breaking news
honda motor corp
-
హోండా ఈవీ స్కూటర్ వచ్చేస్తోంది
మొదటి ఎలక్ట్రిక్ మోడల్ను 2024 మార్చిలో విడుదల చేయాలని అనుకుంటున్నాం. భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త ప్లాట్ఫామ్పై దీని అభివృద్ధి చేపట్టాం. మొదటి మోడల్ ఫిక్స్డ్ బ్యాటరీతో వస్తుంది. రెండో మోడల్ స్వాపబుల్ (మార్పిడికి వీలైన) బ్యాటరీతో ఉంటుంది. మందుగా దేశవ్యాప్తంగా మాకున్న 6,000 విక్రయ అవుట్లెట్ల వద్ద చార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. తర్వాత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విస్తరణపై నిర్ణయం తీసుకుంటాం’’అని ఒగటా వివరించారు. ఈవీ మార్కెట్లోకి ప్రవేశం ఆలస్యంపై స్పందిస్తూ ..‘‘గతేడాది నుంచి ఈవీ వ్యాపారంపై దృష్టి సారించాం. ఒక్కసారి భారత్లో ఈ వ్యాపారం ప్రారంభించామంటే అది స్వల్పకాలానికి కాకుండా దీర్ఘకాలం కోసమే అవుతుంది’’అని బదులిచ్చారు. -
ఏపీలో హోండా బిగ్వింగ్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్సైకిల్, స్కూటర్ ఇండియా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో బిగ్వింగ్ షోరూం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో 300–500 సీసీ సామర్థ్యం కలిగిన మధ్యస్థాయి ప్రీమియం మోటార్సైకిల్స్ను విక్రయిస్తారు. ఇప్పటికే ఏపీలో ఇటువంటి స్టోర్లు వైజాగ్, విజయవాడ, రాజమండ్రిలో నెలకొన్నాయి. హైదరాబాద్లో రెండు బిగ్వింగ్, ఒకటి బిగ్వింగ్ టాప్లైన్ ఔట్లెట్ను కంపెనీ నిర్వహిస్తోంది. బిగ్వింగ్ టాప్లైన్లో హోండాకు చెందిన అన్ని రకాల ప్రీమియం మోటార్సైకిల్స్ లభిస్తాయి. చదవండి: ఐటీ కంపెనీలకు యుద్ధం సెగ -
భారత్కు క్యూ కట్టిన కార్ల దిగ్గజాల బాస్లు
న్యూఢిల్లీ: జనరల్ మోటార్స్, హోండా కంపెనీల అధినేతలు ప్రధాని నరేంద్ర మోడీని గురువారం కలిశారు. జనరల్ మోటార్స్ చైర్మన్ టిమ్ సోల్సో, హోండా మోటార్ కంపెనీ చైర్మన్ ఫుమిహికో ఐకెలు విడివిడిగా ప్రధానిని కలిశారని ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. 2020 కల్లా ప్రపంచంలో మూడో అతి పెద్ద వాహన మార్కెట్గా భారత్ అవతరించనున్నదనే అంచనాలున్నాయని, అందుకే పలు అంతర్జాతీయ కంపెనీలు భారత్పై దృష్టి సారిస్తున్నాయని నిపుణులంటున్నారు. అంతేకాకుండా భారత్ కేంద్రంగా కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పలు అంతర్జాతీయ వాహన దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయని వారంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ రెండు కంపెనీల చైర్మన్లు మోడీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 40 కొత్త మోడళ్లు: జీఎం సీఈఓ మేరీ బర్రా జీఎం చైర్మన్ టిమ్ సోల్సోతో పాటు ఆ కంపెనీ సీఈఓ మేరీ బర్రా కూడా మోడీతో సమావేశమయ్యారు. ప్రధానిగా విజయం సాధించినందుకు అభినందనలు తెలపడానికి మోడీని కలిశామని వివరించారు. ఆ తర్వాత పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా ఆమె కలిశారు. కంపెనీ అంతర్జాతీయ టర్న్ అరౌండ్ ప్రణాళికల్లో భాగంగా ఆమె భారత్లో పర్యటిస్తున్నారు. డీలర్లు, వాహన విడిభాగాల సరఫరాదారులతో సమావేశమవుతారు. భారత్తో సహా మొత్తం అంతర్జాతీయ మార్కెట్లలో 40 కొత్త మోడళ్లనందించనున్నామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. అయితే ఎప్పటిలోగా ఈ మోడళ్లను అందించే గడువును ఆమె వెల్లడించలేదు. 2020 కల్లా మూడో అతిపెద్ద వాహన మార్కెట్గా భారత్ అవతరిస్తుందనే అంచనాలున్నాయని, అందుకే భారత్ మార్కెట్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. ఇక్కడ తీవ్రమైన పోటీ ఉందని, అందుకే మంచి వాహనాన్ని అందిస్తే తప్ప విజయం సాధించలేమని పేర్కొన్నారు. 1996లో భారత్లో కార్యకలాపాలు ప్రారంభించిన జనరల్ మోటార్స్ సంస్థ ఇప్పటివరకూ రూ.2,740 కోట్ల నష్టాలను చవిచూసింది.