breaking news
independence day wishes
-
అమెరికా–భారత్ కలిసి ముందుకు సాగుతాయి
వాషింగ్టన్: అమెరికా–భారత్లు ఉమ్మడి దృక్పథంతో ఐక్యంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించుకుంటూ మెరుగైన భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ట్రంప్ ప్రభుత్వం భారత్పై భారీగా టారిఫ్లను విధించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రజలకు అమెరికా తరఫున, వ్యక్తిగతంగా మార్కో రుబియో శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతియుత, సౌభాగ్యవంత, భద్రత కలిగిన ఇండో–పసిఫిక్ లక్ష్యానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
మన ప్రజాస్వామిక దేశానికి బలం ఈ మూడే: వైఎస్ జగన్
దేశమంతా 79వ స్వాతంత్య్ర దినోత్సవ #IndependenceDay వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటోంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చేసుకుంటున్న సందర్భంలో.. సమాన హక్కులు, న్యాయం, ఐక్యతే మన ప్రజాస్వామ్య దేశానికి నిజమైన బలంగా నిలుస్తాయని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ప్రతి భారతీయుడికి గర్వభరిత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు! అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.As we celebrate our hard-earned freedom, let us remember that the strength of a Democratic Nation lies in unity, justice, and equal opportunity for all.Wishing every Indian a proud Independence Day!#IndependenceDay— YS Jagan Mohan Reddy (@ysjagan) August 15, 2025 -
WETA ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
కాలిఫోర్నియాలోని "విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా సంస్థ ప్రెసిడెంట్ ,ఫౌండర్ హనుమండ్ల ఝాన్సీ రెడ్డి మట్లాడుతూ దేశం అన్నింటా అభివృద్ధి చెందుతున్న సమయం లో ఒక వైరస్ అస్థిత్వానికి సవాల్ విసిరింది .కోవిడ్ సెకండ్ వేవ్ లో WETA ఎన్నో గ్రామాలలో సేవాకార్యక్రమాలని చేయగలిగిందని,సహాయం చేసిన దాతలకు ఈ సమయంలో ముందు ఉండి పని చేసిన కోవిడ్ వారియర్స్ కి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి , WETA వాలంటీర్స్ కి కృతజ్ఞత తెలిపారు. కోవిడ్ కష్ట కాలంలో చురుకు గా పని చేసిన కొంత మంది వాలంటీర్స్ ని అవార్డ్స్ తో సత్కరించామని తెలిపారు.స్వాతంత్ర దినోత్సవంలో ఝాన్సీ రెడ్డి పాల్గొని జాతీయ పథకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకలలో పలువురు ఎగ్జిక్యూటివ్ టీం సభ్యులు, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి పాల్గొని ..శుభాకాంక్షలు తెలిపారు. -
గవర్నర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రోద్యమాన్ని స్మరించుకోవడంతో పాటు దేశ అభ్యు న్నతికి పునరంకితం కావాల్సిన రోజన్నారు. ఎన్నో తరాల దేశ భక్తుల నిస్వార్థ పోరాటాలు, త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. దేశభక్తులందరినీ స్మరించుకునే సమయమని గవర్నర్ అన్నారు. నేడు రాజ్భవన్లో రక్షాబంధన్ వేడుకలు రాజ్భవన్లోని దర్బార్ హాలులో గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రక్షాబంధన్ వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొననున్నారు. -
నెటిజన్కు సానియా ఘాటు రిప్లై, వైరల్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. షోయబ్ పెళ్లి చేసుకున్నప్పటి నుంచీ పలు సందర్భాల్లో ఆమె జాతీయతపై ప్రశ్నలు తలెత్తుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల స్వాతంత్య్ర దినోత్సవాల సమయంలో సానియాకు ఎదురయ్యే ప్రశ్నలు అధికం. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తన జాతీయతను ప్రశ్నించిన ఓ నెటిజన్కు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఘాటు రిప్లై ఇచ్చారు. ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘నా పాకిస్థానీ అభిమానులు, మిత్రులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ భారతీయ వదిన నుంచి మీకు బెస్ట్ విషెష్, లవ్’ అని సానియా ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ చూసిన ఓ నెటిజన్ ‘‘మీక్కూడా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే, మీ ఇండిపెండెన్స్ డే కూడా ఈ రోజే’’ అని ట్వీట్ చేశాడు. నెటిజన్ ట్వీట్పై స్పందించిన సానియా.. ‘‘కాదు, నాది.. నా దేశానిది రేపు. ఈ రోజు నా భర్తది, ఆయన దేశానిది. ఇప్పటికైనా స్పష్టత వచ్చిందనుకుంటా. మరి మీదెప్పుడు?.. ’ అని ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయింది. Happy Independence Day to my Pakistani fans and friends !! best wishes and love from your Indian Bhabi 🙏🏽 — Sania Mirza (@MirzaSania) August 14, 2018 Jee nahi.. mera aur mere country ka Independence Day kal hai, aur mere husband aur unnki country ka aaj!! Hope your confusion is cleared !!Waise aapka kab hai?? Since you seem very confused .. https://t.co/JAmyorH0dV — Sania Mirza (@MirzaSania) August 14, 2018 తన స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15నేనని తన జాతీయతను ప్రశ్నించిన ఆ నెటిజన్కు కాస్త ఘాటుగానే సమాధానమిచ్చింది. ట్రోల్స్ను సీరియస్గా తీసుకోవద్దని సానియాకు మరో నెటిజన్ సూచించారు. ఆ నెటిజన్ సూచనకు స్పందించిన సానియా.. ‘నేను నవ్వుతున్నా. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు’ అని చెప్పారు. మరోవైపు తాను, షోయబ్ భారత్, పాకిస్తాన్లను కలుపడానికి పెళ్లి చేసుకున్నామని చాలామంది అపోహపడుతూ ఉంటారని, కానీ అది నిజం కాదని సానియా మీర్జా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రతేడాది తాను పాకిస్తాన్ వెళ్తుంటానని అక్కడి ప్రజలు తను చాలా బాగా ప్రేమిస్తారని కూడా తెలిపారు. సానియా, షోయబ్లు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. సానియా మీర్జాకు ప్రస్తుతం ఎనిమిదో నెల. I am smiling :) it’s gonna take muchhhhhh more than a troll on social media to take over my brain ... thank you for your wishes 🙌🏽 https://t.co/NPBDz3h0UF — Sania Mirza (@MirzaSania) August 14, 2018 -
వైఎస్ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
-
వైఎస్ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు 72వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా.. 1947, ఆగస్టు 15న ఆనాటి ప్రధాని నెహ్రూ తన ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’లో మహాత్మాగాంధీ ఆకాంక్ష గురించి ప్రస్తావించిన మాటలను గుర్తు చేశారు. ‘దేశానికి సేవ చేయడం అంటే.. దేశంలో కోట్ల మందికి సేవ చేయడమే. దీని అర్థం.. పేదరికాన్ని, అజ్ఞానాన్ని, ఆరోగ్యపరంగా పీడిస్తున్న రకరకాల వ్యాధులను, అవకాశాల్లో అసమానతలను రూపుమాపకుండా దేశానికి సేవ చేశామంటే అర్థం లేదు. దేశంలో అశక్తులైన ప్రజలందరి కంటి నుంచి రాలే ప్రతి కన్నీటి బొట్టునూ తుడిచే అన్ని ప్రయత్నాల్నీ మనమంతా ప్రయత్నలోపం లేకుండా చేయాలన్నదే మహాత్ముడి ఆకాంక్ష. ఈ పని చేయడం మన శక్తికి మించినదే కావచ్చు. కానీ అశక్తుల కన్నీరు, వారి కష్టాలూ అలాగే ఉన్నంతకాలం.. మనం చేయాల్సిన పనిని చేయనట్టుగానే భావించాల్సి ఉంటుంది’’. 5 ఏళ్ల 3 నెలల వైఎస్సార్ పాలనకు, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలకు, తమ పార్టీ ఆవిర్భావానికి, పార్టీ వేస్తున్న ప్రతి అడుగుకూ ఆ మాటలే మార్గదర్శకాలని వైఎస్ జగన్ తెలిపారు. -
రెండు రాష్ట్రాల ప్రజలూ సుఖసంతోషాలతో ఉండాలి: వైఎస్ జగన్
* వైఎస్సార్సీపీ అధినేత జగన్ * పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకం ఆవిష్కరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రజలందరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన 68వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రెండు రాష్ట్రాల్లోని ప్రతి అవ్వా, తాతలకు, ప్రతి సోదరి, సోదరులకు ఈ స్వాతంత్య్ర దినోత్సవం సుఖ సంతోషాలనివ్వాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు, ప్రజలతో గంటకుపైగా గడిపి వారందరితో ముచ్చటించారు. షారిఖ్కు అభినందన.. అమెరికాలోని కనెక్టికట్ విశ్వవిద్యాలయంలో గణితశాస్త్రంలో పీహెచ్డీ సీటు సాధించిన కర్నూలుకు చెందిన షారిఖ్ అహ్మద్ను జగన్ ఈ సందర్భంగా అభినందించారు. దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. -
'సాక్షి' స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు