-
హైదరాబాద్ను రక్షిస్తోన్న ‘అతిథి’..!
ఢాం..ఢాం.. గుండ్లు పేలుతున్నాయి.. చుట్టూ ఉన్న గుట్టల మాటున ఆ శబ్దం ప్రతిధ్వనిస్తోంది.హైదరాబాద్కు అతిథులుగా ఉన్నత ప్రముఖులు వచ్చినప్పుడు గన్ శాల్యూట్గా 21మార్లు తుపాకులను గాల్లోకి పేల్చడం ఆనవాయితీ.. ఇక్కడా ఓ అతిథిని ఆహ్వానిస్తూ డైనమైట్ పేలుళ్లు.. తొలుత 21.. ఆపై మొత్తంగా 101సార్లు. ఓ బృహత్తర పనికి శ్రీకారం చుట్టుకున్న సందర్భమది.గన్ శాల్యూట్ తీసుకున్న అతిథులతో భాగ్యనగరానికి ఒరిగిందేమిటో కానీ.. ఈ ప్రత్యేక శాల్యూట్ తీసుకున్న ‘అతిథి’మాత్రం నగరాన్నే రక్షిస్తోంది. ఆ అతిథి పేరు– ‘గండిపేట జలాశయం’.. ఉరఫ్ ఉస్మాన్సాగర్. సాక్షి, హైదరాబాద్: 1908 సెప్టెంబర్: జల ప్రళయాన్ని తలపించేలా మూసీ ఉప్పొంగింది. బంగాళాఖాతంలో తుపాను ప్రభావంతో రెండ్రోజుల ఏకధాటి వానలతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. దాని తీరంలో అభివృద్ధి చెందిన ప్రధాన నగరం ధ్వంసమైంది. 15 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, అంతకు పదిరెట్ల మంది నిరాశ్రయులయ్యారు. నగర పునర్నిర్మాణ బాధ్యతను నాటి ప్రఖ్యాత ఇంజినీర్, మైసూర్ స్టేట్ దివాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు అప్పగించారు. ఆయన పూర్తిస్థాయి అధ్యయనం చేసి మూసీనది (ఈసీతో కలుపుకొని)పై రెండు జలాశయాలు నిర్మించాలని తేల్చారు. అందులో పెద్దది, ముఖ్యమైంది గండిపేట జలాశయం. (వినియోగంలో ఉన్న వందేళ్ల నాటి కార్యాలయం) 101 డైనమైట్లు పేల్చి.. గుట్టలు ఛిద్రంచేసి.. మార్చి 23, 1913: ప్రస్తుతం గండిపేట జలాశయం ఉన్నచోట అన్నీ గుట్టలే. మధ్యలో కొన్ని ఊళ్లు. వాటిని ఖాళీచేయించి గుట్ట భాగాలను డైనమైట్లు పెట్టి పేల్చేశారు. నాటి బ్రిటిష్ ఇండియా రెసిడెంట్ ఫినే, ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీ సమక్షంలో విశ్వవిఖ్యాత ఇంజినీర్ మోక్షంగుండం విశ్వేశ్వరయ్య స్వీయ పర్యవేక్షణలో 101 డైనమైట్లు పేల్చగా, గుట్టభాగాలు ఛిద్రమై మైదానంలాంటి ప్రాంతం ఏర్పాటైంది. అక్కడే ఓ భారీ మానవ నిర్మిత జలాశయం ఉద్భవించింది. 1913 మార్చిలో ప్రారంభమైన పనులు 1920 శీతాకాలం నాటికి పూర్తయ్యాయి. గండిపేట జలాశయం ప్రారంభ తేదీ, నెలలకు సంబంధించి కచ్చితమైన అధికారిక సమాచారమేదీ లేదని, అప్పటికే జోరుగా పడిన వర్షాలతో 1920 శీతాకాలం నాటికి గండిపేట నిండుకుండలా మారిందని, ఆ సమయంలోనే దాన్ని ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. దీని ప్రకారం ఈ చెరువు సేవలు ప్రారంభమై ఈ చలికాలంతో సరిగ్గా వందేళ్లవుతోంది. అంటే అదిప్పుడు ‘శత వసంతాల గండిపేట’అన్నమాట. 46 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉన్న ఈ జలాశయం నిర్మాణానికి అప్పట్లో రూ.56 లక్షలు ఖర్చయ్యాయి. కాగా, ఇది అందుబాటులోకి వచ్చిన ఏడాదే, అంటే 1920లో పనులు ప్రారంభమై 1927లో హిమాయత్సాగర్ జలాశయం సిద్ధమైంది. (నేటికీ వినియోగంలో ఉన్న రాన్సన్స్ అండ్ రేపియర్ లి కంపెనీ రూపొందించిన యంత్రాలు) రిటైర్మెంట్ కాదు.. టర్నింగ్ పాయింట్ ప్రస్తుతం కృష్ణా, గోదావరి నీళ్లు పుష్కలంగా వస్తూ నగర దాహార్తిని తీరుస్తున్నాయి. దీంతో కొంతకాలంగా ‘గండిపేటకు ఇక రిటైర్మెంటే’అనే మాటలు వినిపిస్తున్నాయి. జంట జలాశయాల పరిరక్షణకు పొందుపరిచిన ఆంక్షలకు రేపోమాపో సడలింపులుంటాయని ముమ్మర ప్రచారం జరుగుతున్న వేళ, సరిగ్గా వందేళ్లలోకి గండిపేట అడుగుపెట్టిన సమయంలో పెద్ద ‘టర్నింగ్ పాయింట్’ఘటనే ఎదురైంది. 1908 నాటి వరదలకు నగరం ధ్వంసమైన నేపథ్యంలో భవిష్యత్తులో అలాంటి జలప్రళయం రాకుండా ఏర్పడ్డ గండిపేట.. తన అవసరాన్ని వందేళ్ల తర్వాత కూడా చాలా గట్టిగా గుర్తుచేసింది. తనను నిర్లక్ష్యం చేస్తే సిటీకి మళ్లీ ప్రళయం ముంచుకొచ్చినట్టేనని స్పష్టంగా తేల్చి చెప్పింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నగరంలోని వందల కాలనీలు, బస్తీలు నీటమునిగిన విషయం తెలిసిందే. నెలైనా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. జంట జలాశయాలు లేకుంటే ‘1908 బీభత్సం’కంటే పెద్ద ఉత్పాతాన్నే నగరం కళ్లచూడాల్సి వచ్చేది. ఉస్మాన్సాగర్–హిమాయత్సాగర్ జంట జలాశయాలు, వాటి చుట్టూ ఉన్న చిన్న చెరువులు పదిలంగా ఉంటేనే భవిష్యత్తులో మూసీ వరదల నుంచి సిటీ సురక్షితంగా ఉండగలదన్న విషయం స్పష్టమైంది. నగరాన్ని కాపాడేందుకు వందేళ్ల కింద పుట్టిన తాను (గండిపేట).. వందేళ్ల వయసులో తానింకా సిటీకి అవసరమేనన్న విషయాన్ని తేల్చిచెప్పింది. వెరసి తనను కాపాడుకుంటేనే మీరు సురక్షితంగా ఉంటారని నగరవాసిని గట్టిగానే హెచ్చరించింది. గండిపేట జలాశయాన్ని పరిరక్షించుకోవాలని, వర్షపు నీరు అందులోకి చేరకుండా అడ్డుపడే నిర్మాణాలను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. (యంత్రాలు రూపొందించిన సంస్థ పేరు) అవి లేకుంటే మనం ఉండం గండిపేట జలాశయం నిర్మాణ సమయంలో సామగ్రి, కూలీలను రైలులో తరలించేవారు. ఇందుకోసం నగరం నుంచి మూసీ తీరం వెంబడి గండిపేట వరకు న్యారోగేజ్ రైల్వేలైన్ వేశారు. నా చిన్నతనంలో ఆ పట్టాలను చూశాను. తర్వాత తొలగించారు. గండిపేట వందేళ్లయినా ఇంత కూడా చెక్కుచెదరలేదు. ఇంకో వందేళ్లు ఉంటుంది. జంటజలాశయాలు బాగుంటేనే నగరం పదిలమన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. వాటికి రక్షణగా ఉన్న ఆంక్షలు సడలిస్తే వాటికి ఉరి వేసినట్టే. అప్పుడు వరదల నుంచి నగరాన్ని కాపాడేదెవరు?. – అనురాధారెడ్డి, ‘ఇంటాక్’– హైదరాబాద్ కన్వీనర్ -
భారీ వర్షాలతో వందేళ్ల రికార్డు బద్దలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైంది. గత 24 గంటల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏకంగా 39 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. వాతావరణ శాఖ రికార్డు చేసిన లెక్కల ప్రకారం గత వందేళ్లలో ఎన్నడూ ఇంతటి వర్షపాతం నమోదు కాలేదు. 1908 సెప్టెంబర్ 28వ తేదీన హన్మకొండలో 30.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 1954 జులై 10వ తేదీన ఖమ్మంలో 30 సెంటీమీటర్లు రికార్డు అయింది. ఆ తర్వాత 1983 అక్టోబర్ 6వ తేదీన నిజామాబాద్లో 35.5 సెంటీమీటర్లు నమోదైంది. వందేళ్ల చరిత్రలో రికార్డు అయిన వీటన్నింటినీ తిరగరాస్తూ ఆర్మూర్లో శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు 39 సెంటీమీటర్లు రికార్డు కావడంపై వాతావరణ శాఖ అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అలాగే అదే జిల్లా మద్నూర్, రంజల్, బోధన్, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లలో 20 సెంటీమీటర్ల కుండపోత వర్షపాతం నమోదైంది. ------------------------------------------------------------ ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో అత్యధిక వర్షపాతం నమోదైన వివరాలు (సెంటీమీటర్లలో) ----------------------------------------------------------- ప్రాంతం అధిక వర్షపాతం తేదీ ----------------------------------------------------------- 1) ఆదిలాబాద్ 25.2 20 అక్టోబర్ 1995 2) భద్రాచలం 23.0 20 సెప్టెంబర్ 2005 3) హన్మకొండ 30.4 28 సెప్టెంబర్ 1908 4) హైదరాబాద్ 24.1 24 ఆగస్టు 2000 5) ఖమ్మం 30.0 10 జులై 1954 6) మహబూబ్నగర్ 25.2 15 ఆగస్టు 1978 7) మెదక్ 19.2 21 సెప్టెంబర్ 2005 8) నల్లగొండ 19.8 26 అక్టోబర్ 2013 9) నిజామాబాద్ 35.5 06 అక్టోబర్ 1983 10) రామగుండం 21.6 05 ఆగస్టు 2006 ------------------------------------------------------------
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement