breaking news
Indefinite
-
తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. బుధవారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన అనంతరం అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. ఏడు రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 4 బిల్లులు ఆమోదం పొందాయి. 54 గంటల 47 నిమిషాలు పని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. -
జయప్రకాష్ దీక్ష విరమణ
రాజోలు, న్యూస్లైన్ : జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా వైఎస్సార్ సీపీ రాజో లు నియోజకవర్గ కోఆర్డినేటర్ మత్తి జయప్రకాష్ చేపట్టిన నిరవధిక దీక్షను శనివారం విరమించారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు చింతలపాటి వెంకట్రామరాజు, మట్టా శైలజ, కొండేటి చిట్టిబాబు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు వేగి రాజు సాయిరాజు, సీనియర్ నాయకుడు చిన్నం ప్రవీణ్బాబు తదితరులు జయప్రకాష్కు నిమ్మరసం ఇచ్చి, దీక్ష విరమింపజేశారు. ఏడు రోజులుగా జయప్రకాష్ ఆమరణ దీక్ష చేస్తున్న విషయం విదితమే. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టినప్పటి నుంచి మత్తి జయప్రకాష్ నిరవధిక దీక్ష ప్రారంభించారు. ఇలాఉండగా డాక్టర్ సువర్ణరాజు ఆధ్వర్యంలో జయప్రకాష్కు వైద్య పరీ క్షలు నిర్వహించి, ప్లూయిడ్స్ ఎక్కించారు. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. తొలుత పాస్టర్లు సందిపూడి ఏలియా, బళ్ల నవరత్నం, సిస్టర్ పితాని సత్యవతి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయప్రకాష్ను పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర సభ్యురాలు ఎన్.వసుంధర, నాయకులు మందపాటి కిరణ్కుమార్, అనితా శుభజ్యోతి, బొలిశెట్టి భగవాన్, గుబ్బల నారాయణరావు తదితరులు పరామర్శించారు. -
జగన్కు మద్దతుగా కడపలో దీక్షలు
-
5వ రోజుకు చేరుకున్న విజయమ్మ దీక్ష
-
నిరవధిక సమ్మె’లో ఉపాధ్యాయులు
కర్నూలు(ఓల్డ్సిటీ), న్యూస్లైన్: జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులు నిరవధిక సమ్మె బాట పట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని రద్దు చేసుకునే వరకు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించారు. ఏపీ ఎన్జీవోలకు మద్దతుగా గురువారం నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నందున ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి(జేఏసీ) జిల్లా చైర్మన్, కో-చైర్మన్ హెచ్.తిమ్మన్న, వి.కరుణానిధి మూర్తి కోరారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లోని పొదుపు భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత నెల 30న కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర విభజన ప్రకటించినప్పటి నుంచి 13 సీమాంధ్ర జిల్లాల ఉపాధ్యాయులంతా సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితిగా ఏర్పాటయ్యాయన్నారు. విభజనను నిరసిస్తూ వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నామని, గురువారం నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెలోనూ ఉపాధ్యాయులంతా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 13 జిల్లాల ఉద్యమ కార్యాచరణ పాటిస్తూ అన్ని మండల, తాలూకా, జిల్లా కేంద్రంలో జరిగే ఉద్యమాల్లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపోయిన పని దినాలను రాబోయే రోజుల్లో శని, ఆదివారాలు, దసరా, సంక్రాంతి సెలవుల్లోనూ పనిచేసి సిలబస్ పూర్తి చేస్తామన్నారు. సమావేశంలో పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ (1938), ఏపీటీఎఫ్ (257), ఆపస్, హెచ్ఎంఏ, పీఈటీఏ, ఆర్యూపీపీ, ఏపీటీజీ, ఎస్ఎల్టీఏ, జీటీఏ, ఎస్సీఎస్టీటీఎఫ్, టీఎన్యూఎస్, ఎస్టీఎఫ్, ఆర్జేయూపీ, వైఎస్సార్టీఎఫ్, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంఏ, బీసీటీయూ, ఎల్టీఏ, వీసీటీఎఫ్ సంఘాల నాయకులు విక్టర్ ఇమ్మానియేల్, ఎం.రమేష్, విజయ భాస్కర యాదవ్, మాణిక్యం రాజు, సుబ్బరాయుడు, ముత్తోజు వీరబహ్మం, కమలాకర్రావు, కృష్ణారెడ్డి, రమణయ్య, రాజసాగర్, రఘు, నాగేంద్రుడు, శ్రీనివాసులు, ఆనంద్, సాయిబాబా, దాదాపీర్, ఇస్మాయిల్, తులసిరెడ్డి, యోగీశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. -
మూడోరోజుకు చేరిన విజయమ్మ ఆమరణ దీక్ష