breaking news
inaction
-
Kolkata: బాలుర హాస్టల్లో విద్యార్థినిపై అకృత్యం.. ఒకరి అరెస్ట్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోగల ఒక న్యాయ కళాశాలలో యువతిపై జరిగిన అత్యాచారాన్ని మరచిపోకముందే, ఇక్కడి ఐఐఎం కళాశాలలో ఇటువంటి ఉదంతం చోటుచేసుకుంది. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్-కలకత్తాలో చదువుకుంటున్న ఒక విద్యార్ధినిపై బిజినెస్ స్కూల్ హాస్టల్లో ఒక విద్యార్థి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసిందని వారు పేర్కొన్నారు. బాధితురాలు పోలీసులకు అందించిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఆమెను కౌన్సెలింగ్ కోసం బాలుర హాస్టల్కు పిలిచారు. ఆ తర్వాత ఆమెచేత ఏదో పానీయం తాగించాక, ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తనపై అత్యాచారం జరిగిందని ఆ యువతి గ్రహించిందని పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని నిందితుడు తనను బెదిరించాడని కూడా ఆమె ఆరోపించిందని పోలీసులు చెప్పారు. కేసు నమోదుచేసిన కొద్ది గంటలకే నిందితుడిని అరెస్ట్ చేశామని, కేసు దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు. -
ప్రతి పథకంలో దోపిడీ
-
సమ్మెకు సై అంటున్న బ్యాంకులు
చెన్నై: కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా త్వరలోనే బ్యాంకులు సమ్మెకు దిగనున్నాయి. దాదాపు 10 లక్షల బ్యాంకులు జులై 29నుంచి సమ్మె చేపట్టనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంకర్స్ అసోసియేషన్ నేత ఒకరు తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో జరిగిన యునైడెట్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఎఎన్ఎస్ కు తెలిపారు. బ్యాకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్ల (AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, INBOC, NOBW, NOBO) ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టనున్నట్టు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఎఐబీఈఎ) గురువారం ఒక ప్రకటలో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ప్రభుత్వ రంగ బ్యాంకులను బలహీనపర్చేవిగా ఉన్నాయని ఎఐబీఈఎ ప్రధాన కార్యదర్శి వెంకటాచలం ఆరోపించారు. ఐడిబిఐ బ్యాంక్ ప్రైవేటీకరణ, కొత్త బ్యాంకు లైసెన్సుల జారీ, క్యాపిటల్ ఇన్ఫూజన్, ఏకీకరణ, విలీనం, గ్రామీణ బ్యాంకుల్లో ప్రయివేటు మూలధనం అనుమతి పెంపు తదితర చర్యల వల్ల బ్యాంకులు నిర్వీర్యమయ్యే ప్రమాదముందని వెంకటాచలం హెచ్చరించారు. ఇప్పటికే బ్యాంకింగ్ సెక్టార్ లో చెడు రుణాల మొత్తం రూ.10 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. పెద్ద మొత్తంలో రుణాలను ఎగవేస్తున్న కార్పొరేట్ సంస్థలపై చర్యలు తీసుకోకవడమే దీనికి కారణమన్నారు. బ్యాంకు ప్రయోజనాలకు భిన్నంగా కార్పొరేట్ సంస్థలకు రుణాల మంజూరు, మాఫీ జరుగుతోందన్నారు. బ్యాంకులకు అప్పులను ఎగవేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 7,000 మందికిపైగా డిఫాల్టర్ల తో 60,000కోట్ల రుణ భారం బ్యాంకింగ్ రంగంపై పడిందని వెంకటాచలం తెలిపారు.