-
విజేత హుమేరా
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి షేక్ హుమేరా అండర్–18 బాలికల సింగిల్స్ విభాగంలో చాంపియన్గా అవతరించింది. ఫైనల్లో హుమేరా 6–2, 6–4తో తెలంగాణకే చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మికపై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో సిద్ధార్థ్ 6–2, 6–7 (2/7), 6–3తో అర్జున్పై... మహిళల సింగిల్స్ ఫైనల్లో మహెక్ 6–1, 6–2తో జీల్ దేశాయ్పై గెలిచారు. విజేతలకు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్ ట్రోఫీలను అందజేశారు. -
హుమేరా శుభారంభం
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్షిప్లో మహిళల సింగిల్స్ విభాగంలో తెలంగాణ అమ్మాయి షేక్ హుమేరా రెండో రౌండ్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో హుమేరా 7–6 (8/6), 0–6, 6–3తో ప్రతిభ నారాయణ్ (కర్ణాటక)పై గెలిచింది. అండర్–18 బాలికల సింగిల్స్లో హుమేరా మూడో రౌండ్లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్లో హుమేరా 6–1, 6–0తో చావి రాఠి (హరియాణా)ను ఓడించింది. మహిళల సింగిల్స్లో తెలంగాణకే చెందిన సామ సాత్విక, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కొండవీటి అనూష రెండో రౌండ్కు చేరారు. తొలి రౌండ్లో సాత్విక 6–1, 6–1తో వన్షిత (కర్ణాటక)పై, అనూష 2–6, 7–5, 6–0తో ఆర్తి ముణియన్ (తమిళనాడు)పై గెలిచారు. అండర్–18 బాలికల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్ల్లో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక (తెలంగాణ) 6–2, 6–2తో సుదీప్త (మహారాష్ట్ర)పై, లక్ష్మి సాహితి రెడ్డి (ఆంధ్రప్రదేశ్) 6–2, 6–2తో పూజ ఇంగ్లే (మహారాష్ట్ర)పై నెగ్గారు. స్మృతి భాసిన్ (తెలంగాణ) 1–6, 4–6తో త్రిషా వినోద్ (కేరళ) చేతిలో... సంస్కృతి దామెర (తెలంగాణ) 6–3, 2–6, 5–7తో ఫర్హత్ కమర్ (రాజస్తాన్) చేతిలో... భక్తి షా (తెలంగాణ) 1–6, 5–7తో కశిష్ భాటియా (ఢిల్లీ) చేతిలో పరాజయం పాలయ్యారు. మరోవైపు అండర్–18 బాలుర సింగిల్స్ రెండో రౌండ్లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–4, 6–2తో అథర్వ శర్మ (మహారాష్ట్ర)పై గెలిచి మూడో రౌండ్కు చేరుకున్నాడు. -
మెయిన్ ‘డ్రా’కు హుమేరా
చండీగఢ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఐటీఎఫ్ జూనియర్స్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. చండీగఢ్ లాన్ టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీ బాలికల చివరి రౌండ్ మ్యాచ్లో టాప్ సీడ్ హుమేరా 5-7, 6-3, 7-5తో హర్లీన్ కౌర్ (చండీగఢ్)ను ఓడించింది. బాలుర విభాగంలోనూ టాప్ సీడ్ అలెక్స్ సోలెంకి 6-4, 6-1తో ఐదో సీడ్ సాగర్ బైన్సపై గెలుపొంది మెయిన్ డ్రాకు అర్హత పొందాడు. మెయిన్ డ్రా మ్యాచ్లు నేటి (సోమవారం) నుంచి ఈనెల 7 వరకు జరుగుతాయి. ఇతర బాలుర మ్యాచ్ల్లో ఆర్. బొల్లిపల్లి 4-6, 7-5, 6-3తో అశుతోష్ తివారిపై, సుమిత్ పాల్ సింగ్ 6-3, 4-6, 6-4తో కృషన్ హుడాపై, అథర్వ శర్మ 6-0, 6-3తో ద్రోణ వాలియాపై గెలుపొందారు. బాలికల మ్యాచ్ల్లో శివాని మంజన్న 6-3, 6-1తో మిషా సూద్పై, యుబ్రాని బెనర్జీ 7-6 (7), 6-1తో దాదాసాహెబ్ చౌగ్లేపై, గౌరీ భాగియా 6-2, 6-3తో అంజలి మొగిలిపై విజయం సాధించారు. -
క్వార్టర్ ఫైనల్లో హుమేరా
