-
టాపు లేచిపోతోంది!
సాక్షి,ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు) : బీచ్రోడ్డులోని రాజీవ్ స్మృతి వనం పైకప్పు రేకులు ఎగిరిపోతున్నాయి. హుద్హుద్ సమయంలో ఈ భవనం పూర్తిస్థాయిలో దెబ్బతింది. అనంతరం దీనికి మరమ్మత్తులు చేశారు. అయితే కథ మొదటికొచ్చింది. భవనంపైన బిగించిన రేకులు ఊడిపోతున్నాయి. బుధవారం సాయంత్రం వీచిన గాలులకు పైన ఉన్న రేకులు ఎగురుతూ దర్శనమిచ్చాయి. ఇవి అటుగా వెళ్లేవారిపై పడితే ప్రమాదం సంభవించే అవకాశం లేకపోలేదు. -
హామీకి పాతరేశారు!
శ్రీకాకుళం టౌన్: జిల్లాలో 192 కిలో మీటర్లు విస్తరించిన ఉన్న తీర ప్రాంతంలో వందల సంఖ్యలో గ్రామాలున్నాయి. అన్ని ఊర్లకు విద్యుద్ధీకరణ పూర్తయినప్పటికీ వర్షాకాలంలో వంద రోజులకు పైగా చీకట్లోకి వెళ్లిపోతుంటాయి. ఏటా ఇదే పరిస్థితి. తుపాన్ల సమయంలో వీచే పెనుగాలులో విద్యుత్ వ్యవస్థ ఛిన్నాభిన్నమై.. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి. హుద్హుద్ తుపాను సమయంలో ఇదే జరిగింది. భీకర గాలులకు వేలాది స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జిల్లా మొత్తం అంధకారంలోకి వెళ్లింది. రోజుల తరబడి కరెంటు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఇలాంటి సమయంలో జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు భూగర్భంలో విద్యుత్ కేబుల్ అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో పనులకు సర్వే జరిపించి రూ.234 కోట్లుతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అరుుతే ఇప్పటి వరకూ ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. తరచూ విద్యుత్ కష్టాలు హుద్హుద్ తుపాను తరువాత కూడా చిన్నచిన్న తుపాన్లు జిల్లాను తాకాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ఉన్న తీర ప్రాంత మండలాలైన ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి, గార, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం ప్రాంతాల్లో ప్రకృతి వైఫరీత్యాల వల్ల తరచూ విద్యుత్ సరఫరా నిలిచి పోతోంది. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు కావాలంటే.. భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు కావాలంటే ఒక్కో మండలం పరిధిలో 33 కేవీ విద్యుత్ లైన్లు 15 కిలోమీటర్లు, 11 కేవీ విద్యుత్ లైన్ 15 కిలోమీటర్లు వంతున అవసరం. అలాగే 50 కిలోవాట్స్ యాంప్సు కెపాసిటీ ఉన్న 46 విద్యుత్ ట్రాన్సుఫార్మర్లు, 315 కిలోవాట్స్ యాంప్సు కెపాసిటీ ఉన్న ట్రాన్సుఫార్మర్లు 68 అవసరమవుతాయని అంచనా. అలాగే భూగర్భ కేబుల్ వ్యవస్థను 13 తీరప్రాంత సబ్స్టేషన్లకు అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇదే విషయూన్ని ట్రాన్స్కో అధికారులు తమ ప్రతిపాదనల్లో పొందుపరిచారు. కాల్వల తవ్వకానికి నిధులు అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టు పరిధిలో అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంతోపాటు శ్రీకూర్మనాథస్వామి ఆలయాన్ని అనుసంధానం చేయాల్సి ఉంది. ప్రతిపాదనలు పంపించాం తుపాన్ల కారణంగా తీర ప్రాంత గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. భారీగా నష్టాలు వస్తున్నాయి. దీన్ని నివారించడానికి, పెద్దెత్తున మార్పులు చేయడానికి భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు కోరింది. దీంతో క్షేత్రస్థాయి అధ్యయనం చేసి ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. రూ.234 కోట్లుతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. ప్రపంచబ్యాంకు నిధులతో ఈ ఆధునికీకరణ చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నిధులు విడుదలైతే చర్యలు మొదలు పెడతాం. - శరత్కుమార్, ట్రాన్స్కో ఎస్ఈ -
అంధకార తాండవం
►హుద్హుద్ తుపానుకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లు ►నేటికీ పునరుద్ధరించని వైనం జలాశయ నీటి విడుదలకు ►జనరేటరే దిక్కు విధుల నిర్వహణలో అవస్థలు పడుతున్న సిబ్బంది విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు సాగునీరందించే తాండవ జలాశయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రాంతంలో హుద్హుద్ తుపానుకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లు నేటికీ పునరుద్ధరించకపోవడం వల్ల రాత్రి వేళల్లో అంధకారం నెలకొంది. నాతవరం : జిల్లాలో ఏకైక మేజర్ ప్రాజెక్టు నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హుద్హుద్ తుపాను సమయంలో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను నేటికీ పునరుద్ధరించకపోవడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. హుద్హుద్ తుపాను సమయంలో గాలులకు తాండవ జలాశయానికి విద్యుత్ సరఫరా చేసే లైన్లన్నీ ధ్వంసమయ్యాయి. అప్పటినుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందవి జనరేటర్పై ఆధారపడాల్సి వస్తోంది. విద్యుత్ సరఫరా లేకుంటే.. తాండవ జలాశయం నీటికి ఆయకట్టుకు విడుదల చేయాలంటే గేట్లు ఎత్తేందుకు విద్యుత్ అవసరం. ప్రమాదస్థాయికి నీటిమట్టం చేరినప్పుడు స్పిల్వే దగ్గర గేట్లు ఎత్తి తాండవ నదిలోకి నీటిని విడుదల చేస్తుంటారు. ఇందుకు తప్పనిసరిగా విద్యుత్ అవసరం. హుద్హుద్ తరువాత తాండవ జలాశయం నిండిన పరిస్థితులు లేవు. ఈ కారణంగా విద్యుత్ ఉన్నా లేకపోయినా పెద్దగా సమస్య తలెత్తలేదు. అత్యవసర అయినప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో జనరేటరే దిక్కవుతోంది. చీకట్లో డ్యామ్! తాండవ జలాశయం డ్యామ్పై లైట్లు వెలగకపోవడం వల్ల అంధకారం నెలకొంది. రాత్రివేళల్లో జలాశయ ప్రాంతం చీకటిమయంగా మారడంతో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో డ్యామ్ దగ్గర నుంచి స్పిల్వే గేట్ల వరకు పరిస్థితిని ఎప్పడికప్పుడు సిబ్బంది పరిశీలించాలి. చుట్టూ దట్టమైన అటవీప్రాంతం, ఎటుచూసినా అంధకారం నెలకొనడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అడవి జంతువులతో సమస్య నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాల అటవీప్రాంతం మధ్య తాండవ జలాశయం విస్తరించి ఉంది. వేసవిలో దాహార్తి తీర్చుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి అడవి జంతువులు జలాశయం వద్దకు వస్తుంటాయి. జలాశయాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో అవి సేదతీరుతుంటాయి. వీటివల్ల సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ సరఫరా లేక ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితి. నిధులు సిద్ధం విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.18 లక్షలు విడుదల చేసింది. వీటిని విద్యుత్ శాఖకు చెల్లించాం. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ ప్రారంభించారు. త్వరలోనే విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుంది. - చిన్నారావు, తాండవ జేఈ -
సీఎం పర్యటన మూడో సారీ...
మళ్లీ రద్దుతో గిరిజనుల్లో నిరుత్సాహం అరకులోయ: సీఎం చంద్రబాబునాయుడు అరకులోయ పర్యటన మూడోసారి కూడా రద్దయింది. గతేడాది హుద్హుద్ తుపానుకు మండలంలోని మాదల పంచాయతీ మెదర్సోలా గ్రామంలో కొండచరియలు విరిగిపడిన సంఘటనలో ఐదుగురు ఆదిమజాతి గిరిజనులు దుర్మరణం పాలయ్యారు. ఆయా కుటుంబాలను పరామర్శించేందుకు సీఎం వస్తారని ఏర్పాట్లు చేసిన అధికారులు, పర్యటన రద్దయినట్లు చివరి నిమిషంలో ప్రకటించారు. జన్మభూమిలో పాల్గొంటారని... అరకులోయ మండలంలో సీఎం దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు ప్రకటించారు. హుటాహుటిన రహదారిని మెరుగుపరిచారు. పంచాయతీలో పెండింగ్ పనులను పూర్తిచేశారు. ఐటీడీఏ పీవో, ఇతర శాఖ అధికారులు సమస్యలను గుర్తించారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడా మైదానంలో బహిరంగ సభకు సుమారు 10 వేల మందికి సరిపడే వేదికను సిద్ధం చేశారు. చివరి నిమిషంలో సీఎం పర్యటన రద్దుతో గిరిజనులు నిరాశకు గురయ్యారు. మళ్లీ రద్దు.. అరకులోయలో సోమవారం సీఎం చంద్రబాబునాయుడు పర్యటిస్తారని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. పెదలబుడులో రచ్చబండలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. యూత్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో కాఫీ పైలాన్ నిర్మాణం, ఎన్టీఆర్ క్రీడా మైదానంలో సుమారు 20వేల మందికి సరిపడే సభా వేదిక సిద్ధం చేశారు. ఈసారి తప్పనిసరిగా చంద్రబాబు అరకు వస్తారని అధికారులు భావించారు. సీఎం పర్యటన రద్దయిందని చివరి నిమిషంలో కలెక్టర్ యువరాజ్ ప్రకటించారు. పర్యటన రద్దుపై భిన్న కథనాలు అరకులోయలో సీఎం పర్యటన తరచూ రద్దవడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అరకులోయ వస్తే పదవి కోల్పోతారన్న సెంటిమెంట్కూడా ఆయన పర్యటన రద్దుకు కారణమని ప్రచారం జరుగుతోంది. బాక్సైట్ ఉద్యమం, మావోయిస్టుల ప్రభావం కూడా కారణం కావొచ్చని అంటున్నారు. -
భారీ విపత్తు... సాయం వీసమెత్తు!
