breaking news
hemanth reddy
-
జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ మూకలు
సాక్షి టాస్్కఫోర్స్: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డిని బయటకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ మూకలు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. ఆయన ఇంటిపక్కనే షామియానాలు ఏర్పాటు చేసి టీడీపీ, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రౌడీలు కర్రలు చేతబూని ఓటర్లను యథేచ్ఛగా భయబ్రాంతులకు గురి చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేదు. ఒకవేళ అటువైపు పోలీసులు వెళ్లినా టీడీపీ కార్యకర్తలు వారిని లెక్క చేయలేదు. కాగా.. తుమ్మలపల్లె పోలింగ్ బూత్ సమీపంలోనే టీడీపీ నేతలు షామియానాలు వేసి వందలాది మందికి టిఫిన్, భోజనాలు పెట్టారు. -
Pulivendula: ఎక్కడికక్కడ పోలింగ్ బూత్లను ఆక్రమించుకున్న టీడీపీ మూకలు
-
టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారు: హేమంత్రెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారంటూ పులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నా కానీ పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘నా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారు. కర్రలు, రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారు. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు’’ అంటూ హేమంత్రెడ్డి నిప్పులు చెరిగారు.ఆర్.తుమ్మలపల్లిలో టీడీపీ మూకలు అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ గూండాలు.. ఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలా కాస్తున్నారు. ఎస్ఫీకి కాల్ చేసినా ఫలితం కనిపించలేదు. హేమంత్ గన్మెన్ని ఉన్నపళంగా అధికారులు మార్చేశారు. నిన్నటి వరకు ఉన్న గన్మెన్ను తొలగించి మరొకరిని పంపించారు. బయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గూండాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు.నల్లపురెడ్డిపల్లిలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. స్వయం ప్రతిపత్తి ఎలక్షన్ కమిషన్ చెప్పే మాటలన్నీ నీట మూటలయ్యాయి. వైఎస్సార్సీపీ ఏజెంట్లను, ఓటర్లను టీడీపీ గుండాలు నిర్భందించారు. ఏజెంట్గా ఉన్న మాజీ ఎంపీపీ బలరాంరెడ్డిని బూత్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓటేసేందుకు అడ్డుకుంటున్నారని సామాన్య ఓటర్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే టీడీపీ అరాచక శక్తులకు అండగా ఉన్నారని మాజీ ఎంపీపీ బలరాం రెడ్డి మండిపడ్డారు. మాపై దాడులు చేసేందుకు టీడీపీ గుండాలు ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగు నుంచి టీడీపీ గుండాలు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఓటేసేందుకు వెళ్తే ఓటర్ స్లిప్పులను చించేశారంటూ ఓటర్ల ఆవేదన వ్యక్తం చేశారు. -
ఎయిర్గన్తో యువకుడు హల్చల్..అరెస్ట్
హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడు ఎయిర్గన్తో హల్చల్ సృష్టించాడు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్పేట సమీపంలో ఇంజనీరింగ్ విద్యార్థి హేమంత్రెడ్డి శుక్రవారం అర్ధరాత్రి ఎయిర్గన్తో పలువురిని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఎయిర్గన్తో పాటు 12 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రియుడి కోసం అమెరికా నుంచి బెజవాడకు