న్యూఢిల్లీ: ఫెనెస్టా ఓపెన్ జాతీయ టెన్నిస్ చాంపియన్షిప్లో హైదరాబాద్ అమ్మాయి షేక్ హుమేరా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన అండర్-16 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో షేక్ హుమేరా 6-1, 4-6, 6-4తో సారా దేవ్పై విజయం సాధించింది. బాలుర విభాగంలో సిద్ధాంత్ 6-4, 6-4తో తోజ్యో ఓజెస్పై, అభిమన్యు 6-0, 6-0తో మోనీష్ షాపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అండర్-14 బాలబాలికల ప్రిక్వార్టర్స్ మ్యాచ్ల్లో ఆర్యన్ జవేరీ 6-2, 6-3తో నరేశ్ బడ్గుజర్పై గెలుపొందగా... సన్యా సింగ్ 7-6 (4), 6-2తో అదితిని ఓడించింది. ఇతర మ్యాచ్ ఫలితాలు.. అండర్-16 బాలురు: రిషబ్ 6-1, 6-3తో ఆయూష్ దేశ్వాల్పై, మేఘ్ కుమార్ పటేల్6-3, 6-0తో సంకేత్ తోమర్పై, అర్జున్ 6-4, 5-7, 6-2తో రోహిత్పై, సురేశ్6-1, 6-0తో నీరజ్ యశ్పాల్పై, దేవ్ 6-2, 7-5తో రిథమ్ మల్హోత్రాపై గెలుపొందారు. బాలికలు: వైదేహి 6-0, 6-0తో గార్గి పవార్పై, అయేషా పటేల్ 6-0, 6-1తో దామినిపై, తనీషా కశ్యప్ 6-2, 6-0తో ముబషిరా షేక్పై, ప్రింకెల్సింగ్ 6-2, 6-2తో ప్రియాన్షి భండారిపై, సల్సా అహర్ 6-1, 6-0తో మలైకాపై, శరణ్య 6-2, 6-3తో యుబ్రాని బెనర్జీపై, భక్తి పర్వాణి 7-6 (6), 1-6, 6-3తో సాయి దేదీప్యపై విజయం సాధించారు. అండర్-14 బాలురు: దేవ్ 6-4, 6-2తో క్రిష్ పటేల్పై, సందీప్ 6-3, 6-3తో ఆదర్శ్ నాగపై, నితిన్ జైపాల్ 6-2, 6-3తో ఆదిత్య వర్ధన్పై, అజయ్ 6-0, 6-3తో రాజేశ్పై, దివేశ్ 5-7, 6-1, 7-6తో ఉదిత్పై, నిశాంత్ 6-0, 6-7 (4), 7-6 (3)తో భూపతిపై నెగ్గారు. బాలికలు: శరణ్య 6-3, 6-3తో సంస్కృతిపై, సారా దేవ్ 6-2, 6-2తో బేలా తన్హాంకర్పై, రిచా 4-6, 6-4, 6-1తో వన్షిక చౌదరీపై, మలైకా 6-0, 6-1తో గార్గి పవార్పై, వినీత 6-2, 1-0తో అర్చితపై, సందీప్తి సింగ్ 6-3,7-5తో భక్తి పర్వాణిపై, ప్రియాన్షి భండారి 6-0, 6-0తో పూర్వి భట్పై గెలిచారు. -
ఆర్టీడబ్ల్యూ కోసం శివాని, హుమేర
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్లో జరిగే ‘రోడ్ టు వింబుల్డన్’ (ఆర్టీడబ్ల్యూ) జాతీయ టోర్నీ కోసం భారత్లో నిర్వహించే క్వాలిఫయింగ్ టోర్నీలో తెలంగాణ, ఏపీలకు చెందిన 12 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో హైదరాబాద్ అమ్మాయిలు శివాని అమినేని, షేక్ హుమేరా బేగం చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు బాలికల జట్టులో సాయి దేదీప్య, ధరణ ఆనంద్, శ్రీవల్లి రష్మిక, రచనా రెడ్డి ఉన్నారు. బాలుర జట్టులో రిత్విక్ చౌదరి, తీర్థ శశాంక్, మెంగా రోహిత్, ఆశిష్ నంద్, ఆకాశ్ రెడ్డి, శ్రీహర్షిత్ ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బాలబాలికల జట్లు అలిండియా టెన్నిస్ సంఘం (ఐటా) నిర్వహించే క్వాలిఫయింగ్ ఈవెంట్లలో పోటీపడతాయి. మొత్తం నాలుగు నగరాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 12న కోల్కతాలో, 19న చండీగఢ్లో, ఫిబ్రవరి 2న ఢిల్లీలో, 9న ముంబైలో ఈ పోటీలు జరుగుతాయి. అనంతరం ఢిల్లీలో ఏప్రిల్ 6న జరిగే ఫైనల్ ఈవెంట్లో గెలుపొందిన విజేతలను రోడ్ టు వింబుల్డన్ జాతీయ మాస్టర్స్ టోర్నీకి ఎంపిక చేస్తారు. ఈ ఈవెంట్ ఇంగ్లండ్లో ఆగస్టులో జరగనుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement