breaking news
Historical judgment
-
చరిత్రాత్మక తీర్పులకో వెబ్ పేజీ ప్రారంభించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలి కాలంలో తాము ఇచి్చన చరిత్రాత్మక తీర్పులను గుదిగుచ్చి ఒక వెబ్పేజీ ద్వారా అందరికీ అందుబాటులోకి తెచి్చంది. న్యాయవితరణలో భాగంగా సుప్రీంకోర్టు వెలువర్చిన కీలక తీర్పుల వివరాలు పౌరులకు తెలియజెప్పడంతోపాటు, న్యాయవ్యవస్థ పట్ల వారిలో మరింత అవగాహన పెంచేందుకు ఈ చొరవ తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. www.sci.gov.in వెబ్సైట్లో ‘ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ సమరీస్’పేరిట విడిగా ఒక వెబ్పేజీని అందుబాటులోకి తెచి్చంది. ప్రస్తుతానికి 2017 సంవత్సరం నుంచి ఇప్పటిదాకా ఇచి్చన కీలక తీర్పుల సమగ్ర వివరాలు అందులో అందుబాటులోకి వచ్చాయి. అంతకుముందునాటి చరిత్రాత్మక తీర్పులను త్వరలో అప్లోడ్ చేయనున్నారు. ‘‘తీర్పు సంక్లిష్టమైన పదజాలంతో ఇంగ్లిష్ భాష ఉంటుంది. వందల పేజీలున్న కోర్టు తీర్పును చదివి అర్థంచేసుకోవడమూ సాధారణ ప్రజలకు కష్టమే. అందుకే సులభ భాషలో, తక్కువ పదాల్లో తీర్పు సారాంశాన్ని పౌరులకు అందుబాటులోకి తెచ్చాం’’ అని సుప్రీం పేర్కొంది. -
చైల్డ్ పోర్న్ చూసినా, వీడియోలున్నా... తీవ్ర నేరమే!
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల బారి నుంచి బాలలకు భద్రత కలి్పంచే పోక్సో చట్టం ప్రకారం ఆ వీడియోలను వ్యాప్తి చేయడం మాత్రమే నేరమన్న వాదన సరికాదని స్పష్టం చేసింది. ‘‘ఆ వీడియోలను కలిగి ఉండటం, డౌన్లోడ్ చేయడంతో పాటు ఆన్లైన్లో గానీ ఇతరత్రా గానీ వాటిని చూడటం కూడా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం కచ్చితంగా నేరమే. ఇవి ‘ఆరంభ నేరం’ కిందకే వస్తాయి’’ అని పోక్సో చట్టం సెక్షన్ 15లోని 1, 2, 3 సబ్ సెక్షన్లను, ఐటీ చట్టంలోని సెక్షన్ 67బిని ఉటంకిస్తూ పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం, డౌన్లోడ్ చేయడం నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును ఘోర తప్పిదంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా ధర్మాసనం అభివరి్ణంచింది. తన మొబైల్లో చైల్డ్ పోర్నో వీడియోలున్న ఓ 28 ఏళ్ల వ్యక్తిని నిర్దోíÙగా పేర్కొంటూ జనవరి 11న హైకోర్టు ఇచి్చన తీర్పును కొట్టేస్తున్నట్టు పేర్కొంది. అతనిపై నేరాభియోగాలను పునరుద్ధరించాల్సిందిగా తిరువళ్లువర్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. ‘‘బాలలపై లైంగిక వేధింపులు అత్యంత ఆందోళనకరమైన అంశం. సమాజంలో లోతుల దాకా వేళ్లూనుకుపోయిన ఈ పెను జాఢ్యం ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్త సమస్య’’ అంటూ ఆవేదన వెలిబుచి్చంది. దీని నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం పలు సూచనలు చేసింది. ‘‘న్యాయపరమైన ఉత్తర్వులు, తీర్పుల్లో ఇకపై చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడొద్దు. దానికి బదులు సదరు నేరాలను మరింత నిర్దుష్టంగా పేర్కొనేలా ‘చైల్డ్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఈఏఎం)’ అని మాత్రమే వాడాలి’’ అని అన్ని కోర్టులనూ ఆదేశించింది. పోక్సో చట్టానికి ఈ మేరకు సవరణ చేసే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటుకు సూచించింది. ఆలోపుగా కేంద్రం ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయాలని పేర్కొంది. బాలలపై లైంగిక వేధింపుల సమస్యను రూపుమాపడంలో ప్రపంచ దేశాలన్నింటికీ ఈ తీర్పు మార్గదర్శకం కాగలదంటూ న్యాయ వర్గాలు హర్షం వెలిబుచ్చాయి. తీర్పులో ముఖ్యాంశాలు → చైల్డ్ పోర్నో మెటీరియల్ బాలల భద్రతకు పెను ముప్పు. బాలలను లైంగిక అవసరాలు తీర్చుకునే బొమ్మలుగా అది చిత్రిస్తుంది. ఫలితంగా జరగరానిది జరిగితే బాధితుల లేత మనసులపై అది ఎన్నటికీ చెరిగిపోని గాయం చేస్తుంది. → విద్యార్థులకు సమగ్ర లైంగిక విద్యా బోధన కార్యక్రమాలను అమలు చేయాలి. ఆరోగ్యకరమైన సంబంధాలు, సరైన ప్రవర్తన వంటివాటిలపై అవగాహన కలిగించాలి. → విద్యార్థులు మొదలుకుని సాధారణ ప్రజల దాకా అన్ని స్థాయిల్లోనూ లైంగిక విద్య, అవగాహన కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి. → చట్టపరమైన పర్యవసానాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. తద్వారా వాటి వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. ఆ నేరాలకు పాల్పడేందుకు వెనకాడేలా చేయవచ్చు. → నేరానికి సంబంధించి బాలల నుంచి సాక్ష్యాల సేకరణ, దర్యాప్తు, విచారణ తదితర ప్రక్రియ వీలైనంత సున్నితంగా జరిగేలా చూడాలి. తద్వారా వారి మనసులు మరింత గాయపడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.లైంగిక విద్య అత్యవసరం బాలలపై లైంగిక నేరాలు తగ్గాలంటే లైంగిక విద్య, లైంగిక ఆరోగ్యం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దురదృష్టవశాత్తూ దీనిపై భారత సమాజంలో తీవ్ర అపోహలు నెలకొని ఉన్నాయంటూ జస్టిస్ పార్డీవాలా ఆవేదన వెలిబుచ్చారు. ధర్మాసనం తరఫున 200 పేజీల తీర్పును ఆయనే రాశారు. ‘‘లైంగిక విద్యను పాశ్చాత్య భావనగా, మన సంప్రదాయ విలువలను దిగజార్చేదిగా భారత సమాజం భావిస్తుంది. దాంతో స్కూళ్లలో లైంగిక విద్యపై వ్యతిరేకత నెలకొని ఉంది. దానిపై పలు రాష్ట్రాల్లో నిషేధమే ఉంది!’’ అని పేర్కొన్నారు. ‘‘సెక్స్, సంబంధిత విషయాలను పిల్లలతో చర్చించడాన్ని ఇబ్బందికరంగా మాత్రమే గాక ఘోర అపరాధంగా, అనైతికంగా మనవాళ్లు చూస్తారు. వాటివల్ల ఎదిగే వయసులో విచ్చలవిడి లైంగిక ధోరణులు తలెత్తుతాయన్న అపోహ వ్యాప్తిలో ఉంది. తల్లిదండ్రులు, పెద్దల్లోనే గాక విద్యావేత్తల్లో కూడా ఈ తిరోగమన ధోరణి నెలకొని ఉండటం దారుణం. దీంతో ఎదిగే పిల్లల్లో లైంగికపరమైన అవగాహన లోపిస్తోంది. అందుకే టీనేజర్లు ఇంటర్నెట్లో సులువుగా అందుబాటులో ఉన్న సెక్సువల్ కంటెంట్కు ఇట్టే ఆకర్షితులవుతున్నారు. ఎలాంటి నియంత్రణా, వడపోతా లేని ఆ విచ్చలవిడి కంటెంట్ వారిని తప్పుదోవ పట్టించడమే గాక అనారోగ్యకరమైన లైంగిక ప్రవర్తనకు, లైంగిక నేరా లకు పురిగొల్పుతోంది’’ అంటూ ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది. ‘‘కను క ఈ విషయమై ముందు పెద్దలను చైతన్యవంతులను చేయడం చాలా ముఖ్యం. సమగ్ర లైంగిక విద్య, అవగాహన బాల లకు ఎంత ముఖ్యమో వారికి అర్థమయ్యేలా చేయాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ, వ్యాప్తి, లైంగిక హింస వంటివాటి చట్టపరమైన పరిణామాలను కూడా అర్థం చేసుకుంటారు. కనుక వాటికి దూరంగా ఉంటారు. పరిశోధనల్లో రుజువైన వాస్తవాలివి. మన దేశంలో సమగ్ర లైంగిక విద్య అవసరం చాలా ఉందని అవి తేల్చాయి’’ అని పేర్కొంది. -
Jammu Kashmir: ఆర్టికల్ 370 రద్దు సబబే
ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పంచిన ఈ ఆర్టికల్ ను రద్దు చేయడం సబబేనని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ ఏకగ్రీవంగా మూడు తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 తాత్కాలిక ఏర్పాటేనని, దాని రద్దుకు రాష్ట్రపతికి పూర్తి అధికారాలున్నాయని స్పష్టం చేసింది. లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని సమరి్థంచింది. జమ్మూ కశ్మీర్కు తక్షణం రాష్ట్ర హోదాను పునరుద్ధరించి సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించా లని కేంద్రాన్ని ఆదేశించింది. కశ్మీర్లో మానవ హక్కుల హననంపై స్వతంత్ర కమిషన్ ఆధ్వర్యంలో నిష్పాక్షిక దర్యాప్తు జరగాలంటూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ విడి తీర్పు వెలువరించారు. కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు సహేతుక కారణాలు ఉండి తీరాల్సిందేనని జస్టిస్ సంజీవ్ ఖన్నా తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పు చరిత్రాత్మకమంటూ మోదీ ప్రస్తుతించారు. ఆరెస్సెస్, బీజేపీ ఈ తీర్పును స్వాగతించగా కాంగ్రెస్, ఇతర విపక్షాలు భిన్నంగా స్పందించాయి. న్యూఢిల్లీ: ఆర్టికల్ 370పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ను రద్దు చేయడం సబబేనని స్పష్టం చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ముక్త కంఠంతో సమరి్థంచింది. 370 ఆర్టికల్ రద్దు తాలూకు రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. సోమవారం ఈ మేరకు ఏకగ్రీవంగా మూడు తీర్పులు వెలువరించింది. ఆర్టికల్ 370 కేవలం ఓ తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, దాన్ని రద్దు చేసే పూర్తి అధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయని సీజేఐ స్పష్టం చేశారు. ఈ మేరకు తనతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.ఎస్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ తరఫున ఆయన 352 పేజీల మెజారిటీ తీర్పు వెలువరించారు. లద్దాఖ్ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం కూడా సబబేనని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారుస్తూ మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘‘జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలి. 2024 సెపె్టంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి’’ అని కేంద్రాన్ని సీజేఐ ఆదేశించారు. ఈ తీర్పును సమరి్థస్తూ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ 121 పేజీలతో విడిగా తీర్పు ఇచ్చారు. ఈ రెండు తీర్పులతోనూ పూర్తిగా ఏకీభవిస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా మరో తీర్పు వెలువరించారు. ఈ తీర్పును కేంద్రంలో మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో మరో పెద్ద విజయంగా భావిస్తున్నారు. ప్రధానితో పాటు బీజేపీ తీర్పును సమర్థించగా పలు పార్టిలతో పాటు పలువురు నేతలు వ్యతిరేకించారు. ప్రతి నిర్ణయాన్నీ సవాలు చేయలేరు జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా కలి్పంచిన ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది. రాష్ట్ర హోదా రద్దు చేసి దాన్ని జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 23 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ అనంతరం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సెపె్టంబర్ 5న తీర్పును రిజర్వు చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యంగ ఆదేశం (సీఓ) 272లో జమ్మూ కశ్మీర్కు రాజ్యాంగంలోని అన్ని విధి విధానాలనూ వర్తింపజేశారు. ఆర్టికల్ 370లో పేర్కొన్న రాజ్యాంగ అసెంబ్లీ అనే పదాన్ని అసెంబ్లీగా మార్చారు. ఈ నిర్ణయాల చెల్లుబాటుపై ధర్మాసనం ప్రధానంగా విచారణ జరిపింది. జమ్మూ కశ్మీర్ విషయమై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్నీ సవాలు చేయజాలరని తీర్పులో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం అది భారతదేశంలో సంపూర్ణంగా విలీనమై అంతర్భాగంగా మారిందనడంలో ఏ సందేహానికీ తావులేదని స్పష్టం చేశారు. ‘‘ఆర్టికల్ 1 ప్రకారమే గాక ఆర్టికల్ 370ని బట్టి చూసినా జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగమే. అలాంటప్పుడు దానికి ప్రత్యేక సార్వ¿ౌమాధికారమంటూ ఏమీ ఉండబోదు. హక్కుల విషయంలోనూ మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో అది సమానమే. అంతే తప్ప ప్రత్యేకతేమీ ఉండబోదు’’ అని పునరుద్ఘాటించారు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రకటించిన నేపథ్యంలో దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం ఆర్టికల్ 3 ప్రకారం సరైందో కాదో తేల్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఆర్టికల్ 370 (1) (డి) కింద తనకున్న అధికారాలను వినియోగించేందుకు (నాటి) జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అంగీకారం తీసుకోవడం రాష్ట్రపతికి తప్పనిసరేమీ కాదని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ రాజ్యాంగ అసెంబ్లీ అనుమతి లేకుండా ఆర్టికల్ 370కి ఎలాంటి మార్పుచేర్పులూ చెల్లుబాటు కావని, రాజ్యాంగ అసెంబ్లీ 1957లోనే రద్దయినందున ఆర్టికల్ 370 శాశ్వతత్వం సంతరించుకుందని పిటిషనర్లు చేసిన వాదనను పూర్తిగా అసంబద్ధమన్నారు. అది కేవలం తాత్కాలిక ఏర్పా టేనని రాజ్యాంగంలోని పలు నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టం చేశారు. దాన్ని రాజ్యాంగంలోని 21వ భాగంలో పొందుపరిచేందుకు కూడా అదే కారణమని వివరించారు. సార్వభౌమత్వం ఉండదు ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్కు అంతర్గత సార్వ¿ౌమత్వం ఉంటుందన్న వాదనను కూడా ధర్మాసనం తోసిపుచి్చంది. 1947లో విలీనం సందర్భంగా రక్షణ, విదేశాంగ, సమాచార అంశాల్లో మాత్రమే జమ్మూ కశ్మీర్ సార్వ¿ౌమాధికారాలను భారత ప్రభుత్వానికి నాటి రాజు హరిసింగ్ వదులుకున్నారన్న వాదనను కూడా కొట్టిపారేసింది. కేంద్రంతో ఇలాంటి ప్రత్యేక నిబంధనలున్న ఇతర రాష్ట్రాలు కశ్మీర్ను ఉదాహరణగా చూపుతూ తమకూ అంతర్గత సార్వ¿ౌమత్వముందని వాదిస్తే పరిస్థితేమిటని సీజేఐ ప్రశ్నించారు. మన అసౌష్టవ సమాఖ్య వ్యవస్థ స్వభావం ప్రకారం కొన్ని రాష్ట్రాలకు మిగతా వాటితో పోలిస్తే కొన్ని విషయాల్లో కాస్త స్వయం ప్రతిపత్తికి ఆస్కారముందని గుర్తు చేశారు. ‘‘భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా ఔదలదాలుస్తూ 1949 నవంబర్ 25న కశ్మీర్ విలీన ఒప్పందాన్ని దాని యువరాజు కరణ్సింగ్ బేషరతుగా ఆమోదించడంతోనే అది పూర్తిగా దేశంలో కలిసిపోయింది. కనుక జమ్మూ కశ్మీర్కు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎప్పుడూ ఏ విధమైన అంతర్గత సార్వభౌమత్వమూ లేదు, ఉండబోదు. అక్కడి ప్రజలకూ ఇదే వర్తిస్తుంది’’ అన్నారు. ‘‘రెండు కారణాలతో ఆర్టికల్ 370 తెరపైకి వచి్చంది. ఒకటి జమ్మూ కశ్మీర్లో రాజ్యాంగ అసెంబ్లీ కొలువుదీరేదాకా దాకా అది మధ్యంతర ఏర్పాటుగా పని చేసింది. అలాగే నాడు అక్కడ నెలకొన్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తాత్కాలిక ఏర్పాటుగా కూడా ఆర్టికల్ 370ని తీసుకొచ్చారు. అది శాశ్వతమేమీ కాదు. దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది’’ అని స్పష్టం చేశారు. సెపె్టంబర్ 30లోగా జమ్మూ కశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి సీజేఐ సూచించారు. కశ్మీర్లో మానవ హక్కుల హననంపై నిష్పాక్షిక దర్యాప్తు: జస్టిస్ కౌల్ సీజేఐ వెలువరించిన మెజారిటీ తీర్పుతో ఏకీభవిస్తూ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ విడిగా తీర్పు వెలువరించారు. దశలవారీగా కశ్మీర్ను అభివృద్ధి తదితర అన్ని అంశాల్లోనూ ఇతర రాష్ట్రాల స్థాయికి తీసుకెళ్లడమే ఆర్టికల్ 370 ఉద్దేశమని స్పష్టం చేశారు. దాని రద్దు పూర్తిగా సబబేనని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్కు తగిలిన గాయాలు మానాల్సిన అవసరముందని జస్టిస్ కౌల్ తన తీర్పులో అభిప్రాయపడ్డారు. 1980ల నుంచి అక్కడ ప్రభుత్వపరంగా, ఇతరత్రా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర కమిషన్ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేశారు. అప్పటి దారుణాలపై అది నిష్పాక్షికంగా పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి నివేదిక సమరి్పంచాలన్నారు. కశ్మీర్ జస్టిస్ కౌల్ స్వస్థలం. ఈ నేపథ్యంలో తీర్పులో ఒక చోట ‘కశ్మీరీలమైన మేము’ అని కూడా ఆయన పేర్కొన్నారు. ‘‘1947 నుంచీ దశాబ్దాల పాటు కశ్మీరీలు వేర్పాటు, ఉగ్రవాదాల బాధితులుగా ఉంటూ వస్తున్నారు. దాంతో తొలుత కశ్మీర్లోని కొన్ని ప్రాంతాలను ఇతర దేశాలు ఆక్రమించాయి. 