breaking news
Hard Ware
-
యూజ్డ్ ఐటీ హార్డ్వేర్.. నిబంధనల్లో మార్పులివే..
న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని (సెజ్) యూనిట్లు ఉపయోగించిన ఐటీ హార్డ్వేర్ ఉత్పత్తులను (ల్యాప్టాప్లు, డెస్క్టాప్లు, మానిటర్లు, ప్రింటర్లు) బైటికి తరలించడానికి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దేశీ టారిఫ్ ఏరియాల్లో (డీటీఏ) తాము సొంతంగా వినియోగించుకోవడానికి మాత్రమే లైసెన్సు అవసరం లేకుండా కంపెనీలు వాటిని సెజ్ల నుంచి తరలించవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఒక నోటిఫికేషన్లో తెలిపింది. అయితే, ఆ పరికరాలను సెజ్ యూనిట్లలో కనీసం రెండేళ్ల పాటు ఉపయోగించి ఉండాలి. అయిదేళ్ల కన్నా పాతవై (తయారీ తేదీ నుంచి) ఉండకూడదు. దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ల్యాప్టాప్లు, కంప్యూటర్ల దిగుమతులపై విధించిన ఆంక్షలను ప్రభుత్వం స్వల్పంగా సడలించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా దేశీ మార్కెట్లోని సంస్థలు వాటిని దిగుమతి చేసుకోవాలంటే లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, కస్టమ్స్ చట్టాలపరంగా సెజ్లను విదేశీ భూభాగంగా పరిగణించడం వల్ల వాటిలోని యూనిట్లకు సుంకాలపరమైన మినహాయింపులు ఉంటాయి. కానీ, సెజ్లలోని సంస్థలు తమ ఉత్పత్తులను దేశంలోని ఇతర ప్రాంతాల్లోకి తీసుకువస్తే .. వాటిని దిగుమతులుగా పరిగణిస్తారు. తదనుగుణంగా సుంకాలూ వర్తిస్తాయి. -
మనసులను చదివే..‘హార్ట్’వేర్
న్యూయార్క్: ఇటువైపు చూడండి.. బాధలో ఉన్నారా? ఖుషీగా ఉన్నారా? కోపమా..! చిరాకా! మీరు చెప్పక్కర్లేదు. మీ మనసులో ఏమున్నా.. ‘ఫేసెట్’ వెంటనే చెప్పేస్తుంది. ఇలా ముఖాన్ని చూసి మనసులను చదివే అత్యాధునిక సాఫ్ట్వేర్ను అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఎమోటెంట్ కంపెనీ ఇంజనీర్లు అభివృద్ధి చేశారు. ఒకవేళ దొంగ నవ్వుతో సాఫ్ట్వేర్ను బురిడీ కొట్టిద్దామనుకున్నా.. ఆ ఆటలు దీని ముందు సాగవు. కృత్రిమ నవ్వును కూడా స్కాన్ చేసి పడేస్తుంది. ఈ సాఫ్ట్వేర్కు ఫేసెట్ అని నామకరణం చేశారు. సాధారణ డిజిటల్ కెమెరా సాయంతో ముఖాన్ని పరీక్షించి వారు ఆనందం, బాధ, భయం, ఆశ్చర్యం, కోపం, చిరాకు ఏ మూడ్లో ఉన్నారో చిటికెలో చెప్పేయగలదు. ఏడు భావాల కలయికను చెప్పే సామర్థ్యం దీనికి ఉంది. సాధారణంగా వ్యక్తుల ఆలోచనలకు, వారు చెప్పే మాటలకు, చేసే చర్యలకు మధ్య సమన్వయం ఉండదని ఫేసెట్ సాఫ్ట్వేర్ తయారీ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన ఎమోటెంట్ సహ వ్యవస్థాపకుడు మారియన్ బార్లెట్ తెలిపారు. ఒక ఫొటోగ్రాఫ్తో భావాల మధ్య తేడాలను ఫేసెట్ కచ్చితంగా గుర్తించగలదన్నారు. సూక్ష్మస్థాయిలో ఉన్న ముఖ కవళికలను సైతం పసిగడుతుందని చెప్పారు. ‘‘ముఖ కండరాలను నియంత్రించేందుకు మానవుల్లో రెండు రకాల మోటారు వ్యవస్థలు ఉంటాయి. సాధారణ చర్యల కంటే అకస్మాత్తుగా జరిగే చర్యలను నియంత్రించే మోటారు వ్యవస్థ వేగంగా ఉంటుంది. ఫేసెట్ వీటి ఆధారంగానే భావాలను గుర్తిస్తుంది’’ అని బార్లెట్ చెప్పారు. -
మన్నవరమా ? వాల్మీకిపురమా ?
సాక్షి, చిత్తూరు: ఇన్ఫరమేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ఏర్పాటుకు చిత్తూరు జి ల్లాలో స్థల పరిశీలనకు హైదరాబాద్ నుంచి గురువారం ఉన్నతస్థాయి కమిటీ రానుంది. ఈ కమిటీ సీఎం నియోజకవర్గంలోని వాల్మీకిపురం-కలికిరి మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ పార్కు స్థలాన్ని పరిశీలించనుంది. అలాగే మన్నవరం వద్ద ఏర్పేడు సమీపంలో స్థల పరిశీలన చేయనుంది. ఇందుకోసం ఐటీ శాఖ నుంచి ఇద్దరు ఉన్నతాధికారులు, కన్సల్టెన్సీ ఎక్స్పర్టు ఒకరు తిరుపతికి గురువారం చేరుకోనున్నారు. కాగా, ప్రభుత్వం రాష్ట్రంలో తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో ఐటీఐఆర్ పెట్టుబడులను విస్తరింపచేసే దిశగా చర్యలు చేపట్టిన క్రమంలో ఇందుకు అనువైన ప్రాంతాలను అధికారులు వెతకడం ప్రారంభించారు. రాయలసీమలో చిత్తూరు జి ల్లాతో పాటు అనంతపురం లేపాక్షి హబ్ స్థలా న్ని కూడా పరిశీలించాలని ఐటీ మంత్రి పొన్నా ల లక్ష్మయ్య అధికారులకు సూచించారు. ఈ క్రమంలో సీఎం సొంత జిల్లా చిత్తూరుకే తొలి ప్రాధాన్యం ఇచ్చి స్థల పరిశీలన చేయనున్నారు. కాగా ఐటీఐఆర్ ఏర్పాటుకు 4వేల ఎకరాల స్థలం అవసరమవుతుంది. వాల్మీకిపురం వైపే చూపు.. ఐటీఐఆర్ జోన్ ఏర్పాటుకు సీఎం నియోజకవర్గం వాల్మీకిపురం-కలికిరి ఇండస్ట్రియల్ పార్కు స్థలం వైపే అధికారుల చూపు ఉంది. ఇక్కడ ఇప్పటికే 12,000 ఎకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఐసీ స్థల సేకరణ చే సి ఉం ది. ఈ క్రమంలో ఐటీఐఆర్లో సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు, హార్డువేర్ ఉత్పత్తుల కంపెనీలు ఉంటాయి కనుక ఇండస్ట్రీ కిందే వస్తుందని, ఈ రీత్యా ఇందులో ఐటీఐఆర్ ఏర్పాటుకు అవసరమైన 4వేల ఎకరాలు తీసుకుంటే ఎలా ఉం టుందనేది పరిశీలించనున్నారు. అయితే ఇక్కడ భూ సేకరణకు తప్పిస్తే తాగునీటి వసతి, హైవే కనెక్టివిటీ, రవాణా సదుపాయలు అంతగా అందుబాటులో లేవు. కేవలం సీఎం నియోజకవర్గం అనే ఒక్క కారణం మినహా ఇక్కడ ఐటీఐఆర్ జోన్కు అవసరమైన అనుకూల అంశాలు తక్కువ. మన్నవరం వద్ద.. శ్రీకాళహస్తి మండలం మన్నవరం వద్ద స్థలపరిశీలనకు కూడా ఈ కమిటీ వెళ్లనుంది. వెంకటగిరి మార్గంలో భెల్ పరిశ్రమకు దగ్గరలో 4వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటు లో ఉంది. ఇక్కడ ఐటీఐఆర్ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుకూలతలు ఎక్కువగా ఉన్నా యి. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. తాగునీటి వసతికి కండలేరు నుంచి వచ్చే పైపు లైన్ ద్వారా మళ్లించేందుకు వీలు కలుగుతుంది. చెన్నై కలకత్తా నేషనల్ హైవేతో పాటు, పూతల పట్టు-నాయుడుపేట హైవేకి అనుసంధానంగా రోడ్డు ఉంది. రైలు మార్గంలో తిరుపతి నుంచి శ్రీకాళహస్తి నుంచి చేరుకోవచ్చు. భౌగోళికంగా నెల్లూరు, చిత్తూరు జిల్లా సరిహద్దుల మధ్య ఉంది. ఈ రీత్యా కూడా ఐటీఐఆర్జోన్ ఏర్పాటుకు మన్నవరం ప్రాంతం అనుకూలంగా ఉం టుందనేది పారిశ్రామిక వర్గాల అభిప్రాయం. ఈ నేపథ్యంలో సహజంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి వాల్మీకిపురం వైపు నిపుణుల కమిటీ మొగ్గుచూపుతుందా లేదా, భౌగోళిక, రవాణా అనుకూలతల వల్ల మన్నవరానికి ప్రాధాన్యత ఇస్తుందా? అనేది చూడాల్సి ఉంది. అదే సమయంలో అనంతపురం రాజకీయనాయకులు లాబీయింగ్ చేస్తే లేపాక్షి హబ్ స్థలానికి ఐటీఐఆర్ తరలిపోయినా ఆశ్చర్యపడక్కరలేదు. జిల్లాకు ఐటీఐఆర్ వస్తే మాత్రం వేలాదిమందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.