breaking news
Hasnapur
-
ఆదిలాబాద్ జిల్లాలో తొలి కరోనా కేసు
సాక్షి,ఆదిలాబాద్: జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయింది. ఉట్నూరు మండలం హస్నాపూర్ గ్రామానికి చెందిన ఒకరికి (24) పాటిజివ్గా నిర్థారణ అయింది. అతడు ఇటీవలే ఢిల్లీ మర్కజ్లోని మత ప్రార్థనల్లో పాల్గొని తిరిగి వచ్చాడు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల్లో అతడికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్థారించారు. కాగా జిల్లాలో ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన 67 మందికి సంబంధించి నమూనాలను హైదరాబాద్కు పంపగా వాటి ఫలితాలు శనివారం వెలువడ్డాయి. కరోనా సోకిన వ్యక్తితో పాటు 15మంది కుటుంబ సభ్యులను ఆదిలాబాద్లోని క్వారంటైన్కు తరలించారు. (అనారోగ్యమా.. అయితే ఫోన్ చేయండి) నమూనాలు హైదరాబాద్కు.. ఢిల్లీలోని మర్కజ్కు మత ప్రార్థనలకు వెళ్లి తిరిగి వచ్చిన వారి సంఖ్య 67మంది కాగా వారికి సంబంధించి స్వాబ్ నమూనాలు గురువారం హైదరాబాద్కు పంపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే జిల్లాకు ఎక్కువ మంది మార్చి 18న ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. వీరి స్వాబ్ నమూనాలను హైదరాబాద్కు పంపించినప్పటికీ అందరిని జిల్లా కేంద్రంలో ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లలో ఉంచడం జరిగింది. (మాస్క్ల్లేవ్.. మేం రాం!) కుటుంబ సభ్యుల హోం క్వారంటైన్.. మర్కజ్ నుంచి తిరిగి వచ్చిన వారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో ఉండగా వారి కుటుంబ సభ్యులను గుర్తించి హోం క్వారంటైన్ చేశారు. ఒక వేళ హైదరాబాద్ నుంచి వచ్చే నమూనాల ఫలితాల్లో ఎవరికైనా పాజిటివ్ ఉన్న పక్షంలో వారి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేసే అవకాశం ఉంది. ఏదీ ఏమైనా కరోనా వైరస్ వ్యాప్తి నిరోదానికి ఇటు అధికారులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఆశా వర్కర్లు నిరంతరంగా శ్రమిస్తున్నారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకే వారు ప్రయత్నిస్తుండగా కరోనా కేసు అనుమానితులు వారికి సహకరించాలన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. కరోనా వైరస్ నివా రణపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. (హై రిస్క్ మహా నగరాలకే..!) క్వారంటైన్కు ఏడుగురు యువకులు బజార్హత్నూర్(బోథ్): హైదరాబాద్ నుంచి వచ్చిన మండలంలోని గిరిజాయి గ్రామానికి చెందిన ఏడుగురు యువకులను శుక్రవారం తహసీల్దార్ జాకీర్, ఎస్సై ఉదయ్కుమార్, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సురేష్ వైద్య పరీక్షలు చేసి ఈ నెల 14 వరకు గిరిజాయి గ్రామ సమీపంలోని కమ్యూనిటీ భవనంలో క్వారంటైన్ హోం చేశారు. తహసీల్దార్ మాట్లాడుతూ యువకులు వలస కూలీలుగా హైదరాబాదులో మేస్త్రీ పనులు చేస్తూ ఉపాధి పొందేవారని, మూడు నెలలు పనులు జరుగవేమోనన్న భయంతో రవాణా సౌకర్యాలు లేక హైదరాబాద్ నుంచి ఆరు రోజుల క్రితం కాలినడకన బయలుదేరి గురువారం రాత్రి 10గంటలకు బజార్హత్నూర్ చేరుకున్నారని తెలిపారు. (తెలంగాణలో ఒక్క రోజే 75 కేసులు) వారిని రోడ్డుపై గుర్తించిన ఎస్సై ఉదయ్కుమార్ రాత్రి భోజనం పెట్టించి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో వసతి ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం వారందరికీ వైద్య పరీక్షలు చేయగా కరోనాకు సంబంధించి ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కొన్ని రోజుల వరకు హోం క్వారంటైన్లో ఉండాలని, జల్బు, జ్వరం, దగ్గు ఏ లక్షణాలు ఉన్నా మండల కేంద్రంలోని పీహెచ్సీకి రావాలని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పర్చ సాయన్న, ఏఎస్సై దామన్, వీఆర్వో ఆనీస్, సూపర్వైజర్ దేవిదాస్ పాల్గొన్నారు. -
అధ్వానంగా హస్నాపూర్..
