Hurun Global Rich List
-
2026లో ధనవంతుల జాబితా: టాప్ 10లో వీరే..
భారతదేశ బిలియనీర్ల జనాభా వేగంగా విస్తరిస్తోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం, ఇండియాలో ఇప్పుడు 308 మంది బిలియనీర్లు ఉన్నారు, వారి మొత్తం సంపద రూ. 112 లక్షల కోట్లు అని అంచనా. దీంతో భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బిలియనీర్ల కేంద్రంగా నిలిచింది, యునైటెడ్ స్టేట్స్, చైనా ముందు వరుసలో ఉన్నాయి.2026లో భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. రెండవ స్థానంలో గౌతమ్ అదానీ, మూడో స్థానంలో రోష్ని నాడర్ మల్హోత్రా నిలిచారు.భారతదేశంలోని టాప్ 10 ధనవంతులు➤ముఖేష్ అంబానీ: రూ. 9.8 లక్షల కోట్లు➤గౌతమ్ అదానీ: రూ. 7.5 లక్షల కోట్లు➤రోష్నీ నాడార్: రూ. 3.2 లక్షల కోట్లు➤సైరస్ ఎస్ పూనావల్ల: రూ. 3.0 లక్షల కోట్లు➤కుమార్ బిర్లా: రూ. 2.5 లక్షల కోట్లు➤దిలీప్ షాంఘ్వీ: రూ. 2.3 లక్షల కోట్లు➤అజీమ్ ప్రేమ్జీ: రూ. 2.3 లక్షల కోట్లు➤నీరజ్ బజాజ్: రూ. 2.2 లక్షల కోట్లు➤అశోక్ హిందూజా: రూ. 2.2 లక్షల కోట్లు➤రాధాకృష్ణ దమానీ: రూ. 1.5 లక్షల కోట్లు🚨 Top 10 richest people in India in 2026.1. Mukesh Ambani - ₹9.8 lakh crore2. Gautham Adani - ₹7.5 lakh crore3. Roshni Nadar - ₹3.2 lakh crore4. Cyrus S Poonawalla - ₹3.0 lakh crore5. Kumar Birla - ₹2.5 lakh crore6. Dilip Shanghvi - ₹2.3 lakh crore7. Azim Premji -…— Indian Tech & Infra (@IndianTechGuide) March 7, 2026 -
నాన్న ఇచ్చిన గిఫ్ట్.. ప్రపంచంలో టాప్ 10లోకి..
హెచ్సీఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిణి నాడార్ మల్హోత్రా చరిత్ర సృష్టించారు. మహిళల హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2025లో టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచారు. రూ.3.5 లక్షల కోట్ల నికర సంపదతో ప్రపంచంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఐదో స్థానాన్ని దక్కించుకున్నారు.నాన్న గిఫ్ట్హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, తన తండ్రి శివ్ నాడార్ నుంచి 47 శాతం వాటా బదిలీ కావడంతో ఆమె ర్యాంకింగ్స్లో ఎదిగారు. ఈ బదిలీతో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రమోటర్ సంస్థలైన వామ సుందరి ఇన్వెస్ట్మెంట్స్ (వామ ఢిల్లీ), హెచ్సీఎల్ కార్ప్ నియంత్రణలోకి వచ్చాయి. ఫలితంగా 12 బిలియన్ డాలర్ల విలువైన టెక్నాలజీ దిగ్గజానికి సంబంధించిన అన్ని వ్యూహాత్మక నిర్ణయాలు ఇప్పుడు రోషిణి నాడార్ మల్హోత్రా చేతిలోకి వచ్చాయి.ఈ బదిలీతో రోష్ని నాడార్ మల్హోత్రా ఇప్పుడు వామా ఢిల్లీ 44.17 శాతం వాటా, హెచ్సీఎల్ టెక్నాలజీస్లో హెచ్సీఎల్ కార్ప్ 0.17 శాతం వాటా, వామా ఢిల్లీ 12.94 శాతం వాటా, హెచ్సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్లో హెచ్సీఎల్ కార్ప్ 49.94 శాతం వాటాపై ఓటింగ్ హక్కులపై నియంత్రణ కలిగి ఉన్నారు.వాటాల బదిలీకి ముందు శివ్ నాడార్ కు వామా ఢిల్లీ, హెచ్ సీఎల్ కార్పొరేషన్ రెండింటిలోనూ 51 శాతం వాటా ఉండగా, రోష్ని నాడార్ మల్హోత్రాకు ఈ రెండు సంస్థల్లో 10.33 శాతం వాటా ఉండేది. 2020 జూలైలో హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్పర్స్గా రోషిణి నాడార్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అగ్రశ్రేణి విద్యా సంస్థలను స్థాపించిన శివ్ నాడార్ ఫౌండేషన్ కు ఆమె ట్రస్టీగా కూడా ఉన్నారు.


