breaking news
India cricketers
-
టీం ఇండియా ప్లేయర్లతో కలిసి డిన్నర్ చేసిన ఎన్టీఆర్
-
భయపడితే పనులు కావంటున్న గంభీర్
-
రూ.850 టికెట్ ను రూ.11వేలకు విక్రయిస్తుండగా పట్టివేత
-
ఫైనల్ పంచ్ ఎవరిదబ్బా ..?
-
హైదరాబాద్ చేరుకున్న భారత్ ,ఆస్ట్రేలియా జట్లు
-
ఒకే జట్టులో కోహ్లి-బాబర్, బుమ్రా-అఫ్రిది..?
ప్రస్తుత తరంలో మేటి క్రికెటర్లుగా పరిగణించబడే విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, రోహిత్ శర్మలు ఒకే జట్టులో ఆడితే చూడాలని ఉందా..? అయితే మీ కోరిక నెరవేరే రోజు మరెంతో దూరంలో లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రత్యేక చొరవ తీసుకుని ఈ బ్యాటింగ్ దిగ్గజాలను ఒకే డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆసియా దేశాల క్రికెటర్లు ఓ జట్టులో, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి జరిగే ఆఫ్రో-ఆసియా క్రికెట్ కప్ను పునఃప్రారంభించాలని ఏసీసీ కసరత్తు చేస్తుంది. వివిధ కారణాల చేత 2007లో నిలిచిపోయిన ఈ టోర్నీని తిరిగి నిర్వహించేందుకు ఏసీసీ ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తదితర క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఏసీసీ కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ మీడియాకు వెల్లడించారు. ఈ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ అంగీకరిస్తే మిగతా దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని ప్రభాకరన్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ కనుక ఏసీసీ ప్రతిపాదనకు ఓకే చెబితే రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది లాంటి ప్రపంచస్థాయి క్రికెటర్లను ఒకే జట్టులో చూడవచ్చు. కాగా, ఈ టోర్నీ తొలిసారి 2005లో జరిగింది. నాడు షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్, సనత్ జయసూర్య లాంటి విధ్వంసకర ఆటగాళ్లు కలిసి ఆసియా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, జాక్ కలిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ఆడారు. ఆసియా ఎలెవెన్ తరఫున భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల ఆటగాళ్లు ఆడగా.. ఆఫ్రికా ఎలెవెన్ తరఫున సౌతాఫ్రికా, కెన్యా, జింబాబ్వే దేశాల క్రికెటర్లు ఆడారు. చదవండి: పాకిస్తాన్ మాజీ క్రికెటర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. -
విశాఖ చేరుకున్న భారత్, శ్రీలంక క్రికెటర్లు
-
మన క్రికెటర్లను ఇలా ఎప్పుడైనా చూశారా?
విశాఖపట్నం: న్యూజిలాండ్తో విశాఖపట్నంలో జరుగుతున్న ఐదో వన్డేలో భారత క్రికెటర్లు సరికొత్తగా కనిపించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ధోనీసేన బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు సహా బ్యాటింగ్కు వచ్చిన క్రికెటర్ల జెర్సీలపై ఎప్పుడూ లేనివిధంగా కొత్త పేర్లు కనిపించాయి. సాధారణంగా క్రికెటర్లు ధరించే జెర్సీలపై వారి సొంత పేర్లు ఉంటాయి. విశాఖ మ్యాచ్లో మాత్రం భారత క్రికెటర్లందరి జెర్సీలపైనా మహిళల పేర్లు ఉన్నాయి. ఆటగాళ్ల జెర్సీపై ఉన్న పేరు వారి తల్లి పేరు. తమ జీవితాల్లో అమ్మకు ఉండే ప్రాధాన్యాన్ని చెప్పడానికి క్రికెటర్లు ఇలా చేశారు. భారత క్రికెట్ బోర్డుతో కలసి స్టార్ ఇండియా చేపట్టిన మహిళల సాధికారిత ప్రచార కార్యక్రమంలో భాగంగా టీమిండియా క్రికెటర్లు తమ తల్లి పేరును జెర్సీపై వేయించుకున్నారు. సామాజిక మార్పు కోసం ఓ టీమ్ జర్సీని వాడటం ప్రపంచంలో ఇదే తొలిసారి అని స్టార్ ఇండియా చైర్మన్ ఉదయ్ శంకర్ చెప్పారు. తమ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన బీసీసీఐ, భారత క్రికెటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
మన క్రికెటర్లను ఇలా ఎప్పుడైనా చూశారా?