breaking news
ISISI
-
మై ఇండియా, కానీ ఐఎస్ కోసం పనిచేస్తా!
సాక్షి, న్యూఢిల్లీ: సూసైడ్ బాంబర్ అవడం సాదియా జీవిత లక్ష్యం. 20 ఏళ్ల అమ్మాయి సాదియా. పుణె దగ్గరి ఎరవాడ తనది. ఇప్పటికి రెండుసార్లు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఎ) పోలీసులు ఆమెను డీ–రాడికలైజ్ చేశారు. అంటే.. మారు మనసు పొందేలా చేయడం. 15 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఒకసారి, 18 ఏళ్ల వయసులో ఒకసారి ఆమెకు డీ–రాడికలైజేషన్ జరిగింది. ‘నేను భరతమాత ముద్దుబిడ్డని’ అని వాళ్లు చెప్పమన్నట్లే చెప్పి, తన మనసు ఎక్కడుందో మళ్లీ అక్కడికే వెళ్లిపోయింది భరత మదర్ ని వదిలేసి! ఐఎస్తో కలిసి ఇండియాలో ‘మ్యాచ్’ కి ప్లాన్ చేస్తుండగా ఈ జులై లో సాదియా ను పట్టుకుంది ఎన్. ఐ.ఎ. ‘ఏం చేస్తున్నావు వారితో కలిసి?!’ అని అడిగితే అబద్ధమేమీ చెప్పలేదు సాదియా. ‘నా మనసు ఇండియన్ మదర్ దగ్గర లేదు’ అంది. ‘మరి ఇండియా వదిలి పోతావా?’ అంటే.. ‘పోను.. ఇది నా దేశం. నేను ఎందుకు పోవాలి?’ అంది! సెప్టెంబర్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది ఎన్. ఐ.ఏ. సాదియా మీద. ‘అంకుల్.. కరోనాను ఒక మనిషికి ఎక్కించి, ఆ మనిషి తో సుమారుగా ఎంతమందికి కరోనాను తెప్పించవచ్చు?’ అని ఎవరినో అడుగుతుంటే విని పోలీసులు ఆమెను పట్టుకున్నారు. సాదియా అన్వర్ షేక్ (పూర్తి పేరు) కు దేశం బయట మంచి మంచి పరిచయాలు ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్, ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్, ఆల్ ఖైదా, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ సంస్థలతో ఆమె టచ్ లో ఉంది. ఫిలిప్పీన్స్ లో ఆయిషా హమిదాన్ అని ఆన్ లైన్ ‘మోటివేటర్’ ఒకావిడ ఉన్నారు. ఇరవై ఏళ్ల లోపు పిల్లల్ని ఆదరించి, అక్కున చేర్చుకుని ఉచితంగా ఐ.ఎస్.పాఠ్యపుస్తకాలు అందించి చక్కగా తల దువ్వుతూ వారి చేత ప్రతి పేజీనీ శ్రద్ధగా చదివించడం ఆమె జీవిత లక్ష్యం. ఆమెతో కూడా టచ్ లో ఉంది సాదియా. మలేసియాలో అజ్ఞాతం లో ఉన్న ఇస్లాం మత ప్రబోధకులు డాక్టర్ జకీర్ నాయక్ కూడా సాదియా కు ఒక మంచి ఇన్స్పిరేషన్. ఐ.ఇ.డి. ఎలా తయారు చేయాలో కూడా నేర్చుకుంది సాదియా. ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్!! ఫేస్బుక్లో మల్టిపుల్ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చెయ్యడం కూడా వచ్చు. ఇన్ని చేస్తూ కూడా ‘ఇండియా ఈజ్ మై కంట్రీ’ అంటున్న ఈ అమ్మాయిని చూస్తుంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులకు ముచ్చటగా ఉందట. మళ్లీ ఇంకోసారి ఆమెను డీ–రాడికలైజ్ చేసే పాపాన్నయితే వాళ్లు మూటగట్టుకోదలుచుకోలేదు. దీనికి సంబంధించి నవంబర్లో కేసు విచారణ మొదలు కాబోతోంది. -
భారత్లో దాడులకు పాకిస్థాన్ ఐఎస్ఐ కుట్రలు
-
బయటపెట్టిన బ్రిటీష్ ఛానల్-అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు
బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదుల సానుభూతిపరుడైన మెహ్దీ మస్రూర్ బిశ్వాస్(24)ను గత రాత్రి ఐటి(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) యాక్ట్ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మస్రూర్ కు నేరుగా ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలతో సంబంధంలేదని పోలీసులు తెలిపారు. అతనిని సొంతంగా తీవ్రవాద భావాలు ఉన్న వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మస్రూర్ కుటుంబం బెంగాల్లోని బీమాన్నగర్లో ఉంటుంది. అతని తండ్రి హోమియోపతి వైద్యుడు. బహుళజాతి కంపెనీలో పని చేస్తున్న మస్రూర్ బెంగాల్లోనే చదువుకున్నాడు. వారం రోజుల క్రితం వరకు మన్సూర్ తల్లి అతనితోనే బెంగళూరులో ఉన్నారు. ఇదిలా ఉండగా, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వాడుతున్న సామాజిక మాధ్యమం ట్వీటర్లో దాని ఖాతాను బెంగళూరుకు చెందిన వ్యక్తే నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలుగుచూశాయి. బ్రిటన్కు చెందిన చానల్ '4 న్యూస్' ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో బెంగళూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జిహాదీలకు అనుకూలంగా 'షామీ విట్నెస్' పేరుతో మెహది అనే వ్యక్తి ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు బ్రిటిష్ చానల్ వెల్లడించింది. అయితే అతని జీవితం ప్రమాదంలో పడే అవకాశమున్నందున పూర్తి పేరును వెల్లడించడం లేదని పేర్కొంది. బెంగళూరులోని ఓ కంపెనీలో అతను పనిచేస్తున్నట్లు తెలిపింది. షామీ విట్నెస్ పేరుతో ఐఎస్కు అనుకూలంగా అతను తన మొబైల్ ద్వారా ఇచ్చే ట్వీట్లను ప్రతి నెలా 20 లక్షల మంది చూస్తున్నారు. దీనికి 17,700 మంది ఫాలోయర్లు కూడా ఉన్నారు. వీరిలో మూడు వంతుల మంది విదేశీయులే. దీంతో ఐఎస్ ఖాతాల్లోకెల్లా ఇదే అత్యంత ప్రచారం జరుగుతున్న ఖాతాగా గుర్తింపు పొందింది. ఐఎస్లో చేరే వారి కోసం సమాచారం అందించడం, బందీల తలల నరికివేత వీడియోలు వంటివి ఈ ఖాతాలో ఉన్నాయి. ఈ విషయం బయటకు పొక్కిన వెంటనే ఆ ఖాతా స్తంభించిపోయింది. కుటుంబం ఆర్థికంగా తనపైనే ఆధారపడటంతో ఖాతాదారుడు ఇంకా ఉగ్రవాద సంస్థలో చేరలేదని ఆ చానల్ తెలిపింది. **