విజయవాడ: ఓ ఎన్నారై యువతి విజయవాడలో ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే భర్తను కాదని మానస అనే యువతి ప్రియుడి కోసం విజయవాడకు వచ్చింది. తీరా ఆమె విజయవాడ వచ్చాక ప్రియుడు హేమంత్ రెడ్డి పత్తా లేకుండా పోయాడు. అతడి కోసం ఫోన్ చేసిన ఫలితం లేకపోవడంతో మానస బంధువుల ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని గమనించిన బంధువులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా హేమంత్ కోసం ఫోన్ చేస్తే వాళ్ల కుటుంబసభ్యుడు కట్నం కోసం డిమాండ్ చేస్తున్నారని మానస ఆరోపించింది. మరోవైపు ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంటికి వచ్చేందుకు అనుమతించడం లేదు. వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన మానస చిన్ననాటి స్నేహితుడైన హేమంత్ రెడ్డి ప్రేమించుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఓ ఎన్నారైని గత డిసెంబర్లో పెళ్లి చేసుకుంది. మానస అమెరికాకు వెళ్లినప్పటి నుంచి హేమంత్ పెళ్లి చేసుకుంటానని ఫోన్లో చెప్పాడు. ప్రియుడితో కలిసి జీవించాలనుకున్న మానస విషయాన్ని భర్తకు చెప్పి...హేమంత్ కోసం అమెరికా నుంచి విజయవాడకు వచ్చింది. ఈలోగా...హేమంత్ రెడ్డి కనిపించకుండా పోవడంతో... తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లింది. వాళ్లు ఇంట్లోకి రావద్దని చెప్పడంతో బంధువుల ఇంట్లో చేరింది. అక్కడ ఉంటూనే ప్రియుడిని కలిసేందుకు ప్రయత్నించింది. ఎంతకీ ఫోన్ కలవకపోవడంతో..హేమంత్ ఇంటికి ఫోన్ చేసింది. వాళ్లు కట్నం డిమాండ్ చేయడంతో ..వేరే దారి లేక నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. మానస పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్తను వదిలి వచ్చిన మానసను కట్నం పేరుతో మోసం చేయడం సరైన పద్దతి కాదంటున్నారు బంధువులు. ఎలాగైనా పోలీసులే మానసకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
పెళ్లి రోజే గృహిణి ఆత్మహత్య
భర్తే హత్య చేశాడని కుటుంబ సభ్యుల ఆరోపణ అత్త మామలు, భర్త అరెస్టు కాటేదాన్, న్యూస్లైన్: తాగుబోతు భర్త వే ధింపులు తట్టుకోలేక ఓ గృహిణి పెళ్లిరోజే తనువు చాలించింది. మైలార్దేవ్పల్లి ఎస్సై మహేంద్రనాథ్ కథనం ప్రకారం... మహబూబ్నగర్ జిల్లా, కొత్తకోటకు చెందిన నరేందర్రెడ్డి(30), రాధ(26) భార్యాభర్తలు. వీరికి హేమంత్రెడ్డి(4), అవిక(8 నెలలు) సంతానం. కాగా వీరి కుటుంబం లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్ప ఫేజ్ 2, ఫ్లాట్నెంబర్ 32లో స్థిరపడింది. ఆటోడ్రైవర్గా పనిచేసే నరేందర్రెడ్డి తాగుడుకు బానిసై తరచూ భార్యను వేధించసాగాడు. ఇదిలావుండగా, సోమవారం వీరి పెళ్లిరోజు కావడంతో ఇంటికి బంధువులు వచ్చారు. అంతా కలిసి గుడికెళ్లి వచ్చారు. అనంతరం రాత్రి బంధువులు డాబాపైన పడుకోగా, నరేందర్రెడ్డి, రాధలు ఇంట్లో పడుకున్నారు. అప్పటికే తాగినమైకంలో ఉన్న భర్త రాధను తీవ్రంగా కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన నరేందర్రెడ్డి.. రాధ మృతదేహాన్ని కిందకు దింపి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటనను గుర్తించిన బంధువులు, స్థానికులు నరేందర్రెడ్డికి దేహశుద్ధి చేయగా, జరిగిన విషయాన్ని వెల్లడించాడు. అయితే, రాధను భర్తే హత్య చేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతురాలి భర్త నరేందర్రెడ్డితో పాటు అత్తమామలు విమలమ్మ(45), నాగిరెడ్డి(50)లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తల్లి మరణించి, తండ్రిని పోలీసులు తీసుకెళ్లడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.