breaking news
implimentation demand
-
‘ఈడబ్ల్యూఎస్ తక్షణమే అమలు చేయాలి’
అంబర్పేట: అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ల (ఈడబ్ల్యూఎస్)ను తెలుగు రాష్ట్రాల్లో తక్షణమే అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఈడబ్ల్యూఎస్ తెలుగు రాష్ట్రాల సాధన సమితి ఆధ్వర్యంలో ఓసీ ప్రజలసాధన సదస్సు నిర్వహించారు. కరుణాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఏడాది పూర్తవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయకపోవడం దారుణమన్నారు. బిల్లు అమలు చేయకపోవడంతో అగ్రవర్ణాల పేదలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ అమలు చేయకపోతే రెడ్డి, కమ్మ, వెలమ, క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణ కులాల ప్రతినిధులతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అవసరమైతే ఉద్యమిస్తామన్నారు. కార్యక్రమంలో పలు అగ్రకుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కూలీల పొట్టకొడితే సహించేది లేదు
ఉచిత ఇసుకను సక్రమంగా అందించండి l ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అంకంపాలెం (ఆత్రేయపురం): ప్రభుత్వం ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తున్నామంటూ ర్యాంపులు తెరిచి చేతులు దులుపుకోవడం వల్ల కొన్నిచోట్ల అక్రమాలు జరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి ఆత్రేయపురం మండలం అంకంపాలెం ఇసుక ర్యాంపును ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఉచిత ఇసుకను పేద ప్రజల ఇళ్ల నిర్మాణానికి సక్రమంగా అందించాలని , అలాఅని కూలీల పొట్ట కొడితే సహించేదిలేదన్నారు.పేద ప్రజలకు ఇసుక అందించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి నిరంతరంగా పర్యవేక్షించాల్సిందిగా స్దానిక తహశీల్దార్ వరదా సుబ్బారావు, ఎంపీడీవో జేఏ ఝూన్సీ, పోలీస్ సిబ్బందిని అదేశించారు. కూలీలతో మాట్లాడిన ఆయన ర్యాంపులో ఏవిధమైన ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకుని వస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ ముత్యాల వీరభద్రరావు, మాజీ సర్పంచి గారపాటి అబ్బులు చౌదరి, వైఎస్సార్సీపీ నేతలు కరుటూరి పట్టాబి, కరుటూరి కృష్ణ , ఆర్.ఐ. హుసేన్, వీఆర్వో హిమబిందు తదితరులు పాల్గొన్నారు.