Housewife suicide
-
ఐదు కుటుంబాల్లో విషాదం
హైదరాబాద్: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని గాయపడ్డ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందగా వివిధ కారణాలతో మరో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన మృతి చెందిన ఘటనలు బుధవారం కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చాయి. ఉప్పల్ పరిధిలో మరొకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుషాయిగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సిలిండర్ లీకైన ఘటనలో.. హెచ్బీకాలనీ, వెంకటేశ్వరనగర్ కాలనీలో నివసించే శాంతం భాగ్యమ్మ(48) ఇళ్లలో పని చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తోంది. గత నెల 19న ఇంట్లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చీరకు అంటుకున్నాయి. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కుటుంబ కలహాలతో గృహిణి.. కుటుంబ కలహాల కారణంగా మనస్థాపం చెందిన గృహిణి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన ఘటన హెచ్బీకాలనీ, కృష్ణానగర్లో చోటు చేసుకుంది. వెస్ట్ గోదావరికి చెందిన శ్రీకాంత్, హైమగంగా భవానీ దంపతులు 3 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. వారికి రెండు సంవత్సరాల వయసు ఉన్న పాప ఉంది. మంగళవారం మధ్యాహ్నం భార్యాభర్తల నడుమ గొడవ జరిగింది. మనస్థాపం చెందిన భవాని భర్త నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందింది. ప్రేమ విఫలమై.. ప్రేమ విఫలమైందని మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందిన ఘటన హెచ్బీకాలనీలో చోటుచేసుకుంది. ఎల్ఐజీకి చెందిన విద్యార్థి హబ్సీగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ప్రేమ విఫలమైందన్న కారణంతో ఇంటో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. ఆర్థిక ఇబ్బందులతో ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందాడు. జార్ఖాండ్కు చెందిన సీఐఎస్ఎఫ్ జవాన్ దినేష్ దాస్ రెండు సంవత్సరాల క్రితం బదిలీపై నగరంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎఫ్సీకి వచ్చాడు. భార్యతో కలిసి ఎన్ఎఫ్సీ క్వార్టర్స్లో నివాసం ఉంటున్నాడు. సంతానం లేరు. అప్పుల బాధ తాళలేక ఇంట్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి మృతిచెందినట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య ఉప్పల్: అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ హనుమసాయినగర్లో నివాసముండే శ్రీనివాస్రెడ్డి కుమారుడు అన్విత్రెడ్డి(25) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురై బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సెల్ఫోన్లో మరణ వాంగ్మూలం
-
సెల్ఫోన్లో మరణ వాంగ్మూలం
వేధింపులు భరించలేక గృహిణి ఆత్మహత్య హైదరాబాద్: ‘భర్త, అత్త, ఆడపడుచుల వేధింపులు భరించలేక చనిపోతున్నాను.. మన్నించమ్మా .. అంటూ తల్లి సెల్ఫోన్లో మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేసి మరీ ఓ గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఎర్ర కుంట మినార్ కాలనీకి చెందిన ఆరీఫ్ తన కుమార్తె అంజుమ్ (20)ను.. యాకుత్పురాకు చెందిన వస్త్ర దుకాణ కార్మికుడు ఇర్ఫాన్ అలియాస్ ఆరీఫ్ (25)కు ఇచ్చి ఈ ఏడాది జనవరి 13న వివాహం చేశారు. వివాహ సమయంలో రూ.50 వేల నగదుతో పాటు మూడు తులాల బంగారం ఫర్నిచర్ అందజే శారు. వివాహం అయిన కొన్నాళ్లకే భర్త, అత్త, ఆడపడుచులు అదనపు కట్నం తీసుకు రావా లని అంజుమ్ను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టారు. పది రోజుల క్రితం ఆమె భర్త అదనపు కట్నం తీసుకురావాలని మీనార్ కాలనీలోని అత్తగారింట్లో వదిలేసి వెళ్లాడు. దీంతో గత పదిరోజులుగా తీవ్ర మానసిక వేదన అనుభవించిన ఆమె.. మంగళవారం రాత్రి తల్లి సెల్ ఫోన్ తీసుకొని అందులో తాను ఎందుకు ఆత్మహత్యకు పాల్పడు తున్నానో వివరిస్తూ వీడియో రికార్డు చేసింది. అందులో భర్త ఆరీఫ్, అత్త ఆజియా ఉన్నీసా, ఆడపడుచులు అర్షియా, సాదియాలు తనను ఎలా వేధింపులకు గురిచేస్తున్నారో పూస గుచ్చినట్లు వివరించింది. అనంతరం బాత్రూమ్కు వెళ్లి తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. -
కేసు వాపసు కోసం మంత్రి బెదిరింపులు!
పంజగుట్ట: కట్నం వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన పంజగుట్ట ఠాణా పరిధిలో జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం... ఎల్లారెడ్డిగూడ పద్మావతి ప్లాజాలో నివాసం ఉండే సారయ్య, సాలీలకు కుమారులు వీరన్న, రాములు సంతానం. వీరిద్దరూ మహేశ్వరం మండలానికి చెందిన స్వరూప, సుశీల (24) అక్కాచెల్లెళ్లను 2009 మార్చి 21న పెళ్లి చేసుకున్నారు. ఒక్కొక్కరికి రూ. 15 లక్షల నగదు, 15 తులాల బంగారు నగలు కట్నంగా ఇచ్చి.. ఘనంగా పెళ్లి చేశారు. సుశీలకు ఆడ పిల్ల పుట్టగానే భర్త రాములు వేధింపులు మొదలెట్టాడు. అదనపు కట్నం తెమ్మని చితకబాదేవాడు. దీంతో సుశీల కుటుంబ సభ్యులు ఇద్దరూ అన్నదమ్ములకు అదనపు కట్నం కింద చెరో అర ఎకరం రాసి ఇచ్చారు. అయినా తృప్తి చెందని రాములు వేధించి, చేయి చేసుకోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన సుశీల మంగళవారం ఉదయం కుమార్తె భవిష్య (6)ను పాఠశాలకు పంపించి తలుపు గడియ పెట్టుకుంది. సాయంత్రం వరకు గదిలోంచి బయటకు రాకపోవడంతో సుశీల సోదరి స్వరూప, ఆమె భర్త వీరన్న కలిసి గడియ విరగొట్టి చూడగా సుశీల ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెంది ఉంది. వారి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి సోదరి స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త రాములు, అత్తామామలతో పాటు బావ వీరన్నపై కేసు నమోదు చేశారు. మంత్రి బెదిరిస్తున్నారు: బాధితుల ఆరోపణ సుశీల మృతికి కారణమైన భర్త, అత్తామామలతో పాటు బావను వెంటనే అరెస్టు చేయాలని కుటుంబసభ్యులు పంజగుట్ట పోలీస్స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. కేసు విత్డ్రా చేసుకోవాలని ఓ మంత్రి తమకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని, విత్డ్రా చేసుకోకపోతే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి కేసు మాఫీ చేయిస్తామని అంటున్నారని మృతురాలి బంధువులు కంటతడిపెట్టారు. నిందితులు కూడా సదరు మంత్రి ఇంట్లోనే తలదాచుకొని ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనే వీరన్న, రాములుకు వేరేవారితో పెళ్లిళ్లు అయినట్టు తమకు సమాచారం అందిందని బాధితులు పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
రాఖీ పండక్కి పుట్టింటికి వద్దనడంతో..
కుత్బుల్లాపూర్: రాఖీ పండక్కి పుట్టింటికి వెళ్లొద్దని భర్త అనడంతో మనస్తాపం చెంది ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. జీడిమెట్ల ఎస్సై సైదిరెడ్డి కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్కు చెందిన జితేందర్ సింగ్ బౌరంపేటలోని ఎస్బీహెచ్ బ్రాంచిలో క్యాషియర్గా పని చేస్తూ సుభాష్నగర్లో ఉంటున్నారు. బుధవారం ఉదయం భార్య ప్రతిమా సింగ్ రాఖీ పౌర్ణమికి స్వగ్రామానికి వెళ్దామని భర్తను కోరగా.. నెల క్రితమే వెళ్లొచ్చాం.. ఇప్పుడెందుకని చెప్పి విధులకు వెళ్లాడు. సాయంత్రం ఫోన్ చేస్తే ప్రతిమ స్పందించలేదు. దీంతో భర్త ఇంటికి వచ్చి చూడగా ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెంది ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.