-
భారత్కు మరో విజయం
రాంచీ: భారత అమ్మాయిల హాకీ జట్టు ఎదురులేని ప్రదర్శనతో దూసుకెళుతోంది. ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత్ 5–0తో మలేసియాపై ఘనవిజయం సాధించింది. వందన కటారియా (7, 21వ నిమిషాల్లో) చక్కని ఆటతీరుతో రెండు గోల్స్ చేసింది. సంగీత కుమారి (28వ ని.), లాల్రెమ్సియామి (28వ ని.) క్షణాల వ్యవధిలోనే చెరో గోల్ సాధించిపెట్టారు. మూడో క్వార్టర్లో జ్యోతి (38వ ని.) కూడా గోల్ చేయడంతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. తొలి లీగ్లో భారత్ 7–1తో థాయ్లాండ్పై నెగ్గింది. -
భారీ విజయంతో భారత్ శుభారంభం
రాంచీ: ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. థాయ్లాండ్ జట్టుతో శుక్రవారం జరిగిన తమ తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా 7–1తో నెగ్గింది. భారత్ తరఫున సంగీత కుమారి (29వ, 45వ, 45వ ని.లో) మూడు గోల్స్ చేయగా... మోనిక (7వ ని.లో), లాల్రెమ్సియామి (52వ ని.లో), సలీమా టెటె (15వ ని.లో), దీపిక (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. -
నేటి నుంచి ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీ
స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ నేడు రాంచీలో మొదలవుతుంది. తొలి రోజు థాయ్లాండ్ జట్టుతో సవితా పూనియా కెపె్టన్సీలోని భారత జట్టు ఆడనుంది. మ్యాచ్ రాత్రి గం. 8:30 నుంచి జరుగుతుంది. చైనా, జపాన్, కొరియా, మలేసియా జట్లు కూడా ఈ టోరీ్నలో పోటీపడుతున్నాయి. థాయ్లాండ్తో మ్యాచ్ తర్వాత భారత్ 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్తో, నవంబర్ 2న కొరియాతో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు నవంబర్ 4న సెమీఫైనల్లో తలపడతాయి. నవంబర్ 5న ఫైనల్తో టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీ మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ టెన్–5 చానెల్లో, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
హాకీ చాంపియన్స్ ట్రోఫీ.. ఆరు జట్లు.. భారత్- పాక్ మ్యాచ్ ఆరోజే!
సాక్షి, చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా పురుషుల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగనుంది. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీకి గురువారం ఎగ్మూర్లోని మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో తెర లేవనుంది. భారత్తోపాటు పాకిస్తాన్, చైనా, మలేసియా, జపాన్, దక్షిణ కొరియా జట్లు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. తొలి రోజు కొరియాతో జపాన్ (సాయంత్రం గం. 4 నుంచి); మలేసియాతో పాకిస్తాన్ (సాయంత్రం గం. 6:15 నుంచి); చైనాతో భారత్ (రాత్రి గం. 8:30 నుంచి) పోటీపడతాయి. భారత్, పాక్ మ్యాచ్ ఆగస్టు 9న జరుగుతుంది. ఆరు జట్ల మధ్య ముందుగా రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో మ్యాచ్లను నిర్వహిస్తారు. టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్లో నెగ్గిన జట్లు ఆగస్టు 12న ఫైనల్లో తలపడతాయి. మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
భారత్ 0 0 మలేసియా
మస్కట్ (ఒమన్): ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా నాలుగో విజయం సాధించాలని ఆశించిన భారత్ను మలేసియా జట్టు నిలువరించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. భారత్కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. నాలుగేసి లీగ్ మ్యాచ్లు పూర్తి చేసుకున్న భారత్, మలేసియా జట్లు మూడు విజయాలు సాధించి ఒక ‘డ్రా’ నమోదు చేశాయి. ఇరుజట్లు 10 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. నేడు జరిగే చివరి లీగ్ మ్యాచ్లో దక్షిణ కొరియాతో భారత్ తలపడుతుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement