breaking news
Haley Matthews
-
WPL 2025: వారియర్స్ ఆశలు ఆవిరి!
లక్నో: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 క్రికెట్ టోర్నీలో ‘ప్లే ఆఫ్’ దశకు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉండాలంటే గెలవాల్సిన మ్యాచ్లో యూపీ వారియర్స్ జట్టు నిరాశపరిచింది. గురువారం జరిగిన మ్యాచ్లో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్పై గెలిచి ప్లే ఆఫ్స్ దశకు చేరువైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జార్జియా వోల్ (33 బంతుల్లో 55; 12 ఫోర్లు) డబ్ల్యూపీఎల్లో తొలి అర్ధశతకంతో ఆకట్టుకోగా... గ్రేస్ హ్యారిస్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ దీప్తి శర్మ (27; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కిరణ్ నవ్గిరె (0), షినెల్ హెన్రీ (6), శ్వేత సెహ్రావత్ (0), ఉమా ఛెత్రీ (1) విఫలమయ్యారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో అమేలియా కెర్ 38 పరుగులిచ్చి 5 వికెట్లతో అదరగొట్టగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హేలీ మాథ్యూస్ (2 వికెట్లు; 68 పరుగులు) ఆల్రౌండ్ ప్రదర్శన తో మెరిపించింది. ఓపెనర్లు రాణించడంతో ఒకదశలో 7.5 ఓవర్లలో 74 పరుగులు చేసిన యూపీ వారియర్స్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. అమేలియా విజృంభణతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. హేలీ (46 బంతుల్లో 68; 8 ఫోర్లు, 2 సిక్స్లు), సివర్ బ్రంట్ (23 బంతుల్లో 37; 7 ఫోర్లు) రాణించారు.వీరిద్దరూ రెండో వికెట్కు 58 బంతుల్లోనే 92 పరుగులు జోడించడంతో ముంబై సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. లీగ్లో భాగంగా శుక్రవారం జరగనున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో గుజరాత్ జెయింట్స్ ఆడుతుంది. -
విండీస్ మహిళలకు మరో విజయం
చెన్నై: మహిళల టి20 ప్రపంచకప్లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ (41 బంతుల్లో 40; 2 ఫోర్లు; 1 సిక్స్), (3/13) ఆల్రౌండ్ షోతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్ జట్టు 49 పరుగుల భారీ తేడాతో ఓడింది. మూడు ఓటములతో బంగ్లా టోర్నీ నుంచి నిష్ర్కమించినట్టే. ఆదివారం జరిగిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (42 బంతుల్లో 41; 4 ఫోర్లు), స్టెఫానీ టేలర్ రాణించారు. డాటిన్ (11 బంతుల్లో 24; 2 ఫోర్లు), స్టేసీ కింగ్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడారు. న హీదాకు మూడు వికెట్లు పడ్డాయి. బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిగర్ సుల్తానా (27 బంతుల్లో 27; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. హేలీ, డాటిన్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. శ్రీలంక మహిళల గెలుపు మొహాలీ: ఆల్రౌండ్ షోతో ఆకట్టుకున్న శ్రీలంక మహిళల జట్టు... ఆదివారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్లో 14 పరుగుల తేడాతో ఐర్లాండ్పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 129 పరుగులు చేసింది. కౌసల్య (28 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు), జయాంగిని (22 బంతుల్లో 34; 7 ఫోర్లు), వీరక్కొడి (41 బంతుల్లో 32; 2 ఫోర్లు) రాణించారు. 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లంకను వీరక్కొడి, కౌసల్య ఆరో వికెట్కు 49 పరుగులు జోడించి ఆదుకున్నారు. మెట్కాల్ఫి 4 వికెట్లు తీసింది. తర్వాత ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. సిసిలా జాయ్సీ (30 బంతుల్లో 29; 4 ఫోర్లు), డెల్ని (24 బంతుల్లో 29; 2 ఫోర్లు), ఐసోబెల్ జాయ్సీ (28 బంతుల్లో 24; 2 ఫోర్లు) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. సుగంధికా 3 వికెట్లు పడగొట్టింది.