breaking news
Intermediate Supplementary results
-
AP: నేడు ఇంటర్ సప్లిమెంటరీపరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బో ర్డు ఇన్చార్జ్జ్ కార్యదర్శి వి. రామకృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది. వెబ్సైట్లో పొందుపరిచే ఈ ఫలితాలు శనివారం సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులో ఉంటాయని రామకృష్ణ పేర్కొన్నారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్ను ‘ourbieap@gmail.com'’ ద్వారా లేదా 9391282578 వాట్సాప్ నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. 28 నుంచి 30 వరకు సీపీటీ టెస్టు సాక్షి, అమరావతి: వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, కారుణ్య నియామక గ్రేడ్–2 వీఆర్వోలు తదితరులకు కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్టు (సీపీటీ) ఈనెల 28వ తేదీనుంచి 30వ తేదీ వరకు జరుగుతుందని ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ‘ https://psc.ap. gov.in' నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. ఈ వెబ్సైట్లలో ఫలితాలు.. www.sakshieducation.com https:bie.ap.gov.in https://examresults.ap.nic.in https://results.apcfss.in -
‘ఇంటర్ అడ్వాన్స్డ్’ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 14 నుంచి 22వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తంగా 4,18,402 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,56,186 మంది పరీక్షలకు హాజరు కాగా, 1,65,971 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో 1,26,117 మంది ఇంప్రూవ్మెంట్ రాసిన వారుండగా, 39,854 మంది వార్షిక పరీక్షల్లో ఫెయిలై, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఇక ఫస్టియర్ ఒకేషనల్ పరీక్షలకు 12,707 మంది హాజరవ్వగా, 7,214 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్ జనరల్ విద్యార్థులు 1,42,144 మంది పరీక్షలు రాయగా.. 59,233 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 7,365 మంది పరీక్షలకు హాజరవ్వగా, 3,977 మంది ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఉత్తీర్ణత శాతం పెరిగింది. 16 నాటికి మార్కుల మెమోలు, రిజిస్టర్లు.. విద్యార్థుల మార్కుల మెమోలు, రిజిస్టర్లను ఈ నెల 16వ తేదీ నాటికి పంపిస్తామని, ప్రిన్సిపాళ్లు వాటిని సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వద్ద నుంచి తీసుకోవాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పేర్కొన్నారు. వాటిలో ఏమైనా పొరపాట్లుంటే సంబంధిత ప్రిన్సిపాళ్ల ద్వారా వచ్చే నెల 8లోగా ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఇక విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం ఈ నెల 11 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో (https://tsbie.cgg.gov.in) దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు. రీకౌంటింగ్ కోసం ప్రతి పేపర్కు రూ.100 చెల్లించాలని, రీ వెరిఫికేషన్ కమ్ ఫొటో కాపీ కోసం ప్రతి పేపరుకు రూ.600 చెల్లించాలని వివరించారు. కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పరీక్షల నియంత్రణాధికారి సుశీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి’ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కార్పొరేటు విద్యాసంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి లేఖ రాశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రైవేటు విద్యాసంస్థల ఆర్థిక దోపిడీ అంతమవుతుందని ఆశించామని.. కానీ అలా జరగడం లేదని లేఖలో పేర్కొన్నారు. -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
► సెంకడియర్లో స్టేట్ ఫస్ట్.. ► ప్రథమ సంవత్సరంలో 6వ స్థానం ► ఈ నెల 30 వరకు రీకౌంటింగ్ గడువు ► సర్కార్ కళాశాలల పరంగా రాష్ట్రంలో ప్రథమం ఆదిలాబాద్ టౌన్ : ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ ఆచార్య గురువారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపారు. ప్రథమ సంవత్సరంలోనూ 61 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 6వ స్థానం దక్కింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఒకేషనల్ ఫలితాల పరంగా జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో నిలిచారు. ఈ ఫలితాల్లోనూ బాలికలు బాలుర కంటే పై చేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో.. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో 13,632 మంది విద్యార్థులు హాజరు కాగా 8,323 మంది ఉత్తీర్ణత సాధించారు. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 6,781 మంది పరీక్షకు హాజరు కాగా 3,796 మంది ఉత్తీర్ణత సాధించారు. 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 6,851 మంది పరీక్షకు హాజరుకాగా 4,527 ఉత్తీర్ణత సాధించారు. 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ కళాశాలల పరంగా.. 2108 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1097 మంది ఉత్తీర్ణులయ్యారు. 52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 1,122 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 546 మంది పాసయ్యారు. 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 986 మంది పరీక్ష రాయగా 551 మంది పాసయ్యారు. 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు కళాశాలల పరంగా.. మొత్తం 7,332 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3,278 మంది ఉత్తీర్ణత సాధించారు. 45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 3,858 మంది పరీక్షకు హాజరు కాగా 1,576 మంది ఉత్తీర్ణత సాధించారు. 41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 3,474 మంది పరీక్షకు హాజరు కాగా 1,702 ఉత్తీర్ణత సాధించారు. 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వోకేషనల్ కోర్సులో మొత్తం 881 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 496 మంది ఉత్తీర్ణులయ్యారు. 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 590 మంది పరీక్షకు హాజరు కాగా 320 మంది పాసయ్యారు. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 291 మంది పరీక్షకు హాజరు కాగా 176 మంది పాసయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు, వోకేషనల్ కోర్సుల ఫలితాల పరంగా జిల్లా విద్యార్థులు స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరం ఫలితాలు.. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 7,716 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 4,693 మంది ఉత్తీర్ణులయ్యారు. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 4,448 మంది పరీక్షకు హాజరు కాగా 2,663 మంది ఉత్తీర్ణులయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 3,268 మంది పరీక్ష రాయగా 2,030 మంది పాసయ్యారు. 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ కళాశాలల పరంగా..మొత్తం 968 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 661 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 577 మంది పరీక్షకు హాజరు కాగా 388 మంది పాసయ్యారు. 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 391 మంది పరీక్ష రాయగా 273 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు కళాశాలల ఫలితాలలో.. మొత్తం 6,505 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 3,906 మంది ఉత్తీర్ణులయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 3,749 మంది పరీక్ష రాయగా, 2,221 పాసయ్యారు. 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,756 మంది పరీక్ష రాయగా 1,685 పాసయ్యారు. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వోకేషనలో కోర్సులో మొత్తం 622 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 387 మంది ఉత్తీర్ణత సాధించారు. 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 421 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 259 మంది ఉత్తీర్ణులయ్యారు. 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 201 మంది పరీక్ష రాయగా వారిలో 128 మంది ఉత్తీర్ణతసాధించారు. 64 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 30 వరకు రీ కౌంటింగ్ గడువు రీ- కౌటింగ్, రీ- వెరిఫికేషన్ కోసం ఈ నెల 30 వరకు విద్యార్థులు అన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆర్ఐవో నాగేందర్ తెలిపారు. రీ- కౌటింగ్ కోసం సబెక్టుకు రూ. 100, రీ- వెరిఫికేషన్ కోసం సబెక్టుకు రూ. 600లు చెల్లించాల్సి ఉంటుదన్నారు. మెమోలో విద్యార్థుల పేర్లు, ఏవైనా తప్పులు దొర్లినట్లరుుతే జూలై 20 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్ఐవో తెలిపారు.