సాక్షి, హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో జన రల్, ఒకేషనల్లో రెండు సంవత్సరాలకు కలిపి 2,48,681 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 68.84 శాతం, రెండో సంవత్సరంలో 49.29 శాతం పాస య్యారు. మే 13 నుంచి 21 వరకు పరీక్షలు జరిగాయి.
889 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు రెండేళ్లకు సంబంధించి న 3,98,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలి తాలను ఇంటర్ బోర్డు గురువారం ఆన్లైన్లో విడుదల చే సింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు ఈ నెల 12 నుంచి 18 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.