లోపించిన పారిశుధ్యం..విజృంభిస్తున్న దోమలు.. వెదజల్లుతున్న దుర్వాసన పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆందోళనలో గ్రామస్తులు ఉట్నూర్ రూరల్ః మండలంలోని హస్నాపూర్ గ్రామంలో పారి శుద్యం లోపించి అధ్వానంగా మారింది. అదేదో మారుమూల గ్రామం కాదు ఆదిలాబాద్ - ఆసిఫాబాద్ ప్రధాన రహాదారికి ఈ గ్రామం ఆనుకొని ఉంది. గత కొన్ని రోజులుగా ఏకదాటిగా కురిసిన వర్షానికి మురికి కాలువల్లో పూడిక నిండి ఉండటంతో గ్రామంలో నీరు ఎక్కడిక్కడ నిలిచి దోమల విజృభనకు స్థావరంగా మారుతున్నాయి. జిల్లా ఉన్నతధికారులు పారిశుద్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని, క్లోరినేషన్ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశా లు ఇస్తున్న ఇక్కడి అధికారులకు ఆదేశాలు వర్తించవేమోనని ఈ గ్రామ పరి స్థితిని చూస్తే అనిపిస్తోంది. గ్రామంలో ఎక్కడ చూసిన పా రిశుద్యం లోపించి అ ధ్వానంగా దర్శనమిస్తోంది. ప్రధాన రహా దారి పక్కన బురదతో ఉంది. ఈ రహా దారిపై మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీఓలు ప్రయాణిస్తుంటారు.. కాని ఈ పరిస్థితి పట్టించుకునే నాథులు కానరావడం లేదు. గ్రామంలో ఉన్న ఇండ్ల చుట్టూ వరద నీరు చేరి బురదమయంగా మారింది. మురికికాలువలు లేక మురికి నీరు ఎక్కడిక్కడ నిలిచి దర్శనమిస్తోంది. పనిచేయని నీటి మోటారు.. గ్రామానికి నీటి సరఫరా చేసే మంచి నీటి మోటారు చెడి పోయి 4 నెలలు గడుస్తున్నప్పటికీ మరమ్మత్తులు చేయడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ మోటారు దాదాపు 50 కుటుంబాలకు నీటిని అందిస్తుంది. గ్రామస్తులు ఉపయోగించే బావి ఇది వరకు ఒకే సారి క్లోరినేషన్ చేపట్టారని, వర్షానాకి నీళ్లు మురికిగా అయ్యాయని క్లోరినేషన్ చేపట్టాలని కోరుతున్నారు. పట్టించుకునే వారు లేకుండా పోయారు. అధ్వానంగా రోడ్లు.. గ్రామంలో ఉన్న సీసీ రోడ్లపై పక్కలకు మట్టి చేరి నీరు రోడ్డుపైనే ఆగుతున్నాయి. దీంతో గ్రా మంలో రోడ్డు ఉండి నడవటానికి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు లేని ప్రాం తాల్లో బురదమంగా మారింది. ప్రధాన రోడ్డుకు ఇరువైపుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ఇక గ్రామ రోడ్లు ఏ విధంగా ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైన మట్టి తీసి రోడ్లు శుభ్రపర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇళ్ల చుట్టూ అపరిశుభ్రతే.. వర్షపు నీరు చేరి గ్రామంలో పలు ఇండ్ల చుట్టు మురికి నీరు నిలిచి అధ్వానంగా మారాయి. సీసీ రోడ్లు పగుళ్లు తేలాయి. మురికి కాలువల్లో పూడిక నిండి కాలువ జాడ లేకుండా పోయింది. దీంతో వరద నీరు ఇండ్లలో చేరుతుంది. ఈ విషయమై ఎన్నో సార్లు అధికారులకు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకున్న పాపాన పోవడం లేదని గ్రామస్తులు ఆవేధన వ్యక్తం చే స్తున్నారు. ఇప్పటికైన సంబందిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గ్రామ సమస్యలు పరిష్కరిస్తారని ఎదురుచూస్తున్నారు. మోటారు మరమ్మతు చేయించాలి నీటి కోసం గోస అయితాంది. తమకు నీరు అందించే మోటారు నాలుగు నెలల క్రితం పాడైపోయింది. బాగు చేయిస్తామని తీసుకువెళ్లి నాలుగు నెలలు గడుస్తున్న ఇంత వరకు తీసుకువచ్చి బిగించలేదు. - ఉషాబాయి, గ్రామస్తురాలు రోడ్లు మంజూరు చేయాలి గ్రామంలో సీసీ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. చినుకు పడితే రోడ్డు చిత్తడిగా మారుతోంది. దీంతో నడవటానికి సైతం ఇబ్బందిగా ఉంది. రోడ్డు ఏర్పాటు చేసి చుట్టు పక్కల మురికి కాలువలు ఏర్పాటు చేసి తమసమస్యలు పరిష్కరించాలి. - షేక్ జిలాని, గ్రామస్తుడు అధికారులు స్పందించాలి.. రోడ్లన్ని పగుళ్లు తేలాయి. మురికి కాలువలు పూడికతో నిండి పోయాయి. ఎన్నో సార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించాం. చేద్దాం, చూద్దాం అనటమే తప్ప నేటికి తమ సమస్యలు పరిష్కరించడం లేదు. ఇప్పటికైన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలి. - రాథోడ్ లాల్సింగ్, గ్రామస్తుడు రోడ్లు ఏర్పాటు చేయాలి.. సీసీ రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నాం చినుకు పడితే రోడ్డు చిత్తడిగా తయారు అయితంది. నడువడానికి ఇబ్బందిగా ఉంది. అధికారులు రోడ్లు, మురికి కాలువలను ఏర్పాటు చేయాలి. మా సమస్యలు పరిష్కరించాలి. - దేవుకాబాయి, గ్రామస్తురాలు