-
బైక్ కొనుగోలుపై రూ.5.30 లక్షలు డిస్కౌంట్.. వివరాలు
పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'హార్లే డేవిడ్సన్' చేరింది. హార్లే డేవిడ్సన్ ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. పాన్ అమెరికా 1250 స్పెషల్ అడ్వెంచర్ టూరర్ మీద సంస్థ రూ. 3.25 లక్షలు తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ బైక్ ధర రూ. 21.24 లక్షలకు చేరింది. స్పోర్ట్స్టర్ ఎస్ కొనుగోలు మీద కూడా ఇదే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ కొనాలనుకునే వారు రూ. 15.54 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. నైట్స్టర్ మీద ప్రస్తుతం రూ. 5.25 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడు రూ. 12.24 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. నైట్స్టర్ స్పెషల్ బైక్ మీద కంపెనీ ఏకంగా రూ.5.30 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 12.99 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. హార్లే డేవిడ్సన్ 2022 మోడల్స్ మీద కూడా డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో 2022 నైట్స్టర్ మీద రూ. 4.30 లక్షలు, స్పోర్ట్స్టర్ ఎస్ మీద రూ. 4.45 లక్షలు, పాన్ అమెరికా స్పెషల్ మీద రూ. 4.90 లక్షల తగ్గింపు లభిస్తుంది. Note: కంపెనీ అందించే డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే కాకుండా, ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. కస్టమర్లు ఖచ్చితమైన డిస్కౌంట్స్ తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
త్వరలో మార్కెట్లోకి హ్యార్లీ డేవిడ్సన్ సూపర్ ఎలక్ట్రిక్ బైక్స్
న్యూఢిల్లీ: దేశంలో ఇందన ధరలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. కొద్దీ కాలం నుంచే ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ విషయంలో పెద్ద పెద్ద కంపెనీలు అటు వైపు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రఖ్యాత అమెరికన్ కంపెనీ హ్యార్లీ డేవిడ్సన్ కూడా వచ్చి చేరింది. అయితే, వినియోగదారులు మాత్రం స్టైల్ విషయంలోనూ, వాల్యూ ఫర్ మనీ వంటి ఆకట్టుకునే వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ లైవ్ బ్రాండెడ్ సూపర్ మోటార్ సైకిల్ ను జులై8న జరిగే అంతర్జాతీయ మోటార్ సైకిల్ షోలో దీనిని ప్రదర్శించనున్నట్లు అధికారిక వెబ్ సైట్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ లైవ్ వైర్ ఎలక్ట్రిక్ బ్రాండ్ కింద వచ్చే అన్నీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో అందించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేలా భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తున్నామని జోచెన్ ప్రకటనలో తెలిపారు. ఈ నూతన బ్రాండ్ మొదట అర్బన్ బైక్స్ పై దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు. హార్లీ డేవిడ్సన్ కు వచ్చే లాభంలో ఎక్కువ భాగం స్మాలర్, లైటర్ మోడళ్ల బైక్స్ కంటే సుదూర క్రూయిజర్లే ఆక్రమించాయి అని అన్నారు. దీని ధర వచ్చేసి 29,799 డాలర్ల(రూ.21,88,825.95 లక్షలు) నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నూతన మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు తెలియదు. హ్యార్లీ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్న జోచెన్ అసలు సిసలైన విద్యుత్ మోటార్ సైకిల్ తయారీకి శ్రీకారం చుట్టారు. చదవండి: కోవిడ్లోనూ కొనుగోళ్లు, విలీనాల జోష్ -
ట్రాక్టర్పై పార్లమెంట్కు...!
సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల తొలిరోజన కొందరు సభ్యులు.. అనూహ్య రీతిలో సభకు వచ్చారు. సైకిల్, ట్రాక్టర్, బుల్లెట్పై ఇలా.. ఒక్కో వాహనం మీద లోక్సభకు వచ్చారు. రోడ్లపై వీరిని చూసిన జనాలు.. వీరిని ఒకింత ఆశ్చర్యంగా గమనించడం విశేషం. ఇండియన్ లోక్దళ్ పార్టీకి చెందిన ఎంపీ దుష్యంత్ చౌతాలా... ట్రాక్టర్పై పార్లమెంట్కు వచ్చారు. ట్రాక్టర్పై పార్లమెంట్కు వస్తున్న చౌతాలాను ఇతర సభ్యులు, ప్రజలు ఒకింత ఆశ్చర్యంతో గమనించారు. చౌతాలా ఇలా పార్లమెంట్కు రావడం కొత్తేమీ కాదు. గతంలో పొల్యూషన్ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న సరి-బేసి విధానాన్ని వ్యతిరేకిస్తూ గుర్రంపై పార్లమెంట్కు వచ్చారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, బీజేపీ ఎంపీలు మన్షుఖ్ ఎల్ మాండవీయ, మనోజ్ తివారీలు సైకిల్పై పార్లమెంట్కు హాజరయ్యారు. కాంగ్రెస్కు చెందిన మహిళా ఎంపీ రంజీత్ రంజన్ ఆరెంజ్ కలర్లోని హార్లీ డేవిడ్సన్ బైక్పై పార్లమెంట్కు వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మహిళల దినోత్సం కాబట్టి.. మహిళా శక్తిని చాటేందుకు హార్లీడేవిడ్సన్ బైక్ వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. బీహార్లోని సుపాల్ నియోజకవర్గానికి 42 ఏళ్ల రంజిత్ రంజన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాలు.. జనవరి 5 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా ట్రిపుల్ తలాక్ సహా 14 కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. -
డుకాటి కొనుగోలు రేసులోకి మరో దిగ్గజం
ఇటాలియన్ మోటార్ సైకిల్ ప్రత్యర్థి డుకాటిని సొంతం చేసుకోవడం కోసం అమెరికా మోటార్ సైకిల్ దిగ్గజం హార్లే-డేవిడ్ సన్ కొనుగోలు రేసులోకి వచ్చింది. మోటార్ సైకిలింగ్ అత్యంత ఫేమస్ అయిన ఈ రెండు సంస్థలు ఓ డీల్ కుద్చుబోతున్నాయని తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు ఈ డీల్ 1.5 బిలియన్ యూరోల(రూ.10,812కోట్లకు పైగా) వరకు ఉండొచ్చని సమాచారం. డుకాటిని జర్మన్ కారు తయారీదారు ఫోక్స్ వాగన్ విక్రయానికి పెట్టింది. ఈ విక్రయానికి దేశీయ మోటార్ సైకిల్ తయారీదారి బజాజ్ ఆటోతో పాటు పలు కంపెనీలు బిడ్స్ దాఖలు చేశాయి. హీరో మోటార్ కార్పొ, తన ప్రత్యర్థి టీవీఎస్ మోటార్ కూడా డుకాటి కొనుగోలు చేయాలనుకుని, తర్వాత విరమించుకున్నాయి. అయితే ఫోక్స్ వాగన్ లో అత్యంత పాపులర్ లేబర్ యూనియన్లు ఈ విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా దీన్ని కొనుగోలుచేయాలని ఆసక్తి కనబరిచింది. ప్రస్తుతం హార్లే-డేవిడ్ సన్ కూడా ఈ కొనుగోలురేసులోకి వచ్చేసింది. డీజల్ ఉద్గార కుంభకోణం వోక్స్వ్యాగన్ గ్రూపు మీద తీవ్ర ప్రభావం చూపింది. దీని నుండి ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వోక్స్వ్యాగన్ తమ డుకాటి టూ వీలర్ల తయారీ సంస్థను విక్రయించేందుకు సిద్దమైంది. ఖరీదైన మరియు శక్తివంతమైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటి మొత్తం విలువ రూ. 10,500 కోట్ల రుపాయలుగా ఉంది. 1926లో లాంచ్ అయిన ఈ డుకాటిని, ఆడి కు చెందిన వోక్స్వ్యాగన్ గ్రూపు 2012 లో 6,000 కోట్ల రుపాయలకు కొనుగోలు చేసింది. ఆ తరువాత కాలంలో 800సీసీ నుండి 1,200సీసీ సామర్థ్యం రేంజ్ ఉన్న మోటార్ సైకిళ్లను అభివృద్ది చేసింది. ప్రస్తుతం హార్లే డేవిడ్ సన్ కు అమెరికాలో సగానికి పైగా మార్కెట్ కలిగి ఉంది. -
హార్లీ డేవిడ్ సన్ నుంచి 2 కొత్త బైకులు
ధర శ్రేణి రూ.9.7 లక్షలు-32.81 లక్షలు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం బైక్స్ తయారీ కంపెనీ ‘హార్లీ డేవిడ్సన్’ తాజాగా రెండు కొత్త మోటార్సైకిళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘రోడ్స్టర్,’ ‘రోడ్ గ్లిడ్ స్పెషల్’ అనే ఈ బైక్స్ ధర వరుసగా రూ.9.7 లక్షలుగా, రూ.32.81 లక్షలుగా (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) ఉంది. భారత్లో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రపంచస్థారుు ఉత్పత్తులను ఆవిష్కరించామని హార్లీ డేవిడ్సన్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ విక్రమ్ పవహ్ తెలిపారు. అలాగే హార్లీ డేవిడ్సన్.. ఏబీఎస్ ఫీచర్తో కూడిన స్ట్రీట్ 750 మోటార్సైకిల్ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.4.91 లక్షలుగా (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) ఉంది. అలాగే 2017 ఎడిషన్ మోడళ్లన్నీ కూడా ఇకపై యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)తో రానున్నారుు. రోడ్స్టర్: ఇందులో వి-ట్విన్ 1,200 సీసీ ఎరుుర్ కూల్డ్ ఇంజిన్ను అమర్చారు. ఈ ఇంజిన్ టార్క్ 96ఎన్ఎం-4,000ఆర్పీఎంగా ఉంది. స్పీడ్, ఆర్పీఎం, టైమ్, ట్రిప్ మీటర్, గేర్ ఇండికేటర్లను చూపించడానికి 4 అంగుళాల డిజిటల్ ఉపకరణాన్ని చేర్చారు. రోడ్ గ్లిడ్ స్పెషల్: ఈ బైక్లో మిల్వాకీ-8 107 సింగిల్ కమ్ వి-ట్విన్ 1,745 సీసీ ఇంజిన్ను అమర్చారు. ఇందులోనూ 6.5 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement