-
బర్ఫీబామ్మ.. ఈ జన్మకు ఇంతేలే అనుకోలేదు.. తొంభైలలోనూ వ్యాపారం
‘‘జీవితంలో నాకు కావాల్సిన సంతోషాలన్నీ దొరికాయి. అది లేదు, ఇది లేదు అన్న అసంతృప్తిలేదు. కానీ ఇంతవరకు నా కాళ్ల మీద నేను నిలబడడానికి ప్రయత్నించిందిలేదు. సొంతంగా డబ్బులు సంపాదించలేదు’’ అని చాలా మంది మలివయసులో దిగులు పడుతుంటారు. అచ్చం ఇలాంటి ఆలోచనా ధోరణి ఉన్న తొంభై ఏళ్ల హర్భజన్ కౌర్ తన మనసులో బాధను దిగమింగుకుని, ఈ జన్మకు ఇంతేలే అని సరిపెట్టుకోలేదు. ‘‘వయసు అయిపోతే ఏంటీ నేను ఇప్పుడైనా సంపాదించగలను’’ అని బర్ఫీలు తయారు చేసి విక్రయిస్తోంది. తొంభైలలోనూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టిస్తూ బర్ఫీబామ్మగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అమృతసర్లోని తారన్తారన్ ప్రాంతంలో పుట్టిపెరిగింది హర్భజన్ కౌర్. పెళ్లికావడంతో భర్తతో లుథియాణాలో కొత్తజీవితం మొదలు పెట్టింది. సంసారం, పిల్లలతో తొంభై ఏళ్లు గడిచిపోయాయి కౌర్ జీవితంలో. పదేళ్లక్రితం భర్త చనిపోవడంతో చంఢీఘడ్లోని తన చిన్నకూతురు దగ్గర ఉంటోంది కౌర్. తొంభై ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు నెరవేరినప్పటికీ..తన కాళ్ల మీద తను నిలబడలేదు, సొంతంగా ఒక్క రూపాయి సంపాదించలేదన్న అసంతృప్తి మాత్రం ఆమె మనసులో ఉండిపోయింది. ఓ రోజు మాటల మధ్యలో తన మనసులో మాటను కూతురు దగ్గర చెప్పింది. అప్పుడు.. కూతురు సరే..ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగింది. అందుకు కౌర్.. శనగపిండితో బర్ఫీలు చేసి విక్రయించాలనుకుంటున్నాను’’ అని చెప్పింది. అందుకు కూతురు సాయం చేయడంతో చంఢీఘడ్లోని సెక్టార్–18లో చిన్న స్టాల్ పెట్టి శనగపిండితో చేసిన బర్ఫీలను విక్రయించింది. ఐదు కేజీల బర్ఫీలు విక్రయించగా మూడు వేల రూపాయలు వచ్చాయి. వ్యాపారం ప్రారంభించిన తొలిరోజే మూడు వేల రూపాయలు రావడంతో ఆమె బర్ఫీల వ్యాపారానికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అనిపించింది. ఇదే సమయంలో హర్భజన్ బర్ఫీ తయారు చేస్తోన్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ట్విటర్లో షేర్ చేయడంతో వీడియో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో ద్వారా వచ్చిన పాపులారిటీతో బర్ఫీల ఆర్డర్లు విరివిగా పెరిగి వ్యాపారం చక్కగా సాగుతోంది. నాన్న నుంచి నేర్చుకుని.. హర్భజన్ తండ్రికి వంటబాగా చేసేవారు. ఆయన నుంచి వంట నైపుణ్యాలను చక్కగా అవపోసన పట్టిన కౌర్... శనగపిండి బర్ఫీ, బాదం సిరప్, టొమాటో చట్నీ, నిమ్మకాయ, మామిడికాయ పచ్చడి, దాల్ హల్వా, పిర్నీ, పంజిరి, ఐస్క్రీమ్లు వంటివి తయారు చేసి విక్రయిస్తోంది. ముందుగా తనకోసం చేసుకుని రుచి చక్కగా కుదిరిన తరువాత మార్కెట్లో విక్రయిస్తోంది. కౌర్ వంటలకు కస్టమర్లనుంచి విరివిగా ఆర్డర్లు వస్తున్నాయి. గత ఆరేళ్లుగా ఒకపక్క బర్ఫీలు చేస్తూనే తనకు ఏమాత్రం ఖాళీసమయం దొరికినా తన మనవ సంతానానికి చిన్నచిన్న గౌన్లను కుడుతుంది. సోషల్ మీడియాలో తన వీడియోలతో వ్యూవర్స్ను ఆకట్టుకోవడమేగాక, ఈ వయసులో కృష్ణా రామా అంటూ కూర్చోకుండా తనకు తెలిసిన పనితో సంపాదిస్తూ మలివయసులో ఊసుపోని వారెందరికో ప్రేరణగా నిలుస్తోంది. మరో తరానికి... నూటపదేళ్లకుపైగా చరిత్ర ఉన్న శనగపిండి బర్ఫీని విక్రయించడం నాకు చాలా గర్వంగా ఉంది. చిన్నప్పడు మా నాన్నగారు ఈ బర్ఫీని ఎంతో రుచికరంగా చేసేవారు. అది చూసి నేర్చుకున్న నేను నా పిల్లలు, తరువాత మనవళ్లకు వండిపెట్టాను. బర్ఫీ ప్రతిముక్కలో నా చిన్నతనం నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఇంట్లో నేను చేసిన బర్ఫీలను అంతా ఇష్టంగా తినేవారు. ఇప్పుడు బయటివాళ్లు సైతం ఇష్టపడుతున్నారు. ‘చైల్డ్హుడ్ మెమొరీస్’ పేరిట ఆన్లైన్లో ఫుడ్ విక్రయిస్తున్నాం. ప్రారంభంలో ఆర్డర్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇప్పుడు బాగా వస్తున్నాయి. నా కూతురు రవీనా సాయంతో నేను ఇదంతా చేయగలుగుతున్నాను. సోషల్ మీడియా అంటే ఏంటో కూడా తెలియని నేను.. నా వీడియోలతో వేలమందిని ఆకట్టుకోవడం సంతోషాన్నిస్తోంది’’. – హర్భజన్ కౌర్ -
కోహ్లీకి, డివిలియర్స్కు తేడా అదే..
లండన్: చాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావోరేవో మ్యాచ్లో భారత గెలుపుకు బౌలర్ల అద్వితీయ ప్రదర్శనే కారణమని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ప్రపంచ నెం 1 జట్టు అయిన దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకు కట్టడి చేయడం బౌలర్ల ప్రతిభకు నిదర్శనమని కొనియాడాడు. పేస్ బౌలర్లలో తొలి 10 ఓవర్లలో ఎక్కువ డాట్ బాల్స్ రాబట్టారిని దీంతో సఫారీలు ఒత్తిడి గురయ్యారని భజ్జీ ఐసీసీకి రాసిన కాలమ్లో వివరించాడు. ఈ క్రెడిట్ యువ బౌలర్ బూమ్రాకేనని, ఫీల్డింగ్, బౌలింగ్తో అద్భుతంగా రాణించాడని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇక మరో పేసర్ భువనేశ్వర్, స్పిన్నర్లు కూడా తమ వంతు రాణించారన్నాడు. భజ్జీ భారత బ్యాటింగ్కు 10/10 రేటింగ్ ఇచ్చాడు. దావన్, కోహ్లీల బ్యాటింగ్ అద్భతమన్నాడు. చేజింగ్లో కోహ్లి రాణిస్తాడనే విషయం మరోసారి నిరూపించాడని భజ్జీ పేర్కొన్నాడు. కోహ్లి, డివిలియర్స్ ఐపీఎల్లో ఒకే జట్టుకు చెందినవారని, కానీ వారి ఆటలోని దృక్పథం వేర్వేరని భజ్జీఅభిప్రాయపడ్డాడు. మైదానంలో కోహ్లీ సానుకూల దృక్పథంతో కనిపిస్తాడని, డివిలియర్స్లో అది కనిపించదని భజ్జీ చెప్పుకొచ్చాడు. ఇది భారత్ గెలుపుకు ఒక కారణమని తెలిపాడు. దక్షిణాఫ్రికా చిన్న చిన్న తప్పిదాలు చేసిందని అదే వారి కొంపముంచిందన్నాడు. ఒక ఇన్నింగ్స్లో మూడు రనౌట్లు కావడం చాల అరుదని అలాంటిది డివిలియర్స్, మిల్లర్ రనౌట్లు టీం ఇండియాకు బూస్ట్నిచ్చిందని భజ్జీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా ఓడిపోతుందని ఊహించలేదని.. కానీ నా అంచనాలు తప్పని రుజువయ్యాయని బజ్జీ తెలిపాడు. -
బౌలింగ్ కోచ్గా జహీర్ను నియమించాలి
న్యూఢిల్లీ: మాజీ పేసర్ జహీర్ఖాన్ను భారత్ బౌలింగ్ కోచ్గా నియమించాలని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టుకు ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే, బ్యాటింగ్ కోచ్గా సంజయ్ బంగర్ లు ఉండగా బౌలింగ్ కోచ్ స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానాన్ని భర్తీ చేయగల సామర్థ్యం జహీర్ ఖాన్కు ఉందని బజ్జీ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘భారత్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా జహీర్ బెస్ట్ ఆప్షన్ అని ఇది నా అభిప్రాయమని’ బజ్జీ ట్వీట్ చేశాడు. ఐపీఎల్-10 లో జహీర్ఖాన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ తీసుకున్నా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. ఈ సీజన్ లోఐపీఎల్100 వికెట్ల క్లబ్బులో చేరిన జహీర్ 11 మ్యాచ్లు ఆడి 10 వికెట్ల పడగొట్టాడు. అయితే భారత జట్టుకు బౌలింగ్ కోచ్ లేకపోవడంతో జట్టు ప్రధాన కోచ్ కుంబ్లే అదనపు భారం మోయాల్సి వస్తుంది. ఇక రిటైర్మెంట్ అనంతరం జహీర్ కోచ్గా చేయడానికి సిద్దం అని చాల సార్లు ప్రకటించాడు. 2011 ప్రపంచ కప్ భారత జట్టు విజయంలో జహీర్ కీలకపాత్ర పోశించాడు. 92 టెస్టులు ఆడిన జహీర్ 311 వికెట్లు పడగొట్టాడు. ఇక 311 వన్డేలు ఆడి 282 వికెట్లు తీశాడు. @ImZaheer would be the best option for indian fast bowling coach in my opinion..Great mind #Greatfella — Harbhajan Turbanator (@harbhajan_singh) 23 May 2017 -
రంజీ ఆటగాళ్ల ఫీజులను పెంచండి
న్యూఢిల్లీ: రంజీ ఆటగాళ్ల ఫీజులను పెంచే విషయంపై నూతన పరిపాలక కమిటీ (సీఓఏ)తో మాట్లాడాలని భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లేను స్పిన్నర్ హర్భజన్ కోరాడు. ఈనెల 21న సీఓఏకు భారత సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల వేతనాల సవరింపుపై కుంబ్లే నివేదిక ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో రంజీ ఆటగాళ్ల గురించి కూడా మాట్లాడాలని భజ్జీ సూచించాడు. రంజీ ఆటగాళ్లలో కొంతమంది ఐపీఎల్ పుణ్యమా అని కోట్లు సంపాదిస్తున్నా సగటు ఆటగాడు మాత్రం ఫస్ట్క్లాస్ క్రికెట్ (రంజీ, దులీప్ ట్రోఫీ)లో మ్యాచ్ ఫీజు కింద లక్షన్నర పొందుతున్నాడు. అదే ఓ టెస్టు ఆటగాడు రూ.15 లక్షలు పొందుతాడు. ఇది ఆటగాళ్లలో ఆర్థికంగా అభద్రతాభావానికి గురిచేస్తోందని కుంబ్లేకు హర్భజన్ ఇటీవల ఓ లేఖ రాశారు. ‘నేను రెండు మూడేళ్లుగా రంజీల్లో ఆడుతున్నాను. ఈ సమయంలో నాతోటి ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆటగాళ్ల ఆర్థిక ఇబ్బందులను చూసి చలించిపోయాను. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని అర్జిస్తున్న క్రికెట్ బోర్డు ఈ ట్రోఫీ నిర్వహిస్తున్నా ఇలాంటి పరిస్థితి ఉండడం దారుణం. 2004 నుంచి వీరి ఫీజులో మార్పులు కూడా జరగలేదు. అప్పటి వందకు ఇప్పటి వంద రూపాయలకు తేడా ఎంతో మారింది. ఏడాదికి ఎంత సంపాదిస్తామో కూడా తెలీకుండా వారు జీవితంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకోగలరు? దయచేసి ఈ అసమానతను బీసీసీఐ పెద్దలకు, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, వీరూలాంటి ఆటగాళ్లకు చేరేలా చూడండి’ అని కుంబ్లేకు రాసిన లేఖలో భజ్జీ ఆవేదన చెందాడు. వందల్లో ఉన్న ఆటగాళ్లలో చాలా కొద్దిమందికే ఐపీఎల్ కాంట్రాక్ట్ లభిస్తోందని, అయితే వారు కూడా ప్రొఫెషనల్ ఆటగాళ్లే అని గుర్తుచేశాడు. ఎక్కువ కోరడంలో తప్పు లేదు: గావస్కర్ మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏడాదిలో 81 రోజులపాటు మ్యాచ్లు ఆడే దేశవాళీ ఆటగాళ్లు దాదాపు రూ.40 లక్షల వరకు మాత్రమే సంపాదించగలరని అన్నారు. అదే ఓ అనామక ఆటగాడు ఐపీఎల్లో ఆడే 16 మ్యాచ్ల్లోనే దాదాపు రూ.4 కోట్ల వరకు వెనకేసుకుంటాడని చెప్పారు. బీసీసీఐకి డబ్బు సంపాదించి పెడుతోంది ఆటగాళ్లే కాబట్టి వారు ఎక్కువ కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు. -
మినీ వరల్డ్కప్ అంబాసిడర్గా హర్భజన్
దుబాయ్: మరో 50 రోజుల్లో ప్రారంభమయ్యే మిని వరల్డ్కప్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫి-2017కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం 8 మంది సీనియర్ క్రికెటర్లను ప్రచారకర్తలుగా ప్రకటించింది. ఈ అంబాసిడర్లలో భారత్ నుంచి ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ అంబాసిడర్లు జూన్ 1 నుంచి 8 మధ్య ఇంగ్లండ్,వేల్స్లో జరిగే మూడు వేదికలకు ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు. అంబాసిడర్లలో హర్భజన్తో పాటు పాకిస్థాన్ స్పిన్నర్ షాహిద్ ఆఫ్రిది, హబీబుల్ బాషర్ (బంగ్లాదేశ్), ఇయన్బెల్( ఇంగ్లండ్), షేన్బాండ్ (న్యూజిలాండ్), మైక్ హాస్సీ (ఆస్ట్రేలియా) కుమార సంగక్కర (శ్రీలంక), గ్రేమ్ స్మిత్ (దక్షిణాఫ్రికా)లున్నారు. ఈ మాజీ క్రికెటర్లందరూ 1,774 అంతర్జాతీయ వన్డేలు ఆడి 51,906 పరుగులు, 48 సెంచరీలు చేశారు. ఇక బౌలింగ్లో 838 వికెట్లు పడగొట్టారు. ఈ మాజీలంతా ఛాంపియన్స్ ట్రోఫి పట్ల ఆదరణ పెరిగేలా కృషి చేయనున్నారు. ఈ టోర్నమెంట్లో జరిగే 15 మ్యాచ్లకు కొత్త తరాన్ని క్రికెట్ వైపు ఆకర్షించేలా కృషి చేస్తారని ఐసీసీ సీఈవో రిచర్డ్సన్ పేర్కొన్నాడు. ఈ దిగ్గజాలతో కొన్ని స్కూళ్లు సందర్శించి పిల్లలకు క్రికెట్ మెళుకువలు నేర్పుతామని రిచర్డ్సన్ పేర్కొన్నాడు. 2002లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫిలో భారత్ జట్టులో సభ్యుడైన హర్భజన్ తన ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశాడు. డిఫెండింగ్ చాంపియన్గా భారత్ బరిలోకి దిగే గ్లోబల్ ఈవెంట్కు అంబాసిడర్గా ఎంపికవ్వడం గర్వంగా ఉందన్నాడు. టోర్నమెంట్ను ప్రమోట్ చేయడంలో తన వంతు భాద్యతను నిర్వర్తిస్తానని హర్భజన్ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫి కచ్చితంగా భారత్ గెలుస్తుందని బజ్జీ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement