-
వరల్డ్కప్ ఫైనల్.. చివరి ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా (ఫొటోలు)
-
Commonwealth Games 2022: క్రికెట్లో కనకంపై గురి
బర్మింగ్హామ్: తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్ప్రీత్ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. నాట్ సివర్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్), డానీ వ్యాట్ (27 బంతుల్లో 35; 6 ఫోర్లు), ఎమీ జోన్స్ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు) రాణించారు. సివర్, జోన్స్ నాలుగో వికెట్కు 54 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ సునాయాసంగా విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. చేతిలో 7 వికెట్లతో 17 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో జోన్స్ రనౌట్ కాగా... ఆ తర్వాత 8 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా సివర్ రనౌట్ కావడం జట్టును దెబ్బ తీసింది. ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. అప్పుడు పతకం రాలేదు కామన్వెల్త్ క్రీడల్లో గతంలో ఒకే ఒకసారి (1998; కౌలాలంపూర్) క్రికెట్ పోటీలు నిర్వహించారు. పురుషుల టీమ్తో వన్డే ఫార్మాట్లో అజయ్ జడేజా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగింది. సచిన్, కుంబ్లే, లక్ష్మణ్, హర్భజన్, రాబిన్ సింగ్, ఎమ్మెస్కే ప్రసాద్ లీగ్ దశలో 3 మ్యాచ్లూ ఆడారు. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత జట్టు... కెనడాపై గెలిచి ఆస్ట్రేలియా చేతిలో ఓడగా, ఆంటిగ్వా అండ్ బార్బుడాతో జరిగిన మ్యాచ్లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. దాంతో సెమీస్ చేరకుండానే టీమిండియా నిష్క్రమించింది. -
సఫారీలపై సగర్వంగా...
టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్లతో విజయం అశ్విన్ సూపర్ బౌలింగ్ కోహ్లి సంచలన బ్యాటింగ్ శ్రీలంకతో ఫైనల్ ఆదివారం వారెవ్వా... ఏం బ్యాటింగ్..! ఒక శిల్పి ఓపికగా ఓ శిల్పాన్ని చెక్కినట్లు... ఓ కళాకారుడు అలుపులేకుండా సౌధాన్ని నిర్మించినట్లు..! భారత క్రికెటర్లు కూడా అద్భుతం చేశారు. టి20 క్రికెట్లో పరుగులు చేయడం ఇంత సులభమా..! అని ప్రపంచం ఆశ్చర్యపోయేలా 173 పరుగుల లక్ష్యాన్ని మంచినీళ్లు తాగినంత సులభంగా ‘ఊదిపారేశారు’. ఓ పద్ధతి ప్రకారం ఆడి చక్కటి భాగస్వామ్యాలతో సఫారీలను చిత్తు చేసి... భారత్ సగర్వంగా టి20 ప్రపంచకప్ ఫైనల్కు చేరింది. ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి పాపం... చోకర్స్ అనే ముద్ర తొలగించుకోవడానికి దక్షిణాఫ్రికా క్రికెటర్లు విశ్వప్రయత్నాలు చేశారు. బాగా బ్యాటింగ్ చేశారు... కళ్లుచెదిరే క్యాచ్లు పట్టుకున్నారు... కుదురుగా బౌలింగ్ చేశారు. కానీ వేటగాళ్లను మాత్రం ఆపలేకపోయారు. టోర్నీలో తొలిసారి భారత బౌలర్లు విఫలమైనా... బ్యాట్స్మెన్ చెలరేగి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన టి20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారత్ ఆరు వికెట్లతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (13 బంతుల్లో 24; 4 ఫోర్లు, 1 సిక్సర్), రహానే (30 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్సర్) మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ అవుటైనా... పరుగుల వేటగాడు విరాట్ కోిహ్ల (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అత్యద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్కు విజయాన్ని అందించాడు. యువరాజ్ (17 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... సురేశ్ రైనా (10 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఒత్తిడిలో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఆమ్లా (16 బంతుల్లో 22; 4 ఫోర్లు) మంచి ఆరంభాన్నివ్వగా... దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ (41 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) నాణ్యమైన ఇన్నింగ్స్తో అర్ధసెంచరీ చేశాడు. డుమిని (40 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్కు వెన్నుముకలా నిలిచాడు. డు ప్లెసిస్, డుమిని మూడో వికెట్కు 71 పరుగులు జోడించారు. చివర్లో మిల్లర్ (12 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడాడు. డుమిని, మిల్లర్ చివరి 4.3 ఓవర్లలో అజేయంగా 43 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో అశ్విన్ మూడు, భువనేశ్వర్ ఒక్క వికెట్ తీశారు. అశ్విన్, జడేజా మినహా భారత బౌలర్లు ఈసారి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం ఇదే స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్ జట్టు శ్రీలంకతో తలపడుతుంది. భాగస్వామ్యాలే కీలకం: ఏ ఫార్మాట్లో అయినా భాగస్వామ్యాలు కీలకమనేది ధోని పదేపదే చెప్పే మాట. దక్షిణాఫ్రికాతో సెమీస్లో భారీ లక్ష్యం కళ్లముందున్నా భారత్ గెలవడానికి కారణం చిన్న చిన్న భాగస్వామ్యాలే. 39, 38, 56, 34... ఇవీ భారత ఇన్నింగ్స్లో భాగస్వామ్యాలు. ఇందులో మొదటి దానిలో తప్ప మిగిలిన మూడింటిలో కోహ్లి భాగస్వామి. ముఖ్యంగా యువరాజ్ నెమ్మదిగా ఆడినట్లు కనిపించినా... కోహ్లితో కలిసి మూడో వికెట్కు నెలకొల్పిన 56 పరుగుల భాగస్వామ్యం (39 బంతుల్లో) మ్యాచ్కు కీలకం. 6 2000 నుంచి భారత్ తాను ఆడిన ఆరు ఐసీసీ సెమీ ఫైనల్స్లో విజయం సాధించగా...దక్షిణాఫ్రికా తాను ఆడిన ఆరు ఓడింది. 3 2010లో మినహా ప్రతీ టి20 ప్రపంచకప్ ఫైనల్కు ఆసియా జట్టు అర్హత సాధించింది. 2007, 2009 తర్వాత మరో సారి రెండు ఆసియా జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. 1 తొలిసారి బ్యాటింగ్కు దిగి 170 పైచిలుకు పరుగులు చేశాక దక్షిణాఫ్రికా ఓడిపోవడం ఇదే తొలిసారి ద్వితీయార్ధంలో జోరు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ నాలుగో బంతికే భువనేశ్వర్ తన స్వింగ్తో డికాక్ను పెవిలియన్కు పంపడంతో భారత్కు మంచి ఆరంభం వచ్చింది. కానీ ఆమ్లా ఎదురుదాడికి దిగడంతో మోహిత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. పరుగుల వేగం పెరుగుతున్న సమయంలో ఆరో ఓవర్లో బౌలింగ్కు వచ్చిన అశ్విన్... ఆమ్లాను బౌల్డ్ చేశాడు. పవర్ప్లే ఆరు ఓవర్లలో దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 44 పరుగులు చేసింది. ఆరు నుంచి పదో ఓవర్వరకు డు ప్లెసిస్, డుమిని క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత చెలరేగిపోయారు. 11 నుంచి 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏకంగా 61 పరుగులు చేసింది. అశ్విన్ తన రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. కానీ భారీ హిట్టర్లు ఉన్న దక్షిణాఫ్రికా తగ్గలేదు. చివరి ఐదు ఓవర్లలో 42 పరుగులు చేసింది. తొలి పది ఓవర్లలో 66 పరుగులు వస్తే ఆఖరి 10 ఓవర్లలో 106 పరుగులు వచ్చాయి. మిశ్రా బౌలింగ్ను బాగా చదివిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత లెగ్ స్పిన్నర్ బౌలింగ్లో భారీగా పరుగులు రాబట్టారు. అలవోకగా... ఓ పద్ధతి ప్రకారం... రోహిత్ శర్మ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. స్టెయిన్ బౌలింగ్లో అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అదే ఊపులో హెండ్రిక్స్ బౌలింగ్లో భారీ షాట్కి వెళ్లి అవుటయ్యాడు. మరో ఎండ్లో రహానే సింగిల్స్తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే... పార్నెల్ బౌలింగ్లో కళ్లుచెదిరే సిక్సర్ బాదాడు. మొత్తానికి పవర్ ప్లే ఆరు ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.