ఎప్పుడూ రాని కష్టం వచ్చింది... ఎన్నో కుటుంబాలు చివురుటాకుల్లా వణికిపోయాయి... ఎంద రికో గూడులేకుండా పోయింది...రైతుల కష్టం నీళ్లపాలయింది... ఒకరేమిటి జిల్లాలో దాదాపు అన్ని వర్గాలవారు తీవ్రంగా నష్టపోయారు... ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి...ఇది హుద్హుద్ తుపాను రేపిన గాయం. అయితే హుద్హుద్ కన్నా ఘోరంగా నేతలు వ్యవహరించారు. తుపాను వచ్చిన వెంటనే జిల్లాలో పర్యటించి అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీలు గుప్పించారు. కొద్దిపాటి మొత్తాన్ని విడుదల చేశారు. ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. దీంతో జిల్లా వాసులు కష్టాలతో కాపురం చేయవలసి వస్తోంది. ప్రకృతి బీభత్సం సృష్టించి ఎనిమిది నెలలు దాటింది , ఇప్పటికీ తుపాను ఆనవాళ్లు చెరిగిపోలేదు. జిల్లా కేంద్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వీధిదీపాలు కూడా వెలగని దుస్థితి ఏర్పడింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: హుద్హుద్ సృష్టించిన బీభత్సం జిల్లా ప్రజల కళ్లముందు ఇంకా కదలాడుతునే ఉంది. ఎనిమిది నెలలు కావస్తున్నా అది చేసిన గాయం మాత్రం మానలేదు. బాధితుల వేదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. హుద్హుద్ వల్ల జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తామని ముఖ్యమంత్రితో పాటు జిల్లాకొచ్చిన మంత్రులంతా ఊదరగొట్టారు. కానీ ఆ హామీలేవీ అమలుకు నోచుకోలేదు. జిల్లాలో రైతులకు రూ.210 కోట్ల మేర నష్టం వాటిల్లగా కేవలం రూ.37కోట్లు విడుదల చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంది. జిల్లా వ్యాప్తంగా 15,189 ఇళ్లు కూలిపోగా, ఇంతవరకు ఒక్క బాధితుడికి కూడా కొత్తగా ఇల్లు మంజూరు చేయలేదు. మిగతా నష్టాలపైనా ఇదే తరహాలో ప్రభుత్వ స్పందన ఉంది. ఇదంతా పక్కన పెడితే హుద్హుద్ దెబ్బకు పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పాడైన వీధి లైట్లకు పలుచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేసి మమ అనిపించారు. కానీ అవి వెలుగేదెప్పుడో, ఆరిపోయేదెప్పుడో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంలో పరిస్థితి మరింత దయనీయం. పట్టణంలోని అత్యధిక ప్రాంతాలు నేటికీ అంధకారంలో మగ్గిపోతున్నాయి. ఎల్ఈడీ లైట్లును ఏర్పాటు చేస్తామంటూ పాడైన లైట్లును గాలికొదిలేశారు. విజయనగరం మున్సిపాల్టీలో 10,500 వీధి లైట్లు ఉండగా హుద్హుద్కు దాదాపు అన్నీ దెబ్బతిన్నాయి. తుఫాన్ తరువాత జిల్లాకొచ్చిన మున్సిపల్ మంత్రి నారాయణ సీరియస్గా స్పందిస్తూ 15 రోజుల్లోగా వీధి లైట్లును పునరుద్ధరించాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కానీ ఆ దిశగా పునరుద్ధరణ పనులు జరగలేదు. ఇప్పటికైతే మరమ్మతులు చేపట్టి 2500పాత లైట్లును, కొత్తగా మరో 1500ఎల్ఈడీ లైట్లును ఏర్పాటు చేశారు. దాదాపు 6500 వీధిలైట్లు వెలగడంలేదు. దీంతో పట్టణంలోని అత్యధిక ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి. ఇదే అవకాశంగా దొంగలు చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకూ దాదాపు 150 దొంగతనాలు జరిగాయి. ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడమే కాకుండా గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు మున్సిపల్ పాలకులు గాని, ఇటు ప్రభుత్వ పెద్దలు గాని పట్టించుకోవడం లేదు. సాలూరు మున్సిపాల్టీలో 500లైట్లు, బొబ్బిలి మున్సిపాల్టీలో 100, పార్వతీపురం మున్సిపాల్టీలో 500లైట్లు హుద్హుద్ బీభత్సానికి దెబ్బతిన్నాయి. వాటికి తాత్కాలికంగా మరమ్మతు చేశారు. అయితే అవి ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు వెలగవో చెప్పలేని పరిస్థితి. అన్ని మున్సిపాల్టీల్లో ఎల్ఈడీ వెలుగులు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినా నేటికీ అది నెరవేరలేదు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement