-
దేశ ఐటీ రంగంలో టాప్.. అత్యధిక వేతనం ఈయనదే..
దేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. ‘మింట్’ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ గత సంవత్సరం వేతన పరిహారంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకున్నారు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం, రవి కుమార్ సింగిశెట్టి గత సంవత్సరం మొత్తంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకోగా ఇందులో 20.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.169.1 కోట్లు) విలువైన షేర్లను అందుకున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం రూ.19.35 బిలియన్ డాలర్లు ఉండగా ఇందులో సీఈవో రవి కుమార్ వేతన పరిహారం 0.11 శాతంగా ఉంది. ఇతర ఐటీ సీఈవోల వేతనాలు ఇలా.. విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే రూ. 10.1 మిలియన్ డాలర్లు (రూ. 83 కోట్లు) హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 10.65 మిలియన్ డాలర్లు (రూ. 88 కోట్లు) అసెంచర్ సీఈవో జూలీ స్వీట్ 31.55 మిలియన్ డాలర్లు (రూ.263 కోట్లు) ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 6.8 మిలియన్లు ( రూ. 56.4 కోట్లు) టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ 3.5 మిలియన్ ( రూ. 29.16 కోట్లు) -
ఐటీ క్వీన్.. రోష్ని!
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగంలో కొత్త క్వీన్ అరంగేట్రం చేసింది. పురుషాధిక్యత అధికంగా ఉన్న ఐటీ రంగంలో తొలిసారిగా ఒక ఐటీ కంపెనీ పగ్గాలు ఒక మహిళ చేతికి వచ్చాయి. దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్సీఎల్ టెక్నాలజీస్కు చైర్పర్సన్గా రోష్ని నాడార్ మల్హోత్ర నియమితులయ్యారు. హెచ్సీఎల్ టెక్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ స్థానంలో ఆయ న ఏకైక సంతానం, రోష్ని నాడార్ చైర్పర్సన్ బాధ్యతలను శుక్రవారమే స్వీకరించారు. కాగా కంపెనీ ఎమ్డీ(చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్)గా శివ్ నాడార్ కొనసాగుతారు. దేశంలోనే అత్యధిక సంపద ఉన్న మహిళగా రికార్డులకు ఎక్కిన ఈమె. స్టాక్మార్కెట్లో లిస్టైన ఐటీ కంపెనీ చైర్పర్సన్గా పగ్గాలు చేపట్టిన తొలి మహిళ అనే ఘనతను కూడా సాధించారు. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ: శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన రోష్ని నాడార్ 2013లోనే హెచ్సీఎల్ టెక్నాలజీస్ వైస్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. హెచ్సీఎల్ గ్రూప్ హోల్డింగ్ కంపెనీగా వ్యవహరిస్తున్న హెచ్సీఎల్ కార్పొరేషన్ సీఈఓగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ వసంత్ వ్యాలీ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించిన రోష్ని నాడార్ ఢిల్లీలో కమ్యూనికేషన్స్ విభాగంలో డిగ్రీ చదివారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ఎమ్బీఏ పట్టా పొందారు. 2009లో హెచ్సీఎల్ కార్ప్లో చేరారు. ఏడాదిలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎదిగారు. 27 ఏళ్ల వయస్సుకే సీఈఓ అయ్యారు. మహిళా కుబేరుల్లో టాప్ రోష్ని నాడార్ 2010లో హెచ్సీఎల్ హెల్త్కేర్ వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రను వివాహమాడారు. వారికి ఆర్మాన్, జాహాన్... ఇద్దరు కుమారులు. హురున్ సంస్థ తాజా కుబేరుల జాబితాలో రూ.36,800 కోట్ల సంపదతో రోష్ని నాడార్ భారత్లోనే అత్యధిక సంపద గల మహిళగా అగ్రస్థానంలో నిలిచారు. -
భారతీయ ఐటీకి భారీ షాక్
- హెచ్1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసిన అగ్రరాజ్యం - తాజా ఈవోపై సంతకం చేసిన డొనాల్డ్ ట్రంప్ - అమెరికన్లకే ఇక పెద్దపీట.. వృత్తినిపుణుల ఆశలపై నీళ్లు వాషింగ్టన్: అమెరికన్లకే పెద్దపీట అనే నినాదంతో అధ్యక్ష పదవిని చేపట్టిన డొనాల్డ్ ట్రంప్...భారతీయ ఐటీ రంగంతోపాటు వృత్తినిపుణులకు షాక్ ఇచ్చారు. హెచ్1బీ నిబంధనలను కఠినతరం చేసేందుకు ఉద్దేశించిన తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్(ఈవో)పై సంతకం చేశారు. ‘బై అమెరికన్, హైర్ అమెరికన్’ అనే నినాదంతో ఈ వీసా విధానంలో సమూల మార్పులకు ఉద్దేశించిన తాజా ఈవోపై విస్కాన్సిన్లోని కెనోషా నగరంలోగల స్నాప్ ఆన్ ఇన్కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం సంతకం చేశారు. అంతకముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ విధానం తీవ్రస్థాయిలో దుర్వినియోగమవుతోంది. అమెరికన్లకు దక్కాల్సిన ఉద్యోగాల్లో విదేశీయుల ను నియమిస్తున్నారు. తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. తాజా ఈవోతో ఈ దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుంది’ అని అన్నారు. దీంతో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంస్కరణల అమలులోకి వస్తాయని, వీసా దుర్వినియోగానికి తెరపడుతుందని చెప్పా రు. లాటరీ విధానంలో ఈ వీసాలను ప్రసు ్తతం జారీ చేస్తున్నారని, అది తప్పని అన్నా రు. ఇందుకు బదులు వాటిని అత్యంత ప్రతి భావంతులకు, భారీవేతనాలు తీసుకుంటున్నవారికి మాత్రమే విధిగా కేటాయించాలన్నారు. అమెరికన్లను తప్పించడం కోసం వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వీటిని వినియోగించకూడదన్నారు. మా ఉద్యోగాలు మాకే తమ దేశంలోని ఉద్యోగాలు తమవారికి మాత్రమే దక్కేలా చేయాలనే లక్ష్యంతోనే ‘హైర్ అమెరికన్’ నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతున్నామని ట్రంప్ చెప్పారు. ‘ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యమివ్వాలని, అదే సమంజసమని అన్నారు. కాగా ట్రంప్ సంతకం చేసిన ఈవో ప్రకారం అమెరికా ప్రాజెక్టులను దేశీ య ఉత్పత్తులతోనే నిర్మించాల్సి ఉంటుం ది. ‘మా దేశంలోని కార్మికులు, ఉత్పత్తిదారులను మోసగించేందుకు విదేశాలు చేసే కుటిలయత్నాలను అంగీకరించబోం. ‘బై అమెరికన్’ విధానం కచ్చితంగా అమలయ్యేలా చూస్తాం. ఇందుకు భిన్నంగా కుది రే ఒప్పందాలపై నిఘా పెడతాం’ అంటూ ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ సంతకం చేసిన తాజా ఈవో ప్రకారం హెచ్1బీ వీసాలు అత్యంత ప్రతిభావంతులు, వృత్తినిపుణులకు మాత్రమే దక్కేలా చేసేందుకు అవసరమైన సంస్కరణలను సెక్రటరీ ఆఫ్ స్టేట్, అటార్నీ జనరల్, కార్మిక విభాగం సెక్రటరీ, హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీలు సూచించాల్సి ఉంటుంది. అమెరికా అధికారులతో మాట్లాడతా న్యూఢిల్లీ: అమెరికా పర్యటన సందర్భంగా హెచ్1బీ వీసా అంశాన్ని అక్కడి యంత్రాంగం దృష్టికి తీసుకెళతానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ బుధవారం సూచనప్రాయంగా తెలియజేశారు. ‘ఐటీ రంగానికి సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించాల్సి ఉంటుంది. వారితో చర్చల అనంతరం ఏమిజరిగిందనేది మీకు తెలియజేస్తా. ’అని అన్నారు. ఇదిలాఉంచితే హెచ్1బీ వీసా మంజూరు విషయంలో నిబంధనలను కఠినతరం చేయడంపై భారతీయ ఐటీరంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. -
టీసీఎస్ దెబ్బ...ఐటీ పరిశ్రమను తాకనుందా?