1980ల్లో వేర్పాటువాదం లోయలో కల్లోలం సృష్టించింది. అది వలసలకు దారి తీసింది. అవి స్వచ్చంద వలసలు కావు. సరిహద్దుల ఆవలి నుంచి వచ్చి పట్ట మతిలేని మతోన్మాదాన్ని తాలలేక కశ్మీరీ పండిట్లు ప్రాణాలు కాపాడుకునేందుకు విధి లేక ఇల్లూవాకిలీ విడిచి మూకుమ్మడిగా వలస వెళ్లారు. దాంతో కశ్మీర్ తాలూకు సాంస్కృతిక విలువలే సమూలంగా మారిపోయాయి. దేశ సమగ్రత, సార్వ¿ౌమత్వమే ప్రమాదంలో పడి సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. విదేశీ చొరబాట్లను అరికట్టి దేశ సార్వ¿ౌమత్వాన్ని పరిరక్షించేందుకు సైన్యం చేపట్టిన చర్యలతో పరిస్థితులు మరో మలుపు తీసుకున్నాయి. తర్వాతి పరిణామాల్లో ఆడ, మగ, చిన్నా, పెద్దా అందరూ భారీ మూల్యం చెల్లించాల్సి వచి్చంది. మూడు దశాబ్దాలు దాటినా నాటి అన్యాయాలను సరిదిద్దలేదు’’ అంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘అక్కడ పరిస్థితిని చక్కదిద్దడంతో పాటు కశ్మీర్ తాలూకు సామాజిక నిర్మాణాన్ని పునరుద్ధరించాల్సి ఉంది. తద్వారా కశ్మీరీలు సహనశీలత, పరస్పర గౌరవం సహజీవనం సాగించేలా చూడాలి’’ అని పేర్కొన్నారు. గట్టి కారణాలుంటేనే యూటీలు: జస్టిస్ ఖన్నా రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆందోళన వెలిబుచ్చారు. ‘‘ఈ చర్య విపరీత పరిణామాలకు దారి తీస్తుంది. సమాఖ్య తత్వానికి అడ్డంకిగా మారుతుంది. ప్రజలకు ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకుండా చేస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. అందుకే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలంటే అందుకు సహేతుకమైన గట్టి కారణాలు ఉండి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3లో పొందుపరిచిన నియమ నిబంధలను పూర్తిగా అనుసరిస్తూ మాత్రమే అందుకు పూనుకోవాలని సూచించారు. ఆర్టికల్ 370 అంశంపై వెలువరించిన విడి తీర్పులో జస్టిస్ ఖన్నా ఈ మేరకు పేర్కొన్నారు. దాని రద్దు సబబేనంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ వెలువరించిన తీర్పులతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. ఆర్టికల్ 370కి శాశ్వత లక్షణం లేదని స్పష్టం చేశారు. ‘‘ఈ మేరకు సీజేఐ, జస్టిస్ కౌల్వెలువరించిన తీర్పులు గొప్ప పరిణతితో కూడుకున్నవి. సంక్లిష్టమైన న్యాయపరమైన అంశాలను సరళంగా వివరిస్తూ సాగాయి’’ అని ప్రస్తుతించారు. అంతిమ అధికారం కేంద్రానిదే ప్రజాస్వామ్యం, సమాఖ్య తత్వం మాన రాజ్యాంగపు మౌలిక లక్షణాలైనా కొన్ని నిర్దిష్ట ఏకస్వామ్యపు లక్షణాలు కూడా అందులో ఇమిడే ఉన్నాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘వాటి ప్రకారం ఏ విషయంలోనైనా అంతిమంగా నిర్ణాయక అధికారాలు కేంద్రానికే దఖలు పడ్డాయి. కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు వంటివి వాటిలో భాగమే’’ అని సీజేఐ వివరించారు. ‘‘కేంద్ర, రాష్ట్రాల మధ్య శాసన, కార్యనిర్వాహక అధికారాల విభజన, వాటి అమలులో రాష్ట్రాలకు ఇచ్చిన స్వతంత్రం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేవే. అయితే పలు కారణాల దృష్ట్యా రాష్ట్రంగా మనుగడ సాగించలేవని భావించిన ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే సంపూర్ణ అధికారాలు కేంద్రానికి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. ఏమిటీ ఆర్టికల్ 370? ► ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక హోదా ఉంటుంది. ► ప్రత్యేక రాజ్యాంగం, రాష్ట్ర పతాకం ఉంటాయి. ► అంతర్గత పాలన విషయంలో పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ► కశ్మీర్పై భారత సార్వభౌమాధికారం రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల వరకే పరిమితం. ► ఇతర రాష్ట్రాల ప్రజలు జమ్మూ కశ్మీర్లో ఆస్తులు, భూములు కొనుగోలు చేయలేరు. ► ప్రజల పౌరసత్వం, ఆస్తి యాజమాన్యం, ప్రాథమిక హక్కుల చట్టం మిగతా ప్రాంతాల వారికంటే భిన్నంగా ఉంటుంది. ► అక్కడ ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అధికారం కేంద్రానికి లేదు. ► రక్షణ, విదేశాంగ, కమ్యూనికేషన్లు మినహా ఇతర చట్టాల అమలుకు అక్కడి రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదం తప్పనిసరి. ► ఆర్టికల్ 370ని సవరించే, రద్దు చేసే అధికారం రాజ్యాంగ అసెంబ్లీకి ఉంది. ► కానీ రాజ్యాంగ అసెంబ్లీయే 1957లో రద్దయిపోయింది. ► దాంతో ఆర్టికల్ 370 రాజ్యాంగంలో శాశ్వత భాగమైయిందని, దాని రద్దు అధికారం కేంద్రానికి లేదని అక్కడి పారీ్టలు వాదిస్తూ వస్తున్నాయి. అమలు నుంచి రద్దు దాకా... 1947 అక్టోబర్ 26: భారతదేశ విభజన తర్వాత జమ్మూకశ్మీర్ స్వతంత్ర దేశంగా ఉండడానికే మహారాజా హరిసింగ్ మొగ్గు చూపారు. భారత్లో గానీ, పాకిస్తాన్లో గానీ విలీనం కాబోమని ప్రకటించారు. ఇంతలో పాకిస్తాన్ సైన్యం అండతో అక్కడి గిరిజనులు జమ్మూకశ్మీర్పై దండెత్తారు. మహారాజా హరిసింగ్ భారత ప్రభుత్వ సహకారాన్ని కోరారు. భారత్లో విలీనానికి అంగీకరించారు. కొన్ని షరతులతో విలీన ఒప్పందంపై సంతకం చేశారు. 1949 మే 27: రాజ్యాంగాన్ని రూపకల్పనకు ఏర్పాటైన రాజ్యాంగ సభ విలీన ఒప్పందం ప్రకారం ఆర్టికల్ 370 ముసాయిదాను ఆమోదించింది. 1949 అక్టోబర్ 17: జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తూ ఆర్టికల్ 370ని భారత రాజ్యాంగంలో చేర్చారు. 1951 మే 1: జమ్మూకశ్మీర్లో రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేస్తూ రాజకుమారుడు డాక్టర్ కరణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 1952: ఇండియా, జమ్మూకశ్మీర్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ‘ఢిల్లీ అగ్రిమెంట్’పై భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, జమ్మూకశ్మీర్ ప్రధానమంత్రి షేక్ అబ్దుల్లా సంతకం చేశారు. 1954 మే 14: రాష్ట్రపత్తి ఉత్తర్వు మేరకు ఆర్టికల్ 370 అమల్లోకి వచ్చింది. 1954 మే 15: జమ్మూకశ్మీర్లో శాశ్వత నివాసితుల హక్కుల విషయంలో రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాలకు రక్షణ కలి్పంచడానికి రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ‘ఆర్టికల్ 35ఏ’ను భారత రాజ్యాంగంలో చేర్చారు. 1957 నవంబర్ 17: జమ్మూకశ్మీర్ రాజ్యాంగాన్ని ఆమోదించారు. 1958 జనవరి 26: జమ్మూకశ్మీర్కు సొంత రాజ్యాంగం అమల్లోకి వచి్చంది. 1965: జమ్మూకశ్మీర్లో ప్రధానమంత్రి, సదర్–ఇ–రియాసత్ పదవులను ముఖ్యమంత్రి, గవర్నర్గా అధికారికంగా మార్చారు. 2018 డిసెంబర్ 20: జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు. 2019 జూలై 3: రాష్ట్రపతి పాలనను మరోసారి పొడిగించారు. 2019 ఆగస్టు 5: ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. 2019 ఆగస్టు 6: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ అడ్వొకేట్ ఎం.ఎల్.శర్మ సుప్రీంకోర్టులో కేసు వేశారు. తర్వాత మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 ఆగస్టు 9: జమ్మూకశ్మీర్ పునర్వ్యస్థీకరణ చట్టం–2019ను పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. 2019 సెప్టెంబర్ 19: ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ కోసం ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. 2023 ఆగస్టు 2: పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ మొదలైంది. 2023 సెపె్టంబర్ 5: మొత్తం 23 పిటిషన్లపై ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. తుది తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు వెల్లడించింది. 2023 డిసెంబర్ 11: ఆర్టికల్ 370 రద్దును సమరి్థస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. చరిత్రాత్మక తీర్పు ఆరి్టకల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం. ఇదొక చరిత్రాత్మక తీర్పు. ఇది కేవలం న్యాయపరమైన తీర్పుకాదు. భవిష్యత్తు తరాలకు ఒక ఆశాదీపం. మెరుగైన భవిష్యత్తుకు వాగ్దానం. మరింత బలమైన, ఐక్య భారత్ను నిర్మించుకొనే విషయంలో మన సమ్మిళిత కృషికి మద్దతుగా నిలుస్తుంది. జమ్మూకశీ్మర్, లద్దాఖ్లోని మన సోదర సోదరీమణుల ప్రగతి, ఐక్యత, ఆశను ప్రతిధ్వనించే తీర్పు ఇది. వారి కలలను నెరవేర్చే విషయంలో మన అంకితభావం చెదిరిపోనిది. భారతీయులుగా మనం గర్వపడే మన ఐక్యతను కోర్టు మరోసారి బలపర్చింది. ఆరి్టకల్ 370 వల్ల నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు ప్రగతి ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష – ‘ఎక్స్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంతో జమ్మూకశీ్మర్లో శాంతి నెలకొంది. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకప్పుడు హింసను అనుభవించిన ప్రజలు ప్రస్తుతం శాంతియుతంగా జీవిస్తున్నారు. వారి జీవితాల్లో అభివృద్ధికి కొత్త నిర్వచనం వచ్చిచేరింది. జమ్మూకశీ్మర్లో పర్యాటకం, వ్యవసాయ రంగాలు వెలిగిపోతున్నాయి. – అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి ప్రతీ భారతీయుడి మదిలో సంతోషం ఆరి్టకల్ 370, ఆరి్టకల్ 35ఏను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమరి్థంచింది. ఈ చరిత్రాత్మక నిర్ణయంతో ప్రతీ భారతీయుడి మదిలో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ ఒక కొత్త అధ్యాయం లిఖించారు. – రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి ప్రజలకు ఉజ్వలమైన భవిష్యత్తు జమ్మూకశీ్మర్, లద్దాఖ్ ప్రజల ఉజ్వలమైన భవిష్యత్తుకు సుప్రీంకోర్టు తీర్పు నాంది పలికింది. అభివృద్ధిని వారికి చేరువ చేయడానికి మోదీ సర్కారు కృషి చేస్తూనే ఉంటుంది. న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు ఇచి్చంది. అభివృద్ధి, సుపరిపాలన, సాధికారత జమ్మూకశీ్మర్, లద్దాఖ్ ప్రజలకు అందుతాయి. వారంతా ఇకపై కలిసికట్టుగా ఉంటారు – ఎస్.జైశంకర్, విదేశాంగ శాఖ మంత్రి ప్రజల పాలిట మరణ శాసనం ఆరి్టకల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు జమ్మూ కశీ్మర్ ప్రజల పాలిట మరణ శాసనం కంటే తక్కువేమీ కాదు. ఇది కేవలం ప్రజలకే కాదు, భారత్ అనే భావనకు పరాజయం. భారత పార్లమెంట్ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక, చట్టవ్యతిరేక చర్యకు నేడు న్యాయపరంగా ఆమోదం లభించింది. కోర్టు తీర్పుతో నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఏ నిర్ణయమూ తుది నిర్ణయం కాదు. జమ్మూకశీ్మర్ ప్రజలు రాజకీయ పోరాటం కొనసాగించాలి. – మెహబూబా ముఫ్తీ, పీడీపీ ఈ తీర్పు నిరాశ కలిగించింది సుప్రీంకోర్టు తీర్పు నాకు నిరాశ కలిగించింది. అయితే, ఉత్సాహం మాత్రం కోల్పోలేదు. న్యాయం కోసం సుదీర్ఘ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. జమ్మూకశీ్మర్ ప్రజల పోరాటం కొనసాగుతుంది. ఓటమి ఎదురైతే వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం. చట్టపరంగా ముందుకెళ్తాం – ఒమర్, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు రాష్టహోదా పునరుద్ధరించాలి ఆరి్టకల్ 370 రద్దుకు చట్టపరంగా ఆమోదం లభించింది. ఇక చెన్నై, కోల్కతా, హైదరాబాద్, ముంబై నగరాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఇక ఎవరూ అడ్డుకోలేరు. వాస్తవానికి ఆరి్టకల్ 370 రద్దు వల్ల జమ్మూ లోని డోంగ్రాలు, లద్దాఖ్లోని బౌద్ధులు ఎక్కువగా నష్టపోతారు. జమ్మూకశ్మీర్కు వెంటనే రాష్టహోదా పునరుద్ధరించాలి. రాబోయే లోక్సభ ఎన్నికలతోపాటే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం జాతీయ సమైక్యత బలోపేతం ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పు మన జాతీయ సమైక్యతను బలోపేతం చేస్తుంది. ఈ ఆరి్టకల్ను మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాం. ఆరి్టకల్ 370 రద్దుకు చట్టపరంగా మద్దతు లభించడం ఆహా్వనించదగ్గ పరిణామం. జమ్మూకశీ్మర్ ప్రజలకు ఇకపై ఎంతో మేలు జరుగుతుంది – సునీల్ అంబేకర్, ఆర్ఎస్ఎస్ ఆ తీర్పునకు చట్టపరంగా విలువ లేదు ఆర్టికల్ 370 విషయంలో భారత సుప్రీంకోర్టు తీర్పునకు చట్టపరంగా ఎలాంటి విలువ లేదు. భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న ఏకపక్షంగా, చట్టవ్యతిరేకంగా తీసుకున్న చర్యలను అంతర్జాతీయ చట్టాలు, న్యాయ వర్గాలు గుర్తించడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం జమ్మూకశీ్మర్ ప్రజలకు స్వయం ప్రతిపత్తి అనే హక్కు ఉంది. ఆ హక్కును వారి నుంచి ఎవరూ బలవంతంగా లాక్కోలేరు. భారత సుప్రీంకోర్టు తీర్పును మేము తిరస్కరిస్తున్నాం. పాక్ విదేశాంగ మంత్రి ప్రజల ఆకాంక్షలను కేంద్రం నెరవేర్చాలి జమ్మూకశీ్మర్కు తక్షణమే రాష్ట్రహోదా పునరుద్ధరించాలి. అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలకు కల్పించాలి. సుప్రీంకోర్టు తీర్పును కుణ్నంగా పరిశీలించాల్సి ఉంది. న్యాయస్థానం కొన్ని అంశాలను పక్కనపెట్టినట్లు కనిపిస్తోంది. పి.చిదంబరం, అభిõÙక్ సింఘ్వీ, కాంగ్రెస్ కోర్టు తీర్పు కలవరానికి గురిచేసింది సుప్రీంకోర్టు తాజా తీర్పు కొంత కలవరానికి గురిచేసింది. ఈ తీర్పు పర్యావసానాలు దేశ రాజ్యాంగ సమాఖ్య నిర్మాణంపై తీవ్రస్థాయిలో ఉంటాయనడంలో సందేహం లేదు. – సీపీఎం పొలిట్ బ్యూరో – సాక్షి, నేషనల్ డెస్క్ -
అయోధ్య ప్రశాంతం
లక్నో/అయోధ్య/న్యూఢిల్లీ: శతాబ్దాల నాటి మందిరం–మసీదు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు అనంతరం దేశవ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ హిందూ ముస్లిం నేతలతో సమావేశమై తీర్పు అనంతర పరిస్థితులపై చర్చించారు. కీలక తీర్పు వెలువరించిన ధర్మాసనంలోని జడ్జీల భద్రత కోసం అధికారులు ముందుజాగ్రత్తగా మరిన్ని చర్యలు తీసుకున్నారు. కాగా, కోర్టు తీర్పు ప్రకారం మసీదు కోసం ఐదెకరాల భూమిపై చర్చించేందుకు ఈ నెల 26న సున్నీ వక్ఫ్బోర్డు సమావేశం కానుంది. ఆలయ పట్టణం అయోధ్యలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పోలీసు బలగాల గస్తీ, తనిఖీలు కొనసాగుతున్నా పట్టణంలోని ప్రధాన ఆలయాల్లో ఆదివారం భక్తుల సందడి తిరిగి మొదలయింది. తీర్పు సందర్భంగా శనివారం నాటి ఉత్కంఠ, ఉద్రిక్త పరిస్థితులకు బదులుగా ఉత్సాహ పూరిత వాతావరణం కనిపించింది. హనుమాన్ గర్హి, నయాఘాట్ల వద్ద జరిగే శ్రీరామ, హనుమాన్ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. సుప్రీం తీర్పు, తదనంతర పరిణామాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రికాబ్గంజ్ తదితర ప్రాంతాల ప్రజలు వార్తా పత్రికలు చదివేందుకు ఆసక్తి చూపారు. ‘మాకిది చాలా అరుదైన, కొత్త శుభోదయం, ప్రత్యేకమైన ఆదివారం. అయోధ్య వివాదం శాశ్వతంగా పరిష్కారం కావడం ఎంతో ఊరట కలిగించింది’ అని అయోధ్యలోని ఓ హోటల్ మేనేజర్ సందీప్ సింగ్ అన్నారు. ‘రామ్లల్లాకు అనుకూలంగా తీర్పు రావడంతో పూలు, పూలదండలకు బాగా డిమాండ్ పెరుగుతుందని వారణాసి తదితర నగరాల నుంచి అదనంగా తెప్పిస్తున్నాం’ అని పూల దుకాణం యజమాని అనూప్ తెలిపారు. శనివారం హోం మంత్రి బిజీబిజీ తీర్పు వెలువడిన శనివారం హోం మంత్రి అమిత్ షా మిగతా కార్యక్రమాలన్నిటినీ రద్దు చేసుకున్నారు. తీర్పు అనంతర పరిస్థితులపై వివిధ రాష్ట్రాల సీఎంలు, సీనియర్ పోలీసులు, నిఘా విభాగాల అధికారులతో ఆయన రోజంతా మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి. తాజా పరిస్థితులపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ ధోవల్ ప్రముఖ హిందు, ముస్లిం నేతలతో సమావేశమయ్యారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మత పెద్దలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. యూపీలో 77 మంది అరెస్ట్ ఉత్తరప్రదేశ్లో సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టి మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన 77 మందిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 34 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా సామాజిక మాధ్యమాల్లోని 8,275 పోస్టింగ్లపై చర్యలు తీసుకోగా, అందులో 4,563 పోస్టులు ఆదివారం పోస్టు చేసినవిగా తెలిపారు. మధ్యప్రదేశ్లోనూ అభ్యంతరకర పోస్ట్లు పెట్టిన 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 26న సున్నీ వక్ఫ్ బోర్డు భేటీ మసీదు నిర్మాణానికి ఐదెకరాల భూమిని కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు సున్నీ సెంట్రల్ వక్ఫ్బోర్డు ఈనెల 26వ తేదీన సమావేశం కానుంది. ఆ ఐదెకరాల భూమిని తీసుకోవాలా వద్దా అనే విషయమై ఆ సమావేశంలో నిర్ణయిస్తామని యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు చైర్మన్ జఫర్ ఫరూఖీ తెలిపారు. ‘కోర్టు తీర్పును సవాల్ చేసే ఉద్దేశం మాకు లేదు. అయితే, మసీదు కోసం ఆ స్థలాన్ని తీసుకోరాదని కొందరు.. ఆ స్థలంలో విద్యా సంస్థను ఏర్పాటు చేసి, పక్కనే మసీదు నిర్మిస్తే బాగుంటుందని మరికొందరు అంటున్నారు. దీనిపై వివరంగా చర్చిస్తాం’అని ఫరూఖీ వెల్లడించారు. జడ్జీలకు భద్రత పెంపు అయోధ్య కేసు తీర్పును ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు జడ్జీలకు భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది. ‘ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, కాబోయే సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ అబ్దుల్ నజీర్ల నివాసాల వద్ద అదనపు బలగాలను మోహరించాం. వీరి నివాసాలకు దారితీసే రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశాం. ఈ జడ్జీల వాహనాల వెంట సాయుధ బలగాలతో ఎస్కార్ట్ వాహనం ఉంటుంది’అని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. 7 భాషలు, 533 డాక్యుమెంట్లు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అయోధ్య భూవివాదానికి సంబంధించిన తీర్పు కోసం సుప్రీంకోర్టు భారీ కసరత్తే చేసింది. సంస్కృతం, హిందీ, ఉర్దూ, పర్షియన్, టర్కిష్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లోని చరిత్ర, సంస్కృతి, పురావస్తు, మత పుస్తకాలను తిరగేసింది. ఇవేకాక మత సంబంధిత కావ్యాలు, యాత్రా వర్ణనలు, పురావస్తు నివేదికలు, బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందరి చిత్రాలు, గెజిటీర్లు, స్థూపాలపై గల శాసనాల అనువాదాలు, ఇలా 533 డాక్యుమెంట్లను పరిశీలించింది. -
‘గృహ’ కుంభకోణంలో 48 మందికి శిక్షలు
సాక్షి, ముంబై: జల్గావ్ గృహనిర్మాణ పథకం కుంభకోణంలో ధులే జిల్లా కోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో ప్రము ఖులైన మాజీ మంత్రి, శివసేన నేత సురేష్ జైన్, ఎన్సీపీ నేత గులాబ్రావ్ దేవకర్లతోపా టు మొత్తం 48 మందిని జల్గావ్ జిల్లా కోర్టు దోషులుగా ప్రకటించింది. వీరిలో సురేష్ జైన్కు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది. గులాబ్రావు దేవకర్కు అయిదేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా, బిల్డర్ జగన్నాథ్ వాణీ, రాజేంద్ర మయూర్లకు ఏడేళ్ల జైలు, రూ.40 కోట్ల జరిమానా, ప్రదీప్ రాయసోనికి అయిదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 1999లో జల్గావ్ మున్సిపాలిటీ ప్రారంభించిన గృహనిర్మాణ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయి. -
నేడు జస్టిస్ చలమేశ్వర్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు జడ్జీల్లో ప్రధాన న్యాయమూర్తి తరువాత అత్యంత సీనియర్ అయిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు. శనివారంతో ఆయనకు 65 ఏళ్లు పూర్తవుతున్నాయి. జస్టిస్ చలమేశ్వర్ సుమారు ఏడేళ్లు సుప్రీంకోర్టులో జడ్జీగా విధులు నిర్వర్తించారు. తన కోసం వీడ్కోలు సమావేశం నిర్వహించొద్దని ఆయన సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్కు ఇది వరకే విజ్ఞప్తి చేశారు. ముక్కుసూటి మనిషిగా పేరొందిన చలమేశ్వర్ పలు చారిత్రక తీర్పులు వెలువరించిన బెంచ్లలో సభ్యుడిగా పనిచేశారు. జనవరి 12న జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లతో కలసి జస్టిస్ చలమేశ్వర్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా కేసులను కేటాయిస్తున్న తీరును తప్పుపట్టడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గోప్యతా హక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని చారిత్రక తీర్పునిచ్చిన 9 మంది జడ్జీల సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ చలమేశ్వర్ కూడా ఉన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ కురియన్ పేరును సుప్రీం జడ్జి పదవికి ప్రతిపాదించిన ఐదుగురు సభ్యుల కొలీజియంలోనూ ఉన్నారు. కృష్ణా జిల్లా నుంచి అత్యున్నత స్థానానికి.. 1953, జూన్ 23న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, మొవ్వ మండలం, పెద్ద ముత్తెవి గ్రామంలో జన్మించిన చలమేశ్వర్..మచిలీపట్నంలో పాఠశాల విద్య పూర్తిచేశారు. చెన్నైలోని లయోలా కళాశాలలో బీఎస్సీ(భౌతికశాస్త్రం) అభ్యసించారు. 1976లో విశాఖపట్నంలోని ఆంధ్రా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1995లో ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్గా నియమితులయ్యారు. 1999లో ఏపీ హైకోర్టులో జడ్జిగా పదోన్నతి పొందా రు. 2007లో గౌహతి హైకోర్టు సీజేగా, 2010లో కేరళ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. -
చరిత్రాత్మక తీర్పునిచ్చిన న్యాయమూర్తులు వీరే...
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ దేశ సర్వోన్నత న్యాయస్థానం 44వ ప్రధాన న్యాయమూర్తి జగదీశ్ సింగ్ ఖేహర్ ఈ నెల 27న(ఆదివారం) పదవీ విరమణ చేయనున్నారు. సిక్కు మతస్థుల నుంచి ఈ అత్యున్నత స్థానాన్ని చేరుకున్న తొలి వ్యక్తిగా ఆయన ప్రత్యేకతను సాధించారు. ఈ ఏడాది జనవరి 4న ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన ఆయన, 2011 సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఉత్తరాఖండ్, కర్ణాటక హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్గా బాధ్యతలను నిర్వహించారు. 2జీ కుంభకోణం కేసులో, సహారా సంస్థ చీఫ్ సుబ్రతా రాయ్ కేసులో కీలక తీర్పులిచ్చారు. అరుణాచల్ప్రదేశ్లో విధించిన రాష్ట్రపతి పాలనను కేంద్రం విరమించుకునేలా ఆయన తీర్పునిచ్చారు. తాజాగా ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్ కేసులో మెజారిటీ తీర్పును (3 ః 2 నిష్పత్తితో) విభేదిస్తూ మైనారిటీ తీర్పును వెలువరించారు. ఈ ఆచారాన్ని గత 1,400 ఏళ్లుగా ఆచరిస్తున్నందున, దీనిలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించాలని, ఆరునెలల్లోగా తగిన చట్టాన్ని తీసుకొచ్చేందుకు రాజకీయపార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలంటూ తమ తీర్పులో సూచించారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాకు చెందిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 2011 అక్టోబర్ 10న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జీల సీనియారిటీలో మూడోస్థానంలో ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో జడ్జీగా పదోన్నతి పొందడానికి ముందు గువహటి, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను నిర్వహించారు. ఎవరైనా ఈ–మెయిల్స్ లేదా ఎలక్ట్రానిక్ మెసేజ్లలో పెట్టే పోస్టుల ద్వారా సంబంధిత వ్యక్తులను అసౌకర్యానికి, కోపానికి గురిచేస్తే వారిని పోలీసులు అరెస్ట్ చేసే హక్కును కల్పించే ఐటీ యాక్ట్ లోని 66 (ఏ) సెక్షన్ను కొట్టేస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఒకరిగా ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జీగా 2018 జూన్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ ఎస్ఏ బోబ్డే బొంబాయి హైకోర్టు జడ్జీగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాక 2013 ఏప్రిల్ 12న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆధార్ కార్డు లేని కారణంగా దేశ పౌరుడికి ఎవరికి కూడా ప్రాథమిక, ప్రభుత్వ సేవలను నిరాకరించరాదంటూ 2015లో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఇచ్చిన స్పష్టీకరణలో బోబ్డే భాగస్వామిగా ఉన్నారు. జస్టిస్ ఆర్కే అగర్వాల్ 2013 అక్టోబర్లో మద్రాసు హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఆర్కే అగర్వాల్ నియమితులయ్యారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ రోహింగ్టన్ ఫాలి నారిమన్ 1979లో న్యాయవాదిగా తమ కెరీర్ను ప్రారం భించిన ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పలు కేసులను వాదించారు. 2011 జూలై 27–2013 ఫిబ్రవరి 4 మధ్యకాలంలో భారత సోలిసిటర్ జనరల్గా పనిచేశారు. 2014 జూలై 7న సుప్రీంకోర్టు జడ్జీగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికప్పుడు ఇచ్చే విడాకులు (ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్) రాజ్యాంగ విరుద్ధమంటూ తాజాగా సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జీల్లో ఒకరిగా ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో కించపరిచే పోస్టులపై దాఖలైన పిటిషన్లో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోని సెక్షన్ 66 (ఏ)ను కొట్టేస్తూ తీర్పునిచ్చిన ఇద్దరు జడ్జీల్లో ఈయన ఒకరు. జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే మణిపూర్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన అనంతరం 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ మానవహక్కుల విషయంలో చంద్రచూడ్ నైపుణ్యతను సాధించారు. బొంబాయి హైకోర్టు జడ్జీగా, అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను నిర్వహించారు. 2016 మే 13న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2017 ఫిబ్రవరిలో నియమితులయ్యారు. గతంలో పంజాబ్, హరియాణా, మద్రాస్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగానూ విధులు నిర్వర్తించారు. ప్రఖ్యాత చిత్రకారుడు ఎమ్మెఫ్ హుస్సేన్ వేస్తున్న పెయింటింగ్లలో అశ్లీలత ఉందంటూ 2008లో దాఖలైన పిటిషన్ను కౌల్ తిరస్కరించారు. జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ 1958లో కర్ణాటకలోని మూడ్బిద్రీలో జస్టిస్ నజీర్ జన్మించారు. బీకామ్ ఆ తర్వాత న్యాయశాస్త్ర పట్టాను పొందాక 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్ 24న అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఉన్నపళంగా 3 పర్యాయాలు తలాక్ (ఇన్స్టంట్ ట్రిపుల్ తలాక్) చెప్పడం చట్టవిరుద్ధమంటూ ఇచ్చిన తీర్పును విభేదిస్తూ చీఫ్ జస్టిస్ ఖేహర్ ఇచ్చిన మైనారిటీ తీర్పుతో జస్టిస్ నజీర్ ఏకీభవించారు.