breaking news
Investigative
-
సైబర్ నేరాల కట్టడికి ‘ఐ4సీ’
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రోజుకో తరహా మోసంతో అమాయకులను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు దర్యాప్తు సంస్థలు తమదైన శైలిలో అడ్డుకట్ట వేస్తున్నాయి. ఇటీవల డిజిటల్ అరెస్టుల పేరిట మోసగాళ్ల ఆగడాలు బాగా పెరగడంతో వారికన్నా ఒకడుగు ముందుకేసి, వారు మోసాలకు వినియోగిస్తున్న సిమ్కార్డు లు, స్కైప్ ఐడీలు, వాట్సాప్ నంబర్లను బ్లాక్ చేస్తున్నాయి. తాము చేపట్టిన చర్యల్లో భాగంగా సైబర్ మోసగాళ్లు డిజిటల్ స్కామ్లకు వాడిన సుమారు 7.81 లక్షల సిమ్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. సైబర్ నేరాలకోసం వినియోగిస్తున్న 2,08,469 ఐఎంఈఐ నంబర్లను కూడా బ్లాక్ చేసినట్లు పేర్కొంది. దేశంలో జరుగుతున్న డిజిటల్ స్కామ్లు, సైబ ర్ నేరాలపై ఇటీవల ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. దేశంలోని అన్ని రకాల సైబర్ నేరాలను సమన్వయంతో పరిష్కరించేందుకు హోంశాఖ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్’(ఐ4సీ) కృషి చేస్తోందన్నారు. వార్తా పత్రికలు, మెట్రో రైళ్లలో ప్రకటనలు, ఆకాశవాణి.. తదితర మాధ్యమాల ద్వారా దీనిపై ప్రచారం చేస్తున్నామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కాలర్ట్యూన్ ప్రచా రాన్ని ప్రారంభించామన్నారు. టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రోజుకు 7 నుంచి 8 సార్లు విధిగా ప్రతి వినియోగదారుడికి వినిపించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డిజిటల్ స్కామ్లపై 1930 టోల్ఫ్రీ నంబర్కు వస్తున్న ఫిర్యాదులపై తక్షణం స్పందిçస్తున్నామని చెప్పారు. డిజిటల్ స్కామ్ల కోసం ఉపయోగించిన 3,962 స్కైప్ ఐడీలు, 83,668 వాట్సాప్ ఖాతాలను ఐ4సీ గుర్తించి బ్లాక్ లిస్టులో పెట్టిందన్నారు. అలాగే అంతర్జాతీయ స్ఫూఫ్డ్ కాల్స్ను కూడా గుర్తించి అరికడుతున్నట్లు తెలిపారు. వివిధ సైబర్ నేరాలపై వచ్చిన 13.36 లక్షల ఫిర్యాదుల ఆధారంగా రూ.4,386 కోట్లు నేరగాళ్లబారిన పడకుండా చర్యలు తీసుకున్నట్లు బండి వివరించారు. -
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్
నవీన్ చంద్ర హీరోగా తెలుగు–తమిళ భాషల్లో రూపొందుతున్న ‘ఎలెవెన్’ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. లోకేశ్ అజ్లస్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రేయా హరి కథానాయిక. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మిస్తున్నారు. ‘‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు లోకేశ్ అజ్లస్ . -
పాక్ యువతి చొరబాటు.. అది ‘హద్దు’లెరుగని ప్రేమే
సాక్షి, హైదరాబాద్: నేపాల్ మీదుగా ఇటీవల సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించిన ఓ పాక్ యువతి వ్యవహారంలో ఎటువంటి కుట్ర కోణం లేదని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. సౌదీ అరేబియాలో పనిచేస్తున్న హైదరాబాద్ యువకుడు అహ్మద్తో సోషల్ మీడియా ద్వారా అయిన పరిచయంతో ప్రేమలో పడిన పాక్ యువతి ఖాదియా నూర్... అతను వేసిన పథకం ప్రకారమే మహ్మద్ (అహ్మద్ సోదరుడు), జీవన్ (నేపాల్ జాతీయుడు)లతో కలసి అక్రమంగా సరిహద్దు దాటి బిహార్లో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సేనలకు చిక్కిందని నిఘా, పోలీసు విభాగాలు గుర్తించాయి. దీన్ని ప్రేమ వ్యవహారంగానే అభివర్ణించాయి. తొలుత దీని వెనుక భారీ కుట్ర ఉండి ఉండొచ్చని భావించిన ఎస్ఎస్బీ... నిందితులను బిహార్లోని సీతామర్హి జిల్లా పోలీసులకు అప్పగించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు, నిఘా వర్గాలు వారిని వివిధ కోణాల్లో విచారించాయి. హైదరాబాద్లోని బహదూర్పురతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ ఆరా తీశాయి. అలాగే రాష్ట్ర నిఘా వర్గాలతోపాటు ప్రత్యేక పోలీసు బృందం బిహార్ వెళ్లి వారిని విచారించి ఇదే విషయాన్ని తేల్చింది. అయితే నూర్ అక్రమంగా సరిహద్దు దాటడానికి ప్రేరేపించి అందుకోసం ఏర్పాట్లు చేసిన అహ్మద్తోపాటు జీవన్లను ఈ కేసులో నిందితులుగా చేర్చాలని సీతామర్హి పోలీసులు భావిస్తున్నారు. చదవండి: జనవరికి సిద్ధం కానున్న కొత్త సచివాలయం -
చదువు కోసం వెళ్తారు.. ఉగ్రవాదులుగా తిరిగొస్తారు
శ్రీనగర్: కరడుగట్టిన ఉగ్రవాది షాకీర్ అల్తాఫ్ భట్ ఇటీవల జమ్మూకశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతడు 2018లో విద్యాభ్యాసం కోసం భారత పాస్పోర్టుపై పాకిస్తాన్కు వెళ్లి, ఉగ్రవాదిగా మారి జమ్మూకశ్మీర్కు తిరిగొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇలాంటి కేసులు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. యువత అన్ని అధికారిక పత్రాలతో రాచమార్గంలో పాకిస్తాన్కు చేరుకొని, ఉగ్రవాద శిక్షణ పొంది, తిరిగొస్తుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం దేశ భద్రతకు సవాలు లాంటిదేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2015 నుంచి 2019 వరకూ జమ్మూకశ్మీర్లో జారీ చేసిన పాస్పోర్టులపై దర్యాప్తు సంస్థలు ఆరా తీశాయి. ఈ ఐదేళ్లలో పాసుపోర్టులో పొందినవారిలో 40 మంది యువత ఉన్నత విద్యాభ్యాసం పేరుతో బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్కు వెళ్లినట్లు వెల్లడయ్యింది. వీరిలో 28 మంది ఆయా దేశాల్లో ఉగ్రవాద శిక్షణలో రాటుదేలి, భారత్లోకి అక్రమంగా చొరబడినట్లు తేటతెల్లమయ్యిందని అధికార వర్గాలు శనివారం పేర్కొన్నాయి. మూడేళ్లలో మరో 100 మందికిపైగా కశ్మీరీ యువత వీసాపై పాకిస్తాన్కు వెళ్లారు. వీరిలో చాలామంది తిరిగిరాలేదు. తిరిగిగొచ్చిన కొందరు కనిపించకుండా పోయారు. వీరంతా స్లీపర్ సెల్స్గా మారి ఉంటారని అనుమానిస్తున్నారు. కొత్తగా చేరినవారికి ఆరు వారాల శిక్షణ గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ దాకా దక్షిణ కశ్మీర్లోని షోపియాన్, కుల్గాం, అనంతనాగ్ జిల్లాకు చెందిన కొందరు యువకులు సరైన ధ్రువపత్రాలతో పాకిస్తాన్కు వెళ్లారనీ, వారు ఇప్పటికీ అధికారికంగా తిరిగి రాలేదని అధికారులు చెప్పారు. నిజానికి వారంతా అక్రమంగా భారత్లోకి చొరబడి ఉంటారని వెల్లడించారు. గత మూడేళ్లలో పాకిస్తాన్కు వెళ్లి, అక్కడ వారం రోజులకుపైగా ఉండి, తిరిగి వచ్చిన యువకులను పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. రాళ్లు విసిరేవారికి పాస్పోర్టు రాదు.. సర్కారీ కొలువు దక్కదు జమ్మూకశ్మీర్లో భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరేవారిపై, విధ్వంసకర కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇలాంటి వారికి ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు రావు, కనీసం పాస్పోర్టు కూడా పొందలేరు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పోలీసు శాఖ సీఐడీ విభాగం శనివారం ఉత్తర్వు జారీ చేసింది. పాసుపోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వరు. రాళ్లు విసిరేవారు ప్రభుత్వ పథకాల్లోనూ లబ్ధి పొందలేరు. పోలీసుల వద్ద, భద్రతా సిబ్బంది వద్ద, దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీ, ఫొటోలు, వీడియోలు, ఆడియో క్లిప్లను నిశితంగా పరిశీలిస్తామని.. పాస్పోర్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అందులో ఉన్నట్లు తేలితే వాటిని నిరాకరిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. -
రెచ్చిపోతున్న కల్తీ కేటుగాళ్లు..
మారెప్పగారి రామ్మోహన్, సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ, గుంటూరు నగరాల్లో కల్తీ వంట నూనెలు, నెయ్యి, టీ పొడి తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్రాలను పలు చోట్ల ‘సాక్షి’ గుర్తించింది. దీంతో గురు, శుక్రవారాల్లో ‘సాక్షి ప్రతినిధి’ ఆయా ప్రాంతాల్లో పర్యటించగా.. కల్తీ వ్యవహారం కళ్లకు కట్టినట్లుగా కనిపించింది. విజయవాడలోని అజిత్సింగ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఇందిరానాయక్ నగర్లో ఓ తయారీ కేంద్రంలో పామాయిల్, వనస్పతితో నకిలీ నెయ్యి తయారు చేస్తున్నారు. కంపెనీ నిర్వాహకుడు పేరేంటని అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించేలోగా వారంతా అక్కడి నుంచి పరారయ్యారు. వివిధ బ్రాండ్ల పేరిట నెయ్యి, అవు నెయ్యి, ఆయిల్ టిన్నులు అక్కడ తయారు చేస్తున్నారు. బెజవాడలోని పాతరాజరాజేశ్వరిపేటలో కల్తీ దీపారాధన తైలం తయారు చేస్తున్న తయారీ కేంద్రాన్ని కూడా పరిశీలించగా.. అక్కడ నువ్వుల నూనెలో తవుడు నూనె, కాటన్సీడ్ ఆయిల్లను కలిపి స్వచ్ఛమైన దీపారాధన తైలంగా నమ్మిస్తున్నారు. వాటిని వివిధ బ్రాండ్ల పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. అదే ప్రాంతంలో బీరువాల కంపెనీ రోడ్డులోనూ ఇలాంటి తైలమే తయారవుతోంది. అగ్గి పుల్ల, సబ్బు బిళ్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి.. పప్పులు, పొడులు, పండ్లు, నూనెలు.. కావేవీ కల్తీకనర్హం అంటున్నారు నేటి కేటుగాళ్లు. ప్రజల ఆరోగ్యమంటే లెక్కలేకుండా, అధికారులంటే భయం లేకుండా, పాప భీతి అసలే లేకుండా ప్రతి ఆహార పదార్థాన్ని కల్తీ చేసేస్తున్నారు. ప్రజలు నిత్యం ఉపయోగించే ఆహారాలే వారి టార్గెట్.. కారం పొడిలో ఎరువుల రసాయనాలు, టీ పొడిలో రంపపు పొట్టు.. నెయ్యిలో పామాయిల్, వనస్పతి, పచ్చళ్లలో రసాయనాలు, కరకరలాడే పాప్కార్న్, కుర్కురేల మాటున కాలకూట విషాలు, నిల్వ ఉంచిన మాంసాలు, పండ్లకు రసాయన పూతలు.. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో కల్తీలు. నిగనిగలాడేలా ప్యాకెట్లు, దాని మీద ప్రముఖ కంపెనీల లోగోలు పెట్టి మాయ చేస్తున్నారు.. ఒక కంపెనీలోనే పది రకాల కల్తీ బ్రాండెడ్ సరుకులను తయారుచేస్తున్నారు. ఏది అసలో, ఏది నకిలీయో గుర్తించడానికి కూడా వీలు లేకుండా ప్యాకింగ్తో బోల్తా కొట్టిస్తున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు? కల్తీకి సంబంధించి చట్టాలు ఏం చెబుతున్నాయి? ఈ వారం సాక్షి పరిశోధనాత్మక కథనం.. తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్..’ అన్నారు గురజాడ అప్పారావు. కండ సంగతి పక్కనపెడితే మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే నాణ్యమైన ఆహారం అవసరం. ఎంత సంపాదించినా ఖర్చు విషయంలో ఆహార పదార్థాలకే మనం అధిక ప్రాధాన్యం ఇస్తాం. తిండి విషయంలో రాజీ పడితే బతుకుబండి సాగదు గనుక నాణ్యమైన పండ్లు, కూరలు, పప్పులు, నూనెలు, బియ్యం, ఇతర పదార్థాలు కొనాలని అందరూ భావిస్తారు. ఈ భావనే కల్తీ వ్యాపారులకు బలంగా మారుతోంది. అధిక లాభాలకు ఆశపడి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు, నాసిరకం వస్తువులు కలిపి కొందరు వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. ఈ వ్యాపారం ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతుందనుకుంటే తప్పులో కాలేసినట్టే. వాణిజ్య కేంద్రాలుగా విరాజిల్లుతున్న విజయవాడ, గుంటూరు నగరాల్లో ఎక్కువగా సాగుతోంది. ఈ కల్తీ ఆహారపదార్థాలు, నూనెలు, నెయ్యితో చేసిన వంట జనాల ఒంట్లో మంట పెడుతోంది. దీంతో ఏ తినుబండారమైనా నిశ్చింతగా తినాలంటే ఏమవుతుందోనన్న పరిస్థితులు నెలకొన్నాయి. తూతూమంత్రంగా ఆహారభద్రత, టాస్్కఫోర్స్ దాడులు, కేసులు ఉంటుండడంతో కల్తీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఆయిల్ మాయలు.. సాధారణంగా ఇంట్లో చేసే ప్రతి ఆహారపదార్థంలోనూ వంట నూనె తప్పనిసరి. అందులోనూ ఎన్నో రకాల నూనెలు, ఎన్నో కంపెనీలు, మరెన్నో బ్రాండ్లు మార్కెట్లలో కనిపిస్తూ ఉంటాయి. ఇదే అక్రమార్కులకు ఆసరాగా మారింది. తవుడు, కొన్ని రకాల విత్తనాలు, పశువుల కొవ్వులు, ఎముకల నుంచి నూనెలను తయారు చేస్తున్నారు. వైట్ ఆయిల్, పామాయిల్లను వాటిల్లో కలిపి ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లలోకి విడుదల చేస్తున్నారు. ఇటీవల నరసరావుపేటలో పెద్ద ఎత్తున నకిలీ ఆయిల్ తయారు చేస్తున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేశారు. అక్కడ ఒకే కంపెనీలో పది రకాల బ్రాండ్లతో ఆయిల్ తయారవుతోంది. మార్కెట్లో దేనికి ఎక్కువగా డిమాండ్ ఉంటే ఆ పేరుతో.. లేక అచ్చం అలాగే వంట నూనెలను తయారు చేస్తూ జనం ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేరుశెనగ నూనె అయినా మరే ఆయిల్ అయినా ఇక్కడే తయారుచేస్తున్నారు. ఉదాహరణకు ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ లోగో పోలిన బాలాజీ సన్ఫ్లవర్, కర్నూలు గ్రౌండ్ నట్, లయన్ బాలాజీ, శక్తి పామాయిల్ ఇలా ఒకే రకమైన ఆయిల్తో వంటనూనెలు తయారు చేస్తున్నారు. సన్ఫ్లవర్ ఆయిల్లో పామాయిల్ నుంచి వేరు చేసిన వైట్ వోలిన్, సూపర్ ఓలిన్లను కలుపుతున్నారు. ప్రజల కంట్లో కారం.. గుంటూరు అంటేనే ముందుగా గుర్తొచ్చేది కారమే. అలాంటి బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా కొందరు వ్యాపారులు కల్తీ కారంతో డబ్బులు పోగేసుకుంటున్నారు. ప్రపంచంలో అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉన్న గుంటూరులో సహజంగా పెద్ద సంఖ్యలో కారం మిల్లులు వెలిశాయి. ఇక్కడి నుంచే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కారం పొడి సరఫరా అవుతోంది. కొన్ని మిల్లులు ఇదే అవకాశంగా భావించి అడ్డదారులు తొక్కుతున్నాయి. అసలు కారంలో 40 నుంచి 50 శాతం మేర కల్తీ పొడిని కలుపుతున్నారు. వృధాగా బయటపడేయాల్సిన తొడిమెలను సైతం పొడిగా మార్చి కారంలో కలిపేస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున ఒకరకమైన వ్యర్థపదార్థాలను దిగుమతులు చేసుకుంటూ ఈ వ్యాపారం నిర్వహిస్తున్నారు. నాణ్యతలేని ఎండుమిరపతో కారం చేసి, దానికి రంగు కోసం ప్రమాదకర రెడ్ ఆక్సైడ్ లాంటి రసాయన పదార్థాలను కలిపి మార్కెట్లోకి వదులుతూ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. కాలేయం, మూత్రపిండాలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలకు కారణమవుతున్నారు. గతేడాది గుంటూరు జిల్లాలో కల్తీ కారం సునామీ సృష్టించింది. కోల్డ్ స్టోరేజీలో మిరప బస్తాల మాటున చైనా కారం నిల్వలు వందల టన్నుల కొద్దీ బయటపడ్డాయి. నెయ్యి.. నానా రకాలు.. మనం తినే ఆహారంలో నెయ్యికి ప్రత్యేక స్థానం. అలాంటి స్వచ్ఛమైన నెయ్యిని సైతం కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. పామాయిల్, వనస్పతి, ఇతర రసాయనాలతోపాటు క్యాన్సర్కు కారకమైన వైట్ ఆయిల్ను నెయ్యిలో వాడుతున్నారు. జంతువుల నుంచి వేరు చేసే కొవ్వునూ, వాటి ఎముకల ద్వారా తయారు చేసే నూనెలను నెయ్యిలో కలుపుతున్నారు. గత ఏడాది చివరిలో ఆహారభద్రతా అధికారులు, టాస్క్ఫోర్స్ పోలీసుల సంయుక్త దాడుల్లో విజయవాడ నగరంలోని పాతపాడు, దేవీనగర్, ఇందిరా నాయక్నగర్, రాజరాజేశ్వరిపేట ప్రాంతాల్లో 400 కిలోల పైగా కల్తీ నెయ్యి పట్టుపడింది. నెయ్యి తయారీలో కెమికల్స్, పాడైపోయిన వెన్నను వాడినట్లు తనిఖీల్లో తేలింది. కాటేసే టీ.. మనలో చాలా మందికి ఉదయం లేవగానే ఒక స్ట్రాంగ్ టీ తాగడం అలవాటు. మిగతా దుకాణాలు ఎలాగున్నా టీ, కాఫీ షాపులు మాత్రం ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. అంత డిమాండ్ ఉన్న కాఫీ, టీ పొడులు విచ్చలవిడిగా కల్తీ అవుతున్నాయి. మామూలు టీపొడి కన్నా కల్తీ టీపొడి చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. చిక్కగాను, కలర్ఫుల్గాను కనిపిస్తుంది. రంపపు పొట్టుకు కలర్ యాడ్ చేసి.. టీ ఫ్లేవర్ను కలిపి అందమైన ప్యాకెట్లలో విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లోని టీస్టాళ్లలో దాదాపు 70 శాతం కల్తీ టీ పొడినే వినియోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. పిల్లలకు ప్రేమతో విషం.. గతంలో పిల్లలు ఏడిస్తే, మారాం చేస్తే బెల్లం ముక్కో, కొబ్బరి ముక్కో, నువ్వుల ఉండో చేతిలో పెట్టేవారు. కాలం మారిందిగా.. ఇప్పుడు మాత్రం పాప్కార్న్, కుర్కురే ప్యాకెట్లు పిల్లల చేతుల్లో పెడుతున్నారు. అవి మంచి కంపెనీలైతే పర్వాలేదు. కానీ కొన్ని వందల రకాల కుర్కురేలు మార్కెట్లను ముంచేస్తుంటే ఏది కల్తీనో, ఒరిజినలో గుర్తుపట్టడం కష్టమే. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నాసిరకం తినుబండారాలను ఎక్కువగా తయారు చేస్తున్నారు. వ్యాపార కేంద్రమైన విజయవాడలో పలుచోట్ల తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నగరంలోని రాజరాజేశ్వరిపేట, దేవీనగర్, పాతపాడు, చిట్టినగర్, పాయకాపురం, అజిత్సింగ్నగర్, గొల్లపూడి, కండ్రిక తదితర చోట్ల ఇవి తయారవుతున్నాయి. నాసిరకం పదార్థాలతో తినుబండారాలను తయారు చేస్తున్నారు. అంటే వీటిలో వాడే నూనెలు, కారాలు, ఇతర పదార్థాలు అన్నీ నాసిరకమే. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. గుంటూరులోని నల్లచెరువు, వర్కర్స్కాలనీ, పొన్నూరు రోడ్డు, సుద్దపల్లి డొంక సెంటర్ తదితర చోట్ల పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. అధికారులు దాడులు చేసి కల్తీలను పట్టుకున్నా.. మరో పేరుతో విడుదలవుతున్నాయి. పిల్లలు ఏడుస్తున్నారు కదా అని ఊరూపేరు లేని స్నాక్స్ కొనిచ్చారా? ఇక మీ పిల్లలకు మీరే ప్రేమతో విషం ఇచి్చనట్లే. ఇప్పుడు కాకపోయినా దీర్ఘకాలంలో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పప్పులు.. కృత్రిమం.. క్యాన్సర్ కారకాలైన కృత్రిమ రంగులను కందిపప్పునకు వాడుతున్నారు. ఆకర్షణ కోసం టారా్టజిన్, లెమన్ ఎల్లో, మెటానికల్ ఎల్లో వంటివి వాడుతున్నారు. వీటిని నిరీ్ణత 0.1 పీపీఎం మించి వాడకూడదు. చాలా వాటిల్లో ఈ మోతాదును మించి వినియోగిస్తున్నారు. ఇవి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. మినప్పప్పు, ఛాయ మినప్పప్పు, మినపగుళ్లు మెరుపు కోసం.. పురుగు పట్టకుండా నిల్వ ఉండేందుకు రసాయన పౌడర్ను వాడుతున్నారు. దీని వల్ల జీర్ణ వ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కాలేయ సమస్యలు తలెత్తడంతో పాటు, పేగుకు సంబంధించిన రుగ్మతలు తలెత్తుతాయని అంటున్నారు. కెమికల్ మామిడి.. సాధారణంగా ఏప్రిల్ మాసంలో చేతికందే మామిడి కాయలను పక్వానికి రాకుండానే కార్బైడ్, ఫైటో కెమికల్స్ ద్వారా కృత్రిమంగా పండుగా మార్చేస్తున్నారు. వీటికి రంగు మాత్రమే ఉంటుంది కానీ రుచి ఉండదని ఆహార భద్రతాధికారులు చెబుతున్నారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల ఎసిడిటీ సమస్యలు వస్తాయంటున్నారు. గత ఏడాది విజయవాడలోని నున్న మ్యాంగో మార్కెట్లో ఫైటో కెమికల్స్ను వినియోగిస్తున్న కొందరు వ్యాపారులను టాస్క్ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 50 లీటర్ల ఫైటో కెమికల్స్ సీజ్ చేశారు. తెల్లనివన్నీ పాలు కాదు! స్వచ్ఛమైన పాలను సైతం కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. విజయవాడలో కొందరు ప్రభుత్వ డెయిరీ పాల పేరిట కల్తీపాలను ఓ ప్రైవేటు కళాశాలకు సరఫరా చేశారు. ప్రకాశం జిల్లా నుంచి తీసుకొచ్చే పాలను విజయవాడ ఆటోనగర్లోని రేవా డెయిరీ అనే ప్లాంట్లో రీఫిల్లింగ్ చేçస్తూ.. అక్కడ పాలను కల్తీ చేసి విక్రయిస్తూ ఆహార భద్రతాధికారులకు పట్టుబడ్డారు. వాస్తవంగా ఎక్కువ శాతం పాలను పాలపొడి ద్వారా తయారు చేస్తూ.. ఆ పాలు స్వచ్ఛమైన వాటిలా కనిపించేందుకు దానిలో ఆయిల్, యూరియా, నురగ కోసం షాంపు తదితర పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇలాంటి పాలు తాగడం వల్ల లేదా వాటిని పెరుగుగా మార్చుకుని తినడం వల్ల విరోచనాలతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధులతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ మటన్ తింటే మటాషే.. ఆదివారం అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది మాంసం. ఎంచక్కా.. ఇంటికి మటనో, చికెనో తీసుకొచ్చి రకరకాల వెరైటీలు చేసుకునేవారు కొందరైతే.. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి రుచులను ఆస్వాదించే వారు ఇంకొందరు. రుచికరమైన ఆహారం తినేందుకు హోటల్కు వెళ్లే భోజన ప్రియులు ఇకపై ఆలోచించాల్సిందే. కొన్ని హోటళ్లలో కుళ్లిపోయే స్థితిలో ఉన్న మటన్, రిఫ్రిజిరేటర్లలో వారాల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, హానికర రసాయనాల వాడకం, ఇలా అడుగడుగునా నిబంధనలను ఉల్లంఘిస్తూ వినియోగదారుల ఆకలిని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. తక్కువ ధరకు వస్తోందని.. ప్రకాశం, నల్గొండ, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం సంతలు జరగుతుంటాయి. అక్కడ రోగాల బారిన పడిన వాటిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి, శనివారం రాత్రికి విజయవాడకు తెస్తున్నారు. వీటిని అనధికారికంగా వధించి, మామూలు మాంసంతో కలిపి అమ్ముతున్నారు. ఈ నాసిరకమైన మాంసాన్నే హోటళ్లు, రెస్టారెంట్లకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. వారు ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేసి రోజుల తరబడి ఫ్రిజ్లో ఉంచి దానినే వండి వడ్డిస్తున్నారు. గత ఏడాది నవంబరు 3వ తేదీన విజయవాడలోని బార్బిక్ నేషన్ రెస్టారెంట్లో ఆహార తనిఖీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ఫ్రిజ్లో ఏకంగా 150 కిలోల మటన్ను నిల్వ ఉంచిన విషయం వెలుగుచూసింది. కనీసం 15 రోజుల నాటి ఆ మాంసం బాగా గడ్డకట్టి కుళ్లిపోయే దశకు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. గత నెల 15వ తేదీన విజయవాడలోని కరెన్సీనగర్, రామచంద్ర నగర్లో మటన్లో బీఫ్ను కలిపి విక్రయిస్తున్న సమయంలో దాన్ని అధికారులు సీజ్ చేశారు. కల్తీకి శిక్షలేమున్నాయి? కల్తీకి సంబంధించి శిక్షలు, తదితర అంశాలను ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 నిర్దేశిస్తుంది. ♦నాసిరకం ఉత్పత్తులని తేలితే సెక్షన్ 51 ప్రకారం రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ♦వివరాలు సరిగా పొందుపర్చకపోతే సెక్షన్ 52 మేరకు రూ.3 లక్షలు జరిమానా వేస్తారు. ♦కల్తీ కారకం ఆరోగ్యానికి హానికరం కాకపోతే సెక్షన్ 57 ప్రకారం రూ.2 లక్షలు మించకుండా జరిమానా విధిస్తారు. ఠి ఆరోగ్యానికి హానికరం అయితే రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ♦సురక్షితం కాని ఆహార పదార్థాలు తినడం వల్ల మరణం సంభవిస్తే సెక్షన్ 59 ప్రకారం ఏడేళ్లు తక్కువ కాకుండా జైలు, రూ .10 లక్షలకు తక్కువ కాకుండా జరిమానా విధించవచ్చు. ♦లైసెన్సు లేకుండా వ్యాపారం సాగిస్తే సెక్షన్ 63 ప్రకారం 6 నెలల వరకు కారాగారం, రూ.5 లక్షల వరకు జరిమానా ఉంటుంది. నిబంధనలు ఇవీ... ♦ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) చట్టం ప్రకారం ఏదైనా జంతువును వధించాలంటే తప్పనిసరిగా యాంటీమార్టం చేయాలి. 48 గంటల ముందు సంబంధిత కబేళాలోని పశువైద్యుడు పరీక్షించాలి. ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ♦పశువైద్యుడు ఇచ్చిన ధ్రువీకరణ ఆధారంగా కబేళాకు తీసుకెళ్తే ముద్ర వేసి జంతువును వధిస్తారు. తర్వాత పోస్టుమార్టం నిర్వహించి ఆరోగ్యంగానే ఉన్నట్లు తేల్చాలి. ♦కళేబరాన్ని మాంసపు దుకాణానికి తీసుకొచ్చి అమ్మకాలు చేపట్టాలి. ఆ రోజు మాంసం మిగిలితే.. దానిని –18 డిగ్రీల ఉషో్టగ్రత వద్ద కొన్ని గంటలపాటే భద్రపర్చాలి. ♦సంబంధిత ఆరోగ్య విభాగం అధికారులు దుకాణాలను పరిశీలించాలి. ముద్ర ఉన్న జంతువు మాంసాన్నే విక్రయిస్తున్నారా? అన్నది చూడాలి. కల్తీపై ఉక్కుపాదం మోపుతాం.. ఆహార పదార్థాలను కల్తీ చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోం. కల్తీ నెయ్యి, పాలు, పప్పుదినుసులు తయారు చేస్తున్న వ్యాపారులతోపాటు అక్రమాలు చేస్తున్న స్వీటు షాపులు, హోటళ్లు, మినరల్ వాటర్ప్లాంట్లపై నిరంతరం నిఘా ఉంచాం. నాలుగేళ్లలో కృష్ణా జిల్లాలో 1,226 దుకాణాల్లో తనిఖీలు చేపట్టి 326 కేసులు నమోదు చేశాం. ఇందులో 126 కేసులు కోర్టుల్లో ఉండగా, 212 కేసులు జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉన్నాయి. కల్తీ నెయ్యి తయారీకి పాల్పడుతున్న 30 కంపెనీలను మూసివేశాం. కల్తీ పాల వ్యాపారులపైనా 20 కేసులు నమోదు చేశాం. కృత్రిమంగా పండ్లను పండిస్తున్న వారిపై 70 కేసులు పెట్టాం. 20 హోటళ్లను, 10 స్వీటు షాపులను సీజ్ చేశాం. – పూర్ణచంద్రరావు, ఆహారభద్రతాధికారి, విజయవాడ కల్తీలతో ప్రమాదకర వ్యాధులు... ఆహార పదార్ధాలతో నాలుగు రకాల కారణాలతో ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆహార పదార్థాల కల్తీ, రంగు రుచి వాసన కోసం ఆహార పదార్ధాల్లో కెమికల్స్ వాడటం, వాడిన వంటనూనెలను రెండుమూడు సార్లు వినియోగించడం, నిల్వ ఉన్న మాంసంతో ఫుడ్ తయారు చేయడం వలన ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. నరాల బలహీనత, మెదడుపై ప్రభావం చూపి మెమరీలాస్, ఇంటలిజెన్స్ తగ్గడం, హార్ట్ ఫెయిల్యూర్, జీర్ణకోశ వ్యాధులు, అల్సర్స్, క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్, బోన్ వీక్ అవడం(ఆస్టియోఫోరోసిస్), మజిల్స్పై ప్రభావం చూపడం, చర్మం ముడతలు పడటం జరుగుతుంది. వాడిన వంటనూనెనే రెండుమూడు సార్లు వాడటం వలన జీర్ణకోశ సమస్యలతో పాటు, గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. – డాక్టర్ కంచర్ల సుధాకర్, విభాగాధిపతి, జనరల్ మెడిసిన్, గుంటూరు ప్రభుత్వాస్పత్రి నిరంతర నిఘా.. కల్తీ వ్యాపారులపై నిరంతర నిఘా పెట్టాం. నగర పోలీసు కమిషనరేట్లో టాస్క్ఫోర్స్ బృందం ప్రత్యేకంగా వీటిపై దృష్టి సారిస్తుంది. కల్తీ నెయ్యి కేంద్రాలపై ఇటీవల దాడులు చేశాం. 1,000 కిలోల కల్తీ నెయ్యి సీజ్ చేశాం. అలాగే దీపారాధనకు వినియోగించే కల్తీ నెయ్యిని తయారు చేస్తున్న వ్యాపారిని అరెస్టు చేశాం. అతని వద్ద నుంచి రూ. 5.40 లక్షల విలువైన కల్తీ నెయ్యిని సీజ్ చేశాం. – బత్తిన శ్రీనివాసులు, పోలీసు కమిషనర్, విజయవాడ ఎన్నో సమస్యలు కందిపప్పులో కేసరిపప్పు కలిపి కల్తీ చేయడం వల్ల వాటిని తినడం వల్ల న్యూరాలజీ సంబంధిత సమస్యలు, పక్ష వాతం వస్తాయి. పసుపు పొడి, కారంపొడుల్లో నిషేధించబడిన రంగులు, చెక్కపొడులు కలిపి కల్తీ చేయడం వల్ల వాటిని తినడం ద్వారా రక్తహీనత, మూర్ఛ రోగం, క్యాన్సర్ వ్యాధులు, కంటి చూపుపోవడం వంటి సమస్యలు వస్తాయి. – డాక్టర్ అనుముల కవిత, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి, గుంటూరు జీజీహెచ్ -
తొలి పరిశోధనాత్మక పాత్రికేయుడు కందుకూరి
తెలుగు అధ్యాపకులు డాక్టర్ సంజీవరావు రాజమహేంద్రవరం కల్చరల్ : పరిశోధనాత్మక జర్నలిజానికి మూలపురుషుడు కందుకూరి వీరేశలింగమని ఎస్కేవీటీ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు డాక్టర్ పి.వి.బి.సంజీవరావు అన్నారు. ప్రభుత్వ అటానమస్ కళాశాలలో ఆవరణలో జరుగుతున్న నవ్యాంధ్రపుస్తక సంబరాలు కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఆయన కందుకూరి నాటకాలపై ప్రసంగించారు.1876లో కందుకూరి రచించిన బ్రాహ్మవివాహంలో చిన్నమ్మ పాత్ర కనపడదు, వినపడుతుందన్నారు. ఈ నాటకానికి పెద్దయ్యగారి పెళ్ళి అని నాటి ప్రేక్షకులు పేరుపెట్టారని తెలిపారు. కందుకూరి రచించిన రెండో నాటకం వ్యవహార ధర్మబోధినికి ప్రజలు ప్లీడర్ల నాటకమని పేరు పెట్టారని తెలిపారు. న్యాయ, పోలీస్, మున్సిపల్ వ్యవస్థల్లోని లోపాలను ఈ నాటకం ద్వారా కందుకూరి ఎత్తిచూపారన్నారు. సభకు అధ్యక్షత వహించిన విశ్రాంత రీడర్ చాగంటి శరత్బాబు మాట్లాడుతూ కందుకూరి నిర్వహించిన వితంతు వివాహాలు జాతి సంప్రదాయాలకు విరుద్ధమని కొందరు ప్రచారం చేశారని, ఇది సరికాదన్నారు. పరాశరస్మృతిలో భర్త గతించినప్పుడు స్త్రీలు పునర్వివాహం చేసుకోవచ్చునని తెలిపారని చెప్పారు. ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, తెలుగు లెక్చరర్ బి.వి.రమాదేవి ఆవంత్స సోమసుందరం సాహిత్యంపై ప్రసంగించారు. నన్నయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ టి.సత్యనారాయణ స్వాగత వచనాలు పలికారు. సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.