ముంబై : అతిపెద్ద సాప్ట్ వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసుపై యూఎస్ కోర్టు వేసిన 6 వేల కోట్ల జరిమానా వివాదం దేశంలోని మిగతా ఐటీ పరిశ్రమలపై ప్రభావం చూపనుందా అంటే మార్కెట్ విశ్లేషకులు అవుననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావంతో హెల్త్ కేర్ బిజినెస్ లో ఎక్కువ కీర్తి ప్రతిష్టలు కలిగన టీసీఎస్ పై భారత్ లో నమ్మకం కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రస్తుత క్లిష్టమైన రాజకీయ వాతావరణంలో, భారత కంపెనీలు తేలికైన పద్ధతులు ఎంచుకుని ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వివిధ ప్రాంతాల్లో భారత ఐటీ రంగం లీగల్ గా చాలా సమస్యలకు గురవుతుందని సాప్ట్ వేర్ నేషనల్ అసోసియేషన్ తెలిపింది. రహస్య వాణిజ్య దావా కేసులో కోర్టు టీసీఎస్ పై భారీ జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో సోమవారం నాటి మార్కెట్లో టీసీఎస్ షేర్లు మార్కెట్లో కుప్పకూలుతున్నాయి. హెల్త్ రంగానికి సాప్ట్ వేర్ ను అందించడంలో ఎపిక్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తోంది. టీసీఎస్ ఆదాయంలో ఎక్కువ శాతం లైఫ్ సైన్స్, హెల్త్ కేర్ నుంచే వస్తుంది. ఈ క్రమంలో టీసీఎస్ పై ఇలాంటి తీర్పు వెలువడటం కంపెనీ కీర్తి ప్రతిష్టలకు భంగంతో పాటు, పోటీదారులు మరింత అనుమానాలు రేకెత్తించే ప్రమాదముందని బెండర్ సాముల్ తెలిపారు. ఆస్పత్రులకు, క్లినిక్ లకు ఐటీ సర్వీసులను అందించడంలో మార్కెట్లో ఎక్కువ అభివృద్ధి ఉందని, ఈ పోటీల్లో టీసీఎస్ ముందంజలో నిలబడేందుకు చాలా ప్రయత్నాలు చేసిందని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో భారత ఐటీ రంగం లీగల్ గా చాలా సమస్యలకు గురవుతుందని సాప్ట్ వేర్ నేషనల్ అసోసియేషన్ తెలిపింది. కానీ ముందుకంటే ఇవి ఎక్కువేమీ కాదని పేర్కొంది. మరోవైపు ఈ వివాదాన్ని టీసీఎస్ తేలిగ్గా తీసుకుంది. యూఎస్ హెల్త్ కేర్ సంస్థ ఎపిక్ సిస్టమ్స్ మేథో సంపత్తి హక్కుల ఉల్లంఘనను టీసీఎస్ ఖండించింది. యూఎస్ జ్యురీ ఇచ్చిన తీర్పుపై అప్పీలుకు వెళ్తామని ప్రకటించింది. టాటా గ్రూప్ లోని ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అమెరికా అనుబంధ సంస్థ టాటా అమెరికా ఇంటర్నేషనల్ కార్ప్ పై 'ఎపిక్ సిస్టమ్స్' దాఖలు చేసిన ట్రేడ్ సీక్రెట్ దొంగిలింపు కేసులో విస్కాన్సిస్ లోని యూఎస్ ఫెడరల్ కోర్టు 940 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 6 వేల కోట్లు) భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement