breaking news
Increase Charges
-
ఆరోగ్య బీమా భారం తగ్గేదెలా..?
రమణ్సింగ్ (68)కు ఇటీవలే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి పాలసీ రెన్యువల్ నోటీస్ వచి్చంది. చూస్తే ప్రీమియం గతేడాది కంటే గణనీయంగా పెరిగిపోయింది. ఏకంగా 30 శాతం అధికంగా చెల్లించాల్సి రావడంతో దీన్ని ఎలా అధిగమించాలా? అనే ఆలోచనలో పడ్డాడు. రమణ్సింగ్కు మాత్రమే ఈ అనుభవం పరిమితం కాదు. దాదాపు అన్ని బీమా సంస్థలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను ఇటీవలి కాలంలో పెంచేశాయి. దీంతో సగటు మధ్యతరగతి వాసులపై హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో భారం పెరిగిపోయింది. కరోనా విపత్తు తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు గణనీయంగా పెరగడం పాలసీదారులకు తెలిసిన అనుభవమే. దీనికి క్లెయిమ్లు భారీగా పెరిగిపోవడమే కారణమని బీమా సంస్థలు చెబుతున్నాయి. ఈ పరిణామాలతో వృద్ధులకు హెల్త్ కవరేజీ విషయంలో కొన్ని బీమా సంస్థలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. అధిక ప్రీమియంకు తోడు, పలు షరతులు పెడుతున్నాయి. వృద్ధులకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం భారంగా మారుతున్న తరుణంలో దీన్ని తగ్గించుకునే మార్గాల గురించి చర్చించే కథనమే ఇది. బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తాజా వార్షిక నివేదిక ప్రకారం.. హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 2020–21లో 94 శాతంగా ఉంటే, అది 2021–22 సంవత్సరానికి 109 శాతానికి పెరిగింది. ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియో 100 శాతానికి దిగువన ఉంటేనే బీమా సంస్థలకు లాభం ఉన్నట్టు. 100 అంతకంటే ఎక్కువ ఉన్నట్టయితే, తమకు వస్తున్న ప్రీమియానికి మించి అవి చెల్లింపులు చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ‘‘గడిచిన కొన్ని సంవత్సరాలుగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు పెరిగిపోయాయి. కరోనా తర్వాత అన్ని వయసుల వారి నుంచి క్లెయిమ్లు 10–30 శాతం వరకు ఎక్కువయ్యాయి. దీనివల్ల వృద్ధులపై భారం పెరిగిపోయింది. వీరు అధిక ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. పైగా వృద్ధుల్లో క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే సదుపాయం అందరికీ ఉండదు’’ అని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ తెలిపారు. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ. దీంతో ఈ వయసులోని వారికి సహజంగానే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు ఇటీవలి కాలంలో క్లెయిమ్లు పెరగడంతో బీమా సంస్థలు ప్రీమియంను మరింత పెంచాయి. ‘‘వృద్ధులకు సహజంగా హెల్త్ రిస్క్లు ఎక్కువ. దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా వీరు హెల్త్ కవరేజీ ఎక్కువగా వినియోగించుకుంటూ ఉంటారు. కనుక క్లెయిమ్ల రిస్క్ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బీమా సంస్థలు ప్రీమియంను నిర్ధారిస్తుంటాయి. 30 ఏళ్ల వయసు వారి ప్రీమియంతో పోలిస్తే 60 ఏళ్లకు పైబడిన వారి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం 2.5 రెట్ల నుంచి 4 రెట్ల వరకు అధికంగా ఉంటుంది’’ అని గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ డైరెక్ట్ సేల్స్ హెడ్ వివేక్ చతుర్వేది తెలిపారు. సీనియర్ సిటిజన్లలో కొందరికి బీమా సంస్థలు పాలసీలు ఇచ్చేందుకు నిరాకరిస్తుంటాయి. వారికి ముందస్తుగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో వచి్చన ఫలితాలే దీనికి కారణమని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. కోపేమెంట్.. కోపేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసుకుంటే, ప్రతి క్లెయిమ్లో పాలసీదారు తన వంతు కొంత భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థలు చెల్లిస్తాయి. సాధారణంగా ఈ కోపేమెంట్ అనేది బీమా కవరేజీలో 10 శాతం నుంచి 50 శాతం వరకు ఉంటుంది. 20 శాతం కోపేమెంట్ ఎంపిక చేసుకుంటే, క్లెయిమ్ మొత్తంలో పాలసీదారు 20 శాతం, మిగిలిన 80 శాతం బీమా సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. క్లెయిమ్లో తన వైపు భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థ ప్రీమియంలో తగ్గింపును ఇస్తుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కోపేమెంట్తో ప్రీమియంలో ఆదా అయిన మొత్తం కంటే, క్లెయిమ్ వచి్చనప్పుడు పాలసీదారు తన వంతు వాటాగా చెల్లించే మొత్తమే అధికంగా ఉంటుంది. అయినా సరే భారీ ప్రీమియం చెల్లించడం కష్టమనుకునే వారు కోపేమెంట్ ఆప్షన్ను పరిశీలించొచ్చు. దీనివల్ల పాలసీ ప్రీమియంలో 30–40 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ‘‘వృద్ధులకు అదనపు వైద్య సంరక్షణ అవసరం ఉంటుంది. కనుక వారు ఆసుపత్రిలో చేరితే ఎక్కువ రోజుల పాటు ఉండాల్సి రావచ్చు. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ను ఎంపిక చేసుకునే వారు ఇన్ పేషెంట్ (ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందే వారు)లో గరిష్ట కవరేజీని ఆఫర్ చేసే ప్లాన్ను పరిశీలించాలి. వ్యాధుల వారీగా ఎవైనా మినహాయింపులు, ఉప పరిమితులు, కోపేమెంట్ ఉన్నాయేమో పరిశీలించాలి’’ అని తపన్ సింఘాల్ సూచించారు. డిడక్టబుల్.. పాలసీదారులు ప్రీమియం తగ్గించుకునేందుకు ఉన్న మార్గాల్లో మరొకటి డిడక్టబుల్ క్లాజ్. ఇది కూడా కోపేమెంట్ మాదిరే పనిచేస్తుంది. ఉదాహరణకు రూ.50,000 డిడక్టబుల్ అనే క్లాజ్ ఉందనుకుంటే.. రూ.50,000 మించిన క్లెయిమ్లకే బీమా సంస్థలు చెల్లింపులు చేస్తాయి. కోపేమెంట్ అలా కాదు. 10 శాతం కోపే ఉంటే రూ.50,000 క్లెయిమ్లో పాలసీహోల్డర్ రూ.5,000 చెల్లించాల్సి వస్తుంది. బీమా సంస్థ రూ.45,000 చెల్లిస్తుంది. కోపేమెంట్ అనేది ప్రతి క్లెయిమ్కు వర్తిస్తుంది. అదే డిడక్టబుల్ అనేది ఏడాది మొత్తానికి (కొన్ని బీమా సంస్థల్లో) స్థిరంగా ఉంటుంది. డిడక్టబుల్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే, ప్రీమియం అంత మేర తగ్గుతుంది. క్లెయిమ్లలో ఆ మేర భారం పాలసీదారులపై పడుతుంది. మరొక ఉదాహరణలో.. ఆస్పత్రిలో చేరి సర్జరీ చేయించుకుంటే రూ.2,00,000 బిల్లు వచి్చంది. డిడక్టబుల్ రూ.20,000 ఉంటే, అప్పుడు పాలసీదారు ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఆ తర్వాత మిగిలిన రూ.1,80,000 కోసం బీమా సంస్థ వద్ద క్లెయిమ్ చేసుకోవచ్చు. డిడక్టబుల్లో ఇప్పటి వరకు చెప్పుకున్నది స్వచ్చందమైనది. రూమ్ రెంట్ ఆస్పత్రిలో చేరిప్పుడు పొందే రూమ్ వసతి కూడా ప్రీమియంను నిర్ణయిస్తుంది. ఎలాంటి పరిమితులు లేని ప్లాన్తో పోలిస్తే సింగిల్ రూమ్, షేరింగ్ రూమ్ ఆప్షన్తో కూడిన పాలసీల ప్రీమియం తక్కువగా ఉంటుంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అన్ని రకాల వసతులు ఉంటాయి. అన్నింటిలోకి షేరింగ్ తక్కువగా ఉంటుంది. కనుక షేరింగ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవడం ద్వారా ప్రీమియం తగ్గేలా చూసుకోవచ్చు. ఒకవేళ షేరింగ్ ఎంపిక చేసుకుంటే.. ఆస్పత్రిలో చేరినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ షేరింగ్ వసతికే పరిమితం కావడం మంచిది. ఖరీదైన వసతి తీసుకుంటే ఆస్పత్రి బిల్లులో కొంత పాలసీదారు చెల్లించాల్సి వస్తుంది. ఇది కేవలం రూమ్ రెంట్ వరకే పరిమితం కాదు. ఎందుకంటే ఖరీదైన వసతిలో ఉండి పొందే వైద్యం సాధారణ షేరింగ్ రూమ్లో పొందే వైద్యంతో పోలిస్తే అధిక వ్యయాలతో ఉంటుంది. కనుక పాలసీ క్లాజ్లో ఉన్న వసతికి మించి ఖరీదైన వసతిలో ఉంటే బిల్లులో కొంత మొత్తాన్ని పాలసీదారు చెల్లించాలి. ఫిట్గా ఉంటే ప్రయోజనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం ద్వారా ప్రీమియంలో తగ్గింపు పొందే అవకాశం ఉంది. రోజువారీ వ్యాయామం చేసే పాలసీహోల్డర్లకు బీమా సంస్థలు రివార్డు పాయింట్లు కేటాయిస్తున్నాయి. ఒక ఏడాది మొత్తం మీద ఇలా పొందిన రివార్డు పాయింట్లను, మరుసటి ఏడాది రెన్యువల్ ప్రీమియంలో తగ్గింపునకు వినియోగించుకోవచ్చు. ఉదాహరణకు రోజువారీ 10,000 అడుగులు నడవడం. లేదంటే రోజులో కనీసం 4,000 అడుగులు నడవడం వంటివి. లేదా జాగింగ్ చేయడం ద్వారా హెల్త్ రివార్డులు సంపాదించుకోవచ్చు. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ రివార్డులతో ప్రీమియంలో నూరు శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. పోర్టింగ్ మొబైల్ నంబర్ పోర్టబులిటీ మాదిరే, హెల్త్ ఇన్సూరెన్స్ను కూడా ఒక బీమా సంస్థ నుంచి మరో బీమా సంస్థకు పోర్టింగ్ పెట్టుకోవచ్చు. బీమా సంస్థ సేవలు నచ్చకపోయినా, ప్రీమియం భారం అనిపించినా.. కారణం ఏదైనా పోర్టింగ్ సదుపాయం ఉంది. పోర్టింగ్ వల్ల పూర్వపు బీమా సంస్థలో పొందిన ప్రయోజనాలు క్యారీ ఫార్వార్డ్ (బదిలీ) అవుతాయి. పోర్టింగ్ వల్ల నో క్లెయిమ్ బోనస్ ఒక్కటి నష్టపోవాల్సి రావచ్చు. పాత సంస్థలో ముందు నుంచి ఉన్న వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ పూర్తి చేసి ఉంటే, కొత్త సంస్థలో మొదటి రోజు నుంచే కవరేజీ పొందొచ్చు. పాలసీ రెన్యువల్ గడువుకు 60 రోజుల నుంచి 45 రోజుల్లోపు కొత్త సంస్థ వద్ద పోర్టింగ్ అభ్యర్థన దాఖలు చేసుకోవాలి. ప్రస్తుత పాలసీలోని కవరేజీ ఫీచర్లతో పోలిస్తే, మెరుగైన సదుపాయాలతో తక్కువ ప్రీమియంతో ఆఫర్ చేస్తున్న సంస్థకు మారిపోవడం వల్ల కొంత ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంది. సూపర్ టాపప్ వృద్ధాప్యంలో నామమాత్రపు కవరేజీ చాలకపోవచ్చు. మెరుగైన కవరేజీతోనే తగినంత రక్షణ లభిస్తుంది. కానీ, మెరుగైన కవరేజీ కోసం ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ ఇండెమ్నిటీ ప్లాన్ను పరిమిత కవరేజీతో తీసుకోవాలి. దీనివల్ల ప్రీమియం తగ్గించుకోవచ్చు. దీనికి అదనపు కవరేజీతో సూపర్ టాపప్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒకే పాలసీని అధిక కవరేజీతో తీసుకోవడంతో పోలిస్తే ప్రీమియం చాలా వరకు తగ్గుతుంది. ఉదాహరణకు రూ.5 లక్షలకు బేసిక్ ప్లాన్ తీసుకుని, దీనికి రూ.20 లక్షల సూపర్ టాపప్ చేసుకున్నారని అనుకుందాం. క్లెయిమ్ రూ.5 లక్షలు దాటినప్పుడు, అదనపు మొత్తానికి సూపర్ టాపప్ ఇచి్చన బీమా సంస్థ నుంచి చెల్లింపులు వస్తాయి. రెగ్యులర్ ప్లాన్తో పోలిస్తే ఇలా చేయడం వల్ల ప్రీమియంను 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ టాపప్ ప్లాన్లు కూడా ఉన్నాయి. కానీ టాపప్, సూపర్ టాపప్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. టాపప్ ప్లాన్లో ఒక పాలసీ సంవత్సరంలో ప్రతి క్లెయిమ్కు విడిగా నిర్ణీత మొత్తం దాటినప్పుడే చెల్లింపులు లభిస్తాయి. సూపర్ టాపప్ ప్లాన్లో అలా కాదు. ఏడాది మొత్తం మీద నిర్ధేశిత డిడక్టబుల్ ఒక్కటిగానే ఉంటుంది. అంటే బేస్ ప్లాన్ రూ.5 లక్షలు తీసుకున్నారు. దీనికి టాపప్ జోడించుకుంటే, ప్రతి క్లెయిమ్లోనూ రూ.5 లక్షలు మించినప్పుడే, రూ.5 లక్షలు మినహాయించి (డిడక్టబుల్) మిగిలినది టాపప్ నుంచి చెల్లింపులు వస్తాయి. అదే సూపర్ టాపప్లో.. ఒక ఏడాదిలో మూడు పర్యాయాలు ఆస్పత్రిలో చేరి (రూ.3లక్షలు, రూ.3 లక్షలు, రూ.4 లక్షలు) రూ.10 లక్షలు బిల్లు వచి్చ నా, రూ.5 లక్షలు డిడక్టబుల్ పోను, మిగిలిన రూ.5 లక్షలను క్లెయిమ్ చేసుకోవచ్చు. బేస్ ప్లాన్ పరిమిత కవరేజీతో తీసుకుని, సూపర్ టాపప్ జోడించుకోలేని వారు.. చిన్న వాటికి క్లెయిమ్ చేసుకోకుండా ఉంటే మంచిది. దీనివల్ల నో క్లెయిమ్ బోనస్ రూపంలో బీమా కవరేజీని ఎలాంటి అదనపు ప్రీమియం లేకుండా నూరు శాతం వరకు పెంచుకోవచ్చు. వీటిని అనుసరించొచ్చు.. హెల్త్ ఇన్సూరెన్స్ను చిన్న వయసులోనే తీసుకోవాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఆ వయసులో ఉండవు. దీంతో ప్రీమియం తక్కువగా ఉంటుంది. నేరుగా 60 ఏళ్ల తర్వాత పాలసీ తీసుకునే వారితో పోలిస్తే, ముందు నుంచే హెల్త్ కవరేజీలో ఉన్న వారికి ప్రీమియం కొంత తక్కువ ఉంటుంది. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువ మందిలో కనిపిస్తుంటాయి. వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని అధిక ప్రీమియాన్ని కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. ► హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ను ఆన్లైన్ ద్వారా నేరుగా బీమా సంస్థ పోర్టల్ నుంచి కొనుగోలు చేస్తే ప్రీమియం 5–10% తక్కువగా ఉంటుంది. కమీషన్లు, ఇతర వ్యయాల భారం తగ్గుతుంది కనుక బీమా సంస్థలు డిస్కౌంట్ ఇస్తాయి. పైగా ఆన్లైన్లో అన్ని బీమా సంస్థల ప్లాన్ల ఫీచర్లు, ప్రీమియంను పోల్చి చూసుకునే వెసులుబాటు పాలసీబజార్ వంటి వేదికలు కలి్పస్తున్నాయి. ఈ విధంగానూ ప్రీమియం భారం తగ్గవచ్చు. ► విడిగా ప్లాన్ తీసుకోవడానికి బదులు కుటుంబం అంతటికీ ఒక్కటే ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే ప్రీమియం తగ్గుతుంది. ► అవసరం లేని కవరేజీలకు దూరంగా ఉండాలి. అవసరం లేని యాడాన్లను జోడించుకుంటే ప్రీమియం భారం పెరుగుతుంది. ► రూ.5 లక్షల బేసిక్ కవరేజీతో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ జోడించుకుంటే ప్రీమియం ఆదా అవుతుంది. ► తమ పిల్లలు కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తుంటే, వారి కార్యాలయం తరఫున తల్లిదండ్రులు కవరేజీ కల్పించుకోవడం ఒక మార్గం. గ్రూప్ ప్లాన్ కావడంతో ప్రీమియం తగ్గుతుంది. ► ఇక ప్రీమియంలో ఆదా కోరుకునే వారు ఒక ఏడాదికి కాకుండా మూడేళ్లకు ఒకేసారి ప్రీమియం చెల్లించడాన్ని పరిశీలించొచ్చు. దీనివల్ల ప్రీమియంలో 10 శాతం వరకు ఆదా అవుతుంది. -
చార్జీలు పెంచకుంటే బస్సు గట్టెక్కదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆర్థిక సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం వంటి చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గట్టెక్కే పరిస్థి తి లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు అధికారులు నివేదించారు. సీఎం గురువారం ప్రగతిభవన్లో ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఆర్థిక పరిస్థితిని వివరించడంతో పాటు ప్రభుత్వ సాయం, చార్జీల పెంపు సంబంధిత ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. పెను భారం భరించే స్థితిలో ఆర్టీసీ లేదు ‘చివరిసారిగా ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర రూ.67 ఉండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్కు రూ.15 పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ఆర్థిక భారం మోపింది. మరోవైపు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్తో సంస్థ అపార నష్టాలను చవిచూసింది. వీటితో పాటు ఇప్పటికే పేరుకుపోయిన రుణ బకాయిలతో సంస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లోనే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచా ల్సి ఉంది. ఒకవేళ జీతాలు పెంచితే సంస్థపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీ సీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. అలాగే బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ కోలుకునే పరిస్థితి ఉండదు..’అని అధికారులు వివరించారు. చదవండి: (ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్..!) గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగే.. ‘వాస్తవానికి గతంతో పోలిస్తే ఆర్టీసీ పరిస్థితి ఎంతో మెరుగైంది. ప్రభుత్వం అందించిన ఇతోధిక సహాయం, ఆర్టీసీలో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్కు బస్సులు తిప్పడం మంచి ఫలితాన్నిచ్చింది. 58 శాతానికి చేరుకున్న ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతోంది. రోజుకు రూ.9 కోట్ల ఆదాయం వస్తోంది. భవిష్యత్తులో మరింత పుంజుకునే అవకాశం ఉన్నా.. డీజిల్ రేట్లు పెరుగుతుండడం నష్టదాయకంగా మారుతోంది..’అని వివరించారు. ‘కార్గో’తో మంచి ఆదాయం: సీఎం ఆర్టీసీ కార్గో సర్వీసులు విజయవంతం అయ్యాయని, ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. కార్గో సేవల ద్వారా ఇప్పటికి 17.72 లక్షల పార్సిళ్లను గమ్యానికి చేరవేశారని, దీనివల్ల ఆర్టీసీకి రూ.22.61 కోట్ల ఆదా యం వచ్చిందని చెప్పారు. ప్రజలు కూడా కార్గో సేవలపై సంతృప్తితో ఉన్నారంటూ.. ఆర్టీసీ కార్గో సేవల స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్ను సీఎం ప్రశంసించారు. ఆర్టీసీ కార్గో ద్వారా పంపిన పార్సిళ్లు సకాలంలో, సురక్షితంగా గమ్యం చేరుకుంటాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. అటు మారుమూల ప్రాంతాలకు, ఇటు నగరంలోని ఇంటింటికీ డోర్ డెలివరీ చేయడం అభినందనీయమన్నారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ షాక్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు చార్జీలు మరోసారి మోత మోగనున్నాయి. 2019 డిసెంబరులో కిలోమీటరుకు 20 పైసలు చొప్పున పెంచిన ఆర్టీసీ.. ఏడాది తర్వాత మళ్లీ పెంపునకు సిద్ధమైంది. ఈసారి కి.మీ.కు 10 పైసల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ధరలపై ముఖ్యమంత్రికి నివేదించి చర్చించాకే అమలులోకి తేనున్నట్లు సమాచారం. ఈ మేరకు గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగిన సమావేశంలో ఆర్టీసీ చార్జీల పెంపు అంశం చర్చకు వచ్చింది. డీజిల్ ధరలు విపరీతంగా పెరగడం, లాక్డౌన్ కారణంగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారడంతో చార్జీల పెంపు తప్పదనే కోణంలో చర్చించారు. మరోవైపు ఆర్టీసీ సిబ్బందికీ జీతాలు పెంచనున్నట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్టీసీ వ్యయంలో 52 శాతం జీతభత్యాల పద్దే ఆక్రమించింది. జీతాల భారం 50 శాతం దాటితే ఏ సంస్థ మనుగడ అయినా కష్టమనేది ఆర్థిక నిపుణుల మాట. అలాంటిది ఇప్పటికే సగానికి మించడం, మళ్లీ పెరగనుండడంతో తదనుగుణంగా ఆర్టీసీ ఆదాయాన్నీ పెంచుకోక తప్పదు. ప్రత్యామ్నాయ ఆదాయం ఇప్పటికిప్పుడు అసాధ్యం. కాబట్టి చార్జీల పెంపు తప్ప మరో మార్గం కనిపించటం లేదని తేల్చారు. లేదంటే బడ్జెట్ రూపంలో ఆర్టీసీకి ప్రభుత్వం కనీసం మరో రూ.వెయ్యి కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఆర్టీసీ సిబ్బంది జీతాలకు ప్రస్తుతం ప్రభుత్వమే నిధులు ఇస్తున్నందున, ఇంకా పెంపు కష్టమని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక మిగిలింది చార్జీల పెంపు మాత్రమే కావటంతో ఆ కోణంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రజల్లో వ్యతిరేకత? ఏడాది కింద చార్జీల పెంపుతో జనంపై రూ.750 కోట్ల వార్షిక భారంపడింది. ఆర్డినరీలో కనీస చార్జి రూ.10, ఎక్స్ప్రెస్లో రూ.15 చేయడంతో సామాన్యులకు బస్సు ప్రయాణం భారమైందనే అభిప్రాయం ఉంది. చార్జీలు పెంచాక కేవలం మూడు నెలలు మాత్రమే పూర్తిస్థాయిలో బస్సులు నడిచాయి. మార్చి నుంచి లాక్డౌన్ మొదలవడంతో డిపోలకే పరిమితమయ్యాయి. మళ్లీ మే నుంచి దశల వారీ ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తిస్థాయిలో తిరగడం లేదు. మరో వైపు కోవిడ్ వల్ల ప్రజల ఆర్థిక పరి స్థితీ దిగజారింది. ఈ సమయంలో చార్జీలు పెంచితే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. సిటీ సర్వీసులు 75 శాతానికి.. కోవిడ్ నేపథ్యంలో ఇప్పటికీ హైదరాబాద్లో సిటీ బస్సులు పూర్తిస్థాయిలో తిరగటం లేదు. తొలుత 25 శాతం, అనంతరం 50 శాతానికి అనుమతించారు. ఫిబ్రవరి 1నుంచి జిల్లా సర్వీసులు పూర్తిస్థాయిలో తిరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిటీలో సర్వీసులను 75 శాతానికి పెంచుకునేందుకు గురువారం సమావేశంలో సీఎం అనుమతించారు. -
రేపటి నుంచి టోల్ వడ్డన
సాక్షి, చెన్నై: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని టోల్గేట్లలో చార్జీల వడ్డనకు చర్యలు చేపట్టారు. అయితే, వాహనదారులు, లారీ యజమానులు ఈ వడ్డనను వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని జాతీయ రహదారుల్లో 48 చోట్ల టోల్ప్లాజాలు ఉన్నాయి. ఆయా టోల్గేట్లు వాహనాలు దాటాలంటే, రుసుం చెల్లించాల్సిందే. ఈ టోల్గేట్లలో ఆరు నెలలకు ఓ సారి చార్జీల పెంపు ప్రక్రియ మొదటి నుంచి అమల్లో ఉంది. ఆ దిశగా ఆరు నెలల క్రితం 20 టోల్గేట్లలో ఐదు నుంచి పది శాతం మేరకు టోల్ వడ్డన సాగింది. దీనిని వాహన యజమాన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించే పనిలో పడ్డాయి. ఈ సమయంలో కరోనా లాక్డౌన్ అమలు కావడంతో రవాణా ఆగింది. ఆ తర్వాత సరకు రవాణా సాగడంతో టోల్ వసూళ్లను రద్దు చేశారు. క్రమంగా ఆంక్షల సడలింపులు, వాహనాలు రోడ్డెక్కడంతో మళ్లీ టోల్ వసూళ్లు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో మిగిలిన 28 టోల్గేట్లలో ఐదు నుంచి పది శాతం మేరకు టోల్ పెంపునకు చర్యలు తీసుకున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందన్న ప్రకటన ఆదివారం వెలువడింది. ఆ మేరకు ఒక్కో టోల్ గేట్లో వాహనదారులు ఇదివరకు చెల్లిస్తున్న మొత్తం కంటే అదనంగా రూ.5 నుంచి రూ.15 వరకు చెల్లించాల్సిన పరిస్థితి. అసలే కరోనా లాక్డౌన్ పుణ్యమా ఆర్థిక ఇబ్బందులు, కష్టాల్లో ఉన్న వాహనదారులకు ఈ టోల్ వడ్డన కొత్త భారంగా మారింది. లారీ, ట్రాన్స్పోర్టు యజమానుల సంఘాలు వడ్డనను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ సమయంలో పెంపు సబబు కాదని, ఆరు నెలల పాటు టోల్ పెంపు వద్దని ఆ సంఘం నేత కుమారస్వామి డిమాండ్ చేశారు. -
‘కేటగిరీ’ మార్పులతో చార్జీలు పెరగవు
డిస్కంలకు అదనపు ఆదాయం రాదు: టీఎస్ఎస్పీడీసీఎల్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కనెక్షన్ల కేటగిరీ నిర్వచనంలో ప్రతిపాదించిన మార్పులతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఎలాంటి అదనపు ఆదాయం రాదని, చార్జీలు కూడా పెరగవని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ చార్జీల పెంపు లేకుండానే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి టారీఫ్ ప్రతిపాదనలను ప్రతి పాదించామని పేర్కొంది. విద్యుత్ కనెక్షన్ల కేటగిరీల్లో డిస్కంలు ప్రతిపాదించిన మార్పులపై సోమవారం ‘సాక్షి’లో ‘లేదు లేదంటూనే బాదుడు’శీర్షికతో ప్రచురితమైన కథనంపై సంస్థ యాజమాన్యం స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చింది. కనెక్షన్ల కేటగిరీల్లో మరింత స్పష్టత ఇచ్చేందుకు, న్యాయపరమైన చిక్కులను అధిగమించేందు కే కేటగిరీ నిర్వచనంలో మార్పులు ప్రతిపాదించినట్లు తెలిపింది. ఎల్టీ–2 కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు, హెచ్టీ–2(ఇతర) కేటగిరీల నిర్వచనం పరిధిలోకి కొత్తగా అన్ని రకాల సర్వీసింగ్ స్టేషన్లు, రిపేరింగ్ సెంటర్లు, బస్ డిపోలు, లాండ్రీలు, డ్రై క్లీనింగ్ యూని ట్లు, గ్యాస్/ఆయిల్ స్టోరేజీ/ట్రాన్స్ఫర్ స్టేష న్లు, గోదాములు/స్టోరేజీ యూనిట్లను చేర్చాలని ప్రతిపాదించామని, వాస్తవానికి ఈ రకా ల కనెక్షన్లకు ఇప్పటికే కమర్షియల్, హెచ్టీ–2 (ఇతర) కేటగిరీల కిందే చార్జీలు విధిస్తున్నామ ని వెల్లడించింది. ఐటీ పరిశ్రమల పరిధిలోని ఐటీయేతర వ్యాపారాలనూ ఇప్పటివరకు ఐటీ యూనిట్ల కిందే పరిగణించి అనుమతులిచ్చేవారని పేర్కొంది. ఇప్పుడు ఐటీయేతర కార్యకలాపాలను మినహాయించాకే ఐటీ పరిశ్రమలకు అనుమతులిస్తున్నారని తెలి పింది. ఇప్పటివరకు ఎల్టీ, హెచ్టీ పరిశ్రమల కేటగిరీల పరిధిలో ఉన్న ఐటీ సంస్థల సముదాయంలోని కేఫ్టేరియా, హోటళ్లు, ఏటీఎంలు, బ్యాంకులు, ఆడిటోరియంలు, ఇతర సదుపాయాలను ఎల్టీ–2 కమర్షియల్, హెచ్టీ–3(ఇతర) కేటగిరీల నిర్వచనం పరిధిలోకి చేర్చాలని ప్రతిపాదించామని తెలిపింది.