breaking news
influential
-
ఆమె ‘టైమ్’ మొదలైంది!
ఒక జవాబు ఏం చేస్తుందో తెలియదుకానీ...ఒక ప్రశ్న మాత్రం చాలా చేస్తుంది! ఆ ప్రశ్న ఆమెను కొత్తగా ఆలోచించేలా, కొత్త ఆవిష్కరణకు స్ఫూర్తినిచ్చేలా చేసింది. ఆ ఆవిష్కరణే అనీమా ఆనంద్కుమార్ను టైమ్స్ 100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్స్డ్ పీపుల్ ఇన్ ఏఐ’ జాబితాలో చోటు సాధించేలా చేసింది...ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యాసాలు రాయగలదు. ప్రశ్నలకు జవాబులు చెప్పగలదు. ఇన్ని చేసే కృత్రిమ మేధస్సు... భౌతిక ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకోగలదా? సెమీకండక్టర్ తయారీని మెరుగుపరచగలదా? ఇప్పుడున్న సాంకేతిక పద్ధతుల కంటే అసాధారణ వాతావరణాన్ని మెరుపు వేగంతో పసిగట్టగలదా?... ఈ ప్రశ్నలు అనీమా ఆనంద్ కుమార్ను లోతుగా ఆలోచించేలా చేశాయి. ప్రమాద నష్టాలను తగ్గించే సాంకేతికతపై కాకుండా ప్రమాదాలను ముందుగా పసిగట్టే సాంకేతికతపై దృష్టి పెట్టారు అనీమ. దాని ఫలితమే... యాక్సిలరేటెడ్ అండర్స్టాండింగ్ అనే సంస్థ.మరో ముందడుగుఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజినీర్ అయిన అనిమా ఆనంద్ కుమార్, బెనెడిక్ట్ జెనిక్తో కలిసి ‘యాక్సిలరేటెడ్ అండర్స్టాండింగ్ ఇంక్’ అనే స్టార్టప్ ప్రారంభించారు. ఓపెన్ ఏఐ, ఆంత్రోపిక్ వంటి ఏఐ దిగ్గజాలను ఎదుర్కోవడానికి, వాటికి దీటుగా ఏఐ చాట్బాట్లు, మోడల్స్ని నిర్మించడానికి ఎన్నో టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఆ టెక్ కంపెనీల జాబితాలో తాజాగా ‘యాక్సిలరేటెడ్ అండర్స్టాండింగ్’ సంస్థ చేరింది.‘ఇది ఏఐ ప్రపంచంలో మరో ముందడుగు’ అని అంటున్నారు విశ్లేషకులు. అనిమ రూ΄÷ందించిన అల్గారిథమ్, వాతావరణ సూచన, వైద్యపరికరాల డిజైనింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ కాంపోనెంట్స్ తయారీ, న్యూక్లియర్ ఫ్యూజన్ రీసెర్చ్కు ఉపయోగపడుతుంది.పిన్న వయసులోనే ప్రొఫెసర్కర్నాటకలోని మైసూర్లో జన్మించిన అనీమ ఐఐటీ, మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ, కార్నెల్ యూనివర్శిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఎంఐటీలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. టెక్నాలజీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ముందు యూసీ ఇర్వీన్లో ప్రొఫెసర్గా పనిచేశారు. కాల్టెక్ యూనివర్శిటీలో అత్యంత పిన్నవయస్కురాలైన ప్రొఫెసర్గా గుర్తింపు ΄÷ందారు. ఆ తరువాత అమెజాన్ వెబ్ సర్వీసెస్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా, ‘ఎన్విడియ’లో ఏఐ రిసెర్చ్కు సంబంధించి సీనియర్ డైరెక్టర్గా పనిచేశారు.ప్రత్యేకత ఇది...‘యాక్సిలరేటెడ్ అండర్ స్టాండింగ్ ఇంక్’ అనేది న్యూరల్ ఆపరేటర్స్ అనే సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఫిజికల్ సిస్టమ్స్ నుండి నేర్చుకున్నదాన్ని వివిధ సమస్యల పరిష్కారానికి ఏఐ సిస్టమ్స్ను ఉపయోగించుకుంటుంది. తమ సిస్టమ్ సింగిల్ ప్రాంప్ట్లో 5 ట్రిలియన్ల డేటా పాయింట్స్ను ప్రాసెస్ చేయగలదని కంపెనీ తెలియజేసింది.టైమ్ ప్రశంస‘వాతావరణాన్ని ఏఐ నియంత్రించలేకపోవచ్చు. కానీ దానిని అంచనా వేయగలదు. ఈ కాలెక్ట్ ప్రొఫెసర్ (అనీమ) అత్యంత వేగంగా వాతావరణాన్ని అంచనా వేసే పద్ధతులకు మార్గదర్శకత్వం వహించారు. సంప్రదాయ విధానాల కంటే వేల రేట్లు వేగంగా వాతావరణాన్ని అంచనా వేయడానికి అల్గారిథమ్లను రూ΄÷ందించారు. క్వాంటం కంప్యూటర్లు, నూతన వైద్యపరికరాలు రూ΄÷ందించడానికి, కంప్యూటర్ చిప్ తయారీలో కీలక దశను ఆప్టిమైజ్ చేయడానికి...ఇంకా మరెన్నో పనులకు అల్గారిథమ్లను ఉపయోగించారు’ అని అనీమా ఆనంద్కుమార్ను పరిచయం చేసి, ప్రశంసించింది టైమ్ మ్యాగజైన్. ఐక్యరాజ్య సమితిలో అనీమఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి శాస్త్రీయ సలహా మండలిలో సభ్యురాలిగా అనీమా ఆనంద్ కుమార్ నియామకం అయ్యారు. తద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన ప్రపంచస్థాయి నిపుణులతో కలిసి పనిచేసే అవకాశం ఆమెకు వచ్చింది. ఐక్యరాజ్య సమితి శాస్త్రీయ ఎజెండాను రూ΄÷ందించడంలో సహాయం అందించారు అనీమ. ఏఐ సాంకేతికత గురించి తప్పుడు సమాచారం వ్యాప్తిలో ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏఐ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందనే విషయంపై ప్రచారం చేశారు. -
టైమ్ జాబితాలో రిలయన్స్, టాటా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ లిస్టులో చోటు దక్కించుకున్నాయి. 2024కి గాను ప్రపంచంలోనే 100 అత్యంత ప్రభావవంతమైన కంపెనీలతో టైమ్ దీన్ని రూపొందించింది. ఈ లిస్టులో రిలయన్స్ చోటు దక్కించుకోవడం ఇది రెండోసారి. 2021లో కూడా ఈ జాబితాలో రిలయన్స్ ఉంది. కంపెనీలను అయిదు విభాగాలుగా వర్గీకరించగా టైటాన్స్ కేటగిరీలో రిలయన్స్, టాటాలను టైమ్ చేర్చింది. పయొనీర్స్ కేటగిరీలో సీరమ్ ఉంది. 58 ఏళ్ల క్రితం టెక్స్టైల్, పాలీయెస్టర్ కంపెనీగా ఏర్పాటైన రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 200 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగిందని టైమ్ పేర్కొంది. 1868లో ప్రారంభమైన టాటా గ్రూప్.. సాల్ట్ (ఉప్పు) నుంచి సాఫ్ట్వేర్ వరకు వివిధ రంగాల్లో విస్తరించిందని తెలిపింది. 2023లో ఐఫోన్లను అసెంబుల్ చేసే తొలి భారతీయ కంపెనీగా నిలి్చందని వివరించింది. అటు సీరమ్ ఏటా 3.5 బిలియన్ డోసుల టీకాలను ఉత్పత్తి చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వేక్సిన్ల తయారీ సంస్థగా ఉందని టైమ్ పేర్కొంది. -
అమెరికా ఫైనాన్స్లో ఇండో-అమెరికన్ మహిళల సత్తా
న్యూయార్క్: అమెరికా ఆర్థికరంగంలో భారత సంతతి మహిళలు సత్తా చాటారు. అత్యంత ప్రభావవంత 100 మంది మహిళల జాబితాలో భారత సంతతికి చెందిన ఐదుగురు చోటు దక్కించుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక జాబితాను వాల్స్ట్రీట్ జర్నల్కు అనుబంధమైన బారన్ నాలుగో వార్షిక జాబితాలో రూపొందించింది. ఆర్థిక సేవల రంగంలో ఉన్నత స్థాయిలకు చేరడంతో పాటు ఈ రంగభవితను మార్చడంలో కీలక పాత్రను పోషించిన అత్యుత్తమ 100 మంది మహిళలను ఇందులో చేర్చారు. ఈ లిస్ట్లో జేపీ మోర్గాన్కు అను అయ్యంగార్, ఏరియల్ ఇన్వెస్ట్మెంట్స్కు చెందిన మీనా లక్డావాలా-ఫ్లిన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్కుచెందిన రూపాల్ జె భన్సాలి, గోల్డ్మన్ సాక్స్ గ్రూప్కు చెందిన సోనాల్ దేశాయ్, బోఫా సెక్యూరిటీస్కు సెక్యూరిటీస్కి చెందిన సవితా సుబ్రమణియన్కు స్థానం లభించడం విశేషం. వీరితోపాటు పాకిస్థానీ అమెరికన్, అసెట్ మేనేజ్మెంట్ సంస్థ నువీన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, సైరా మాలిక్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అను అయ్యంగార్: బారన్ వివరాల ప్రకారం జేపీ మోర్గాన్లో విలీనాలు, కొనుగోళ్ల విభాగానికి అంతర్జాతీయహెడ్గా ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు 2020 జనవరి నుంచి ఈ విభాగానికి కో-హెడ్గా పనిచేశారు. స్మిత్ బిజినెస్ అడ్వైజరీ నెట్వర్క్కు కో-చైర్గా కూడా ఉన్నారు. అయ్యంగార్ తన భర్తతో కలిసి న్యూయార్క్ నగరంలో నివసిస్తున్నారు. స్మిత్ కళాశాల నుండి ఆర్థికశాస్త్రంలో బీఏ, వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం నుంచి ఏంబీఏ చేశారు. రూపాల్ జె భన్సాలీ(55): ఏరియల్ ఇన్వెస్ట్మెంట్లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, పోర్ట్ఫోలియో మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 100 వుమెన్ ఇన్ ఫైనాన్స్ డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా కూడా ఉన్నారు. మనీ మేనేజింగ్ కోసమే తాను పుట్టానని చెప్పుకునే మహిళలను ఫైనాన్స్లో పనిచేసేలా ప్రోత్సహించాలనే ఆసక్తి ఎక్కువ. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో మాస్టర్ ఆఫ్ కామర్స్, తరువాత రోచెస్టర్ విశ్వవిద్యాలయంనుండి ఫైనాన్స్లో ఎంబీఏ చేశారు. ఆమె రోటరీ ఫౌండేషన్ స్కాలర్ కూడా. సోనాల్ దేశాయ్(58): 2018లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కు ముఖ్య పెట్టుబడుల అధికారిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె నిర్వహణలో 137 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, డ్రెస్డ్నర్ క్లీన్వోర్ట్ వాసర్స్టెయిన్, థేమ్స్ రివర్ క్యాపిటల్లో పనిచేసిన తర్వాత 2009లో ఆమె ఈ సంస్థలో చేరారు. యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్లో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన కరియర్ ప్రారంభించారు. మీనా లక్డావాలా-ఫ్లిన్ (45): ఒలింపిక్స్లో పోటీపడాలనుకునే ఉత్సాహభరితమైన జిమ్నాస్ట్. కానీ మోకాలి గాయం కారణంగా ఆమె దృష్టి ఫైనాన్స్ కెరీర్ వైపు మళ్లింది. అలా ఈక్విటీ సేల్స్ డెస్క్లో పనిచేస్తున్న ఫ్రైడ్మాన్, బిల్లింగ్స్ రామ్సే గ్రూప్లో ఇంటర్న్షిప్ చేసింది. గ్లోబల్ ఇన్క్లూజన్, డైవర్సిటీ కమిటీకి కో-ఛైర్గా పనిచేశారు. గ్లోబల్ ప్రైవేట్ వెల్త్ మేనేజ్మెంట్ విభాగానికి కో-హెడ్గాను, 1999లో జేపీ మోర్గాన్ ఛేజ్లో పనిచేశారు. ఆతర్వాత గోల్డ్మన్ శాక్స్కు మారారు. సవితా సుబ్రమణియన్ (50): బ్యాంక్ ఆఫ్ అమెరికాలో యూఎస్ ఈక్విటీ, క్వాంటిటేటివ్ స్ట్రాటజీ విభాగ హెడ్గా ఉన్నారు. ఈక్విటీలపై యూఎస్ సెక్టార్ కేటాయింపులను సిఫార్సు చేయడం, S&P 500 ఇతర ప్రధాన సూచీలకు అంచనాలను నిర్ణయించడం చేస్తారు. అలాగే సంస్థాగత వ్యక్తిగత క్లయింట్లకు సంస్థ పరిమాణాత్మక ఈక్విటీ వ్యూహాన్ని అభివృద్ధి చేయడం మార్కెటింగ్ చేయడం వంటి బాధ్యతలను కూడా నిర్వహిస్తారు. -
అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో మోదీ
న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో అత్యంత ప్రభావశీలురైన 30 మంది వ్యక్తుల్లో మోదీ ఒకరిగా నిలిచారు. టైమ్ మేగజైన్ తాజాగా వెల్లడించిన జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పాటు హ్యారీపోటర్ సృష్టికర్త జేకే రౌలింగ్, సింగర్స్ టేలర్ స్విఫ్ట్, బియాన్స్లు ఉన్నారు. ట్వీటర్, ఫేస్బుక్లలో 3.8 కోట్లమంది ఫాలోవర్లున్న మోదీ నాయకుల్లో ఒబామా తరువాత రెండో స్థానంలో నిలిచారు. భారత్లోని దాదాపు 20 కోట్లమంది నెటిజన్లను చేరుకోవడానికి సోషల్ మీడియాను మంచి సాధనంగా మోదీ గుర్తించారని పత్రిక తెలిపింది.


