-
ఐఎస్ఎల్ ఫైనల్ కోల్కతాలో
న్యూఢిల్లీ: భారత్లో ఫిఫా అండర్–17 ప్రపంచకప్ సాకర్ అనూహ్యంగా విజయవంతమైంది. తుదిపోరులో భారత్ లేకపోయినా... కోల్కతాలో ఇంగ్లండ్, స్పెయిన్ల మధ్య జరిగిన ఫైనల్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నీ టైటిల్ పోరునూ కోల్కతాకు మార్చేశారు. మొత్తానికి ప్రారంభ, ఫైనల్ మ్యాచ్ల వేదికలు మారాయి. కొచ్చిలో తొలి మ్యాచ్... కోల్కతాలో ఫైనల్ మ్యాచ్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ రెండు మినహా మిగతా మ్యాచ్లన్నీ షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్) తెలిపింది. ఈ నెల 17 నుంచి ఐఎస్ఎల్ నాలుగో సీజన్ మొదలవుతుంది. వచ్చే ఏడాది మార్చి 17న జరిగే ఫైనల్తో ముగుస్తుంది. షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచే కోల్కతాలో జరగాలి. కానీ అదిప్పుడు కొచ్చికి తరలింది. -
చాంపియన్ చెన్నైయిన్
ఊహకందని మలుపులతో సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ రెండో సీజన్కు అద్వితీయ ముగింపు లభించింది. గతేడాది సెమీస్లోనే నిష్ర్కమించిన చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఈసారి ఓటమి అంచుల నుంచి బయటపడి విజేతగా అవతరించింది. లీగ్ దశలో టాపర్గా నిలిచిన గోవా ఎఫ్సీతో జరిగిన టైటిల్ పోరులో చెన్నైయిన్ చివరి నిమిషాల్లో అద్భుతం చేసి ఔరా అనిపించింది. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా చెన్నైయిన్ జట్టు నిర్ణాయక గోల్ సాధించి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. చివరి నిమిషాల్లో తడబడిన గోవా తుదకు తగిన మూల్యం చెల్లించి రన్నరప్తో సరిపెట్టుకుంది. * ఐఎస్ఎల్ ట్రోఫీ హస్తగతం * ఫైనల్లో గోవాపై 3-2తో విజయం * రూ. 8 కోట్ల ప్రైజ్మనీ సొంతం ఫటోర్డా (గోవా): పరిస్థితులు ఎలా ఉన్నా చివరి క్షణం వరకు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పోరాడితే దాని ఫలితం ఎలా ఉంటుందో చెన్నైయిన్ జట్టు రుచి చూసింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ రెండో సీజన్లో చాంపియన్గా ఆవిర్భవించింది. గోవా ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన ఫైనల్లో చెన్నైయిన్ జట్టు 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. 90వ నిమిషం వరకు 1-2తో వెనుకబడిన చెన్నైయిన్ జట్టుకు గోవా గోల్కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమాని ‘సెల్ఫ్ గోల్’తో ఊపిరి పోయగా... ఇంజ్యూరీ టైమ్లో (90+2వ నిమిషంలో) మెండోజా గోల్ సాధించి చెన్నైయిన్ జట్టును చాంపియన్గా నిలబెట్టాడు. చివరి క్షణం వరకు అప్రమత్తంగా లేకపోతే దాని మూల్యం ఏస్థాయిలో ఉంటుందో గోవా జట్టుకు ఈ మ్యాచ్ ద్వారా తెలిసొచ్చింది. మ్యాచ్ అంటే ఇదీ.. అనే తరహాలో సాగిన అంతిమ సమరంలో చెన్నైయిన్ జట్టుకు అదృష్టం కూడా కలిసొచ్చింది. తాజా విజయంతో గోవాలో ఎప్పుడు ఆడినా తమదే గెలుపనే సెంటిమెంట్ను చెన్నైయిన్ మరోసారి నిజం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్, భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని సహ యజమానులుగా ఉన్న చెన్నైయిన్ జట్టుకు విజేత హోదాలో ట్రోఫీతోపాటు రూ. 8 కోట్ల నజరానా అందగా... రన్నరప్ గోవాకు రూ. 4 కోట్లు లభించాయి. సెమీస్లో ఓడిన కోల్కతా, ఢిల్లీ డైనమోస్ జట్లకు రూ. కోటీ 50 లక్షల చొప్పున ప్రైజ్మనీ ఇచ్చారు. మ్యాచ్ను వీక్షించేందుకు ముకేశ్ అంబానీ, నీతా అంబానీతో పాటు గోవా సహ యజమాని, క్రికెటర్ కోహ్లి తన గర్ల్ఫ్రెండ్ అనుష్క శర్మతో హాజరయ్యారు. ఆద్యంతం హోరాహోరీ... భారీగా తరలివచ్చిన సొంత ప్రేక్షకుల మద్దతుతో చెలరేగిన గోవా ఆరంభం నుంచి తమ బలాన్నే నమ్ముకుంటూ దూకుడు కనబరిచింది. వేగంగా పాస్లు ఇచ్చుకుంటూ గోల్స్ కోసం ప్రయత్నించింది. ఆరో నిమిషంలో ప్రత్యర్థి తలతో ఢీకొన్న గోవా స్ట్రయికర్ డుడు గాయపడడంతో మైదానం వీడాడు. తొలి 25 నిమిషాలు ఇరు జట్ల నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. 33వ నిమిషంలో గోవాకు ఫ్రీకిక్ చాన్స్ లభించింది. అయితే లియో మౌరా సంధించిన షాట్ గోల్ పోస్ట్ కుడివైపునుంచి బయటికి వెళ్లింది. ఐదు నిమిషాల వ్యవధిలో గోవాకు కొయెల్హో హెడర్ గోల్ ప్రయత్నం చేసినా తృటిలో తప్పింది. దీంతో తొలి అర్ధభాగం గోల్స్ నమోదు కాకుండానే ముగిసింది. అయితే ద్వితీయార్ధంలో ఆట స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. 53వ నిమిషంలో చెన్నైయిన్ స్టార్ స్ట్రయికర్ మెండోజాను ఇన్సైడ్ బాక్స్లో ప్రణయ్ కిందపడేయడంతో పెనాల్టీ అవకాశం దక్కింది. దీనిని సద్వినియోగం చేసుకుంటూ పెలిస్సారి జట్టుకు తొలి గోల్ అందించాడు. అయితే నాలుగు నిమిషాల వ్యవధిలోనే గోవా స్కోరును 1-1తో సమం చేసింది. రోమియో అందించిన క్రాస్ను సబ్స్టిట్యూట్గా వచ్చిన హవోకిప్ మెరుపు వేగంతో గోల్పోస్టులోకి పంపి సంతోషం నింపాడు. కానీ 59వ నిమిషంలో తమకు లభించిన రెండో పెనాల్టీని చెన్నైయిన్ సద్వినియోగం చేసుకోలేపోయింది. మెండోజా షాట్ను గోవా కీపర్ లక్ష్మీకాంత్ సులువుగా అడ్డుకున్నాడు. 87వ నిమిషంలో గోవాకు లభించిన ఫ్రీకిక్ను జోఫ్రే గోల్తో 2-1 ఆధిక్యం సాధించింది. అయితే ఈ ఆనందాన్ని స్వయం తప్పిదంతో గోవా కోల్పోయింది. 90వ నిమిషంలో బంతిని ఆపే ప్రయత్నంలో గాల్లోకి ఎగిరిన కీపర్ లక్ష్మీకాంత్ చేతిని తాకుతూ గోల్ కావడంతో స్కో రు తిరిగి సమమైంది. అయితే అదనపు సమయం (90+2వ నిమిషం)లో మెండోజా సూపర్ గోల్తో చెన్నైయిన్ విజేతగా నిలిచింది. చెన్నైయిన్ జట్టుకు బ్రూనో పెలిస్సారి (54వ నిమిషంలో), మెండోజా (90+2వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. గోవా గోల్కీపర్ లక్ష్మీకాంత్ కట్టిమాని 90వ నిమిషంలో ‘సెల్ఫ్ గోల్’ చేశాడు. గోవా తరఫున హవోకిప్ (58వ నిమిషంలో), జోఫ్రే (87వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. -
ఐఎస్ఎల్ ట్రోఫీ ఆవిష్కరణ
ముంబై: భారత్లో ఫుట్బాల్కు ఆదరణ పెంచే ఉద్దేశంతో ప్రారంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంట్లో భాగంగా ఆదివారం ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ (ఎఫ్ఎస్డీ) చైర్పర్సన్ నీతా అంబానీ ఐఎస్ఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో ఆయా ఫ్రాంచైజీల తరఫున బరిలోకి దిగబోతున్న అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజాలు ఫ్రెడెరిక్ జుంగ్బర్గ్, డెల్ పియరో, క్యాప్డెవిలా, డేవిడ్ ట్రెజెగుట్, రాబర్ట్ పిరాస్, లూయిస్ గార్సియా, డేవిడ్ జేమ్స్ పాల్గొన్నారు. ‘ఇది నిజంగా మా అందరికీ చిరస్మరణీయ రోజు. ఐఎస్ఎల్ ట్రోఫీని ఆవిష్కరించేందుకు నేను ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజాల సరసన నిలబడ్డాను. విశ్వవ్యాప్తంగా వీరు ఇప్పటికే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. భారత్లో కూడా వర్ధమాన ఆటగాళ్లకు ఐఎస్ఎల్ ట్రోఫీ ప్రేరణగా నిలుస్తుంది’ అని నీతా అంబానీ తెలిపారు. ఫ్రేజర్ అండ్ హాస్ డిజైన్ చేసిన ఈ ట్రోఫీ 26 అంగుళాల ఎత్తు ఉంది. పైభాగంలో ఐఎస్ఎల్ లోగోను ముద్రించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement