breaking news
ICBM
-
పాక్ టార్గెట్ అమెరికా??.. ఇది జోక్ కాదు బాస్!
ఎవ్వడ్రా వీడు.. ఘోల్లుమనే జోక్ వేశాడు అనుకుంటున్నారా?. కానీ ఇదే నిజం. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రపంచమంతా దృష్టిసారించిన వేళ..పాక్ రహస్యంగా శక్తివంతమైన.. అదీ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ చేపట్టింది!. ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించినట్లు ఫారిన్ ఎఫైర్స్ అనే పత్రిక కథనం ప్రచురించింది. దీర్ఘ శ్రేణి నూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల(ICBM) తయారీని పాకిస్థాన్ రహస్యంగా చేపడుతోంది. వీటి సామర్థ్యం ఏకంగా.. అమెరికాకు చేరుకోగలదని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా సాయంతో పాక్ వీటిని అభివృద్ధి చేస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ అలాంటి క్షిపణులను సమకూర్చుకుంటే.. ఆ దేశాన్ని అణ్వస్త్ర శత్రువుగా అమెరికా గుర్తించడం ఖాయమని వాషింగ్టన్ నిఘా వర్గాలు స్పష్టం చేశాయని సదరు కథనం పేర్కొంది.అమెరికాను తాకగలిగే అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశం ఏదైనా సరే.. అమెరికాకు శత్రువుగానే చూడాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యలను సదరు నివేదిక ప్రముఖంగా పేర్కొంది. ఈ కథనాన్ని వైట్హౌజ్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. ఐసీబీఎం అంటే.. ఖండాలను దాటగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణులు. ఇందులో అణ్వాయుధాలతో పాటు సాధారణ యుద్ధ క్షిపణులు కూడా ఉంటాయి. వీటి లక్ష్యం.. 5,500 కిలోమీటర్లు దాకా ఉండొచ్చు. అయితే ప్రస్తుతానికి పాక్ దగ్గర అలాంటి క్షిపణలేం లేవు. ప్రస్తుతం అమెరికా జాబితాలో రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఉన్నాయి.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ తన ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టిందని ఆ దేశ మీడియా నుంచే కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే దేశ రక్షణ బడ్జెట్ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది. అలాగే చైనా నుంచి భారీగా ఆయుధ సంపత్తిని పాక్ దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ఆ దేశ విధానంలో.. షార్ట్, మీడియం రేంజ్ మిస్సైల్స్ మాత్రమే ఉన్నాయి. చివరగా.. 2022లో పాక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ షాహీన్-3ను ప్రయోగించింది. దీని పరిధి.. 2,700 కిలోమీటర్లు. ఇదిలా ఉంటే.. తమ దేశం చేపట్టే అణు పరీక్షలు భారత్ ముప్పును ఎదుర్కొనేందుకేనని పాక్ పలుమార్లు బాహాటంగానే ప్రకటించుకుంది. కిందటి ఏడాది.. పాక్ మీద లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ కార్యక్రమంపై అమెరికా ఆంక్షలు విధించగా.. పాక్ వాటిని పక్షపాత ధోరణిగా ప్రకటించింది.ప్రస్తుతం పాక్ దగ్గర 170 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి. తద్వారా న్యూక్లియర్ నాన్ ప్రొలైఫ్రేషన్ ట్రీటీ(NPT)కి పరిధిని ఉల్లంఘించింది. న్యూక్లియర్ వెపన్స్ను కట్టడి చేయడం, తద్వారా అణు శక్తిని పరిమితంగా(శాంతి పరిధికి లోబడి) ఉపయోగించుకోవాలని చెప్పడం ఈ ఒప్పంద ఉద్దేశం.ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం.. మే నెలలో పాక్ ఉగ్రశిబిరాలపై, ఆ దేశ ప్రధాన ఎయిర్బేస్లపై దాడులు జరిపింది. ఆ సమయంలో పాక్ తన హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిందని.. అయితే భారత రోబస్ట్ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ దానిని అడ్డుకుందనే ప్రచారం జోరుగా నడిచింది. అటుపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు పాక్ న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని కోరారు. పాక్ అలాంటి ఆయుధాల విషయంలో హద్దులు మీరి ప్రవర్తించదనే ఆశిస్తున్నట్లు రాజ్నాథ్ కూడా వేరుగా ఓ ప్రకటన చేశారు. -
హైదరాబాద్: "ICBM- స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సలెన్స్" 16వ స్నాతకోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం
సియోల్: ఉత్తరకొరియా గురువారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. టోక్యోలో జపాన్–దక్షిణ కొరియా నేతల శిఖరాగ్ర సమ్మేళనం ప్రారంభానికి ముందు ఉ.కొరియా ఈ దుందుడుకు చర్యకు పాల్పడటం గమనార్హం. ఉత్తరకొరియా ఈ నెలలో జరిపిన మొదటి ఐసీబీఎం ప్రయోగం కాగా, వారం వ్యవధిలో చేపట్టిన మూడో ఆయుధ పరీక్ష ఇది. ప్యాంగ్యాంగ్ సమీపం నుంచి గురువారం ఉదయం ప్రయోగించిన ఈ క్షిపణి సుమారు వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి తూర్పువైపు సముద్రజలాల్లో పడిపోయినట్లు దక్షిణ కొరియా ప్రకటించింది. -
ఆగని ఉ.కొరియా క్షిపణులు
సియోల్: ఉత్తరకొరియా క్షిపణుల ప్రయోగ పరంపర గురువారమూ కొనసాగింది. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్(ఐసీబీఎం) సహా కనీసం ఆరుక్షిపణులను ప్రయోగించింది. తాజా పరిణామంతో జపాన్ ఉలిక్కిపడింది. రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయడంతోపాటు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కోరింది. రాజధాని ప్యాంగ్యాంగ్ సమీపంలోని ఓ ప్రాంతం నుంచి గురువారం ఉదయం 7.40 గంటలకు ఒక ఐసీబీఎంను, ఒక గంట తర్వాత అక్కడికి సమీపంలోని కచియోన్ నుంచి రెండు తక్కువ శ్రేణి మిస్సైళ్లను ఉత్తరకొరియా ప్రయోగించినట్లు దక్షిణకొరియా సైన్యం ధ్రువీకరించింది. పొరుగు దేశాల భూభాగాల్లోకి ప్రవేశించకుండా నివారించేందుకు ఐసీబీఎంను ఎత్తులో ప్రయోగించి ఉండవచ్చని తెలిపింది. ఈ క్షిపణి 2 వేల కిలోమీటర్ల ఎత్తులో 750 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని జపాన్ పేర్కొంది. తమ గగనతలం మీదుగా మాత్రం వెళ్లలేదని తెలిపింది. ఈ ప్రయోగంతో అప్రమత్తమైన జపాన్ ప్రభుత్వం ..అండర్గ్రౌండ్ లేదా పటిష్టమైన భవనాల్లోకి వెళ్లి తలదాచుకోవాలంటూ మియాగి, యమగట, నిగట ప్రిఫెక్చర్ల ప్రజలను కోరింది. ఆయా ప్రాంతాల్లో బుల్లెట్ రైళ్లను కొద్దిసేపు నిలిపివేశారు. అనంతరం క్షిపణి ప్రయోగాలపై ఉత్తరకొరియా ఒక ప్రకటన చేసింది. దక్షిణకొరియా, అమెరికాలు సైనిక విన్యాసాలను కొనసాగించాలని తీసుకున్న నిర్ణయంపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. తర్వాత మరో 3 క్షిపణుల్ని ప్రయోగించింది. -
ఘనంగా ఐసీబీఎం స్కూల్ స్నాతకోత్సాహం
-
చైనా సాహసం : గాల్లోనే కూల్చేసింది
బీజింగ్, చైనా : దేశం వైపు దూసుకొచ్చే అణ్వాయుధ క్షిపణిని కూల్చేవేసే ప్రయోగం విజయవంతమైనట్లు చైనా ప్రకటించింది. సోమవారం జరిగిన ఈ ప్రయోగంలో చైనా తొలుత ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ని ప్రయోగించింది.. క్షిపణి భూమి వాతావరణం దాటిన అనంతరం రక్షక క్షిపణితో దాన్ని కూల్చివేసింది. అయితే, భారత్ అగ్ని-1 అణ్వాయుధ క్షిపణిని ప్రయోగించిన అనంతరం చైనా ఈ ప్రకటన చేయడం గమనార్హం. అనుకున్న లక్ష్యాలన్నింటిని డిఫెన్స్ సిస్టమ్ అందుకున్నట్లు చైనా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ ప్రయోగాన్ని దేశ రక్షణ నిమిత్తం చేసిందే తప్ప ఎవరినీ ఉద్దేశించి కాదని పేర్కొంది. శత్రుదేశాల క్షిపణిని అడ్డగించి గాల్లోనే పేల్చివేయగల సామర్ధ్యం కలిగిన రక్షణ వ్యవస్థను 2010లో డ్రాగన్ దేశం అభివృద్ధి చేసింది. -
పరిధిలోకి అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా
సియోల్/వాషింగ్టన్ : ఉత్తరకొరియా బుధవారం మరోసారి ఖండాంతర క్షిపణి(ఐసీబీఎం)ని పరీక్షించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా గుర్తించినందుకే ఈ క్షిపణిని పరీక్షించినట్లు కిమ్ దేశం ప్రకటించింది. దాదాపు 1000 కిలోమీటర్ల పాటు ప్రయాణించిన క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో పడినట్లు పెంటగాన్ పేర్కొంది. ఈ పరీక్షతో ఉత్తరకొరియా అమెరికాలోని ఏ భూభాగాన్నైనా ఢీ కొట్టగల సామర్ధ్యాన్ని సాధించినట్లు రక్షణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు. అమెరికాతో పాటు, యూరప్, ఆస్ట్రేలియాల్లోని ఏ ప్రాంతాన్నైనా చేరుకోగల సామర్ధ్యం ఉత్తరకొరియా సాధించింది. కాగా, ఉత్తరకొరియా తాజా పరీక్షపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రపంచ రక్షణను తాము చూసుకుంటామని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా కౌన్సిల్ ఉత్తరకొరియా క్షిపణిపరీక్షపై అత్యవసరంగా భేటీ కానుంది. ఉత్తరకొరియా పరీక్షను జపాన్, దక్షిణ కొరియాల అధ్యక్షులు ఖండించారు. -
జీఎస్టీఐ డైరెక్టర్ జనరల్గా జాన్ జోసఫ్
ఉత్తర కొరియా ‘క్షిపణి’ ప్రయోగం విజయవంతం అమెరికాతో సహా వివిధ దేశాలపై దాడిచేసే సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం) హ్వాసాంగ్–14ను జూలై 4న విజయవంతంగా పరీక్షించినట్లు ఉత్తరకొరియా అధికార వార్త సంస్థ ప్రకటించింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో ఈ ప్రయోగం జరిగిందని; క్షిపణి 2,802 కి.మీ. ఎత్తుకు చేరుకొని, 39 నిమిషాల పాటు 933 కి.మీల దూరం ప్రయాణించి జపాన్ ఆర్థిక మండలి జలాల్లో పడినట్లు పేర్కొంది. కాగా, ఇది మధ్యశ్రేణి క్షిపణి అని, దీనివల్ల అమెరికాకు ముప్పు లేదని అమెరికా పసిఫిక్ కమాండ్ తెలిపింది. మరోవైపు ఈ క్షిపణి 2,500 కి.మీ ఎత్తుకు చేరినట్లు జపాన్ పేర్కొంది. అయితే, ఇది ఖండాంతర క్షిపణేనని, దీని గరిష్ట పరిధి 6,000 కి.మీ. పైనే ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం. అమెరికా, దక్షిణ కొరియా క్షిపణి ప్రయోగం అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా దక్షిణ కొరియా జలాల్లో క్షిపణి ప్రయోగాలు నిర్వహించాయి. ఇందులో భాగంగా జూలై 4న దక్షిణ కొరియాకు చెందిన హున్మూ–2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అమెరికా వెల్లడించింది. ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షకు ప్రతిగా దీన్ని నిర్వహించినట్లు అమెరికా తెలిపింది. అణ్వస్త్ర నిషేధ ఒప్పందానికి ఆమోదం అణ్వస్త్రాలను నిషేధించే అంతర్జాతీయ ఒప్పందానికి ఐక్యరాజ్యసమితిలో ఆమోదం లభించింది. జూలై 7న ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చ, ఓటింగ్లో నిషేధానికి అనుకూలంగా 122 దేశాలు ఓటు వేశాయి. నెదర్లాండ్స్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ ఒప్పందం ప్రకారం అణ్వాయుధాల అభివృద్ధి, నిల్వ, వాటిని ప్రయోగిస్తామని బెదిరించడంపై నిషేధం ఉంటుంది. అణ్వాయుధాలున్న అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, భారత్, పాకిస్థాన్, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్, జపాన్ ఈ ఓటింగ్లో పాల్గొనలేదు. హాంబర్గ్లో జి–20 సదస్సు జర్మనీలోని హాంబర్గ్లో జూలై 7,8 తేదీల్లో రెండ్రోజులపాటు జి–20 దేశాల సదస్సు జరిగింది. ఉగ్రవాదం అరికట్టేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, ఉమ్మడి పోరాటం చేయాలని సదస్సు తీర్మానించింది. అలాగే వాణిజ్య రంగంలో రక్షణాత్మక ధోరణులను వ్యతిరేకించడంపై ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఆర్థిక ప్రగతి, ఉద్యోగాల కల్పనలో సమానత్వానికి కృషి, అన్ని రంగాల్లో అవినీతిపై పోరాటం చేయాలని సదస్సులో నేతలు నిర్ణయించారు. 2019 నాటికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్కరణలను పూర్తిచేయాలని ప్రతిపాదించారు. సమాచార, కమ్యూనికేషన్ వ్యవస్థల దుర్వినియోగంతో ఆర్థిక సుస్థిరతకు ముప్పు కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో 19 దేశాల అధినేతలతోపాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ తరఫున ప్రధాని మోదీ హాజరయ్యారు. ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో గుర్తింపు జపాన్లోని ఒకినోషిమా ద్వీపానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంత హోదా దక్కింది. ఇక్కడి ద్వీప దేవతను సందర్శించుకునేందుకు ఏడాదికి 200 మందిని మాత్రమే అనుమతిస్తారు. అయితే మహిళలకు ప్రవేశం లేదు. సముద్రం ద్వారా ఇక్కడికి చేరుకోవడం ప్రమాదమనే కారణంతోనే స్త్రీలను ఇక్కడికి అనుమతించడం లేదని తెలుస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో వెయ్యికి పైగా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రదేశాలున్నాయి. స్మారక స్థలాలు, ప్రదేశాలు, నగరాలు, నిర్మాణాలు ఈ జాబితాలో ఉన్నాయి. వార్తల్లో వ్యక్తులు జీఎస్టీఐ డైరెక్టర్ జనరల్గా జాన్ జోసఫ్ జీఎస్టీ(వస్తు, సేవల పన్ను) ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్గా జాన్ జోసెఫ్ జూలై 9న నియమితులయ్యారు. ఈయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ 1983 బ్యాచ్ అధికారి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీఐగా మారింది. వైవీ రెడ్డి పుస్తకం ‘అడ్వైజ్ అండ్ డిసెంట్’ ఆవిష్కరణ రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ వైవీ రెడ్డి రాసిన ‘అడ్వైజ్ అండ్ డిసెంట్: మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్’ పుస్తకాన్ని జూలై 6న హైదరాబాద్లో ఆవిష్కరించారు. అంతర్జాతీయ ఆర్థిక విధానాలను ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించారు. కామన్వెల్త్ చెస్ చాంపియన్గా అభిజిత్ గుప్తా న్యూఢిల్లీలో జూలై 10న ముగిసిన కామన్వెల్త్ చెస్ చాంపియన్ టైటిల్ను అభిజిత్ గుప్తా గెలుచుకున్నారు. రెండు, మూడు స్థానాల్లో వైభవ్ సూరి, తేజస్ బాక్రే నిలిచారు. క్రీడలు ఆసియా అథ్లెటిక్ చాంపియన్షిప్లో భారత్కు ప్రథమ స్థానం ఒడిశాలోని భువనేశ్వర్లో జూలై 9న ముగిసిన 22వ ఆసియా అథ్లెటిక్ చాంపియన్షిప్లో భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. భారత్కు మొత్తం 29 పతకాలు లభించాయి. ఇందులో 12 స్వర్ణ, 5 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. 8 స్వర్ణ, 7 రజత, 5 కాంస్య పతకాలతో చైనా ద్వితీయ స్థానంలో నిలిచింది. 40కి పైగా దేశాలకు చెందిన 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లోని వివిధ క్రీడాంశాల్లో పాల్గొన్నారు. వెస్టిండీస్తో వన్డే సిరీస్ భారత్ కైవసం వెస్టిండీస్తో ఐదు వన్డేల సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. జూలై 6న జరిగిన చివరిదైన ఐదో వన్డేలో విజయం సాధించి సిరీస్ను 3–1తో సొంతం చేసుకుంది. ఒక వన్డే వర్షం కారణంగా రద్దయింది. ఆసియా స్నూకర్ చాంపియన్గా భారత్ ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్గా భారత్ నిలిచింది. కిర్గిస్థాన్లోని బిష్కెక్లో జూలై 5న పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో భారత జట్టు విజయం సాధించింది. జాతీయం మదర్ థెరిస్సా చీరకు మేధో హక్కు మదర్ థెరిస్సా ధరించిన నీలి అంచు తెల్లచీరకు మేధో హక్కు లభించింది. మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్కు ఈ హక్కు దక్కింది. కేంద్ర ప్రభుత్వ ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రీలో ఈ గుర్తింపును జారీ చేసినట్లు జూలై 9న ఛారిటీస్ తెలిపింది. చీర ట్రేడ్ మార్క్ ధ్రువీకరణకు 2013 డిసెంబర్ 12న దరఖాస్తు చేసినట్లు పేర్కొంది. వివాహాల తప్పనిసరి నమోదుకు లా కమిషన్ సిఫారసు వివాహాలను తప్పనిసరిగా నమోదు చేయాలని సూచిస్తూ జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని భారత లా కమిషన్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ మేరకు తన నివేదికను జూలై 4న సమర్పించింది. ఈ నివేదికలో పలు సూచనలు చేసింది. వివాహాల నమోదుకు అందరికీ వర్తించేలా ఒక సంస్థ ఏర్పాటుచేయాలని పేర్కొంది. దీంతో ప్రజల హక్కులకు మరింత రక్షణ కల్పిచడంతోపాటు మరిన్ని కొత్త హక్కులు లభిస్తాయని పేర్కొంది. ఏ సంప్రదాయం, వ్యక్తిగత చట్టాల(పర్సనల్ లా) ప్రకారం వివాహాలు జరిగినా నమోదు తప్పనిసరి చేయాలని, ప్రస్తుతం అమల్లో ఉన్న జనన, మరణ నమోదు చట్టం–1969 కింద ఈ అవకాశం కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని సూచించింది. జనన, మరణాల నమోదుకు బాధ్యులుగా ఉన్నవారికే ఈ బాధ్యతా అప్పగించాలని పేర్కొంది. సరైన కారణం లేకుండా వివాహ నమోదులో జాప్యం చేస్తే రోజుకు రూ.5 చొప్పున జరిమానా వసూలు చేయాలని, నమోదును ఆధార్తో అనుసంధానం చేయాలని సూచించింది. వివాహాల నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, సంక్షేమ పథకాలు, ఇతరత్ర ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అందులో భార్య పేరు రాయడంతోపాటు వివాహ ధ్రువీకరణ పత్రం జతచేయడాన్ని తప్పనిసరి చేయాలని సూచించింది. వివాహం ఏ దేశ చట్ట ప్రకారం జరిగినా భార్యాభర్తల్లో కనీసం ఒకరు భారతీయులైతే వారి వివాహాన్ని నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని నివేదించింది. ఇజ్రాయెల్తో భారత్ ఏడు ఒప్పందాలు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో రెండు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. జూలై 5న ఇరు దేశాల ప్రధానులు మోదీ, బెంజిమన్ నెతన్యాహు సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అంతరిక్ష పరిశోధన, పారిశ్రామిక, వ్యవసాయ, నీటి పరిరక్షణ రంగాలపై కుదిరిన ఈ ఒప్పందాల విలువ సుమారు రూ.32,500 కోట్లు ఉంటుంది. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతోపాటు ఆ దేశ అధ్యక్షుడు రువెన్ రివ్లిన్తోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో అనేక ద్వైపాక్షిక అంశాలతోపాటు ఉగ్రవాదంపై చర్చించారు. తీవ్రవాదంపై కలసికట్టుగా పోరాటం చేయాలని, ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరిం చాలని రెండు దేశాలు నిర్ణయించాయి. భారత్, ఇజ్రాయెల్ సీఈవోల సదస్సులోనూ మోదీ పాల్గొన్నారు. భారత్ ప్రధాని ఇజ్రాయెల్లో పర్యటించడం చరిత్రలో ఇదే మొదటిసారి. అహ్మదాబాద్కు యునెస్కో వారసత్వ గుర్తింపు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరానికి ప్రపంచ వారసత్వ నగరంగా యునెస్కో గుర్తింపు లభించింది. భారత్లో ఈ గౌరవం దక్కిన తొలి నగరం ఇదే. 600 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నగరానికి వారసత్వ హోదా ప్రకటిస్తూ జూలై 8న పోలెండ్లో జరిగిన యునెస్కో ప్రపంచ వారసత్వ సంఘం సమావేశంలో నిర్ణయించారు. దీంతో పారిస్, వియన్నా, కైరో, బ్రస్సెల్స్, రోమ్, ఎడిన్బరో తదితర ప్రపంచ వారసత్వ నగరాల సరసన అహ్మదాబాద్ చేరింది. ఈ హోదాకు ఢిల్లీ, ముంబై కూడా పోటీ పడ్డాయి. అమర్నాథ్ యాత్రపై ఉగ్రదాడి జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో అమర్నాథ్ యాత్రపై జూలై 10న జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు యాత్రికులు మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. గుజరాత్కు చెందిన యాత్రికుల బృందం అమర్నాథ్ యాత్ర ముగించుకొని బస్సులో తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. -
అగ్ని-5సక్సెస్
బాలాసోర్ (ఒడిశా): భారత అమ్ముల పొది మరింత పదునెక్కింది. అణ్వస్త్ర సామర్థ్యం గల ‘అగ్ని-5’ దీర్ఘశ్రేణి ఉపరితల క్షిపణిని ఆదివారం రెండోసారి విజయవంతంగా పరీక్షించింది. దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణి ఐదు వేల కిలోమీటర్లకు పైగా దూరంలో గల లక్ష్యాన్ని ఛేదించగలదు. ఒడిషా తీరంలోని వీలర్ దీవిలో గల పరీక్షా క్షేత్రం నుంచి ఆదివారం ఉదయం 8:50 గంటలకు అగ్ని-5 క్షిపణిని ప్రయోగించారు. ఈ ప్రయోగం ఎలాంటి పొరపాట్లూ లేకుండా ఆశించిన ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేరుకుందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) అధికార ప్రతినిధి రవికుమార్గుప్తా ప్రకటించారు. వేయి కిలోలకన్నా ఎక్కువ బరువుగల అణ్వాయుధాన్ని తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని తొలిసారి 2012 ఏప్రిల్ 19న విజయవంతంగా పరీక్షించారు. తాజాగా రక్షణ పరిశోధన శాస్త్రవేత్తలు, నిపుణుల సమక్షంలో క్షిపణిని రెండోసారి విజయవంతంగా ప్రయోగించి పరీక్షించారు. వీలర్ దీవిలోని లాంచ్ పాడ్ నుంచి క్షిపణిని ప్రయోగించగానే కొన్ని సెకన్ల వ్యవధిలోనే భీకర గర్జనతో పొగలు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిందని ప్రత్యక్షంగా తిలకించిన వ్యక్తి ఒకరు తెలిపారు. దాదాపు 17 మీటర్ల నిడివి, రెండు మీటర్ల వెడల్పు గల క్షిపణి 50 టన్నుల బరువు ఉంటుంది. దేశీయంగా తయారుచేసిన ఇతర అగ్ని శ్రేణి క్షిపణులకన్నా ‘అగ్ని-5’ క్షిపణి మరింత ఆధునికమైనదని, ఆకాశయానం, దిశానిర్దేశం, వార్హెడ్, ఇంజన్లకు సంబంధించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ఇందులో పొందుపరిచామని శాస్త్రవేత్తలు వివరించారు. ఇందులో ఉపయోగించిన రింగ్ లేజర్ గైరో ఆధారిత ఇనెర్షియల్ నావిగేషన్ సిస్టమ్, మైక్రో నావిగేషన్ సిస్టమ్లు.. ఖచ్చితమైన లక్ష్యానికి కొద్ది మీటర్ల దూరం వరకూ చేర్చాయని చెప్పారు. అగ్ని శ్రేణి క్షిపణుల్లో భారత్ వద్ద ప్రస్తుతం అగ్ని-1 (700 కి.మీ. లక్ష్య పరిధి), అగ్ని-2 (2,000 కిలోమీటర్ల లక్ష్య పరిధి), అగ్ని-3 (2,500 కిలోమీటర్ల లక్ష్య పరిధి), అగ్ని-4 (3,500 కిలోమీటర్ల లక్ష్య పరిధి) క్షిపణులు ఉన్నాయి. మరికొన్ని పరీక్షల తర్వాత ఐదు వేల కిలోమీటర్ల లక్ష్య పరిధి గల అగ్ని-5 క్షిపణిని కూడా సైన్యానికి అందిస్తామని డీఆర్డీఓ వర్గాలు తెలిపాయి. ‘అగ్ని-5’ క్షిపణి విజయ వంత పరీక్షతో శాస్త్రవేత్తలు దేశం గర్వించేలా చేశారని రక్షణమంత్రి ఎ.కె.ఆంటోని అభినందనలు తెలిపారు. ఇది భారత దీర్ఘశ్రేణి క్షిపణి శకంలో కొత్త మైలురాయి అని జాతీయ భద్రతా సలహాదారు శివ్శంకర్మీనన్ అభివర్ణించారు. దేశం గర్వించేలా చేశారంటూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ... ఆంటోనీకి అభినందనలు తెలిపారు. అగ్ని-5 విశేషాలివీ.. దేశీయ పరిజ్ఙానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి ఉపరితల క్షిపణి 5,000 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు 1,000 కిలోలకు పైగా బరువుగల అణ్వస్త్రాన్ని తీసుకెళ్లగలదు పొడవు: 17 మీటర్లు, వెడల్పు: 2 మీటర్లు, బరువు: 50 టన్నులు మోటార్లు: మూడు దశల సాలిడ్ రాకెట్ మోటార్లు