breaking news
Handloom loans
-
నేతన్నలకు రుణమాఫీ ఆశలు
► కొత్త మార్గదర్శకాలు జారీ ► రూ.5.65కోట్లతో రుణమాఫీ ► జిల్లాలో 876 కుటుంబాలకు ప్రయోజనం ► జీవో 20తో వెసులుబాటు సిరిసిల్ల (కరీంనగర్): ఏడాదిన్నరగా ప్రకటనలకే పరిమితమైన నేతకార్మికుల రుణమాఫీ ఆశలు మళ్లీ చిగురించాయి. ఈమేరకు గతంలో జారీఅయిన జీవో 44ను మార్గదర్శకాలను సవరించి తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్20ని విడుదలచేసింది. దీని ప్రకారం జిల్లాలోని పవర్లూం కార్మికుల వ్యక్తిగత రుణాలు మాఫీ కానున్నాయి. రూ..5.65 కోట్లతో జిల్లాలో నేతకార్మికులకు రుణవిముక్తి కలుగుతుంది. ఆరేళ్లుగా ఆశలు.. చేనేత రుణాల మాఫీకి 2010లో అప్పటి ప్రభుత్వం రూ.420 కోట్లు కేటాయించింది. పవర్లూం రంగాన్ని రుణమాఫీలోకి తీసుకోవాలని అప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ సీఎం రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిలను కలిసి కోరగా.. వారు అంగీకరించారు. అరుుతే బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో రూ.118 కోట్లు మిగిలినా పవర్లూం రంగానికి రుణమాఫీ వర్తించలేదు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్ రుణమాఫీ ఇవ్వాలని చేనేత, జౌళిశాఖ అధికారులతో చర్చించి జీవో 44ను జారీ చేస్తూ రూ.5.65కోట్లు మంజూరుచేశారు. డీఎల్సీ సమావేశమే తరువాయి.. గతంలో జారీచేసిన జీవో 44ప్రకారం రుణాలపై బ్యాంకర్లు వందశాతం చక్రవడ్డీ మాఫీ చేయాలి. బకాయిపడిన వడ్డీలో 75శాతం బ్యాంకర్లు భరించాల్సి ఉంది. మిగతా 25 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. 2014 మార్చి 31నాటికి ఉన్న రుణం విధించే వడ్డీని బ్యాంకర్లే భరించాల్సి ఉంది. అరుుతే బ్యాంకర్లు ససేమిరా అన్నారుు. దీంతో రుణమాఫీ వ్యవహరం మళ్లీ మొదటికొచ్చింది. మారిన మార్గదర్శకాల ప్రకారం జీవో 20 ద్వారా రైతు రుణమాఫీలాగే లక్షలోపు రుణాలను వడ్డీతో కలిపి మాఫీ చేయాలని నిర్ణయించారు. దీనిపై జిల్లాస్థాయిలో డీఎల్సీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరగాల్సి ఉంది. ఈ నెల 11న డీఎల్సీ సమావేశం జరిగే అవకాశముంది. సిరిసిల్లకే ఎక్కువ ప్రయోజనం.. జిల్లాలో నేతన్న వ్యక్తిగత రుణమాఫీ జరుగుతుంది. ఇప్పటికే సేకరించిన వివరాల ఆధారంగా రుణమాఫీ ఉంటుంది. గంగాధర, చొప్పదండితోపాటు సిరిసిల్ల నేతన్నలకు రుణమాఫీ వర్తిస్తుంది. సిరిసిల్లకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. రూ.లక్షలోపు రుణాలు మాఫీ అవుతాయి.- ఎం.వెంకటేశం, జౌళిశాఖ ఏడీ -
చేనేతలరాత ఇంతేనా..
♦ చేనేత రుణాలన్నీ మాఫీ చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ♦ 159 గ్రూపులకుగాను కేవలం 42 గ్రూపులకే మాఫీ ♦ వ్యక్తిగత రుణాల విషయంలో 757కుగాను 512 మందికే వర్తింపు ♦ పవర్లూమ్స్ విషయంలోనూ అదే దారి ♦ ఆధార్ అనుసంధానం పేరుతో చాలామందికి మాఫీ కాని వైనం ♦ మార్చి చివరికి బ్యాంకు ఖాతాల్లో పడుతుందంటున్న అధికారులు ♦ రెండేళ్లుగా మొదటి విడతకే దిక్కులేదు...రెండో విడత ఎప్పుడో? అధికారంలోకి రాక మునుపు ఒకమాట... వచ్చిన తర్వాత మరొక మాట చెప్పడం ‘దేశం’ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మహిళలు.. రైతులు.. చేనేతలు.. ఎవ్వరూ కూడా ఒక్కపైసా బ్యాంకులకు కట్టొద్దు...అధికారంలోకి రాగానే మాఫీ చేసి రుణ విముక్తులను చేస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రగల్బాలు పలికారు. ‘ఏరు దాటేంతవరకు ఓడ మల్లన్న......ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చాక రుణమాఫీ విషయంలో బాబు యూ టర్న్ తీసుకున్నారు. ఏదో ఒక రూపంలో వీలైనంత మేర రుణమాఫీని తగ్గించడమే లక్ష్యంగా ఆంక్షలు పెడుతున్నారు. రెండేళ్లు పూర్తవుతున్నా నేటికీ ఒక్క చేనేత కార్మికుడికి కూడా రుణమాఫీ చేతికి అందకపోవడం గమనార్హం. సాక్షి, కడప: జిల్లాలో చేనేతలకు సంబంధించి వేలాది మగ్గాలు ఉన్నాయి. ప్రధానంగా మాధవరం, ప్రొద్దుటూరు, పుల్లంపేట, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం తదితర ప్రాంతాలలో చేనేత వృత్తిని నమ్ముకుని అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, చేనేత వృత్తిలో నష్టాలు రావడంతో చాలామంది రుణాలు తీసుకున్నారు. ప్రధానంగా జిల్లాలో 757 మంది చేనేత కార్మికులు వ్యక్తిగత రుణాలు తీసుకోగా, అందులో 512 మందికి రూ.1.37 కోట్లు ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. మిగిలిన 245 మందికి సంబంధించిన ఆధార్ ఠ మొదటిపేజీ తరువాయి నెంబర్లు అనుసంధానం కాలేదు. దీంతో వీరికి రెండవ విడతలో ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే 216 పవర్లూమ్స్ ఉండగా, అందులో 126 పవర్లూమ్స్కు మాత్రమే రూ.41,87,382 లక్షలు కేటాయించారు. మిగిలిన 90 పవర్లూమ్స్కు ఎప్పుడు కేటాయింపులు జరుగుతాయో అర్థం కావడం లేదు. సగానికి సగం గ్రూపులకు కూడా అందని మాఫీ ఇక చేనేతల్లో మహిళా గ్రూపులకు సంబంధించి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు బాబు సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. ఇందులో ఒక్కో గ్రూపులో ఒకరు మొదలుకుని ఎంతమంది ఉన్నా రూ.5 లక్షల వరకు రుణాలు అందించారు. అయితే జిల్లా వ్యాప్తంగా 159 మహిళా చేనేత గ్రూపులు ఉండగా, కేవలం 42 గ్రూపులకు మాత్రమే రుణమాఫీని వర్తింపజేశారు. 42 గ్రూపులకుగాను కోటి 2 లక్షల రూపాయలను కేటాయించారు. అయితే మరో 117 గ్రూపులకు సంబంధించిన రుణమాఫీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. అంటే సగం గ్రూపులకు కూడా మాఫీ సొమ్ము అందని పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. రెండవ విడత ఎప్పుడో? మొదటి విడత చేనేత రుణమాఫీకి సంబంధించి చేనేత జౌళి శాఖ అధికారులు జిల్లాలోని వ్యక్తిగత, గ్రూపు, పవర్లూమ్స్ల ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం రూ. 2.80 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ప్రతిపాదనలు వెళ్లిన అనంతరం సంబంధిత కార్మికుల అకౌంట్లలో రుణమాఫీ సొమ్ము జమ కానుంది. మొదటి విడత రుణమాఫీ మొత్తం ఈనెలాఖరులోపు జమ అయ్యే అవకాశం కనిపిస్తుండగా, రెండవ విడత ఎప్పుడు మంజూరవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తానికి జిల్లాలో చేనేత కార్మికులకు రుణాలు అందడంతో పాటు రుణమాఫీ కూడా పెద్ద సమస్యగా మారింది. మార్చి చివరి నాటికి ఖాతాలకు రుణమాఫీ - ఏడీ జయరామయ్య జిల్లాలో చేనేత రుణమాఫీకి సంబంధించి 512 మందికి వ్యక్తిగత రుణాలు మాఫీ అయ్యాయని.. 42 గ్రూపులకు, మరో 126 పవర్లూమ్స్కు రుణమాఫీ మంజూరైనట్లు చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జయరామయ్య తెలిపారు. ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ రూ. 2.80 కోట్లు రుణమాఫీ కింద ప్రభుత్వం కేటాయించిందని...మార్చి నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అంతేకాకుండా మరికొన్ని గ్రూపులకు, వ్యక్తిగత రుణాలకు సంబంధించి కూడా రెండవ విడతలో మాఫీ సొమ్ము జమచేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆధార్ అనుసంధానం కాకపోవడంతోపాటు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు.