ICET exam
-
ప్రవేశ పరీక్షలకు వేళాయే
సాక్షి, అమరావతి/అనంతపురం: రాష్ట్రంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలకు వేళయ్యింది. ఈ నెల 6 నుంచి జూన్ 13 వరకు ఎనిమిది ప్రవేశ పరీక్షలను ఉన్నత విద్యా మండలి నిర్వహించనుంది. ఈనెల 6న ఈసెట్, 7న ఐసెట్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసింది. నిర్ణీత సమయానికంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది.ఇప్పటికే పరీక్షల తేదీల వారీగా హాల్టికెట్లను అందుబాటులో ఉంచామని తెలిపింది. అభ్యర్థులు తమ హాల్టికెట్తో పాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు, బ్లాక్/బ్లూ బాల్పాయింట్ పెన్నును తీసుకెళ్లాలని సూచించింది. హాల్టికెట్పై ముద్రించిన వివరాలపై అభ్యంతరం ఉంటే పరీక్షా కేంద్రంలోని అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరింది. అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది.ఈసెట్ నిర్వహణకు సిద్ధం: ఏపీ ఈసెట్ను మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈసెట్ కన్వినర్ ప్రొఫెసర్ బి.దుర్గాప్రసాద్ వెల్లడించారు. లేటరల్ ఎంట్రీ కింద ఇంజినీరింగ్ సెకండియర్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈసెట్ ఉదయం సెషన్ 9 గంటలకు ప్రారంభమై 12 గంటలకు ముగుస్తుందని.. మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుందన్నారు. -
టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు తేదీని పొడిగించింది. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ వర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇప్పటివరకు టీఎస్ ఐసెట్కు 67,361 దరఖాస్తులు వచ్చాయని, గత ఏడాదితో పోలిస్తే 1,700 దరఖాస్తులు పెరిగినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో టీఎస్ ఐసెట్–2022 నిర్వహించనున్నట్లు తెలిపారు. -
తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, వరంగల్: ఐసెట్-2018 షెడ్యూల్ను బుధవారం విడుదల చేశారు. తొలిసారి ఆన్లైన్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు కన్వీనర్ సుబ్రహ్మణశర్మ తెలిపారు. మార్చి 6 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 30 అని వెల్లడించారు. మే 23, 24 తేదీల్లో ఐసెట్ పరీక్ష జరుగుతుందన్నారు. జూన్ 6 న ఫైనల్ కీ, అదే నెలలో ఫలితాలు విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో 12, ఆంధ్రప్రదేశ్లో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. -
ఐసెట్కు నిర్వాహణకు ఏర్పాట్లు పూర్తి
విశాఖపట్టణం: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 16 న జరిగే ఐసెట్-2015కు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఐసెట్ చైర్మన్, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తెలిపారు. గురువారం నిర్వహించిన ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశం అనంతరం వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 78,739 మంది విద్యార్థులు దరఖాస్తులు చేయగా, 16 రీజినల్ కేంద్రాల పరిధిలో 136 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, హాల్టికెట్లు అందని వారు.. ప్రాంతీయ సమన్వయకర్తలను సంప్రదించాలన్నారు. విద్యార్థులు నీలం, నలుపు బాల్పాయింట్ పెన్నులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఐసెట్ కన్వీనర్ రామచంద్రమూర్తి అన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. (ఏయూక్యాంపస్)