-
ఇంటర్ ఫస్టియర్లో 28.29% ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రథమ సంవత్సర పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్ ఫలితాలను విడుదల చేశారు. గత వార్షిక పరీక్షల్లో ఫెయిలై, ప్రస్తుతం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 28.29 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంప్రూవ్మెంట్ రాసిన విద్యార్థులను కలుపుకుంటే 64.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తంగా 3,00,607 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో గత వార్షిక పరీక్షల్లో ఫెయిలైన వారు 1,49,605 మంది ఉండగా, వారిలో 42,331 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంప్రూవ్మెంట్కు 1,51,002 మంది విద్యార్థులు హాజరై మార్కులను మెరు గు పరుచుకున్నట్లు బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. 30 నాటికి మార్కుల జాబితాలు.. మార్కుల జాబితాలు, మెమోలు సంబంధిత జిల్లా విద్యాదికారులకు పంపించనున్నట్లు అశోక్ తెలిపారు. వాటిని కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈనెల 30న తీసుకొని విద్యార్థులకు అందజేయాలన్నారు. విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్లైన్ ద్వారా (tsbie. cgg.gov.in స్టూడెంట్ సర్వీసెస్) దరఖాస్తు చేసుకో వచ్చని తెలిపారు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ. 100, రీవెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ కాపీ కోసం ఒక్కో పేపరుకు రూ. 600 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. -
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరానికి సంబంధించి మొత్తం 4.42 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో లక్షకు పైగా విద్యార్థులు బెటర్మెంట్ కోసం రాశారని పేర్కొన్నారు. రెగ్యులర్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులు.. విద్యా సంవత్సరం కోల్పోకూడదనే ఉద్దేశంతోనే సెప్టెంబరులో కాకుండా..మేలో పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. 22 రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్ష నిర్వహణ, ఫలితాల విడుదలకు అధికారులు బాగా కృషి చేశారని ప్రశంసించారు. ఈ యేడాది 76 శాతం పాస్ ‘మొదటి సంవత్సరం విభాగంలో.. మార్చిలో అరవై శాతం మంది పాస్ కాగా, సప్లిమెంటరీలో 11 శాతం కలుపుకుని మొత్తం ఈ యేడాది 76 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. సెకండ్ ఇంటర్ రెగ్యులర్లో 72 శాతం పాస్ కాగా, సప్లిమెంటరీలో 15 శాతం పాస్ అయ్యారు. మొత్తంగా 87శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఒకేషనల్లో మొత్తంగా తొలి యేడాది 65 శాతం, రెండో సంవత్సరం 81 శాతం పాసయ్యారు అని మంత్రి తెలిపారు.రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కావాలనుకునే వారు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 22 అని వెల్లడించారు. -
ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కడపలో ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ 48.66 శాతం, ఫస్టియర్ 76.31 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఇంటర్ ప్రశ్నాపత్రాల రికౌంటింగ్కు జులై 2లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సత్యనారాయణ, కలెక్టర్ కె.వి. సత్యనారాయణ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
రాజస్తాన్ రాయల్స్కు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన బట్లర్
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement