breaking news
Indias victory
-
వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. అమెరికా రాయబారి సందడి.. వీడియో ట్రెండింగ్!
ప్రపంచమంతా క్రికెట్ వరల్డ్ కప్ హడావుడి నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత జట్టు మరోసారి వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉత్కంఠభరితమైన ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ సందడి చేశారు. 1983లో తొలిసారి ప్రపంచకప్ను కైవసం చేసుకున్న భారత జట్టులోని కొందరు సభ్యులను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ కలిశారు. బ్యాట్ పట్టి వారితో సరదాగా క్రికెట్ ఆడారు. నాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. 1983 విజయం 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు సంకేతంగా తాను సంతకం చేసిన బ్యాట్ను లెజెండరీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, రోజర్ బిన్నీ, జిమ్మీ అమర్నాథ్, కీర్తి ఆజాద్, రవిశాస్త్రిలకు బహూకరించారు. దీనికి సంబంధిచిన వీడియోను ఎరిక్ గార్సెట్టీ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. భారత్లో క్రికెట్ అభివృద్ధికి బాటలు వేశారంటూ 1983 వరల్డ్ కప్ నెగ్గిన లెజండరీ క్రికెటర్లను అభినందిస్తూ భారత్ మరోసారి ట్రోఫీని గెలవాలని ఆకాంక్షించారు. భారత్ ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఆడుతున్న తరుణంలో గార్సెట్టీ షేర్ చేసిన ఈ వీడియో ట్రెండింగ్లో నిలిచింది. అత్యధికంగా వ్యూవ్స్, లైక్స్ వచ్చాయి. అలాగే పలువురు స్పందిస్తూ కామెంట్లు చేశారు. Met the OGs of cricket 🏏 – '83 legends @therealkapildev, Sunil Gavaskar, @iRogerBinny, @JimmyAmarnath, @KirtiAzaad, and @RaviShastriOfc! They bowled me over with their stories from India's first cricket World Cup victory! Rooting for #TeamIndia for the World Cup final on Sunday.… pic.twitter.com/71aTKDIuax — U.S. Ambassador Eric Garcetti (@USAmbIndia) November 17, 2023 -
గంటలోపే ఖేల్ ఖతం
► ముంబై టెస్టులో భారత్ ఘనవిజయం ► ఇంగ్లండ్పై ఇన్నింగ్స్, 36 పరుగుల ఆధిక్యంతో గెలుపు ► సిరీస్ 3–0తో కైవసం ఊహించినట్టుగానే జరిగింది.. ఎలాంటి సంచలనాలు చోటు చేసుకోలేదు. బరిలో దిగిన గంటలోపే భారత బౌలర్లు విజయ లాంఛనాన్ని ముగించారు. మన బ్యాట్స్మెన్ కు మరో ఇన్నింగ్స్ ఆడే పరిస్థితి లేకుండా ఇంగ్లండ్ చివరి వరుస బ్యాట్స్మన్ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కోహ్లి సేన 3–0తో దక్కించుకుంది. చివరి రోజు కూడా అశ్విన్ తన స్పిన్ మ్యాజిక్ను ప్రదర్శించి మిగిలిన నాలుగు వికెట్లను కేవలం నాలుగు ఓవర్లలోనే తన ఖాతాలో వేసుకుని సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు చేసినా... భారత బౌలర్ల ప్రతిభ కారణంగా ఇంగ్లండ్ జట్టుకు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. కోహ్లి నేతృత్వంలో భారత జట్టుకిది వరుసగా ఐదో టెస్టు సిరీస్ విజయం కావడం విశేషం. అలాగే దాదాపు 24 ఏళ్ల అనంతరం ఇంగ్లండ్ జట్టుపై స్వదేశంలో తొలిసారిగా మూడు టెస్టులను నెగ్గినట్టయ్యింది. ముంబై: లాంఛనం ముగిసింది. భారత్ ఖాతాలో మరో విజయం చేరింది. ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. సోమవారం ముగిసిన నాలుగో టెస్టులో కోహ్లి సేన ఇన్నింగ్స్, 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్ జట్టును చిత్తుగా ఓడించింది. చివరి రోజు ఇంగ్లండ్ జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో కనీస పోటీని కూడా ప్రదర్శించలేదు. దీంతో 55.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మరోవైపు వరుసగా మూడు విజయాలతో ఐదు టెస్టుల సిరీస్ను భారత జట్టు 3–0తో కైవసం చేసుకుంది. 1993లో అజహరుద్దీన్ కెప్టెన్సీలో చివరిసారిగా భారత జట్టు ఇంగ్లండ్పై మూడు టెస్టులను నెగ్గింది. అశ్విన్ కు ఆరు, జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. మొత్తం ఈ మ్యాచ్లో అశ్విన్ 12 వికెట్లు తీశాడు. అలాగే ఈ విజయంతో 2012లో ఇంగ్లండ్కు కోల్పోయిన ఆంథోనీ డి మెల్లో ట్రోఫీని తిరిగి కైవసం చేసుకున్నట్టయ్యింది. సిరీస్లో చివరి టెస్టు ఈనెల 16 నుంచి 20 వరకు చెన్నైలో జరుగుతుంది. ఓవర్నైట్ స్కోరు 182/6తో తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ భారత బౌలర్లకు ఎలాంటి శ్రమను ఇవ్వలేదు. అశ్విన్ దెబ్బకు కేవలం ఎనిమిది ఓవర్లలో 13 పరుగులు మాత్రమే చేసి తమ ఇన్నింగ్్సను ముగించింది. బెయిర్స్టో (107 బంతుల్లో 51; 2 ఫోర్లు) చక్కటి క్యారమ్ బంతికి వికెట్ల ముందు దొరికిపోగా తను రివ్యూకు వెళ్లాడు. అయితే అంపైర్ నిర్ణయమే సరైందని తేలింది. అలాగే క్రిస్ వోక్స్ (0), రషీద్ (7 బంతుల్లో 2)లను అవుట్ చేసిన అశ్విన్ తన కెరీర్లో 24సార్లు ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ఫీట్ను పూర్తి చేశాడు. ఆ తర్వాత అండర్సన్ (2)ను కూడా అశ్వినే పెవిలియన్ కు పంపి భారత శిబిరంలో విజయోత్సాహాన్ని నింపాడు. అండర్సన్ తో భారత ఆటగాళ్ల వాగ్వాదం 640 పరుగులు... ఈ సిరీస్లో కెప్టెన్ విరాట్ కోహ్లి ఇప్పటిదాకా సాధించిన పరుగులు. అయితే 128 సగటుతో భీకర ఫామ్లో ఉన్న తన బ్యాటింగ్ను ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ తేలిగ్గా తీసుకుంటున్నాడు. అసలు అతడి బ్యాటింగ్ టెక్నిక్ ఏమంత గొప్పగా లేదని, తను భారత్లోనే బాగా ఆడతాడని ఆదివారం ఆట అనంతరం జరిగిన ప్రెస్మీట్లో విమర్శించాడు. ఇది చివరి రోజు తను బ్యాటింగ్కు వచ్చినప్పుడు మాటల యుద్ధానికి తెర తీసింది. భారత ఫీల్డర్లు అండర్సన్ చుట్టూ చేరి ఏదో అనడం కనిపించింది. వెంటనే రంగంలోకి దిగిన అంపైర్లు అశ్విన్ , జడేజాలతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే అండర్సన్ కామెంట్స్ తనకు తెలీదని కెప్టెన్ కోహ్లి అన్నాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 400; భారత్ తొలి ఇన్నింగ్స్: 631 ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: కుక్ ఎల్బీడబ్ల్యూ (బి) జడేజా 18; జెన్నింగ్స్ ఎల్బీడబ్ల్యూ (బి) భువనేశ్వర్ 0; రూట్ ఎల్బీడబ్ల్యూ (బి) జయంత్ యాదవ్ 77; మొయిన్ అలీ (సి) విజయ్ (బి) జడేజా 0; బెయిర్స్టో ఎల్బీడబ్ల్యూ (బి) అశ్విన్ 51; స్టోక్స్ (సి) విజయ్ (బి) అశ్విన్ 18; బాల్ (సి) పార్థీవ్ పటేల్ (బి) అశ్విన్ 2; బట్లర్ నాటౌట్ 6; వోక్స్ (బి) అశ్విన్ 0; అదిల్ రషీద్ (సి) రాహుల్ (బి) అశ్విన్ 2; అండర్సన్ (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 2; ఎక్స్ట్రాలు 19; మొత్తం (55.3 ఓవర్లలో ఆలౌట్) 195. వికెట్ల పతనం: 1–1, 2–43, 3–49, 4–141, 5–180, 6–182, 7–185, 8–189, 9–193, 10–195. బౌలింగ్: భువనేశ్వర్ 4–1–11–1; ఉమేశ్ 3–0–10–0, జడేజా 22–3–63–2, అశ్విన్ 20.3–3–55–6, జయంత్ యాదవ్ 6–0–39–1. 1 పర్యాటక జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులు చేసినా ఓడడం భారత్లో ఇదే తొలిసారి. ప్రపంచ క్రికెట్లో ఇంగ్లండ్ రెండుసార్లు, శ్రీలంక ఒక సారి ఇలా ఇన్నింగ్స్ ఓటమిని పొందాయి. 7 మ్యాచ్లో పది వికెట్లకు పైగా తీయడం అశ్విన్ కు ఇది ఏడోసారి. భారత్ నుంచి కుంబ్లే (8) టాప్లో ఉన్నాడు. 17 స్వదేశంలో భారత్ వరుసగా 17 టెస్టుల్లో ఓటమి లేకుండా సాగుతోంది. 1980ల్లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో జట్టు సాధించిన ఫీట్ను సమం చేసింది. 27 ఇప్పటిదాకా ఈ సిరీస్లో అశ్విన్ తీసిన వికెట్లు. 5 భారత జట్టు వరుసగా ఐదో సిరీస్ను సొంతం చేసుకొని తమ అత్యుత్తమ ప్రదర్శనను సమం చేసింది. 2008–2010 మధ్యలో కూడా భారత్ ఐదు సిరీస్లు నెగ్గింది. ఈ విజయం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఐదు సిరీస్లలో ఇదే మధురమైన విజయం. నేను వాస్తవిక ధోరణిలో ఉంటాను. ఇతరుల టెక్నిక్, బలహీనతల గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. ఎవరికి వారు అర్థం చేసుకుని దానిపై కృషి చేయాలి. నా దృష్టి అంతా మంచి క్రికెట్పైనే ఉంటుంది. వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించను. అండర్సన్ వ్యాఖ్యల గురించి నాకు తెలీదు. మైదానంలో అశ్వినే నాతో చెప్పాడు. వెంటనే నవ్వాను. అయితే అశ్విన్ అతడితో వాగ్వాదానికి దిగితే నేనే వెళ్లి సర్దిచెప్పాను. పరిస్థితిని శాంతింపజేయడం నాకు ఇదే తొలిసారి. –విరాట్ కోహ్లి (భారత కెప్టెన్) మేం చాలా అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాం. దీంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ వికెట్పై 400 పరుగులు మంచి స్కోరు. మొయిన్అలీ, రషీద్లను తక్కువ చేసినట్టు కాదు గానీ మా జట్టులో 2012లో స్వాన్, పనేసర్లాంటి అత్యుత్తమ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. ఈ పిచ్లపై అలాంటి బౌలర్లే కావాలి. ఇక్కడి మైదానాల్లో భారత్ను ఓడించాలంటే ఉత్తమ స్థాయిలో ఆడాల్సిందే. అదే మాలో లోపించింది. చక్కటి లెంగ్త్తో అశ్విన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. నిజంగా ఇక్కడి పిచ్లపై అతడిని ఎదుర్కోవడం కష్టమే. ఇక జో రూట్కు కెప్టెన్ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి –అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్ కెప్టెన్) -
మెరిసిన అవేశ్
బంగ్లాపై భారత్ గెలుపు అండర్-19 ముక్కోణపు సిరీస్ కోల్కతా: బౌలింగ్లో అద్భుతంగా రాణించిన భారత కుర్రాళ్లు... అండర్-19 ముక్కోణపు సిరీస్లో బోణీ చేశారు. అవేశ్ ఖాన్ (6-3-4-4) సంచలన ప్రదర్శనతో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు. దీంతో శుక్రవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 82 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై నెగ్గి శుభారంభం చేసింది. జాదవ్పూర్ యూనివర్సిటీ కాంప్లెక్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ గెలిచిన భారత్ 45.3 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది. సుందర్ (34), జీషాన్ అన్సారి (34) మినహా మిగతా వారు విఫలమయ్యారు. మిరాజ్ 3, హలీమ్, షావోన్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ 22 ఓవర్లలో 76 పరుగులకు కుప్పకూలింది. షఫీయుల్ (26) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన అవేశ్ ఖాన్... తర్వాత వరుస ఓవర్లలో వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో భారత్కు 5 పాయింట్లు లభించాయి. నేడు (శనివారం) జరిగే మ్యాచ్లో రికీ భుయ్ సేన... అఫ్ఘానిస్తాన్తో తలపడుతుంది. -
నాలుక కోసుకున్న క్రికెట్ అభిమాని
వేలూరు : ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భారత్జట్టు విజయం సాధించాలని కోరుతూ తమిళనాడులోని వేలూరు జిల్లా వానియంబాడికి చెందిన ఓ యువకుడు గురువారం నాలుక కోసుకున్నా డు. వేలూరు జిల్లా వానియంబాడి మిడె న్స్ కుప్పం గ్రామానికి చెందిన సుధాకర్(27) భవన నిర్మాణ కార్మికుడు. ఇతను క్రికెట్ అభిమాని. గురువారం ఉదయం జోలార్పేటలోని అత్తగారింటికి వె ళ్ళిన సుధాకర్ అక్కడున్న పొన్నేరి వేడియప్పన్ ఆలయం వద్దకు వెళ్లి బ్లేడుతో నాలుక కోసుకుని ఆలయంలోని పీఠంలో ఉంచాడు. దీన్ని గమనించిన భక్తులు ఆ యువకుని బంధువులకు సమాచారం అందించారు. అప్పటికే సుధాకర్ సృహ తప్పి పడిపోవడంతో స్థానికులు వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుధాకర్ నాలుకను స్థాని కులు ఆసపత్రికి తీసుకువచ్చారు. ఎండకు వాడి పోయి ఉన్న నాలుకను వేలూరులోని వైద్య బృందం అధునూతన పద్ధతిలో ఆపరేషన్ చేసి అమర్చింది. సుధాకర్ మాట్లాడుతాడా అనే విషయం చెప్పడానికి కొద్ది రోజులు పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. క్రికెట్ పోటీల్లో భారత్ టీమ్ గెలవాలని నాలుక కోసుకున్నట్టు సుధాకర్ పైపర్పై రాసి వివరించాడు. ఇదిలా ఉండగా కుటుంబ సమస్యల వల్ల కూడా సుధాకర్ ఇలా చేసి ఉండవచ్చునని స్థానికులు చెపుతున్నారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం సుధాకర్ కత్తిని నోటిలో పెట్టుకుని చెట్టు ఎక్కుతున్న సమయంలో జారి నాలుక తెగిపోయినట్టు కేసు నమోదు చేశారు. -
భారత్ గెలుపుకోసం మోకాళ్లపై కొండపైకి...
తిరుపతి: ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో భారత్ జట్టు గెలవాలని ఆకాంక్షిస్తూ తిరుపతికి చెందిన ఓ యువ క్రీడాకారుడు బుధవారం తిరుపతి అలిపిరి నుంచి తిరుమలకు మోకాళ్లపై నడిచి వెళ్లాడు. తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెకు చెందిన తాళ్లపాక చాణక్య తిరుపతిలోని కేశవ రెడ్డి కాన్సెప్ట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ, పలు రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ప్రతిభను చాటుతున్నాడు. బుధవారం సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మోకాళ్లపై తిరుమలకు బయలుదేరాడు. ఈసందర్భంగా చాణక్య మీడియాతో మాట్లాడుతూ గురువారం జరగనున్న మ్యాచ్లో ఆస్ట్రేలియాపై భారత్ జట్టు గెలవాలని, అనంతరం ఫైనల్స్లో గెలిచి దేశానికి ప్రపంచకప్ తీసుకురావాలన్న ఆకాంక్షించాడు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటానన్నారు. ఇదిలా ఉండగా చాణక్య ప్రస్తుతం ఆంధ్ర జట్టు అండర్ 14 విభాగంలో స్టాండ్ బై వికెట్ కీపర్గా ఉన్నాడు.