breaking news
hindi imposition
-
దిగొచ్చిన ‘మహా’ సర్కారు.. 'హిందీ తప్పనిసరి' తీర్మానం రద్దు
ముంబై: దేశ వ్యాప్తంగా అమలు చేయాలని చూస్తున్న ‘త్రి భాషా విధానం’లో భాగంగా హిందీని తప్పనిసరి చేయాలనే అంశంపై పలు రాష్ట్రాల్లో తీవ్ర నిరసలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా ఈ సెగ గట్టిగానే ఉండటంతో ఫడ్నవీస్ సర్కార్ వెనక్కి తగ్గింది. ఈ త్రి భాషా విధానం పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించే పనిలో పడింది. గత ఉద్ధవ్ ఠాక్రే సర్కారే దీనికి ఆమోదం తెలిపి, ఇప్పుడు నిరసనలకు పిలుపునివ్వడంపై ఫడ్నవీస్ తప్పుబడుతున్నారు. మహారాష్ట్రలో మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు ఒకటో తరగతి నుంచే అమలు చేయాలని ఉద్ధవ్ సర్కార్ అప్పుడు నిర్ణయం తీసుకుని, ఇప్పుడు ఎందుకు దీనిని వ్యతిరేకిస్తున్నారని సీఎం ఫడ్నవీస్ ప్రశ్నించారు. త్రి భాషా విధానంపై శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో నిరసన సెగ తీవ్రతరమైంది. హిందీని తప్పనిసరి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తీర్మానాన్ని వ్యతిరేకించాలని, దానికి సంబంధించిన తీర్మానం ప్రతులను చించి వేయాలని శివసేన(యూబీటీ) చీఫ ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించారు. దక్షిణ ముంబైలో జరిగే నిరసన కార్య క్రమానికి నేటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే ఆ పాలసీని రద్దు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
హిందీని బలవంతంగా రుద్దొద్దు.. కేంద్రానికి స్టాలిన్ లేఖ
చెన్నై: హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దని కేంద్రానికి లేఖ రాశారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అది భాషాయుద్ధానికి దారి తీస్తుందని హెచ్చరించారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ నిలయమని, అన్ని భాషలను సమానంగా చూడాలని సూచించారు. దేశంలోని అన్ని భాషలను అధికారిక భాషలుగా గుర్తించే స్థాయికి మనం చేరుకోవాలని పేర్కొన్నారు. భారత సమగ్రతను కాపాడాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాన్ని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు లేఖలో పేర్కొన్నారు. దేశంలోని ఐఐటీలు, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు హిందీలో పాఠాలు బోధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసిన మరునాడే స్టాలిన్ లేఖ రాశారు. మాతృభాషను ఆరాధించే ఏ రాష్ట్రమైనా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. 'హిందీ దివస్' సందర్భంగా హిందీ అధికారిక భాష అని అమిత్ షా చెప్పిన విషయాన్ని స్టాలిన్ గుర్తు చేశారు. దేశంలోని మెజారిటీ విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థులు హిందీ మాట్లాడరని అన్నారు. హిందీ మాట్లాడేవారిని ఫస్ట్ క్లాస్ సిటిజెన్లుగా, మాట్లాడని వారిని సెకండ్ క్లాస్ సిటిజెన్లుగా చూస్తే అది కచ్చితంగా 'విభజించు పాలించు' విధానమే అవుతుందని వ్యాఖ్యానించారు. మరో దక్షిణాది రాష్ట్రం కేరళ కూడా హిందీని బలవంతంగా రుద్దొద్దని ఇప్పటికే స్పష్టం చేసింది. రాజ్యాంగ స్ఫూర్తికి, దేశంలో భాషా వైవిధ్యానికి ఇది పూర్తి విరుద్ధమని పేర్కొంది. భారత వైవిధ్యాన్ని బీజేపీ ఎప్పుడూ విశ్వసించదని కేరళ మాజీ మంత్రి టీఎం థామస్ విమర్శించారు. 'ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే దేశం' అనే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం -
Sakshi Cartoon: ..వ్యతిరేకించేది ప్రతిపక్షపార్టీవాళ్లు కాద్సార్! మన పార్టీ నాయకులే!
..వ్యతిరేకించేది ప్రతిపక్షపార్టీవాళ్లు కాద్సార్! మన పార్టీ నాయకులే! -
నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టద్దు
-
నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టద్దు
'నిద్ర పోతున్న సింహాన్ని అనవసరంగా రెచ్చగొట్టద్దు' అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎండీఎంకే నాయకుడు వైగో తీవ్ర హెచ్చరికలు పంపారు. ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలలో హిందీని తప్పనిసరిగా వాడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై తమిళనాట బీజేపీ మిత్రపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న పీఎంకే, ఎండీఎంకే రెండూ కూడా.. బీజేపీ వైఖరిని తప్పుబట్టాయి. అందులో భాగంగానే ఎండీఎంకే నాయకుడు వైగో ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీని రుద్దాలన్న నిర్ణయించడాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించదని, గతంలో కూడా రక్తమోడ్చి తాము హిందీపై పోరాడామని, ఇప్పుడు మళ్లీ రెచ్చగొట్టద్దని ఆయన అన్నారు. పీఎంకే నాయకుడు ఎస్ రాందాస్ కూడా హిందీ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. హిందీ అధికారభాష కాబట్టే దాన్ని అందరిపై రుద్దుతున్నారని, దీనికి పరిష్కారంగా దేశంలోని మొత్తం 22 భాషలనూ అధికార భాషలుగా ప్రకటించాలని ఆయన చెప్పారు.