breaking news
iran firing
-
ఎదురులేని ఖొర్రంషహర్
ఇరాన్లోని మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా సైన్యం బంకర్ బస్టర్ బాంబులు, క్షిపణులు ప్రయోగించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇరాన్ సైన్యం ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. ఖొర్రంషహర్–4 మిస్సైల్ సహా మొత్తం 40 క్షిపణులు ప్రయోగించినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ)ప్రకటించింది. ఇజ్రాయెల్లోని లక్ష్యాలను ఛేదించామని వెల్లడించింది. ఖొర్రంషహర్–4 క్షిపణి ప్రయోగ దృశ్యాలు ఇరాన్ ప్రభుత్వ టీవీ చానల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇది ఇరాన్ అమ్ములపొదిలో అత్యంత కీలకమైన అస్త్రం అని చెప్పొచ్చు. ఇరాన్కు ఇదే అతిపెద్ద క్షిపణి కావడం గమనార్హం. ఇరాన్లోని ఖొర్రంçషహర్ అనే నగరం పేరునే దీనికి పెట్టారు. ఖైబర్ మిస్సైల్ అని కూడా అంటారు. 1980వ దశకంలో ఖొర్రంషహర్లో ఇరాక్–ఇరాన్ మధ్య భారీ యుద్ధం జరిగింది. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఉన్న యూదుల కోట ‘ఖేబర్’ను 7వ శతాబ్దంలో అప్పటి పర్షియా(ఇరాన్) పాలకులు అక్రమించారు. → ఖొర్రంషహర్–4ను ఇరాన్ ప్రభుత్వ రంగంలోని ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్(ఏఐఓ) అభివృద్ధి చేసింది. ఇది ద్రవ ఇంధనంతో నడిచే మీడియం–రేంజ్ బాలిస్టిక్ క్షిపణి. → తొలిసారిగా 2017 జనవరిలో పరీక్షించారు. 2017 సెప్టెంబర్లో టెహ్రాన్ మిలటరీ పరేడ్లో ప్రజల కోసం మొదటిసారి బహిరంగంగా ప్రదర్శించారు. → ఈ క్షిపణి పొడవు 13 మీటర్లు. వ్యాసం 1.5 మీటర్లు. బరువు 19.5 టన్నులు. పరిధి 2,000 కిలోమీటర్లు. 1,800 కిలోల వార్హెడ్లను మోసుకెళ్లగలదు. కానీ, దీని పరిధి 2,500 కిలోమీటర్లకుపైగా ఉంటుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈజిప్టు, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, రొమేనియా, బల్గేరియా, గ్రీస్ దేశాలు ఈ మిస్సైల్ పరిధిలోకి వస్తాయి. → ఖొర్రంషహర్–4 టార్గెట్ ఏరియాకు చేరుకున్న తర్వాత ఏకంగా 80 లక్ష్యాలపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదని అంటున్నారు. అత్యంత వేగంతో ప్రయాణిస్తూ శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థల నుంచి సులువుగా తప్పించుకోగలదని సమాచారం. అంటే ఈ క్షిపణిని మధ్యలోనే కూలి్చవేయడం దాదాపు అసాధ్యమే. ఒక్కసారి గురిపెడితే లక్ష్యాన్ని తాకాల్సిందే. → ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థకు అసలైన ముప్పు ఖొర్రంషహర్–4 నుంచే పొంచి ఉంది. ఇజ్రాయెల్ ఐరన్డోమ్ కానీ, డేవిడ్ స్లింగ్ కానీ దీన్ని అడ్డుకోలేవు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దు
ఇజ్రాయెల్-ఇరాన్ దాడి కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ ఎయిర్లైన్స్ చర్యలు చేపట్టాయి. ఈమేరకు పలు విమాన సర్వీసుల సమయంలో మార్పలు, మరికొన్నింటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఎతిహాద్, ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఫ్లైదుబాయ్, కువైట్ ఎయిర్వేస్ వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఈమేరకు ప్రకటన విడుదల చేశాయి.మిడిల్ ఈస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో గగనతల పరిమితుల కారణంగా బుధవారం విమానాలను దారి మళ్లిస్తున్నట్లు ఎతిహాద్ ఎయిర్వేస్ తెలిపింది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ అక్టోబర్ 2, 3 తేదీల్లో ఇరాక్ (బాస్రా, బాగ్దాద్), ఇరాన్, జోర్డాన్లకు వెళ్లే అన్ని విమానాలను రద్దు చేసింది. ఇరాక్, ఇరాన్లకు ప్రయాణించే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఖతార్ ఎయిర్వేస్ ప్రకటించింది. జోర్డాన్, ఇరాక్, ఇజ్రాయెల్, ఇరాన్లకు అక్టోబర్ 2, 3 తేదీలకు ప్రయాణాలు సాగించే ఎయిర్క్రాఫ్ట్లను నిలిపేస్తున్నట్లు ఫ్లైదుబాయ్ పేర్కొంది. కువైట్ ఎయిర్వేస్ విమాన సమయాల్లోనూ మార్పులు చేసినట్లు కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఇజ్రాయెల్పై ఇరాన్ మంగళవారం సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్తో భీకరంగా దాడులు చేసింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ తమ ఐరన్ డోమ్ వ్యవస్థతో ఇరాన్ మిసైల్స్ను అడ్డుకున్నట్లు ప్రకటించింది. -
#IranAttack: ఇరాన్ దాడులు.. అమెరికా వ్యూహం ఫలించిందా?
Live Updates.. ఇజ్రాయెల్కు ఇరాన్ తాజా వార్నింగ్.. ►ప్రతీకార చర్యలో భాగంగా ఇజ్రాయెల్పై శనివారం రాత్రి డ్రోన్లు, మిసైళ్ల వర్షం కురిపించిన ఇరాన్, ఆ దేశానికి ఆదివారం( ఏప్రిల్ 14) మళ్లీ వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇరాన్ను హెచ్చరించారు. తాము చేసిన డ్రోన్ దాడులకు ఇజ్రాయెల్ ఎలాంటి ప్రతి దాడులకు దిగినా తమ స్పందన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ►ఇజ్రాయెల్పై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ..‘ఇరాన్ భీకర దాడులను ఇరాన్ ఎదుర్కోని వారిపై విజయం సాధించింది. శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించింది. దీంతో శత్రువులు ఇజ్రాయెల్ణు ఏమీ చేయలేరని వెల్లడించినట్లైంది. ఇజ్రాయెల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉంది. ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశాం. మా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారు. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తాం. ఈ దాడులను నేను ఖండిస్తున్నాను’ అని కామెంట్స్ చేశారు. 300 డ్రోన్స్ ప్రయోగించిన ఇరాన్.. ►ఇరాన్ దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. వాటిల్లో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని వెల్లడించింది. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్లోని ఐడీఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా.. ఒక వ్యక్తి గాయపడ్డాడు. ఇరాన్ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే తొలిసారి. ఇరాన్ డ్రోన్లను కూల్చిన అమెరికా.. ►అమెరికా దళాలు ఇరాన్ ప్రయోగించిన దాదాపు 70కిపైగా డ్రోన్లు, మూడు బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధ్రువీకరించారు. మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు స్పందించాయని పేర్కొన్నారు. ఇరాన్ మొత్తం 100కుపైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందన్నారు. ►ఇరాన్ ఆపరేషన్ సక్సెస్.. BREAKING: IRAN CHIEF OF STAFF OF ARMED FORCES “We regard this operation as completely successful and we do not intend to continue the operation, but if Israel responds, our next operation will be much bigger.” pic.twitter.com/ys9nR93bUp — Nabeel Shah (@nabeel_AMU) April 14, 2024 ఇరాన్ పార్లమెంట్లో సంబురాలు.. 🇮🇷🇮🇱 The Iranian Parliament celebrates the Iranian attack on Israel - ISZ reports pic.twitter.com/EBKWjeWHL3 — Zlatti71 (@Zlatti_71) April 14, 2024 ►ఇజ్రాయెల్, ఇరాన్ బలాబలాలు ఇలా.. Iran 🇮🇷 vs Israel 🇮🇱 Total Population: Iran 🇮🇷: 87.6M Israel 🇮🇱: 9.04M Available Manpower: Iran 🇮🇷: 49.05M Israel 🇮🇱: 3.80M Fit-for-Service: Iran 🇮🇷: 41.17M Israel 🇮🇱: 3.16M Military Personnel: Active Personnel: Iran 🇮🇷: 610K Israel 🇮🇱: 170K Reserve Personnel: Iran 🇮🇷: 350K… — World of Statistics (@stats_feed) April 14, 2024 ►ఇరాన్, ఇజ్రాయెల్ దాడులపై స్పందించిన భారత్.. ఇజ్రాయెల్పై దాడుల నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రాంతంలో శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లడంపై ఆందోళన వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా 'తక్షణమే ఇరు పక్షాలు వెనక్కు తగ్గాలని, సంయమనం పాటించాలని, హింస నుంచి వెనుదిరిగి, దౌత్య మార్గానికి తిరిగిన రావాలని పిలుపునిస్తున్నాం. మేము పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఆయా దేశాల్లో ఉన్న భారతీయులతో మా రాయాబార కార్యాలయాలు టచ్లో ఉన్నాయి. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం ఉండేలా చూడటం చాలా ముఖ్యం' అని భారత్ విదేశాంగ శాఖ పేర్కొంది. 🚨🇮🇱🇮🇷 Iran cruise missiles over Jerusalem War is the greatest failure of human civilisation. We Hope India 🇮🇳 Pray for peace 🕊️ everywhere. Hope everyone safe. #Iran #Israel #WWIII #TheVoice #IranAttack #Iranians #savas #IranAttackIsrael US Air force | Terrorist pic.twitter.com/R0xOq4YHRC — Parmanand (@Parmana75684584) April 14, 2024 ►అప్రమత్తమైన యూకే.. ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి నేపథ్యంలో యూకే అప్రమత్తమైంది. దాడులను నిరోధించడానికి ఎయిర్ఫోర్స్ జెట్లు, ఎయిర్ రీఫ్యూయలింగ్ ట్యాంకర్లను సిద్ధం చేసింది. మరోవైపు ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపు ఇజ్రాయెల్ రక్షణ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని డజన్ల కోద్దీ రాకెట్లను ప్రయోగించింది. 🇮🇷🇮🇱 IRAN is CELEBRATING after the successful attack on ISRAEL!#Iran #Iranians #Iranian pic.twitter.com/lIPj62U6Q8 — Areeba🇵🇸 (@Areeba_sys) April 14, 2024 ► ఇజ్రాయెల్పై దాడిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఖండించారు. ప్రపంచం మరో యుద్ధాన్ని భరించే స్థితిలో లేదని తేల్చిచెప్పారు. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలన్నారు. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. ►ఐరాస చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు తెలిపింది. మళ్లీ ఇజ్రాయెల్, అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. ఇరాన్ జాతీయ జెండాలు పట్టుకుని రహదారులపై ర్యాలీలు నిర్వహించారు. Live over Tel Aviv#savas #amici23 #Iran #TheVoice #ENGFAxMajorSongkranFestival #Israel #IranAttack #Coachella #Iranians #LANACHELLA pic.twitter.com/jsTqnbW9qy — Dr.Qayyum (@Qayyum654475038) April 14, 2024 WE STAND WITH IRAN #Palestinians #IranAttackIsrael #Iranians #Iranian pic.twitter.com/AfICHslK7V — Hitler😎 (@happy601_hitler) April 14, 2024 #WorldWar3 1 . Russia, China, Iran,yamen, North Korea 2. Nato , USA, Israel and UK India stand neutral 😐 #Iran#Isreal #IranAttack #Indian pic.twitter.com/v4fXu2Cb5q — Vikas Singh (@VikasKu74248695) April 14, 2024 WW3 HAS OFFICIALLY STARTED ?#IranAttackIsrael #Israel #WorldWar3 pic.twitter.com/lqLLEJToP4 — Amit Jha (@amit_code) April 14, 2024 Palestinians celebrating Iran ballistic missiles#IranAttack #IranAttackIsrael #Iranian #Iranians #StandWithIran #WorldWar3 #WorldWarIII #Iran #Israel #IsraelIranWar #الحرب_العالمية_الثالثة #LALISA pic.twitter.com/1ooFUCCvbX — Abid Ullah (@abidullahmsd03) April 14, 2024 ►ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు మొదలయ్యాయి. దాదాపు రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్ను ఇరాన్ ప్రయోగించింది. దీంతో, రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఇక, ఇరాన్ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్కు అమెరికా మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. ►కాగా, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు ప్రారంభించింది. ఆకాశంలో ఇజ్రాయెల్వైపుగా రెండు వందలకుపైగా డ్రోన్స్, మిస్సైల్స్ను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. ఇక, ఈ డ్రోన్స్ ఇజ్రాయెల్ గగనతలంలోకి రాగానే సైరన్ శబ్ధంతో అట్టుడుకుపోయింది. అయితే, వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్ మీదుగా ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి. ఇరాన్లో డ్రోన్ దాడుల్లో ఒక బాలిక గాయపడినట్టు సమాచారం. #WATCH | Tel Aviv: Iranian drones intercepted by Israel's Iron Dome, as Iran launches a drone attack against Israel by sending thousands of drones into its airspace. (Source: Reuters) pic.twitter.com/GyqSRpUPF1 — ANI (@ANI) April 14, 2024 ఇదిలా ఉండగా.. ఇరాన్ నుంచి వచ్చే డ్రోన్స్ ఇజ్రాయెల్కు రావడానికి గంటల కొద్దీ సమయం పడుతుందిని వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. మరోవైపు.. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి సమీపంగా క్షిపణి విధ్యంసక యుద్ధ నౌకలను మోహరించింది. Israelis’ reality in the last hours: pic.twitter.com/VXeHM8WqJi — Israel Defense Forces (@IDF) April 14, 2024 Outstanding video of Iran targeting Israeli Air defense systems! Iranian missiles with decoy bomblets are first deployed, then several ballistic missiles hit their intended target. What a fantastic video. pic.twitter.com/ff5ftepSj1 — Saeed (@Haman_Ten) April 14, 2024 ISRAELIS in FULL PANIC as IRANIAN missiles land in ISRAEL#Iran #Israel #WorldWar3 #WorldWarIII #Oil #TelAvivTed #IranAttack #iranisraelwar pic.twitter.com/EESNcSV1uc — Time ⭐ (@Sunil__Ahir) April 14, 2024 ఇజ్రాయెల్ నౌకలో భారతీయులు.. మరోవైపు.. 17 మంది భారతీయ నావికులు ఉన్న ఇజ్రాయెల్ కంటైనర్ షిప్ను ఇరాన్ పారామిలటరీ రివల్యూషనరీ గార్డు కమాండోలు శనివారం స్వాధీనం చేసుకున్నారు. పర్షియన్ గల్ఫ్లోని హొర్మూజ్ జలసంధిలో ఈ ఘటన జరిగింది. నౌకను ప్రస్తుతం ఇరాన్ జలాల వైపు మళ్లిస్తున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఎంఎస్సీ ఏరీస్ అనే పేరున్న ఈ నౌకపై పోర్చుగీస్ జెండా ఉంది. BREAKING: IRAN BANS ALL SHIPS LINKED TO ISRAEL “Starting today, all vessels linked to the Zionist regime are banned from operating in the Oman Sea and the Persian Gulf. Any such vessels found in these waters will be confiscated.” pic.twitter.com/9z5VAjPzZX — Sulaiman Ahmed (@ShaykhSulaiman) April 14, 2024 ఇది ఇజ్రాయెల్లోని జొడియాక్ గ్రూప్నకు చెందిన నౌక. ఇరాన్ కమాండోలు సోవియట్ కాలం నాటి మిల్ ఎంఐ–17 హెలికాప్టర్ నుంచి తాడు సహాయంతో నౌకపై దిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇరాన్ కమాండోల దుశ్చర్యపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చవద్దని హెచ్చరించింది. ఇరాన్ కమాండోలు స్వాధీనం చేసుకున్న కంటైనర్ నౌకలో ఉన్న 17 మంది భారతీయ నావికుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని భారత వర్గాలు తెలిపాయి. దౌత్యమార్గాల్లో ఇరాన్ను అధికారులను సంప్రదిస్తున్నామని పేర్కొన్నాయి. What a beautiful view i have ever seen... i stand with iran💪✌️#Iran #Israel #IranAttack#IranAttackIsrael pic.twitter.com/WOI5xldTC3 — Malik Ehtisham (@MalikEhtisham_1) April 14, 2024 -
ఇటు భారత్.. అటు ఇరాన్.. పాక్కు డబుల్ షాక్
పాకిస్థాన్కు ఒకేసారి రెండు దెబ్బలు గట్టిగా తగిలాయి. ఒకవైపు భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్తో మతి పోగొడితే.. మరోవైపు పశ్చిమ సరిహద్దుల్లో ఇరాన్ సైన్యం పాకిస్థాన్పై దాడిచేసింది. ఇరాన్ బోర్డర్ గార్డ్స్ దళాలు సరిహద్దుల్లో కాల్పులు జరిపాయి. బలూచిస్థాన్ ప్రాంతంలోకి మూడు మోర్టార్లను ప్రయోగించాయి. దాంతో పాక్ దళాలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇరానీ బోర్డర్ గార్డ్స్ పేల్చిన మోర్టార్ షెల్స్ పంజ్గూర్ జిల్లాలో పడ్డాయని బలూచిస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. వాటిలో రెండు సరిహద్దు దళాల చెక్ పోస్టు సమీపంలో పడితే, మరొకటి కిల్లి కరీమ్ దాడ్ వద్ద పడిందని డాన్ పత్రిక అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. అయితే మోర్టార్ల దాడి వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు. కానీ దాడి వల్ల స్థానికుల్లో మాత్రం తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సరిహద్దు దళాల సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. పాకిస్థానీ దళాలు పశ్చిమ సరిహద్దులలో కూడా మరిన్ని బలగాలను మోహరించాయి. పాకిస్థాన్కు ఇరాన్తో 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఆ సరిహద్దుల్లో కూడా పాకిస్థాన్ పదే పదే ఉగ్రవాద దాడులను ప్రోత్సహిస్తోందని ఇరాన్ ఆరోపిస్తోంది. ఇరు దేశాల సైనిక దళాలకు మధ్య ఇంతకుముందు కూడా ఇరానీ భూభాగంలో కాల్పులు జరిగాయి. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలని ఇరాన్, పాకిస్థాన్ మధ్య 2014లో ఒక ఒప్పందం జరిగింది. అయినా ఫలితం లేకపోవడంతో ఇరాన్ కూడా దాడికి దిగింది.