వేగం పెంచే ప్రయత్నంలో రహానే అవుటయ్యాడు. ఆ లోపు కోహ్లి క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ 2 వికెట్లకు 80 పరుగులు చేసింది. యువరాజ్ కుదురుకోవడానికి సమయం తీసుకుంటే... ఆ సమయంలో కోహ్లి హిట్టింగ్ మొదలుపెట్టాడు. తాహిర్ బౌలింగ్లో సిక్సర్తో కోహ్లి 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లితో 56 పరుగుల భాగస్వామ్యం తర్వాత యువరాజ్ భారీషాట్కు వెళ్లి అవుటయ్యాడు. విజయానికి 4 ఓవర్లలో 40 పరుగులు అవసరమైన దశలో... రైనా వచ్చి సిక్సర్తో ఖాతా తెరిచాడు. రైనా జోరుతో పార్నెల్ వేసిన 17వ ఓవర్లో ఏకంగా 17 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత భారత్ వెనుదిరిగి చూడలేదు. సెమీస్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినందుకు సంతోషంగా ఉంది. మంచి ఫామ్లో ఉన్నా. చివరి వరకూ ఒకరు క్రీజులో ఉంటే మ్యాచ్ గెలవచ్చని తెలుసు. విన్నింగ్ రన్ కొట్టడంలో ఆనందం ఉంటుంది. అందుకే నేను విన్నింగ్న్ ్రకొట్టాలని అనుకుని ధోని సింగిల్ తీయకుండా నాకు అవకాశం ఇచ్చాడు. 173 పెద్ద లక్ష్యం అని తెలుసు. కానీ టెన్షన్ పడలేదు. మానసికంగా బలంగా ఉంటే ఛేజింగ్ చేయడం సులభం. రెండు మంచి భాగస్వామ్యాలు నమోదైతే గెలుస్తామని తెలుసు. అందుకే అందరం కూల్గా ఉన్నాం. బౌలర్ల వల్లే సెమీస్కు వచ్చాం. - విరాట్ కోహ్లి స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 6; ఆమ్లా (బి) అశ్విన్ 22; ప్లెసిస్ (బి) అశ్విన్ 58; డుమిని నాటౌట్ 45; డివిలియర్స్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 10; మిల్లర్ నాటౌట్ 23; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 172 వికెట్ల పతనం: 1-9; 2-44; 3-115; 4-129; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-33-1; మోహిత్ శర్మ 3-0-34-0; అశ్విన్ 4-0-22-3; జడేజా 2-0-8-0; రైనా 4-0-35-0; మిశ్రా 3-0-36-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) డు ప్లెసిస్ (బి) హెండ్రిక్స్ 24; రహానే (సి) డివిలియర్స్ (బి) పార్నెల్ 32; కోహ్లి నాటౌట్ 72; యువరాజ్ (సి) డివి లియర్స్ (బి) తాహిర్ 18; రైనా (సి) డు ప్లెసిస్ (బి) హెండ్రిక్స్ 21; ధోని నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 9; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 176 వికెట్ల పతనం: 1-39; 2-77; 3-133; 4-167. బౌలింగ్: డుమిని 3-0-29-0; మోర్కెల్ 2-0-17-0; స్టెయిన్ 3.1-0-36-0; హెండ్రిక్స్ 4-0-31-2; పార్నెల్ 3-0-33-1; తాహిర్ 4-0-30-1.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు
రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (15-05-2024)
స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
గర్భస్త శిశువుకూ జీవించే హక్కుంది: సుప్రీం సంచలన తీర్పు
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
Buddy First Single: పాటతో రూమర్స్కి చెక్ పెట్టిన అల్లు శిరీష్!
మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు
తప్పక చదవండి
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- అమ్ముడుపోని లక్షలాది ఇళ్లు.. చైనా కీలక ప్రతిపాదన!
- నాన్స్టిక్ పాత్రలు వినియోగిస్తున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ఆంధ్రాలో చిన్న ఆలయానికి జూ.ఎన్టీఆర్ భారీ విరాళం
- ‘ఆ దేవాలయాలు నిర్మించాలంటే 400కుపైగా సీట్లు కావాల్సిందే’
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
- NewsClick Row: ప్రబీర్ తక్షణ రిలీజ్కు సుప్రీం కోర్టు ఆదేశం
Advertisement