్ని గుత్తా ఆక్షేపించారు. ప్రతుల దగ్ధం తెలంగాణ ప్రజలను అవమానించటమేనని ఆయన అన్నారు. ఇటువంటి అనైతిక చర్యలు మానుకోకపోతే చర్యలు తప్పవని గుత్తా హెచ్చరించారు. తెలంగాణ ప్రతులను భోగి మంటల్లో కాల్చడం... వాళ్ల సంస్కారహీనతకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో నల్గొండ ఎంపీ గానే పోటీ చేస్తానని గుత్తా స్పష్టం చేశారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)
దాక్షాయణి బర్త్ డే.. పుష్ప మేకర్స్ స్పెషల్ అప్డేట్!
దేవర బర్త్ డే ట్రీట్.. అప్డేట్ అదిరిపోయింది!
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. సాధారణ తీర్పు కాదన్న అమిత్ షా
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement