యథేచ్ఛగా అక్రమ రీఫిల్లింగ్ దందా
బ్లాక్ మార్కెట్లో డొమెస్టిక్ సిలిండర్లు
వందకు పైగా అక్రమ కేంద్రాలు!
పట్టని పౌరసరఫరాల శాఖ
దృష్టి సారించిన ఎస్వోటీ పోలీసులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) అక్రమ రీఫిల్లింగ్ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్వోటీ) పోలీసులు అక్రమ రీఫిల్లింగ్ వ్యవహారాలను బహిర్గతం చేసినప్పటికీ సంబంధిత పౌర సరఫరాల శాఖకు కనువిప్పు కలగడం లేదు. గ్రేటర్ పరిధిలో ఐఏఎస్ హోదాగల ఒక చీఫ్ రేషనింగ్ అధికారి (సీఆర్వో), ఇద్దరు జిల్లా స్థాయి పౌరసరఫరాల అధికారులు, పన్నెండు మంది సహాయ పౌరసరఫరాల అధికారులుతో పాటు ప్రత్యేక విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ సబ్సిడీ వంటగ్యాస్ పక్కదారి పట్టి అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది.
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అండదండలతో..
సబ్సిడీ వంట గ్యాస్ కంటే నాన్ సబ్సిడీ, కమర్షియల్ గ్యాస్ ధర రెండింతల నుంచి మూడింతలు అధికంగా ఉండటం అక్రమ వ్యాపారానికి కలిసి వస్తోంది. కొందరు వ్యాపారులు ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల అండదండలతో అక్రమ రీఫిల్లింగ్కు తెరలేపి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్లకు ఆధార్ అనుసంధానం లేకపోవడంతో పాటు ఎడాదికి 12 సబ్సిడీ సిలిండర్ల సరఫరా వెసులుబాటుతో గృహ వినియోగదారులకు పెద్దగా ఆందోళన లేకుండా పోయింది.
దీంతో డీలర్లు వ్యాపారులతో కుమ్మక్కై సబ్సిడీ సిలిండర్లను యథేచ్చగా పక్కదారి పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా డొమెస్టిక్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగించడమే కాకుండా.. కమర్షియల్ సిలిండర్లలో సైతం గ్యాస్ను రీఫిల్లింగ్ చేయడం పరిపాటిగా మారింది. మరోవైపు వాహనాల్లో, ఐదు కిలోల ప్రయివేటు సిలిండర్లలో సైతం అక్రమ రీఫిల్లింగ్ విస్తృతంగా సాగుతోంది. ఫలితంగా అక్రమ ‘రీఫిల్లింగ్’ వ్యాపారం వుూడు పువ్వులు ఆరు కాయులుగా విరాజిల్లుతోంది.
గ్యాస్ పరికరాల దుకాణాల ముసుగులో..
మహానగరానికి ఉద్యోగం, చదువుల రీత్యా వలస వచ్చే బ్యాచిలర్స్, విద్యార్థులు అధికంగా ఐదు కిలోల చిన్న సిలిండర్లు వూత్రమే వినియోగిస్తారు. వీరికి అధికారికంగా గ్యాస్ కనె క్షన్లు లేని కారణంగా బ్లాక్లోనే గ్యాస్ను రీఫిల్లింగ్ చేయక తప్పని పరిస్థితి. దీనిని అదనుగా తీసుకున్న కొందరు వ్యాపారులు గ్యాస్ పరికరాల దుకాణాల వుుసుగులో రీఫిల్లింగ్ కేంద్రాలను ఏర్పా టు చేసి అక్రమ దందా కొనసాగిస్తున్నారు. రీఫిల్లింగ్ సందర్భంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్న సంఘటనలు కూడా లేకపోలేదు.గతంలో కంచన్బాగ్లోని ఒక రీఫిల్లింగ్ కేంద్రంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ నుం చి చిన్న సిలిండర్లో అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తుం డగాప్రమాదం చోటుచేసుకుంది. అయి నా వీరి తీరు మారలేదు. అధికారుల నిఘా పెరగలేదు.
రీఫిల్లింగ్ వ్యాపారం జోరు.
మహానగరంలో ఎల్పీజీ రీఫిల్లింగ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు వందకు పైగానే అక్రమ రీఫిల్లింగ్ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. వంటగ్యాస్ డిమాండ్ను ఆసరా చేసుకున్న వ్యాపారులు డొమెస్టిక్ గ్యాస్ కిలో గ్యాస్ ధర రూ.100 నుంచి 120 లు తగ్గకుండా రీఫిల్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అదేవిధంగా 14.2 కిలోల డొమెస్టిక్, 19 కిలోల కమర్షియల్ సిలిండర్లను సైతం రీఫిల్లింగ్ చేస్తూ అధిక ధరకు విక్రయిస్తున్నారు. నగరంలోని ప్రతి కేంద్రంలో నిరంతరం అక్రమ రీఫిల్లింగ్ ప్రకియ కొనసాగుతూనే ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారు. వురోవైపు మూడు, నాలుగు చక్రాల వాహనదారులు సైతం 20 శాతం వరకు గ్యాస్ సిలిండర్లను వినియోగించడంతో రీఫిల్లింగ్ వ్యాపారులకు డిమాండ్ మరింత పెరిగినట్లయింది. నాలుగు చక్రాల వాహనదారులకు రెండు రోజుల కోకసారి సిలిండర్ రీఫిల్లింగ్ అవసరముంటోంది. దీంతో వ్యాపారం మరింత జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
మొక్కుబడి దాడులే....
ఫిర్యాదులు వస్తే కానీ పౌరసరఫరాల శాఖాధికారుల్లో కదలిక కనిపించదు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్పుడప్పుడు హడావుడిగా దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నా.. అవి కాస్త ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అక్రవు రీఫిల్లింగ్ చే సే కేంద్రాలను వదిలి చిన్న, చిన్న రీఫిల్లింగ్ కేంద్రాలు, చిరు హోటళ్ల పైనే దృష్టి సారించడం అనుమానాలకు తావిస్తోంది. వురికొన్నిప్రాంతాలలో దాడుల కంటే ముందే సమాచారం లీకై అక్రవూర్కులు అప్రమత్తమైపోతున్నారు. వాణిజ్యపరమైన బడా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో బాహటంగా డొమెస్టిక్ సిలిండర్లు వినియోగిస్తున్నా పట్టింపు లేకుండా పోయింది. ఇదీ గ్రేటర్లో పౌరసరఫరాల శాఖ పర్యవేక్షణ తీరు.
ఈ అక్రమం అధికారులకు కనబడలేదా..?
సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు వారం రోజుల క్రితం నగర శివారులోని నాచారం సింగం చెరువు తండా సమీపంలోని ఒక గృహంపై దాడులు నిర్వహించగా డొమెస్టిక్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలో అక్రమంగా గ్యాస్ను రీఫిల్లింగ్ చేసే వ్యవహారం బహిర్గతమైంది. సుమారు 63 డొమెస్టిక్, 55 కమర్షియల్ సిలిండర్లను సీజ్ చేయడమే కాకుండా 60 రీఫిల్లింగ్ రాడ్స్, తూనికల యంత్రాలను ఎస్వోటీ పోలీసులు సీజ్ చేశారు. ఇంత జరిగినా వంటగ్యాస్ పంపిణీ వ్యవహారాలను నిరంతరం పర్యవేక్షించాల్సిన ఫౌరసరఫరాల శాఖ మాత్రం కనీసం పట్టనట్లు వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తోంది.