breaking news
ISIS Leaders
-
అమెరికా దాడుల్లో ఐసిస్ అగ్రనేతల హతం
వాషింగ్టన్: ఇరాక్లోని మోసుల్ నగరంపై అమెరికా గత నెల 25న జరిపిన వైమానిక దాడుల్లో ఇద్దరు ఐసిస్ సీనియర్ మిలటరీ కమాండర్లు అహ్మద్ అల్బజరీ, హతీం అల్హమ్దునీ మృతిచెందారని పెంటగన్ పేర్కొంది. దీంతో మోసుల్పై ఐసిస్ పట్టు కోల్పోయినట్లేనంది. పాక్లో ఉగ్రవాదులపై 2009-2015 మధ్యజరిపిన దాడుల్లో 116 మంది సాధారణ పౌరులు మృతిచెందారని పేర్కొంది. యూఎస్ స్వాతంత్య్ర దినమైన జూన్ 4న ఆ దేశ ఎయిర్పోర్టులపై దాడులు చేస్తామని ఐసిస్ సానుభూతిపరులు ట్విటర్లో హెచ్చరించారు. -
'మా టార్గెట్ మీరే.. అంతం చేస్తాం'
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను అంతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి హెచ్చరించారు. తమ తదుపరి లక్ష్యం ఐఎస్ నాయకులేనని, ఎక్కడున్నా హతమారుస్తామని అన్నారు. కాలిఫోర్నియాలో దాడి అనంతరం ఒబామా రెండోసారి సోమవారం ఉగ్రవాద వ్యతిరేక చర్యల గురించి మాట్లాడారు. అమెరికా మిలటరీ అధికారులతో సమావేశమై చర్చించారు. ఇరాక్, సిరియాలో ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను నిర్మూలించడానికి అమెరికా, మిత్రదేశాలు కలసికట్టుగా పోరాడుతాయని చెప్పారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు పోరాటాన్ని ముమ్మరం చేసినట్టు వెల్లడించారు. 'ఐఎస్ నాయకులు ఎక్కడా తలదాచుకోలేరు. మేం ఐఎస్ నాయకులకు పంపే సందేశం ఒక్కటే. మా టార్గెట్ మీరే' అని ఒబామా పేర్కొన్నారు. కాలిఫోర్నియా దుర్ఘటన అనంతరం ఒబామా ఆ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఐసిస్ ఉగ్రవాద సంస్థను నాశనం చేసి తీరుతామని ఒబామా ప్రకటించారు. అమెరికాలోను, ప్రపంచవ్యాప్తంగా ప్రజల మనస్సులను కలుషితం చేస్తున్న కొత్త దశ ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కొంటామన్నారు.